
చిత్తూరు కలెక్టరేట్ వద్ద చెవిరెడ్డి ధర్నా
చిత్తూరు: ప్రజా సమస్యలను చిత్తూరు జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులను కలవని కలెక్టర్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
పెద్ద నోట్ల రద్దుతో ఒక్కపక్క సామాన్యులు కష్టాలు పడుతుంటే.. చెప్పాపెట్టకుండా కలెక్టర్ సెలవుపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. 17 రోజుల పాటు కలెక్టర్ సెలవు పెట్టి చంద్రబాబు, లోకేశ్ నల్లధనాన్ని మార్చడానికి వెళ్లారని ఆరోపించారు.