చిత్తూరు: వైద్యం వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో 11 నెలల చిన్నారిని చేర్పించారు. అక్కడి వైద్యులు సరైన చికిత్స చేయకపోవడంతోనే ఆ చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.