ఆ పసికందు ఇక లేదు | child dies in anantapur government hospital | Sakshi
Sakshi News home page

ఆ పసికందు ఇక లేదు

Published Sun, Aug 7 2016 12:31 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఆ పసికందు ఇక లేదు - Sakshi

ఆ పసికందు ఇక లేదు

ధర్మవరం రూరల్‌ పరిధిలోని నగటూరు పోతులయ్య ఆలయం గుడి మెట్లపై శుక్రవారం సాయంత్రం చిక్కిన శిశువు అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అనంతపురం సిటీ: ధర్మవరం రూరల్‌ పరిధిలోని నగటూరు పోతులయ్య ఆలయం గుడి మెట్లపై శుక్రవారం సాయంత్రం చిక్కిన శిశువు అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాత్రి 8 గంటలకు శిశువును ధర్మవరం పోలీసులు అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో చేర్పించారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించినట్లు కనిపిస్తున్న శిశువుకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు.

శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ పసికూన శ్వాస ఆగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు ఉదయమే వార్డుకు వెళ్లి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి ఆస్పత్రి ఆవరణలో లభించిన చిన్నారికి మెరుగైన వైద్య సేవలందించాలని డాక్టర్‌ సుధీర్‌ను ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement