child dies
-
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కొడుకు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. తేజస్వీ(25) అనే మహిళ తన భర్త లోహిత్, రెండున్నరేళ్ల కూమార్తె, కుమారుడు విహాన్తో కలిసి ద్విచక్రవాహనంపై హెబ్బాల్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ నగర్ నుంచి హెచ్ఆర్బీర్ లేఅవుట్ వరకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్పకూలి రోడ్డు మీద పడింది. బైక్పై వెళ్తున్న కుటుంబంపై ఇనుప రాడ్లతో కూడిన మెట్రో పిల్లర్ పడటంతో వారు తీవ్ర గాయపడ్డారు. ముగ్గురుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వివాహితతోపాటు ఆమె మూడే కుమారుడు మరణించారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లర్ కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. చదవండి: ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన: ప్రయాణికులను ఎక్కించుకోకుండా.. -
పాముకాటుకు తల్లడిల్లి తనువు చాలించిన చిట్టితల్లి
కర్నూలు (వెల్దుర్తి) : తనకేం జరిగిందో తెలీదు. ఊపిరాడని స్థితిలో తీవ్ర బాధను అనుభవించింది. చెప్పేందుకు నోరురాక, శరీరం సహకరించక.. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించిందో చిట్టితల్లి. పదకొండేళ్ల ఆ బాలిక పేరు అంజలి. వెల్దుర్తి మండలంలో జరిగిన సంఘటన వివరాల్లోకి వెళితే... పుల్లగుమ్మి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవిలకు నలుగురు కుమార్తెలు సంతానం. మూడవ కుమార్తె అంజలి. కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీదేవి తన ఆఖరు కూతురుతో కలిసి రెండేళ్ల నుంచి పుట్టిల్లు బలపాలపల్లెలో ఉంటోంది. తండ్రి బ్రహ్మయ్య ఆ సమయం నుంచే పక్షవాతంతో మంచం పట్టాడు. దీంతో ఇంట్లో ఉన్న ముగ్గురు కుమార్తెలు కుటుంబ భారం మోస్తూ తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. మూడవ కుమార్తె అంజలి స్థానిక ఎంపీపీ స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసుకుంది. సెలవులు కావడంతో తన అక్కలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఆదివారం రాత్రి రోజూ మాదిరిగానే ఇంట్లో (రేకుల షెడ్డు) నిద్రించింది అంజలి. 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో కాలికి ఏదో కరిచినట్లు గుర్తించింది. అబ్బా అనుకుంటూనే వెళ్లి పడుకుంది. రెండు గంటల సమయానికి గొంతు, మొహం వాచిపోయి, శరీరంలోను, కాలి వద్ద తీవ్ర నొప్పి మొదలైంది. చెప్పుకోవడానికి తల్లి లేకపాయె. తండ్రి పక్షవాతంతో ఉన్నాడు. అక్కలు గాఢ నిద్రలో ఉన్నారు. ఎలాగోలాగ తడబడుతూ బయటకు వచ్చి పక్క ఇంట్లో నివాసముంటున్న జేజినాయన చిన్నమారెన్న వద్దకు వెళ్లింది. అక్కడ జేజినాయన, జేజి, చిన్నాన్నకు విషయం తెలుపలేక అప్పటికే మూగబోతున్న గొంతుతో కొద్దికొద్దిగా చెబుతూ, చివరకు సైగలు చేసింది. నోరు మెదపలేని స్థితిలో, ఊపిరి ఎగదోసుకుంటూ వచ్చిన బాలికను చూసి వారు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలీదు, బాలిక చెప్పలేకపోతోంది. చివరకు అచేతనావస్థకు చేరుకుంటోంది. పాముకాటు వేసినట్లు నిర్ధారించుకుని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పాముకాటుకు తగిన చికిత్స అందించేలోగా సోమవారం తెల్లవారుజామున అంజలి కన్నుమూసింది. -
భార్యతో గొడవ, ఆ వ్యక్తి ఏం చేశాడంటే...
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవకు మూడేళ్ల పసిపాప బలైయ్యింది. భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండగా కోపంతో ఆమె భర్త పసి పాపను నేలకు వేసి బలంగా కొట్టాడు. దీంతో పాప అక్కడికి అక్కడే మరణించింది. ఈ సంఘటనలో పాప తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోలా గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరే సమయానికి మహిళ తీవ్రంగా గాయపడినట్లు, చిన్నారి అప్పటికే మరణించినట్లు అధికారులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు నోయిడా అదనపు పోలీస్ కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు. నిందితుడు రోజు మద్యం సేవించి, భార్యతో తరచూ గొడవలు పడేవాడని చుట్టు పక్కల వారు తెలిపారు. నిన్న గొడవ జరిగే సమయంలోనూ అతడు మందు తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని బులంద్షహర్ జిల్లాకు చెందిన అమిత్గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. నోయిడాలో పనిచేసే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాప చనిపోయిందన్న విషయాన్ని అతడు తన భార్య రేణు కుటుంబానికి సమాచారం ఇచ్చాడని, అయితే పాప చనిపోవడానికి గల కారణాన్ని వారికి తప్పుగా చెప్పాడని అతని అత్తమామలు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, అమిత్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు -
ఆశల దీపం ఆరిపోయింది
సాక్షి, మందస: ఆశల దీపం ఆరిపోయింది. ఇన్నాళ్లు ఆ ఇంట్లో గళగళమన్న కాళ్ల పట్టీల సవ్వడి ఆగిపోయింది. అందరినీ ఎంతగానో నవ్వించిన ఆ నవ్వు మాయమైంది. ఆ చిన్నారిపై క్యాన్సర్ మహమ్మారి పగబట్టి తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. దాతల సాయంతోనైన బతికించుకుందామనుకున్న ఆ తల్లిదండ్రుల ప్రయత్నాలను నీరుగార్చింది. తన గారాల పట్టి భవిష్యత్పై ఎన్నో కలలు కన్న వారికి గుండె కోత మిగిల్చింది. మందస మండలం లొహరిబంద గ్రామానికి చెందిన చిన్నారి నవ్య(9) అలియాస్ ప్రేమకుమారి బుధవారం అర్ధరాత్రి బోన్మారో కేన్సర్తో మరణించింది. రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతులు తమ కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించారు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో దాతలు సాయంతో ఏడాదిపాటు బతికించారు. ఈ నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఏ కష్టమొచ్చిన తామంతా ఆదుకోవడానికి ముందుంటామని ఉద్దానవాసులు నవ్య సమస్యను సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా, పత్రికల ద్వారా బాహ్య ప్రపంచానికి చెప్పి, ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. నవ్యకు సోకిన వ్యాధి చికిత్సకు అవసరమయ్యే వ్యయం సేకరించడానికి ఉద్దానం యువత సిద్ధమవుతుండగా, హఠాత్తుగా నవ్య మరణించడంతో చిన్నారిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యవంతమవుతున్నారు. ఇక ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూకావడం కాలేదు. అందరి ఆశలు అడియాశలు చేసిన నవ్య అంత్యక్రియలు ప్రజల కన్నీటి సంద్రం మధ్య జరిగాయి. -
సీతాఫల్మండిలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సీతాఫల్మండిలోని ఓ పురాతన భవనం స్లాబ్ ఆదివారం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో తల్లితోపాటు ఆమె 14 నెలల కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటన గురించి తెలియడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పురాతన భవనం కూలిన స్థలాన్ని పరిశీలించారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
-
ఆడుకుంటూ వెళ్లి.. స్తంభాన్ని పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫుట్పాత్ పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ఘాతానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఈఎల్ సీటీ (ఫెబల్ సిటీ)లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన దివాకర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య, కుమారుడు మోనీష్(7)తో కలిసి ఫెబల్ సిటీలోని ఈ–బ్లాక్ 12వ అంతస్తు 8వ నెంబర్ ఫ్లాట్లో నివసిస్తున్నారు. మోనీష్ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్మెంట్లోని తోటి పిల్లలతో కలిసి లాన్లో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకోవడానికి కిందకు వచ్చాడు. ఈ క్రమంలో ఆడుతూ ఆడుతూ వెళ్లి ఫుట్పాత్ పక్కనే ఉన్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకున్నాడు. దాని కింది భాగంలో విద్యుత్ వైరు పాడై ఉండటంతో స్తంభానికి కరెంటు సరఫరా అవుతోంది. దీంతో మోనీష్ విద్యుత్ఘాతానికి గురై నిమిషంపాటు అలాగే ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతోపాటు వాకింగ్ చేస్తున్నవారు ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. నిమిషం తర్వాత మోనీష్ కింద పడిపోయాడు. వెంటనే చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనతో ఆందోళనకు గురైన అపార్ట్మెంట్వాసులు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. బిల్డర్తో పాటు కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పీబీఈఎల్ సిటీ నిర్వాహకులు నివారణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న భూగర్భ కేబుల్ వైర్లకు టేపులు చుట్టారు. స్తంభం వద్దకు వెళ్తూ... విద్యుత్ఘాతానికి గురై అలాగే ఉండిపోయిన మోనీష్ పోస్టుమార్టానికి తండ్రి ససేమిరా... మోనీష్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులు సోమవారం రాత్రే తమ స్వస్థలం చెన్నై తీసుకెళ్లారు. అయితే, ఇక్కడ కేసు నమోదు చేయడానికి పోస్టుమార్టం నివే దిక అవసరం కావడంతో పోలీసులు మోనీష్ తండ్రి దివాకర్ను సంప్రదించారు. అయితే, తన కుమారుడికి పోస్టుమార్టం చేయించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. దీంతో అపార్ట్మెంట్వాసులు దివాకర్తో మాట్లాడి ఒప్పించారు. అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఐదు రోజుల్లో వస్తుందని వెల్లడించారు. ఈ కేసులో బిల్డర్, అసోసియేషన్, విద్యుత్ సరఫరా కాంట్రాక్టర్పై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. -
విమానంలో 11నెలల శిశువుకు అస్వస్ధత
-
విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతి
సాక్షి, హైదరాబాద్: విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. ప్రయాణికులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. అయితే ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్ను, అంబులెన్స్ను సిద్దం చేశారు. లాండింగ్ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్ సెంటర్కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
చిన్నారిని మింగేసిన మృత్యువు
రోజూలాగే అమ్మకు బైబై చెప్పి పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన చిన్నారిని ఇంటి సమీపంలో కమాండర్ వాహనం రూపంలో మృత్యువు మింగేసింది. చిన్నారి రాక కోసం ఎదురు చూస్తున్న తల్లి జరిగిన విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. ఇక నా పాప శాశ్వతంగా రాదన్న విషయం తెలిసి కన్నీరుమున్నీరువుతుంది. భగవంతుడా! ఇంత కఠినంగా శిక్షిస్తావా? అంటూ చిన్నారి తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం: ముక్కుపచ్చలారని చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో రెండు నిమిషాల్లో ఇంట్లోకి వెళ్లిపోతుందనగానే మృత్యువు ఆగమేఘాల మీద వచ్చి కమాండర్ రూపంలో కబలించుకుపోయింది. ఆటో దిగి ఇంటి వైపు నడుస్తున్న చిన్నారిని ఉన్న ఫలంగా కమాండర్ ఢీకొట్టి ప్రాణాలను హరించింది. తమ చిన్నారి స్కూలు నుంచి తిరిగి వస్తుందని ఆ తల్లి ఇంటి ముంగిట వేచి చూస్తున్నంతలోనే కమాండర్ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి చిన్నారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన గండి జగదీశ్వరరావు, రోజాల కుమార్తె నేహ. పార్వతీపురం మండలం వైకేఎం కాలనీ సమీపంలో ఉన్న సురేష్ పాఠశాలలో 1వ తరగతి చదువుతుంది. రోజులాగే శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో ఆటోలో తోటి విద్యార్థులతో కలసి ఇంటికి బయలుదేరింది. ఆటో ఊరిలోకి రాగానే ఇంటి ముందు రోడ్డు మీద దిగి ఇంటివైపు నడిచింది. ఇంతలో ఒడిశా అలమండ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న కమాండ్ర్ వాహనం బలంగా ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే చిన్నారి నేహ మృతి చెందింది. వీధిలో ఉన్న వారంతా చిన్నారి నేహను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించినప్పటికే ప్రాణాలను విడిచిందని స్థానికులు తెలిపారు. దీంతో చిన్నారి నేహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి నేహ తండ్రి జగదీశ్వరరావు ఆర్మీలో పని చేస్తున్నారు. తల్లి రోజ గృహిణి. కుమారుడు యుగంధర్ ఉన్నాడు. నేహ మృతితో కుటుంబ సభ్యులు, చినబొండపల్లి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అదృశ్యమై శవమై తేలాడు... రామభద్రపురం(బొబ్బిలి): మండలంలోని రొంపల్లి గ్రామానికి చెందిన ముదిలి సూరయ్య(63) నాలుగురోజులు క్రితం అదృశ్యమై అదే గ్రామ సమీపంలో గల డ్యాంలో పడి శవమై శనివారం తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... రొంపల్లి గ్రామానికి చెందిన ముదిలి సూరయ్య ఈ నెల నాల్గో తేదీన పొలం పనికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు రోజులుగా వెతుకుతున్నారు. అదే గ్రామంలో డ్యాం వద్ద ఉన్న లష్కర్ రెండు రోజుల కిందట ఇక్కడ ఏదో మృతదేహం కనిపించినట్లయింది గ్రామస్తులకు చెప్పడంతో ఆ డ్యాంలో గాలించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతదేహం కనిపించలేదు. శనివారం నాటికి డ్యాంలో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని ముదిలి సూరయ్యగా గుర్తించారు. కుమారుడు ముదిలి కృష్ణ ఫిర్యాదు మేరకు హెచ్సీ గోపీరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యుమోనియాతో చిన్నారి మృతి
చెన్నేకొత్తపల్లి(రామగిరి): చెన్నేకొత్తపల్లి మండలం చందమూరు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు నవీన్ (9) న్యుమోనియాతో గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న నవీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు చెన్నేకొత్తపల్లి, ధర్మవరం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బెంగుళూరుకు తరలించారు. వైద్యపరీక్షల్లో న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
ధర్మవరం టౌన్: ధర్మవరం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృత్యువుపాలైంది. పట్టణంలోని లోనికోటకు చెందిన హసీఫా శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. శిశువు ఉమ్మనీరు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. అయితే ఆ సమయంలో చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకుని తిరిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అప్పటికి చిన్నారి ఆరోగ్యం కుదుటపడినా శనివారం ఉదయం మళ్లీ క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో మరోసారి ఇబ్బంది ఎదురవడంతో చిన్నారి తల్లిదండ్రులు డ్యూటీ డాక్టర్ వెంకటేశ్వర్లు కోసం చిన్నపిల్లల వార్డుకు వెళితే యథావిధిగా అందుబాటులో లేడు. దీంతో వారు ఆ చిన్నారిని తిరిగి అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యుడు చెప్పడంతో రోదిస్తూ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆస్పత్రికి వచ్చిన వారి ప్రాణాలు తీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివాదం ముదరడంతో పట్టణ ఎస్సై జయానాయక్ అక్కడికి చేరుకుని బాధితులను శాంతపరిచారు. జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. సూపరింటెండెంట్ రామలక్ష్మి చిన్నపిల్లల డాక్టర్ సెలవులో ఉండటంతోనే బయట చికిత్స చేయించుకున్నారని వివరణ ఇచ్చారు. చిన్న పిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం తాను డ్యూటీలో ఉన్నానని, తన వద్దకు ఎవరూ రాలేదంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. -
ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం
కదిరి అర్బన్: అభం శుభం తెలియని చిన్నారి ఆటో చక్రాల కిందపడి ప్రాణం కోల్పోయింది. పట్నం గ్రామంలో రాధిక, ఆంజనేయులు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. మంగళవారం ఉదయం తాగునీరు పట్టుకునేందుకు రాధిక ఆటో ట్యాంకర్ వద్దకెళ్లింది. ఆమె వెనకాలే కార్తీక (3) వెళ్లింది. బిందెలో నీరు పట్టుకుని తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి వెనకాలే నిల్చుని ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారివ్వడం కోసం డ్రైవర్ ఆటో ట్యాంకర్ను వెనక్కు తోలాడు. వెనుకచక్రాల కిందపడిన కార్తీక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాముకాటుతో చిన్నారి మృతి
పెనుకొండ : పట్టణంలోని మారుతీనగర్లో నివాసం ఉంటున్న శీనప్ప, రాధమ్మల కుమారుడు నాని (4) పాముకాటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు చిన్నారి తల్లిదండ్రులతో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో బాలుడు ఏడవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాటుకాటుకు గురయ్యాడన్న అనుమానం ఉందని, వెంటనే పుట్టపర్తికి వెళ్ళాలని సూచించడంతో వారు హుటాహుటిన పుట్టపర్తికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం... పలువురిని కంటతడి పెట్టించింది. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
రాయదుర్గం టౌన్ : రాయదుర్గం పట్టణంలోని 21వ వార్డు మారెమ్మగుడి సమీపంలో పది నెలల చిన్నారి ఎన్.జస్మిత్ డెంగీ లక్షణాలతో శనివారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పేస్వామి, రాధ దంపతులకు మూడేళ్ల కుమారుడు, పది నెలల కుమార్తె జస్మిత్ ఉన్నారు. గత ఆదివారం జస్మిత్కు జ్వరం రావడంతో ఆర్ఎంపీతో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్కు తీసుకెళ్లారు. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ స్థాయికి పడిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా ఇదే నెల ఒకటో తేదీ తహసీల్దార్ రోడ్డులో అల్తాఫ్ కుమార్తె ఆయేషా(6) డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా పట్టణంలోని అన్ని వార్డుల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రతిరోజూ ఆస్పత్రికి దాదాపు 500 దాకా రోగులు వస్తుండగా ఇందులో 50కిపైగా జ్వర పీడితులు ఉంటున్నారు. వారంరోజుల క్రితం కూడా ముగ్గురికి డెంగీ పాజిటివ్గా గుర్తించి అనంతపురంలో చికిత్సలు అందజేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. -
అయ్యో..చిట్టి తండ్రీ!
తన చిట్టితండ్రి ఎడబాటును.. ఆ తండ్రి ఒక్క క్షణమైనా భరించలేడు. ఆ తల్లీ అంతే.. తన బంగారుబాబును వదిలి.. నిమిషమైనా ఉండలేదు. చిన్నారి బాబు బుడిబుడి అడుగులను చూసి వారెంతో మురిసిపోయేవారు. అమ్మ.. నాన్న అంటూ పలికే పొడిపొడి మాటలను విని ఉప్పొంగిపోయేవారు. ఏ పనిలో ఉన్నా వారికి బిడ్డ ధ్యాసే. నిన్న కాక అటు మొన్ననే.. ఆ చిన్నారికి ఏడాది నిండింది. తొలి జన్మదిన వేడుకను తల్లిదండ్రులు పెద్ద పండగలానే చేశారు. ఇంతలోనే వారి ఆశల దీపం ఆరిపోయింది. పరామర్శ కోసమని బిడ్డను తీసుకుని వచ్చిన ఆ తల్లి.. కళ్లెదుటే తన గారాలపట్టిని పోగొట్టుకుంది. ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో మాయదారి మృత్యుశకటం.. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. పాపం.. తన బిడ్డ ఇంక లేడన్న విషయం ఆ తండ్రికి ఎలా చెప్పాలో..!! రాజాం/సిటీ(శ్రీకాకుళం): తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన మరో తల్లికి కడుపుకోత మిగిలింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి మృత్యుఒడిలోకి చేరుకుంది. వన్వే ట్రాఫిక్ విధానం ఆ ఇంట్లో పుత్రశోకానికి కారణమైంది. వాటర్ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఓ చిన్నారి దుర్మరణం చెందాడు. శనివారం స్థానిక మేదరవీధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లాకు చెందిన పిల్లి కళావతి.. రాజాం మేదరవీధిలో ఉంటున్న తన తల్లి కోలా పార్వతిని పరామర్శించేందుకు రెండు రోజుల క్రితం వచ్చింది. కళావతి భర్త గురునాథరావు వలస కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కళావతి కూడా భర్తతోనే హైదరాబాద్లో ఉంటోంది. వీరికి 13 నెలల ఢిల్లీశ్వరరావుతోపాటు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. భర్త హైదరాబాద్లో ఉంటుండగానే.. కళావతి విజయనగరం వచ్చింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి కళావతిని పరామర్శించేందుకు ఈ నెల 22న పిల్లలతో కలసి రాజాం వచ్చింది. అప్పటి నుంచి మేదరవీధిలో తల్లిదండ్రులు పార్వతి, బంగారయ్యల వద్దనే ఉంది. మరో రెండు రోజుల్లో తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది. శనివారం ఉదయం ఇంటి ఆవరణలో తన 13 నెలల కుమారుడు ఢిల్లీశ్వరరావుతో కలసి ఉంది. అదే సమయంలో వన్వే ట్రాఫిక్ కారణంగా అటుగా వచ్చిన వాటర్ప్యాకెట్ల లగేజీ వ్యాన్ ఆ ఇంటిపైకి దూసుకువచ్చింది. దీంతో ఇంటి వరండాలో ఉన్న బాలుడు ఢిల్లీశ్వరరావు ప్రమాదానికి గురయ్యాడు. వ్యాన్ ముందర భాగం బాలుడి తలను గట్టిగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కళ్లముందు ఆడుతున్న ఢిల్లీశ్వరరావు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. ఇంట్లో ఉన్న కళావతి తల్లిదండ్రులు బంగారయ్య, పార్వతిలు కూడా బయటకు వచ్చి ఘొల్లుమన్నారు. పాపం.. కన్నబిడ్డ చావు చూడటానికే వచ్చిందా!! కళావతికి ఏడేళ్ల క్రితం విజయనగరానికి చెందిన గురునాథరావుతో వివాహం జరిగింది. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లడం.. కొద్దిరోజులు పని చేసి విజయనగరం రావడం వారికి పరిపాటి. వీరికి ఇద్దరు మగపిల్లలు. హాయిగా జీవనం సాగిపోతుందనుకున్న సమయంలో చిన్న కుమారుడు ఢిల్లీశ్వరరావు మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రికి చేరవేసేందుకు బంధువులు సాహించలేకపోయారు. రాజాం సీఐ శంకరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి మృతదేహాన్ని బంధువులు విజయనగరం తీసుకుపోయారు. -
వేడి నీటిలో పడిన చిన్నారి మృతి
అగళి (మడకశిర) : అగళి మండలం ఆలూడి గ్రామంలో పవిత్ర, నరసింహరాజు దంపతుల కుమార్తె భానుప్రియ(3) అనే చిన్నారి శుక్రవారం ఉదయం వేడినీటిలో పడి మృతి చెందినట్లు ఏఎస్ఐ ఖలీల్బాషా తెలిపారు. చిన్నారికి స్నానం చేయించేందుకు కుటుంబ సభ్యులు నీటిని వేడి చేసి బయట ఉంచారన్నారు. అక్కడే ఉన్న ఓ కుక్క మొరగడంతో ఆడుకుంటున్న చిన్నారి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు వేడినీటి బకెట్పై పడింది. దీంతో వేడి నీరంతా పడటంతో శరీరం కాలిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అగళిలోని గుప్త పాఠశాలలో ఎల్కేజీలో చేరిన భానుప్రియ పట్టుమని పది రోజులు కూడా గడవకనే మృతి చెందడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతికి పాఠశాల యజమాన్యం నివాళులర్పించి, మౌనం పాటించారు. -
గర్భంలోనే శిశువు మృతి
- వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆరోపణ - ప్రభుత్వాస్పత్రి ఎదుట నిరసన రాయదుర్గం టౌన్ : రాయదుర్గంలోని ఆత్మకూరు వీధిలో నివాసముంటున్న మాబున్నీ బళ్లారి ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి ప్రసవమైంది. అయితే గర్భంలోనే శిశువు మృతి చెందింది. రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో అంతకు ముందు వేసిన ఇంజక్షన్ వికటించడంతోనే ఈ సంఘటన జరిగిందంటూ బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదం చేశారు. రెండోసారి గర్భం దాల్చిన మాబున్నీని గత శుక్రవారం పొత్తికడుపులో నొప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్తో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. డ్యూటీ డాక్టర్ వసంతలక్ష్మీ డైక్లోఫెనాక్ ఇంజక్షన్ ఇచ్చారు. శనివారం ఉదయం కూడా మరోమారు ఇంజక్షన్ ఇచ్చినట్లు బంధువులు తెలిపారు. సాయంత్రం 4 గంటలవుతున్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో చేసేది లేక గర్భిణిని బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి ఆమె డెలివరీ కాగా.. గర్భంలోనే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. రాయదుర్గం ఆస్పత్రిలో ఇచ్చిన ఇంజక్షన్ల వల్లే బిడ్డ గర్భంలోనే మృతి చెందాడని మాబున్నీ బంధువులు ఆరోపించారు. దీంతో వారు మూకుమ్మడిగా కలసి రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు. వైద్యాధికారి స్పందిస్తూ డాక్టర్ వసంతలక్ష్మీ ఇచ్చిన ఇంజక్షన్ వల్ల తల్లికీ, బిడ్డకూ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. తాము సిఫార్సు చేయకున్నా వారే బళ్లారికి వెళ్లారన్నారు. -
చిన్నారిని మింగిన నీటిపాత్ర
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : నీటిపాత్ర ఓ చిన్నారిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్చెరువులో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, వారిని అవ్వ వద్ద మంగళవారం సాయంత్రం వదిలేసి దంపతులిద్దరూ గొర్రెలను చూసొచ్చేకి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రెండో సంతానమైన చందు(2)ఆడుకుంటూ వెళ్లి కొళాయి వద్ద గల నీటి పాత్రలో ప్రమాదవశాత్తు పడిపోయాడన్నారు. కాసేపటికి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారొచ్చి బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే బిడ్డ మరణించి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. -
వికటించిన వైద్యం
హిందూపురం రూరల్ : పురిటి నొప్పుల ప్రసవంతో వచ్చిన ఒక మహిళకు శస్త్రచికిత్స (సిజేరియన్) నిర్వహించగా పురుటిబిడ్డ మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం పట్టణంలోని గిరీష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. హిందూపురం పట్టణం ఎంఎఫ్రోడ్డులో నివాసం ఉంటున్న దివ్యజ్యోతికి ఏడాది క్రితం మడకశిరలోని శ్రీనివాసులుతో వివాహంమైంది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణంలోని గిరీష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈక్రమంలో 9 నెలలు నిండిన తర్వాత కాన్పు కోసం వెళ్తే స్కానింగ్ చేసి బిడ్డ క్షేమంగా ఉందని.. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. దివ్యజ్యోతి ఉదయం నుంచే ఆస్పత్రిలో ఉంది. అయితే చివరి నిమిషంలో సిజేరియన్ చేయాలని కోరగా చేశారు. కానీ పురిటి బిడ్డ మృత్యువాత పడిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై వైద్యురాలు సంధా్యలక్ష్మిని అడగ్గా సాధారణ కాన్పు చేయాలని కోరారు. అయితే పరిస్థితి మారడంతో సిజేరియన్ చేశామన్నారు. బిడ్డ ఉమ్మి నీరు తాగి తల వాపు రావడంతో మృతి చెందినట్టు తెలిపనారు. విషయం తెలుసుకున్న ఐఎంఏ కార్యదర్శి బాలాజి అక్కడికి చేరుకుని బాధితులకు, వైద్యులకు సర్ది చెప్పారు. -
పోయిన చిన్నారి ప్రాణం
- హృదయ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - రంగంలోకి దిగిన పోలీసులు అనంతపురం మెడికల్ : అనంతపురం సాయినగర్లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలైంది. తమ బిడ్డ మరణానికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గార్లదిన్నె మండలం పాత కల్లూరుకు చెందిన భాగ్యలక్ష్మీ, ఉదయ్కుమార్ దంపతులకు మూడు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం జ్వరం రావడంతో అనంతపురం సాయినగర్లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్ శ్రీనివాసులు.. నాలుగు రకాల మందులు ఇచ్చారు. ఇంటికెళ్లి మందులు వేయగానే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెంటనే ఆటోలో అనంతపురానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రికి వచ్చి డాక్టర్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అంతలోనే టూటౌన్ పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ఆస్పత్రి వద్ద గొడవ చేయడం తగదని, ఏదైనా ఉంటే స్టేషన్లో కేసు పెట్టాలని సూచించారు. అయినా వారు ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. బిడ్డ మృతదేహంతో తల్లి కన్నీరు పెడుతుంటే అక్కడున్న వారి హృదయాలు చలించిపోయాయి. ఘటనపై డాక్టర్ శ్రీనివాసులును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘పాల పొర పోవడం వల్లే బిడ్డ చనిపోయినట్టున్నాడు. పోస్టుమార్టం చేస్తే వాస్తవాలు తెలుస్తాయి’ అని అన్నారు. -
బాత్రూము బండ విరిగిపడి బాలుడి మృతి
ఓడీ చెరువు : ఇంటిముందు బాత్రూము కోసం ఏర్పాటు చేసుకున్న నల్లబండ విరిగి మీద పడటంతో బాలాజీ అనే ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్లో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు.. క్రాసింగ్లో నివాసముంటున్న నాగరాజు, అనూష దంపతులకు బాలాజీ, కార్తీక్ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురూ కలిసి శనివారం ఉదయం టిఫిన్ చేశారు. నాగరాజు కూలి పని నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. ఇంటిముందు చుట్టూ బండలు పాతి ఏర్పాటు చేసుకున్న బాత్రూము వద్ద పెద్ద కుమారుడు బాలాజీ ఆడుకుంటున్నాడు. ఆ బండల వద్ద కూర్చోవడానికి వీలుగా పెట్టిన ఓ రాయి ఎక్కి బండను పట్టుకుని ఆ పక్కనే ఉన్న చిన్న కానుగచెట్టు ఎక్కబోయాడు. ఆ బండ విరిగి మీదపడింది. ఆ శబ్ధం విన్న అనూష అరుస్తూ పరుగున బయటకు వచ్చింది. ఆమె అరుపుతో చుట్టుపక్కలవారు కూడా అక్కడికి వచ్చి బాలుడిపై పడిన బండను తొలగించారు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాలాజీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. -
చిన్నారిని మింగిన నీటి తొట్టె
అగళి : అగళి పోలీస్స్టేషన్ సమీపంలో నివాసముంటున్న భజంత్రి అశ్వత్థప్ప మనవడు విష్ణుకుమార్(2) బుధవారం ఉదయం నీటి తొట్టెలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అశ్వత్థప్ప తన కుమార్తె శశికళను ఆరేళ్ల కిందట హిందూపురానికి చెందిన రామప్పకు ఇచ్చి వివాహం చేశారు. మొదటి కాన్పులో విష్ణు జన్మించగా, ఇప్పుడామె రెండో కాన్పుకు పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టెలోకి విష్ణుకుమార్ కాలుజారి పడిపోయాడన్నారు. తల్లి చూసి గట్టిగా కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి చిన్నారిని బయటకు తీసి వెంటనే పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో శిరా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు వివరించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే ఆ బిడ్డ బతికేవాడని స్థానికులు తెలిపారు. -
సనప ఉత్సవాల్లో అపశ్రుతి
కోనేటిలోకి జారిపడి చిన్నారి మృతి ఆత్మకూరు (రాప్తాడు) : ఆత్మకూరు మండలం సనప గ్రామంలో శుక్రవారం జరిగిన మాధవరాజుల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కోనేటిలోకి జారిపడి మృత్యువాతపడ్డాడు. ఎస్ఐ ధరణి కిషోర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా... ధర్మవరంలోని రైతు నారాయణస్వామి, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు గణేష్ (10)ఉన్నారు. సనప మాధవరాజుల ఉత్సవాలకు శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నారాయణస్వామి వచ్చారు. సాయంత్రం మూడు గంటలకు గణేష్ ఒంటరిగా కోనేరు వద్దకు చేరుకుని అక్కడ నీటిలో ఆడుకుంటున్న పిల్లలను గమనిస్తూ మెట్లపై నుంచి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. చాలా సేపటి తర్వాత తమతో పాటు గణేష్ లేడనే విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడి కోసం వెదకడం మొదలుపెట్టారు. కోనేరు వద్ద చేరుకుని అనుమానంతో నీటిలో వెదకగా బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలాన్ని ఎస్ఐ పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి
పెనుకొండ రూరల్(పరిగి) : మండలంలోని కోనాపురంలో పెంటా వ్యాక్సి¯ŒS వికటించి మూడు నెలల చిన్నారి శనివారం మృతి చెందింది. తల్లిదండ్రులు రామచంద్ర, సుధ తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం చిన్నారిని గ్రామంలోని అంగ¯ŒSవాడీ కేంద్రం–2 వద్దకు తీసుకెళ్లి నెల ఇంజక్ష¯ŒS వేయించామన్నారు. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మరణానికి కారణం ఏఎ¯ŒSఎంలు లతిత, కుమారి లేనని వారు ఆరోపించారు. ఈ విషయంపై పరిగి పీహెచ్సీ డా.జగదీష్ను వివరణ కోరగా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
నీటి తొట్టిలో పడి చిన్నారి మృత్యువాత
పావగడ : కర్ణాటకలోని పావగడ తాలూకాలోని తిరుమణిలో నరశింహలు, సుధారాణి దంపతుల కుమారుడు నిఖిత్(4) ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించడంతో అప్పటికే ఊపిరాడక చిన్నారి మతి చెందాడు. తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో బాలుడి మృతి
అనంతపురం రూరల్ : డెంగీతో బాలుడు మృతి చెందిన ఘటన రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కొట్టాలలో మంగళవారం చోటు చేసుకుంది. చంద్రబాబు కొట్టాలకు చెందిన ఫరూక్ బేగం, శర్మాస్ దంపతుల కుమారుడు హుస్సేన్ (4) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గలేదు. పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందాడు. -
మెట్లపై నుంచి జారిపడి చిన్నారి మృతి
యాడికి : రాయలచెరువులో షఫీవుల్లా కుమార్తె షహనాజ్(3) మెట్లపై నుంచి జారి పడి ఆదివారం మరణించి నట్లు గ్రామస్తులు తెలిపారు. షఫీవుల్లాకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో పెద్ద కు మార్తె షహనాజ్ ఇంటిపైకి వెళ్లే ప్రయత్నంలో మెట్లెక్కుతూ జారి కిందపడిపోయిం దన్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
రుయాలో మరో చిన్నారి కన్నుమూత
తిరుపతి : తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి శనివారం మృతి చెందింది. శుక్రవారం ఇదే అసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
చికిత్స పొందుతూ బాలిక మృతి
చిలమత్తూరు : ఆత్మహత్యకు పాల్పడిన బాలిక బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. వివరాలు.. మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధికి చెందిన రోషన్, షకీలా దంపతుల పెద్ద కుమార్తె హర్షియాబాను (13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి భరించలేక సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. గమనించిన బంధువులు, తల్లిదండ్రులు గాయపడ్డ హర్షియాను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జమాల్బాషా వివరించారు. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
హిందూపురం ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన హిందూపురం అర్బన్ : స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ లక్షణాలతో చిన్నారి నవిత (4) మంగళవారం మతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప ప్రాణాలు కోల్పోయిందని చిన్నారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మడకశిర మండలం కెరసానిపల్లికి చెందిన నాగమణి, నరసింహులు దంపతుల కుమార్తె నవితకు జ్వరం రావడంతో ఈనెల 17వ తేదీ హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి హైఫీవర్ ఉంది. రెండు రోజుల్లో పరిస్థితి మెరుగు పడుతుందని భరోసా ఇచ్చారు. నాలుగు రోజుల నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్లు జ్వరం తగ్గుతుందని చెబుతూ వచ్చారు. కాగా మంగళవారం ఉదయం నవితకు జ్వరం ఎక్కువైంది. ఈ క్రమంలో ఫిట్స్ మొదలై కొంతసేపటికే శరీరం చల్లబడిపోయింది. గమనించిన తల్లి నాగమణి వెంటనే వైద్యులను తీసుకొచ్చింది. పరీక్షించిన డాక్టర్లు హైఫీవర్ కారణంగా చనిపోయిందన్నారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన చిన్నారి నవిత చనిపోయిందనే విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. వైద్యులతో పాటు సూపరింటెండెంట్ కేశవులతో వ్వాగాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ ఎస్ఐలు దిలీప్, వెంకటేశులు, సిబ్బంది అక్కడికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. -
పసికందును కాటేసిన అతిసార
రాయదుర్గం రూరల్ : రాతిబావివంక గ్రామానికి చెందిన శెట్టినాయక్, సరితాబాయి దంపతుల కుమారుడు చంద్రశేఖర్నాయక్ (21 నెలలు) అతిసారతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సరితాబాయి పుట్టినిల్లు అయిన కర్ణాటకలోని ఖానహŸసళ్లి సమీపంలోని పూజారి హళ్లి తండాకు గత ఆదివారం వెళ్లారు. మంగళవారం వాంతులు, విరేచనాలు కావడంతో రాయదుర్గం పట్టణానికి వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించిన అనంతరం బళ్లారి విమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో టుంకూరు వద్ద చనిపోయాడు. మృతదేహాన్ని శనివారం రాత్రి ఖననం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా సర్పంచ్ గాని, పంచాయతీ కార్యదర్శులు గాని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గాని ఎటువంటి చర్యలూ చేపట్టలేదని గ్రామస్తులు తెలిపారు. రాయదుర్గంలో డెంగీ కేసు.. రాయదుర్గం పట్టణం మొలకాల్మూరు రోడ్డు సున్నపుబట్టీల వద్ద హుస్సేన్బీ అనే పదేళ్ల చిన్నారి డెంగీ జ్వరం బారినపడింది. బళ్లారిలోని ఆర్కే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా నిర్ధారించి, చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుందని తల్లిదండ్రులు ఖాసీంసాబ్, ఫాతిమాబీ తెలిపారు. -
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
గార్లదిన్నె: మర్తాడులో నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మర్తాడు గ్రామానికి చెందిన బాషా, భాను కుమార్తె షకీదా (5) ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా గురువారం సాయంత్రం ఇంటి సమీపంలో కనిపించడం లేదు. దీంతో బంధువులు చుట్టు పక్కల అంతా వెతికారు. ఆఖరికి బాషా ఇంటి సమీపంలో ఉన్న నీటి తొట్టెలో షకీదా మృతదేహాన్ని కనుకున్నారు. నీళ్లలో విగత జీవిలా పడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
మృత్యు ఒడికి చిన్నారి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో కర్ణాటక గుట్టకొడికేపల్లికి చెందిన అభిలాష్ (4) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు రవి, గాయిత్రీ ఆస్పత్రి వద్ద కన్నీరు మున్నీరయ్యారు. అభిలాష్కు తీవ్ర జ్వరం ఉందని వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి మరో డాక్టర్కు బాధ్యత అప్పగించి వెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందటంతో వైద్య సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరకుని వైద్యులతో గొడవకు దిగారు. ఇంతలో డాక్టర్ వెంకటరమణ అక్కడికి చేరుకుని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. బెంగళూరుకు వెళ్లాలని సూచించాలి కదా వైద్యులను బంధువులు నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐలు మహమ్మద్బాష, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి అక్కడికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పారు. -
ఊపిరి తీసిన ఊయల
యాడికి : బడికి పోయి ఉన్నా మాకు నువ్వు దక్కేదానివి కదమ్మా అంటూ ఆ తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఊయల బిగుసుకుని ప్రగతి (11) అనే బాలిక ఊపిరి ఆగిపోయింది. స్థానికులు తెలిపిన మేరకు... పిన్నేపల్లి గ్రామానికి చెందిన రవీంద్రనాథ్రెడ్డి,వరలక్ష్మి దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రగతి చిన్నది కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ప్రగతి మండల కేంద్రం యాడికిలోని ప్రైౖవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. మంగళవారం ‘అమ్మా చెవిలో నొప్పిగా వుంది. ఈరోజు స్కూలుకు వెళ్లను’ అని చెప్పడంతో సరే ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండమ్మా అని తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఇంటిలో ఉన్న ఊయల ఊగుతూ ఆడుకుంటోంది. అయితే ఉన్నపళంగా ఊయల మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక పాప మృతి చెందింది. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విగతజీవిగా కుమార్తె కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. -
చిన్నారి ప్రాణం పోయింది
గుంతకల్లు టౌన్ : చికిత్స కోసం వెళితే చిన్నారి ప్రాణమే పోయింది. ఇంజెక్షన్ వేసిన కొన్ని నిమిషాలకే కన్ను మూసింది. తమ చేతుల మీదే గిలగిలాకొట్టుకుంటూ పాప చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సురేష్, సులోచన దంపతుల రెండో కుమార్తె జ్యోతి(11నెలలు)కి సోమవారం రాత్రి నుంచి తీవ్రమైన జ్వరం వచ్చింది. మంగళవారం ఉదయం చిన్నారిని వైద్యం నిమిత్తం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని టి.బి.రోడ్లోని అరుణ్ క్లినిక్లో చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వీరేష్కుమార్ను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు పాపకు ఇంజెక్షన్ వేశాక రక్తపరీక్షలకు సిఫార్సు చేశారు. ల్యాబ్కు తీసుకెళ్లగానే పాప పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించుకుంటూ వైద్యుడి వద్దకు వచ్చారు. ఇంజెక్షన్ వికటించే తమ పాప మరణించిందని, మెరుగైన వైద్యం చేసి ఉంటే బతికి ఉండేదని వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ధర్నా కేవీపీఎస్ డివిజన్ అధ్యక్షుడు జగ్గిలి రమేష్, కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాయలసీమ దళిత సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్ రాయలసీమ కార్యదర్శి స్వామిదాస్ తదితరులు చిన్నారి జ్యోతి మరణానికి కారణమైన డాక్టర్ను వెంటనే అరెస్ట్ చేయాలని క్లినిక్ ఎదుట రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగారు. సీఐ గురునాథబాబు, ఎస్ఐ నగేష్బాబులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులు, వైద్యుడిని ఒన్టౌన్ పోలీస్స్టేçÙన్కు తీసుకెళ్లారు. పట్టణంలోని వైద్యులు కూడా స్టేషన్కు వచ్చారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్పై కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పాప తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఏ విచారణకైనా సిద్ధమే జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని పరీక్షించి జ్వరం నయం కావడానికి తగిన మోతాదు మేరకు ఇంజెక్షన్ వేశాను. పాప యాక్టివ్గా లేని కారణంగా రక్త పరీక్షలు చేయించుకువస్తే ఆ రిపోర్ట్ చూసి తదుపరి మెరుగైన వైద్యం చేస్తానని చెప్పాను. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ఉన్నాం కానీ ప్రాణాలు తీసేందుకు కాదు. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే. – డాక్టర్ వీరేష్కుమార్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు -
ఆ పసికందు ఇక లేదు
అనంతపురం సిటీ: ధర్మవరం రూరల్ పరిధిలోని నగటూరు పోతులయ్య ఆలయం గుడి మెట్లపై శుక్రవారం సాయంత్రం చిక్కిన శిశువు అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాత్రి 8 గంటలకు శిశువును ధర్మవరం పోలీసులు అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్ఎన్సీయూ వార్డులో చేర్పించారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించినట్లు కనిపిస్తున్న శిశువుకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ పసికూన శ్వాస ఆగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఉదయమే వార్డుకు వెళ్లి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి ఆస్పత్రి ఆవరణలో లభించిన చిన్నారికి మెరుగైన వైద్య సేవలందించాలని డాక్టర్ సుధీర్ను ఆదేశించారు. -
సందీపూ.. లే నాన్నా..
►ఇంత శిక్ష వేస్తావనుకోలేదు రా ► తల్లిడిల్లిన హృదయం ► కొడైకెనాల్లో గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి ►అనంతపురం చేరిన మృతదేహం అనంతపురం సెంట్రల్ : ‘సందీపూ లే నాన్నా.. నన్ను విడిచి ఎక్కడికి పోతావురా.. కొడుకా నావైపు ఒక్కసారి చూడరా.. అంటూ విద్యార్థి సందీప్ తల్లి గౌరీ తన కుమారుడి మృతదేహంపై పడి రోదించడం అందరి గుండెలను పిండేసింది. ఆమెను ఓదార్చడం అక్కడున్న వారితరం కాలేదు. చేతికొచ్చిన కొడుకు కళ్లెదుటే నిర్జీవంగా పడి ఉండడం చూసి ఆ మాతృహృదయం తట్టుకోలేకపోయింది. కొడైకెనాల్లో గల్లంతైన పోలీస్ హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ కుమారుడే సందీప్(20). అతని ఆచూకీని గురువారం రాత్రి కనుగొన్నారు. మృతదేహాన్ని శుక్రవారం అనంతపురంలోని అరవింద్నగర్లో గల వారి నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహం రాగానే కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. జరిగిందేమిటంటే... అనంతపురంలోని పీవీకేకే కళాశాలలో సందీప్ డిగ్రీ చదువుతున్నాడు. వినాయక చవితికి వినూత్నమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత మంగళవారం తన స్నేహితులతో కలసి మహీంద్రా కంపెనీకి చెందిన లోగాన్ కారులో బళ్లారి జిల్లా హంపీకి వెళ్లారు. అక్కడ విగ్రహాలను చూసిన అనంతరం అటు నుంచి కొడైకెనాల్ వెళ్లారు. గురువారం మధ్యాహ్నం అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారీ నీళ్లలో పడిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి అతని ఆచూకీ కనుగొన్నారు. ఒక్కగానొక్క కుమారుడు... హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ ముగ్గురు అన్నదమ్ములు కాగా, వారందరికీ ఆడపిల్లలే సంతానం. చంద్రశేఖర్కు మాత్రం ఒక కుమారుడు, ఒక కుమార్తె. వారి వంశంలోనే సందీప్ ఏకైక మగసంతానం కావడంతో అతి గారాబంగా పెంచారు. అందులో భాగంగానే స్నేహితులతో పరిచయం ఎక్కువ కావడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే తన తండ్రిలాగే సందీప్ కూడా పోలీసు అధికారి కావాలని కలలు కనేకాడని గుర్తు చేశారు. ప్రస్తుతం నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో ఎలాగైనా కానిస్టేబుల్ లేదా ఎస్ఐ కావాలని శిక్షణ కూడా పొందేవాడని తెలిసింది. అంతలోనే ప్రమాదం జరిగి తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం అందరినీ కలచివేసింది. అమ్మమాట కాదని... నెల కిందటే సందీప్ తన స్నేహితులతో కలసి కొడైకెనాల్ వెళ్లొచ్చినట్లు తెలిసింది. నెల తిరక్కనే మరోసారి తాను, తన స్నేహితులు కొడైకెనాల్ వెళ్లి రావాలని తల్లితో చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఎలాగైనా పోవాలని అతను పట్టుబట్టినట్లు తెలిసింది. ఎలాగోలా ఇంట్లో ఒప్పించి, ఆ తరువాత మిత్రులతో కలసి కొడైకెనాల్ వెళ్లి, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఇప్పుడు ఆ కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. నేను చనిపోతే ఏడవకండి సందీప్ తన ఫేస్బుక్ అకౌంట్లో కొన్ని రోజుల కిందట ఓ పోస్ట్ అప్డేట్ చేశారు. అందులో ‘నేను చనిపోతే ఏడవకండి. ఒక్కసారి ఆకాశం వైపు చూసి గుడ్బై చెప్పండి’ అంటూ రాసి ఉండడాన్ని స్నేహితులు గుర్తు చేసుకుని విషాదంలో మునిగిపోయారు. -
పంటకాలువలో పడి చిన్నారి మృతి
కర్నూలు: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి చెందిన కురుమయ్య, కృష్ణవేణి దంపతుల కుమార్తె రుషిత(3)ను బంధువుల వద్ద ఉంచి పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు కూతురు కోసం బంధువుల ఇంటికి వెళ్లి చూసింది. అక్కడ కనిపించకపోయే సరికి చుట్టుపక్కల వెదికారు. చివరికి సమీపంలోని పంట కాలువలో శవమై ఉండగా స్థానికులు గుర్తించారు. ఆడుకుంటూ వెళ్లి నీళ్లలో పడి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
డెంగీతో చిన్నారి మృతి
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): డెంగీ మహమ్మారి ఓ చిన్నారిని మింగేసింది. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో నివాసం ఉండే దంపతుల కుమార్తె సాయిరేఖకు డెంగీ వ్యాధి సోకింది. దాంతో వైద్యం నిమిత్తం చెన్నైలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక సోమవారం మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి
-
పాము కాటుతో చిన్నారి మృతి
గార: స్నేహితులతో కలసి ఆడుకుంటున్న వేళ ఓ నాగుపాము కాటువేసి ఐదేళ్ల చిన్నారిని బలితీసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీపురం పంచాయతీ పరిధిలోని దువ్వుపేటలో జరిగింది. బాకి హరిత ఆదివారం అంగన్వాడీ స్కూల్కు సెలవు కావడంతో స్నేహితురాళ్లతో కలసి మధ్యాహ్నం గ్రామం సమీపంలోని కల్వర్టుపై కూర్చుంది. కింద కాలువలో నీటి ధార వెళుతుంటే కాళ్లూపుతూ హరిత ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ నాగుపాము హరిత కాలుపై కాటు వేసింది. ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు శ్రీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మృతి చెందింది. -
ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి
నారాయణపేట్: ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారిని నీటి ట్యాంకర్ బలి తీసుకుంది. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్లోని బీసీ కాలనీలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నీటితో ట్యాంకర్ బీసీ కాలనీలో వెళుతుండగా.. రేఖ అనే నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంట్లోంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. డ్రైవర్ గమనించి ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ట్యాంకు వెనుక టైర్ కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తర్వాత స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): అప్పటి వరకూ సరదాగా ఆడుతూ, కేరింతలు కొడుతూ కనిపించిన చిన్నారి నోరు మూగబోయింది. ఆడుకుంటూ స్నానాలగదిలోకి వెళ్లిన రెండేళ్ల బాలుడు నీటి బకెట్లో తలకిందులుగా పడిపోవడంతో మృతి చెందాడు. ఆలస్యంగా జరిగిన దారుణాన్ని చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు బాధతో కుప్పకూలిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు ఎస్పీ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్ల కిట్టయ్య, లక్ష్మీదేవి దంపతుల రెండేళ్ల కుమారుడు జితేంద్ర ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు ఉన్నారు. అయితే, జితేంద్ర స్నానాల గదిలోకి వెళ్లగా కాలు జారి బకెట్లో తలకిందులుగా పడిపోవడంతో ఊరిరాడక మృతి చెందాడు. గాలికి బాత్రూమ్ డోర్ కూడా మూసుకుపోవడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. చిన్నారి మాట వినిపించకపోవడంతో ఎవరో ఒకరు ఎత్తుకుని ఉంటారులే అనుకున్నారు. కానీ, కొద్దిసేపటికి బాత్రూమ్లోని నీటి బకెట్లో జితేంద్ర విగతజీవిగా కనిపించడంతో... కిట్టయ్య, లక్ష్మీదేవి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు కూడా చలించిపోయారు. -
వైద్యం కరువై నవజాత శిశువు మృతి
వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే: బాధితులు శోకసంద్రంలో దంపతులు నీరుగారుతున్న మార్పు పథకం బంగారంపేట (పెళ్లకూరు): గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించి, వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడేందుకు, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ‘మార్పు’ కింద ఏఎన్ఎంలను నియమించింది. కానీ ప్రభుత్వం గర్భిణులపై చూపుతున్నామన్న శ్రద్ధ వాస్తవ విరుద్ధంగా ఉంది. బంగారుపేటలో శుక్రవారం తాజాగా చోటుచేసుకున్న సంఘటనతో మరోసారి ఇది రుజువైంది. వైద్యారోగ్య సిబ్బంది సరైన పోషకాహారం, ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడంతో బంగారుపేట గ్రామానికి చెందిన సమాధి శ్రీలక్ష్మికి పుట్టిన నవజాత మగబిడ్డ శుక్రవారం మరణించింది. నెలకిందటే తాళ్వాయిపాడుకు చెందిన ముస్సరత్జహకి సరైన వైద్యం అందక మగబిడ్డ మృతిచెందిన విషయం మరువక ముందే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గర్భిణుల ఆరోగ్యంపై సిబ్బంది ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. స్థానిక బీసీ కాలనీకి చెందిన శ్రీలక్ష్మికి తొలి, మలి కాన్పుల్లో ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మూడోసారీ శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో ఈ సారైనా మగబిడ్డ పుడతాడేమోనని భర్త బాలాజీ ఆశపడ్డాడు. అతను అనుకున్న విధంగానే ఈ సారి మగబిడ్డ జన్మించాడు.. అయితే ఎనిమిది నెలలకే ప్రసవం కావడంతో ఆ పిల్లాడు పుట్టిన వెంటనే మరణించాడు. దీంతో ఆ దంపతులిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోలోనే నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు పథకం నీరుగారడంతోనే పుట్టిన పిల్లలు మృత్యువాత పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ‘మార్పు’ కింద తన పేరు రికార్డుల్లో నమోదైనా, వైద్యసిబ్బంది ఎలాంటి సదుపాయాలు కల్పించడం, ప్రతినెలా ఆస్పత్రుల్లో చూపించడం చేయలేదని బాధితులు తెలిపారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సాయిబాబాని వివరణ కోరగా.. దీనిపై ఎలాంటి సమాచారం లేదని, విచారించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. -
నీటి గుంతలో పడి చిన్నారి మృతి
గోరంట్ల (అనంతపురం జిల్లా): నీటి గుంతలో పడి ఒక చిన్నారి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో బుధవారం జరిగింది. వివరాలు.. గోరంట్లలోని మోహన్రావునగర్కు చెందిన వేమనారాయణ, పుష్పలత దంపతుల కుమార్తె పల్లవి (2) ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని నీటి గుంతలో పడింది. గమనించిన కుటుంబసభ్యులు బాలికను వెలికి తీసినా అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
గోదావరిలో మునిగి చిన్నారి మృతి
ఏటూరునాగారం (వరంగల్): వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలో గురువారం రాత్రి గోదావరి నదిలో మునిగి ఒక చిన్నారి మృత్యువాతపడింది. వివరాలు.. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొట్టె వెంకటేశ్వర్లు, శైలజ దంపతులు తమ కుమార్తె ప్రియాంతి (3) తో కలిసి బుధవారం గోదావరి ఆవలిగట్టున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి వారు పడవ ఎక్కారు. రాత్రి పది గంటల సమయంలో పడవ తీరానికి చేరింది. కిందికి దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ వారు ముగ్గురూ నీళ్లలో పడిపోయారు. ప్రియాంతి నీటిలో మునిగి చనిపోగా.. వెంకటేశ్వర్లు, శైలజలను తోటి ప్రయాణికులు కాపాడారు. -
అన్నప్రాసన మరుసటి రోజే అనంతలోకాలకు..
గార్ల (ఖమ్మం జిల్లా): అన్నప్రాసన చేసుకున్న మరుసటిరోజే ఆ పాపకు వడదెబ్బ తగిలింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. గార్ల మండలం బీఆర్ఎన్ తండాకు చెందిన భూక్యా రాజేష్, దేవి దంపతులకు ముగ్గురు పిల్లలు. తొలుత ఇద్దరు కుమారులు. తర్వాత ఆరు నెలల కూతురు త్రివేణి ఉన్నారు. ఆ పాపకు మర్రిగూడెం వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుభకార్యం జరుపుకున్న సంతోషం ఆ తల్లిదండ్రులకు కొద్ది గంటలు నిలువలేదు. అన్నప్రాసన రోజే ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో పాప వడదెబ్బకు గురైంది. చికిత్స నిమిత్తం ఖమ్మంలో ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆదివారం అన్నప్రాసనకు హాజరై, మరుసటి రోజు పాప అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
వైద్యం వికటించి చిన్నారి మృతి
చిత్తూరు: వైద్యం వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో 11 నెలల చిన్నారిని చేర్పించారు. అక్కడి వైద్యులు సరైన చికిత్స చేయకపోవడంతోనే ఆ చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
సీఎం సభకు వెళ్తున్న బస్సు ఢీకొని బాలుడి దుర్మరణం
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో గురువారం ముఖ్యమంత్రి సభకు జనాన్ని తరలించే బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో పురుషోత్తం(5) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు... కురబలకోటలో జరిగే సీఎం సభకు రామసముద్రం నుంచి టీడీపీ కార్యకర్తలను బస్సులో తరలిస్తున్నారు. ఆ బస్సు దాదినాయునితాండ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న మదనపల్లె మండలం కృష్ణాపురానికి చెందిన పి. ఈశ్వర్ (45), వెనుక కూర్చుని ఉన్న పవన్(12), ఈశ్వర్ తమ్ముడి కుమారుడు పురుషోత్తం(5) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పురుషోత్తం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈశ్వర్, పవన్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
కరీంనగర్: తన చిలిపి చేష్టలతో.. అమాయక నవ్వులతో.. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచే ఏడాదిన్నర చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టెలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) అనే గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటా విష్ణువర్థన్ రెడ్డి (18 నెలలు) అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటూ నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
డాక్టర్ నిర్లక్ష్యానికి బాలిక బలి