private hospital
-
నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్!
ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్ అంకుష్కు ఫోన్ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా.. ఏం చేస్తావో చేయ్..అంటూ సవాల్ విసిరాడు. అంకుష్ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం -
రక్తం మారింది... ప్రాణం పోయింది
జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్స్టేషన్ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది. ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తమిళనాడులోని దిండిగల్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
ఆక్సిజన్ సిలిండర్తో.. నడి రోడ్డుపై..
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్ఆర్పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కైకలూరు మండలం దేవిచింతపాడు గ్రామానికి చెందిన తానేటి నాగమణి 2 నెలల క్రితం ఏలూరు ఎన్ఆర్పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా కొద్ది రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వేరే హాస్పిటల్కు తీసుకువెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారని చెప్పారు. క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స చేయటంతో ఇన్ఫెక్షన్ అయిందని, అది తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని వైద్యులు చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు నాగమణిని శనివారం సాయంత్రం.. ముందుగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్కు తీసుకురాగా, తమకు సంబంధం లేదని, వైద్యం చేయబోమంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. రాత్రి 10.35 గంటల వరకూ ఆరున్నర గంటల పాటు రోడ్డుపైనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. -
ప్రాణం పోయమంటే... పేగులు తోడేశారు
అనంతపురం మెడికల్: జీవి పుట్టుకకు దేవుడు కారణమైతే... ఆ జీవి ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడిపేందుకు వైద్యులు కారణమై దేవుడితో సమానంగా ఖ్యాతి దక్కించుకున్నారు. అయితే కొందరు వైద్యుల కారణంగా ఈ ఖ్యాతి కాస్త అపఖ్యాతిగా మారుతోంది. ఇందుకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో సర్జరీ విభాగం సేవలే నిదర్శనం. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న ఓ వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి వార్డుకు తరలిస్తే పేగులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...కణేకల్లు మండలం బెన్నికల్కు చెందిన వృద్ధుడు హనుమప్ప కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆ చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు గత నెల సర్వజనాస్పత్రికి పిలుచుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గత నెల 25న యూనిట్ 2 కింద అడ్మిట్ చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇంటర్ స్టైనల్ ఇన్ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పి వస్తోందని గుర్తించి లాపరోటమీ సర్జరీ (పొత్తికడుపు ఓపెన్ సర్జరీ) చేసి ఎస్ఐసీయూకు తరలించారు. ఐసీయూకు తరలించిన అదే రోజు హనుమప్పకు సర్జరీ వైద్యులు వేసిన కుట్లు తెరుచుకుని కడుపులో నుంచి పేగులు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు, పక్కనే ఉన్న రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు.వార్డులోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి విషయాన్ని వెంటనే వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే అనస్తీసియా నుంచి బయటపడిన హనుమప్ప నొప్పి భరించలేక కేకలు వేస్తుండడంతో ఎస్ఐసీయూలో భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైద్యులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. ఇదేమిటని బాధిత కుటుంబసభ్యులు వైద్యులను ఆరా తీస్తే హనుమప్పకదలడం, ఆయాసం అధికంగా కావడంతో పేగులు బయట పడ్డాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాక ఈ అంశం వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హనుమప్ప కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. కాగా, యూనిట్ 2 వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శస్త్రచికిత్స విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సర్జరీ విభాగంలో సరైన ప్రమాణాలను వైద్యులు పాటించడం లేదని ఆస్పత్రి వర్గాలే బాహటంగా చెబుతున్నాయి. సీనియర్లు చేయాల్సిన సర్జరీని పీజీ వైద్య విద్యార్థులతో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వజనాస్పత్రిలో సర్జరీ విభాగం వైఫల్యాలపై ఆస్పత్రి పాలక వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు
కామారెడ్డి టౌన్: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. -
ప్రాణదానం చేసి.. ప్రాణాలు విడిచింది
బొమ్మనహళ్లి: ఓ మహిళ సామాజిక సేవలో ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలుస్తారు. అదే మాదిరిగా బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసును చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన బెంగళూరులో జరిగింది. మృతురాలు అర్చనా కామత్ (34).బంధువుకు బాగా లేదంటే..వివరాలు.. ఉడుపికి చెందిన అర్చనా కామత్ మంగళూరులో ఓ మేనేజ్మెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. తమ బంధువైన వృద్ధురాలు (69)కి కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. అనేకమందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు. అర్చన బ్లడ్ గ్రూప్తో సరిపోయింది. దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది. 12 రోజుల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అర్చనకు శస్త్రచికిత్స చేసి లివర్ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు. మూడురోజుల తరువాత అర్చన డిశ్చార్జ్ అయింది. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండురోజుల కిందట ఆకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఆమెకు భర్త చేతన్ కామత్ తో పాటు నాలుగేళ్ల తనయుడు ఉన్నారు. ఆమె లివర్ను పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండడం విశేషం. -
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్పై అత్యాచారం, హత్య, షాద్నగర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్పై జరిగిన దాడితోపాటు కోల్కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేటుపరం..! బాబు, పవన్ వాటాలు బయటపడ్డ నిజాలు
-
బాబు నిర్వాకం.. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.కాగా, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాకిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో పీపీపీ పద్దతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మెత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.ఇక, ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్దతిలో పెట్టాలని నిర్ణయించారు. -
పిల్లే కదా అనుకుంటే..
శివమొగ్గ: ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి మహిళ మరణించిన ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గృహిణి గంగీబాయి (44) అనే మహిళ రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది.అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నఫళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ మల్లప్ప తెలిపారు. పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు. -
‘ఆపరేషన్’ సిజేరియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.45 శాతం అనవసరమే సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం ⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు.⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
ఢిల్లీలో ప్రైవెట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
● ఆస్పత్రిలో బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన ● పోలీసుల జోక్యంతో విరమణ మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
కడుపు కోతకు చెక్..!
సాక్షి, రాజమహేంద్రవరం: బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అదీ సహజ పద్ధతిలో జరిగితే తల్లీ, బిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహం అమ్మ కడుపును కోసేస్తోంది.. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు యథేచ్ఛగా చేసేస్తున్నారు. గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే శస్త్ర చికిత్స తప్పుకాదు. కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా శ్రస్త్ర చికిత్సలనే ప్రోత్సహిస్తున్నారు. సిజేరియన్కు రూ.40 వేల నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి(కోత కనబడని శస్త్ర చికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రుతలకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్ర చికిత్సలే చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ దుస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్య శాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్ల వల్ల కలిగే అనర్ధాలు, సహ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు పోత్రహించేందుకు ‘సీ–సేఫ్’ విధానాన్ని రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం సన్నద్ధమవుతోంది. ఇదీ సంగతి జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 300కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రాజమహేంద్రవరం జీజీహెచ్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, కడియం పీహెచ్సీల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వైద్య శాఖ గణాంకాల ప్రకారం 50 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 50 శాతానికి పైగా అపరేషన్లు జరుగుతున్నాయి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండటంతో బాలింతలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మార్చి 22 వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22,648 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రైవేటులో అత్యధికంగా 15,804, అందులో 10,433 సిజేరియన్లు జరిగాయి. 5,370 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,844 జరగ్గా.. కేవలం 3,552 శస్త్ర చికిత్సలు మాత్రమే చేశారు. అదీ హైరిస్క్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. 3,763 సాధారణ ప్రసవాలు జరిగాయి. నర్సులకు శిక్షణ సహజ ప్రసవాలు పెంచే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైఫరీ(ఎన్పీఎం) కోర్సులో శిక్షణ అందించారు. బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళలకు అవసరమైన వైద్యం ఎలా అందజేయాలో వివరించారు. హైరిస్క్లో ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి అందించాల్సిన వైద్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డులో పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. సీ–సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియనుల చేయాలన్నదే ‘సీ–సేఫ్’ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాతృశిశు మరణాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తుంది. సాధారణ కాన్పులే మేలు నవమాసాలు మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించడం తగదని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితిని బట్టి రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ను ప్రోత్సహిస్తున్నారు. వైద్యుల్లో సైతం వేచి చూసే ధోరణి ఉండాలి. రోగుల ఒత్తిడి మేరకు శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడం తగదు. గర్భం దాల్చినప్పటి నుంచి తేలికపాటి వ్యాయామాలు చేస్తే కాన్పు సమయంలో ఇబ్బందులు పడాల్సి అవసరం ఉండదని సూచిస్తున్నారు. జిల్లాలో మూడు నెలలుగా శస్త్ర చికిత్సలు, నార్మల్ డెలివరీలు ఇలా.. ఆస్పత్రి నెల సిజేరియన్లు నార్మల్ డెలివరీ ప్రభుత్వ జనవరి 236 251 ఫిబ్రవరి 253 250 మార్చి 215 244 ప్రైవేటు జనవరి 916 389 ఫిబ్రవరి 631 345 మార్చి 599 292 గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అవసరం లేకుండా చేపట్టే జిసేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు గాను ప్రతి పీహెచ్సీ, గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నా.ం ఈ క్రమంలో సీ–సేఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం... – డాక్టర్.కె. వెంకటేశ్వరరావు,జిల్లా వైద్య శాఖాధికారి -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఐదు రోజులు మృత్యువుతో పోరాటం
వరంగల్ : ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడిన ఓ విద్యార్థిని ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే హసన్పర్తికి చెందిన లిక్కి శంకర్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు అక్షయ(13), కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గొల్లపల్లి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. నగరంలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. ఈనెల 21న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అవయవాల దానం అక్షయ అవయవాలను దానం చేశారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యసిబ్బంది నేత్రాలతో పాటు ఇతర అవయవాలను సేకరించారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య అక్షయ అంతిమయాత్ర సాగింది. పార్థివదేహం ఇంటికి చేరుకున్న సమాచారం అందుకున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్షయ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో తెలివి గల విద్యార్థినిగా ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అనంతరం హసన్çపర్తిలో శ్మశాన వాటికలో అక్షయ అంత్యక్రియలు నిర్వహించారు. -
వీర్యం తారుమారు చేసినందుకు రూ.1.5 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్లో వారికి కవలలు జని్మంచారు. శిశువులకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. -
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్లోకి మార్చుతూ అప్గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్కు ఆ ఆస్పత్రిలో సర్జన్గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్లో పెట్టిన సొంత క్లినిక్లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
ఆరోగ్యానికి వై‘ఎస్సార్’.. ప్రైవేటుకు దీటుగా వైద్యం
కాకినాడ సిటీ: చిన్న జబ్బు చేసి, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రోజుకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 ఖర్చు చేయాల్సిందే. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి తరచూ రక్త పరీక్ష, మందుల ఖర్చు సరేసరి. ఇటువంటి పరిస్థితుల్లో జబ్బు చేసిందంటే పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పేది కాదు. ఈ దుస్థితి నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంపై ఫోకస్ పెట్టారు. పక్కా భవనాలు, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది, అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు (యూహెచ్సీ) ఏర్పాటు చేశారు. ఇవి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురం, తుని, సామర్లకోట, పిఠాపురం వంటి పట్టణాల్లో శివారు ప్రాంతాల నుంచి సైతం 10 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా యూహెచ్సీలు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండగా, వీటితో పాటు జిల్లాలో కొత్తగా 23 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో యూహెచ్సీకి రూ.80 లక్షల చొప్పున వెచ్చించారు. ప్రభుత్వ సాయం మరువలేం పిల్లలు, వృద్ధులకు చిన్నపాటి జబ్బు చేస్తే.. ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. చాలా దూరం కావడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి సత్వరమే ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రభుత్వ సాయాన్ని పేద ప్రజలు ఎప్పటికీ మరువలేరు. – డి.జితేంద్రసింగ్, స్వర్ణాంధ్ర కాలనీ, కాకినాడ అన్ని రకాల చికిత్సలూ అందిస్తున్నాం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలూ అందిస్తున్నాం. ముఖ్యంగా ల్యాబ్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక రోగులకు ఎప్పటికప్పుడు ఉచితంగా మందులు అందజేస్తున్నాం. కొంత ఇబ్బందికరంగా ఉన్న రోగులను పర్యవేక్షణలో ఉంచుకుని, వైద్యం అందించేందుకు 10 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పడిప్పుడే వీటికి అవసరమైన పరికరాలు వస్తున్నాయి. రోగులకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉండటంతో సత్వరం వైద్య సేవలందిస్తున్నాం. వారంలో ఒక రోజు ఇద్దరు, ముగ్గురు స్పెషలైజేషన్ చేసిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. – డాక్టర్ వి.మహేష్, పర్లోవపేట, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్, కాకినాడ ఇవీ సౌకర్యాలు ► ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్ను 10 గదులతో నిర్మించారు. ► ప్రతి భవనంలో 10 పడకలు, ఓపీ–1, ఓపీ–2, లేబర్ రూము, మైనర్ ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, యోగా గది, ఫార్మా గది, మినీ వార్డులు ఉన్నాయి. ► ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక వైద్యాధికారి వైద్య సేవలు అందిస్తారు. వీరితో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ► ప్రతి సోమవారం ఒక స్పెషలైజేషన్ వైద్యుడి సేవలు అందిస్తున్నారు. ► బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగులు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగనవసరం లేకుండా అర్బన్ హెల్త్ సెంటర్లోనే రక్త పరీక్షలు చేస్తారు. ► అనంతరం వైద్యులు ఆ రిపోర్టులు చెక్ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు. ► ల్యాబ్లో అన్ని రకాల వైద్య పరీక్షలూ ఉచితంగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► ఎవరికైన రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ–సంజీవని యాప్ ఆయా స్పెషలైజ్డ్ డాక్టర్ల సలహా తీసుకుని, చికిత్స చేసి, మందులు అందజేస్తారు. శివారు ప్రాంతాలకు ఎంతో మేలు డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు పట్టణాల్లోని శివారు ప్రాంత ప్రజలకు వరంలా ఉన్నాయి. కాకినాడ నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట, సంజయ్నగర్, సాంబమూర్తినగర్, రేచర్లపేట కొత్త కాకినాడ, జగన్నాథపురం, నరసింహా రోడ్డు, పప్పుల మిల్లు, పద్మనాభ నగర్, ఏటిమొగ, ముత్తానగర్, మహాలక్ష్మి నగర్, రణదీప్ నగర్, నాయకర్ నగర్, జె.రామారావుపేట, ఏసువారి వీధి, చినమార్కెట్ తదితర శివారు ప్రాంతాలకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ శివారు కాలనీల్లోని ప్రజలు గతంలో ఏదైనా చిన్నపాటి జబ్బు చేస్తే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)కి వెళ్లడానికి చాలా వ్యయప్రయాసలు పడేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లతో చేరువలోనే సత్వర వైద్య సేవలు అందుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా...
-
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు
-
కుమార్తె సీమంతం.. గంటల్లోపే మృత్యు ఒడికి తండ్రి
కళ్యాణదుర్గం: కుమార్తె సీమంతం ఘనంగా జరిపిన 24 గంటల్లోపే ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన గంగవరం గంగన్న (52) ఒక్కగానొక్క కుమార్తె జయంతి సీమంతం వేడుకను బుధవారం బంధువుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక గంగన్న ఛాతినొప్పితో విలవిల్లాడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న అతను ఛాతి నొప్పి రావడంతో మృతి చెందినట్లు అల్లుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, గంగన్న గతంలో ఆర్డీటీ ఉపాధ్యాయుడిగా, ఆయన భార్య హంపమ్మ గ్రామ సర్పంచ్గా సేవలు అందించారు. (చదవండి: విజయవాడలో దారుణం.. స్నేహితు పనేనా..?) -
ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై..
విజయనగరం ఫోర్ట్: రక్తపరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళపై ఆస్పత్రి ఉద్యోగి మంగళవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె ఈసీజీ గది లోకి వెళ్లగా అక్కడి ఉద్యోగి లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది. చదవండి: వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే.. దీంతో ఆమె బయటకు పరిగెత్తుకుని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో వారు డయల్ 100కు ఫోన్ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే వన్టౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టగా సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం. -
ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసినపడిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జబల్పూర్, దమోనాకా ప్రాంతంలోని న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ సిద్ధార్థ్ బహుగుణా తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఆసుపత్రిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. #WATCH | Madhya Pradesh: Fire breaks out at Jabalpur Hospital. Further details awaited pic.twitter.com/RdjjqARKIY — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2022 ఇదీ చదవండి: చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో.. -
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
-
విషాదం: పుట్టిన కొన్ని గంటలకే శిశువు.. ఆ వెంటనే తల్లి..
సాక్షి. ఆదిలాబాద్: శుభవార్త కోసం వేచిచూస్తున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.. మొదటి కాన్పు కావడంతో పుట్టింటి, నెట్టింటివారు గర్భి ణిని ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్న మగ శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శిశువు మృతిచెందగా, సాయంత్రం 5 గంటలకు బాలింత తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన సయ్యద్ అక్బర్అలీ, షాకెర సుల్తానాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల షాకెరా సుల్తానా గర్భం దాల్చింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని శారద నర్సింగ్ హోమ్కు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం 11.30 గంటలకు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. 2.30 గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే శిశువు శ్వాస సరిగా తీసుకోవడంలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించడంతో కుటుంబీకులు అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బాలింత కూడా మృతిచెందిందని వైద్యురాలు చైతన్య స్రవంతి కుటుంబ సభ్యులకు తెలిపారు. మొదట బాలింత పరిస్థితి ఏ విధంగా ఉందని అడగగా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పినా ఇక్కడే వైద్యం అందిస్తామని వైద్యురాలు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలోద్దు! డాక్టర్ నిర్లక్ష్యంతోనే.. వైద్యురాలి నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతిచెందారని బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆస్పత్రిలోనికి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు యత్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై కేసు నమోదు చేసి ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావ్, వన్టౌన్ సీఐ, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయినా ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రిలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు బయటకు తీసుకురావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఓ వైద్యుడు సాధారణ కాన్పు జరిగిందని, బీపీ ఎక్కువై ఫిట్స్ రావడంతో బాలింత మృతిచెందిందని తెలిపారు. ఈ విషయమై వైద్యులను ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
కొత్తూరు: ప్రమాదవశాత్తు ఐదేళ్ల విద్యార్థికి మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని ఇన్ముల్నర్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. ఎంఈవో కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇమామ్, షభానాబేగంలకు ముజామిల్ (5)తో పాటు మూడేళ్ల వయస్సున్న కూతురు ఉంది. ముజామిల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 9.30 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ పక్కన విద్యార్థికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు మంటలను ఆర్పేసి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరితో పాటు ఎంఈవో కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాల సమీపంలో చెత్తకు పెట్టిన నిప్పు వద్ద బాధిత విద్యార్థితో పాటు మరో బాలుడు ఆడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఎంఈవో తెలిపారు. -
ఒక్కరోజే 2,484 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆదివారం 65,263 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,484 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.61 లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207 మంది కోలుకోగా, మొత్తంగా 7.18 లక్షలమంది రికవరీ అయ్యారు. ఆదివారం కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,086 మంది బలయ్యారు. ప్రస్తుతం 38,723 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,214 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 843 మంది ఐసీయూలో, 1,319 మంది ఆక్సిజన్, సాధారణ పడకలపై 1,052 ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. -
ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత
పుణె (ముంబై): ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే (67) అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఆయన గత కొద్దికాలంగా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య ఒక కుమారుడు, కుమార్తె, తల్లి ఉన్నారు. ఇండియన్ లా సొసైటీ నుంచి లా పట్టాను పొందిన షివాడే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్కు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు, షినే అహుజాపై రేప్ కేసులను వాదించారు. వీటితోపాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీ తరఫున కేసును, వజ్రాల వ్యాపారి భరత్షా కేసులను షివాడే కోర్టులో వాదించారు. చదవండి: (మొబైల్ మింగేశాడు.. ఎండోస్కోపీతో..) -
బయోగ్యాస్ ప్లాంట్లో పుర్రెలు, పిండాల ఎముకలు
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఆవరణలో కనీసం 11 పుర్రెలు 54 పిండాల ఎముకలను పోలీసులు వెలికి తీశారు. ఈ మేరకు పోలీసులు అక్రమ అబార్షన్ కేసును విచారిస్తున్నప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ఆ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ రేఖా కదమ్, నర్సుని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...13 ఏళ్ల బాలికకు బలవంతంగా అబార్షన్ చేయించుకోమని బాలికతో సంబంధం పెట్టుకున్న మైనర్ బాలుడి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈక్రమంలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ బాలికను అబార్షన్ చేయించుకోకపోతే నీ పరువు తీస్తామని బెదిరించారు. అంతేకాదు ఆమెకు అబార్షన్ చేయించేందుకు వైద్యులకు డబ్బులు కూడా ఇచ్చారు. ఒక బాలికకు బలవంతంగా అబార్షన్ చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించాం. అప్పుడు ఆర్వీ తహసీల్లోని కదమ్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను తనీఖీ చేస్తుండగా పిండాలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఆ మైనర్ బాలుడి తల్లితండ్రులను, వైద్యుడిని, నర్సుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం అని పోలీసులు తెలిపారు. (చదవండి: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....) -
కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): జాతీయ కవి కువెంపు కోడలు, కవి కే.పీ.పూర్ణచంద్ర తేజస్వి సతీమణి రాజేశ్వరి (84) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు దేహాన్ని ఓ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: డిజిటల్ కరెన్సీకి తుది మెరుగులు!.. సెబీకి అప్పగిస్తే ఏం చేద్దాం? -
హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ..
Samantha Falls Sick And Tested In Private Hospital: స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని వెళ్లింది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్లోని AIG హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సామ్ ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు. -
నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత
సాక్షి, బెజ్జంకి(మెదక్): పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఎలుకంటి గురువారెడ్డి, లక్ష్మీల కూతురు శిరిషను నాలుగేళ్ల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన నాగెల్లి రజనీకాంత్కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కూతురు వినీక్ష ఉంది. ఆరు నెలల క్రితం రజనీకాంత్కు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో శిరీషను గుండారంలోని తల్లిగారింట్లో వదిలి వెళ్లాడు. పెళ్లికి ముందు నుంచి ఫిట్స్తో బాధపడుతున్న శిరీష తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో మనస్తాపం చెంది ఈనెల 6న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చదవండి: Hyderabad: సెల్ఫోన్ చోరుల కొత్త పంథా -
‘రహెనుమా–ఎ– దక్కన్’ చీఫ్ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/దూద్బౌలి: ప్రముఖ ఉర్దూ దినపత్రిక రహెనుమా–ఎ–దక్కన్ చీఫ్ ఎడిటర్ సయ్యద్ వికారుద్దీన్(82) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. హోంమంత్రి మహమూ ద్ అలీ తదితరులు వికారుద్దీన్ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. శుక్రవా రం ఉదయం ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని జనాజేకీ నమాజ్ (అంతిమ ప్రార్థనలు) కోసం మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఈ ప్రార్థనల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంబీటీ, ఎంఐఎం పార్టీల నేతల తోపాటు ముస్లిం మతపెద్దలు, అభిమానులు పాల్గొన్నారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర లాడ్బజార్, ముర్గీచౌక్, మూసాబౌలి మీదుగా హుస్సేనీ ఆలంలోని మూసా ఖాద్రీ దర్గా వరకు సాగింది. తర్వాత అంత్యక్రియలు నిర్వ హించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీలో డిగ్రీ చదివిన ఆయన 65 ఏళ్లుగా రహెనుమా–ఎ– దక్కన్ పత్రికకు చీఫ్ ఎడిటర్గా సేవలు అందిస్తున్నారు. ఇటీవలే ఆ పత్రిక వందేళ్లు పూర్తిచేసుకుంది. ముస్లిం దేశాల సమైక్యత కోసం ఆయన ఇండో–అరబ్ లీగ్ సంస్థను స్థాపించారు. ఆయన కృషి వల్లే ఆ సంస్థకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. పాల స్తీనాపై ఇజ్రాయిల్ దురాక్రమణను ఆయన తీవ్రంగా నిరసించేవారు. పాలస్తీనా విమోచనాయోధులు యాసర్ అరాఫత్, మహమూద్ అబ్బాస్, అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్లతో సంబంధాలుండేవి. భారత్– అరబ్ దేశాల మైత్రి కోసం చేసిన కృషికి 22 అరబ్బు దేశాల లీగ్ సంస్థ ఆయనకు పురస్కా రాన్ని అందజేసింది. స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డునూ అందుకున్నారు. ఆయన మృతికి భారతదేశంతోపాటు అరబ్బు దేశాల దౌత్య కార్యాలయాలు సంతాపం తెలిపాయి. వికారుద్దీన్ మృతిపట్ల సీఎం కేసీఆర్తో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిని షేక్ అబ్దుల్ రహీం లక్డీకపూల్లో మిరాకిల్ గ్లాస్ ట్రేడర్ పేరు షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీ సాయంత్రం తన వీపు పై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్ కొడుకు షేక్ జునేద్ (21) తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్ అబ్దుల్ రహీమ్.. జునేద్ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్కు పరీక్షలు నిర్వహించి క్లినిక్లోకి తీసుకువెళ్లి షేక్ అబ్దుల్ రహీమ్ను అడగకుండానే మైనర్ సర్జరీ చేసి కురుపును తొలగించాడు. సర్జరీ విషయం తెలిసిన జునైద్ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని నిలదీశాడు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్ జునేద్కు నొప్పి బాగా పెరిగింది. అక్కడరక్తస్రావమైంది. గమనించిన డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్ జునేద్కు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు నేరుగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. కురుపు వద్ద మైనర్ సర్జరి చేసే సమయంలో సూది జునైద్ శరీరంలోనే ఉండిపోయిందని డాక్టర్ సజ్జాద్ తెలిపారు. ఇదిలా ఉండగా 3వ తేదీ తెల్లవారు జామున షేక్ జునైద్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆపిల్ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా సర్జరీ చేశారని షేక్ అబ్దుల్ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును గోల్కొండ పోలీసులు బుధవారం స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి విజ్ఞప్తి మేరకు గురువారం ఉస్మానియా వైద్యులు ఖననం చేసిన షేక్ జునైద్ మృతదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సెవెన్ టూంబ్స్ సమీపంలోని స్మశానవాటిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..
నిజామాబాద్ అర్బన్: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్కు చెందిన నవీన్కుమార్కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్ కరీం, పి.గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం
-
‘సర్వేపల్లి’ మనుమడు కేశవ్ దేశిరాజు కన్నుమూత
సాక్షి,చెన్నై/బాపట్ల: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు (కుమార్తె కుమారుడు), విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు (66) చెన్నైలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తన తాత రాధాకృష్ణన్ జయంతి రోజునే ఆయన తనువు చాలించడం విచారకరం. కేశవ్ పూర్వీకులు బాపట్లలోని దేశిరాజు వారి వీధిలో నివసించారు. ఇప్పటికీ చాలామంది దేశిరాజు కుటుంబాల వారు అక్కడ ఉన్నారు. 1978 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కేశవ్.. కేంద్ర ఆరోగ్య శాఖ, వినియోగదారుల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. తన తాత సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిని అణువణువునా పుణికిపుచ్చుకున్న కేశవ్ దేశిరాజు అనేక పుస్తకాలు రాశారు. కేశవ్ దేశిరాజు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ సంతాపం తెలిపారు. -
‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!
సాక్షి, పంజగుట్ట: సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు సనత్నగర్కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతన్ని మొదట ఈసీఐఎల్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం అడ్మిట్ చేశారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలు చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు రోధిస్తూ వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి మహేందర్ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. చదవండి: Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే! -
అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై..
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన ఎనిమిది నెలలకే మరో వివాహిత తనువు చాలించింది. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. అత్తింటివారు హత్య చేశారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కారణాలేవైనా ఇద్దరు గర్భిణులు ఆత్మ హత్య చేసుకోవడం స్థానికులను కలిచివేసింది. సాక్షి, భీమారం(ఆదిలాబాద్): అత్తింటి వేధింపు తాళలేక మండలంలోని నర్సింగాపూర్(బి) గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి దుర్గం రమ్య (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మడి లక్ష్మి, రాజలింగు దంపతుల కుమార్తె రమ్యకు 2020 జూన్ 26న భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రాజ శేఖర్తో వివాహం జరిగింది. ఆ సమయంలో ఒప్పుకున్న ప్రకారం కట్నంతోపాటు 10 గుంటల భూమి ఇచ్చారు. ఆ భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామలు రమ్యపై ఒత్తిడి తెస్తున్నారు. మరో రూ.50వేలు అదనపు కట్నం తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో అదనపు కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించడంతో గర్భిణి అని కనికరం చూపకుండా శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు తాళలేక రమ్య శుక్రవారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం భీమారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రమ్య మృతిచెందినట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. మృతురాలి భర్త రాజశేఖర్, అత్తమామలు శశక్క, భూమన్న, మరిది రాకేశ్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని అన్నారు. చదవండి: పెళ్లయిన ఎనిమిది నెలలకే అఘాయిత్యం -
పోలీస్నంటూ వైద్యుడిని బెదిరించి రూ.75 లక్షలు కాజేయబోయిన కిలాడి దొంగ
హైదరాబాద్: హైదరాబాద్లోని ఓ ప్రముక ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు బంజారాహిల్స్లో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం ఆ వైద్యుడి వద్ద మహేశ్ అనే వ్యక్తి డ్రైవర్గా పని చేశాడు. ఆ సమయంలోనే ఆ వైద్యుడికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి అతను సేకరించాడు. ఈ విషయం తెలిసుకున్న ఆ వైద్యుడు అతన్ని పనిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి మహేశ్ ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్గా పని చేస్తున్న గౌతం నాయర్ వద్ద డ్రైవర్గా చేరాడు. అయితే మహేశ్ తన జల్సాల కోసం గౌతం నాయర్ వద్ద నుంచి మొత్తం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు చెల్లించ లేని మహేశ్ తప్పుడు మార్గంలో అధిక మొత్తం సంపాదంచే ఓ ప్రణాళికను గౌతం నాయర్కు చెప్పాడు. గతంలో తాను ఓ వైద్యుడి వద్ద పని చేశానని, వైద్యుడు తన భార్యను చంపుతానని మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని దానిని ఆసరాగా చేసుకొని ఆ వైద్యుడిని బెదిరించి డబ్బు సంపాదిద్దామని గౌతం నాయర్కు ప్లాన్ చెప్పాడు. మహేశ్ మాటలు విని ఈ నెల 14న గౌతం నాయర్ వైద్యుడికి ఫోన్ చేసి తాను ఖమ్మం సీఐనని మీ ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని రూ.75 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ వైద్యుడు వెంటనే పోలీస్లను ఆశ్రయించాడు. కేసు నమొదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ వైద్యుడితో గౌతం నాయర్కు రూ.75 లక్షలు కాదని రూ.20 లక్షలు చెల్లిస్తానని తన ఆడియో క్లిప్ తనకి ఇవ్వవలసిందిగా పోలీసులే దగ్గరుండి ఫోన్ చేయించారు. అలాగే డబ్బులు తీసుకోడానికి బంజారాహిల్స్లోని ఓ ప్రముక ఆలయం వద్దకు రావాల్సిందిగా సూచించారు. అయితే గౌతం నాయర్ పోలీస్ స్టిక్కర్ వేసిన కారులో ఆలయానికి వచ్చాడు. అప్పటికే పోలీసులు ఆ ఆలయం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలోనే ఆ వైద్యుడితో గౌతం నాయర్ మాట్లాడుతుండగానే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్రధాన నిందితుడు మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అనంతరం పోలీసులు మాట్లాడుతూ ఇలా ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే భయపడకుండా ధైర్యంగా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. -
వైద్యుల నిర్వాకం.. చికిత్సకోసం వెళితే.. కరెంట్షాకులు..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్లోని ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన కిషన్ (38) మానసిక సమస్యతో ప్రశాంతి హాస్పిటల్లో చికిత్సకోసం పది రోజుల క్రితం చేరాడు. చికిత్స పొందుతున్న కిషన్ మంగళవారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. అయితే పేషెంట్ పరిస్థితిని అంచనా వేయకుండా వైద్యులు అడ్డగోలుగా కరెంట్ షాక్లు, ఓవర్డోస్ మందులు ఇవ్వడం మూలంగానే చనిపోయాడని ఆరోపిస్తూ బుధవారం ఉదయం మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. టూటౌన్ పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మృతుడి బంధువులతో చర్చించి సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై సైకియాట్రిస్టు డాక్టర్ పి.కిషన్ను వివరణ కోరగా, సదరు పేషెంట్కు ట్రీట్మెంట్ పూర్తిచేసి డిశ్చార్జ్ చేసే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందాడని తెలిపారు. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది
కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్పూర్కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. -
మంత్రి పువ్వాడ సీరియస్.. డబ్బు వాపస్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి
సాక్షి, ఖమ్మం: కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల భయాలను ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇటీవలే కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబం నుంచి అధిక బిల్లులను వసూళ్లు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబం కట్టిన 5 లక్షల అధిక బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం తిరిగి చెల్లించింది. వివరాలు.. ఖమ్మం పట్టణానికి చెందిన అలీమ్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటంబ సభ్యులు చేర్పించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అలీమ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన కుటుంబం నుంచి సదరు ఆస్పత్రి యాజమాన్యం చార్జీల రూపంలో 6 లక్షల 40 వేలు వసూలు చేసింది. అయితే ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ దృష్టికి మృతుని కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఆయన మండిపడ్డారు. అధికంగా వసూలు చేసిన బిల్లులను వెనక్కి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో 5 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం చెల్లించింది. చదవండి: Khammam: మధిర ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి -
TS: కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా రాష్టవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్సల ఛార్జీలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. కోవిడ్ సోకి సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు, పీపీఈ కిట్ ధర రూ.273కి మించరాదని ఆస్పత్రుల ఛార్జిలను ఖారారు చేసింది. హెచ్ఆర్ సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300, ఐఎల్6 రూ.1300 మాత్రమే ఛార్జ్ చేయాలని పేర్కొంది. అదే విధంగా డీ డైమర్ రూ.300, సీఆర్పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటీన్ రూ.400, ఎల్డీహెచ్ రూ.140 ఛార్జీలను నిర్ణయించింది. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలుగా, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలుగా ధరలను ప్రభుత్వం ఖారారు చేసింది. చదవండి: CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. -
Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల పంపిణీ జోరు పెరిగింది. కోవిడ్ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తుండటం, కొద్దినెలల్లో కరోనా మూడోవేవ్ రావొచ్చనే అంచనాల నేపథ్యంలో.. టీకాలకు డిమాండ్ పెరిగింది. పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ (పీసీవీసీ)లను ఆశ్రయిస్తున్నారు. ఇవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నా.. రద్దీ విపరీతంగా ఉంటోంది. 656 ప్రభుత్వ.. 29 ప్రైవేటు కేంద్రాలు రాష్ట్రంలో 656 ప్రభుత్వ కేంద్రాలు, 29 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లతో పాటు హైరిస్క్ కేటగిరీలో ఉన్న వారికి, 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇస్తున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల పంపిణీ ఉచితం కాగా.. ప్రైవేటు కేంద్రాల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటులో రోజూ 2 వేల మందికిపైనే.. రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రోజుకు సగటున 2వేల మందికిపైనే టీకాలు ఇస్తున్నారు. గురువారం ఒక్కరోజే 29 ప్రైవేటు కేంద్రాల్లో 57,922 మందికి టీకాలు వేశారు. అదే 656 ప్రభుత్వ కేంద్రాల్లో 1,23,020 మందికి ఇచ్చారు. ఈ లెక్కన ప్రభుత్వకేంద్రాల్లో రోజుకు సగటున 2 వందల కంటే తక్కువ మందికి టీకాలు ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటివరకు 73,99,241 టీకాలు ఇవ్వగా.. ఇందులో ప్రభుత్వకేంద్రాల్లో ఇచ్చినవి 60,71,872, ప్రైవేటు కేంద్రాల్లో ఫీజులు చెల్లించి తీసుకున్నవి 13,27,369 డోసులు కావడం గమనార్హం. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆగింది! కొవిన్ యాప్ ద్వారా ముందస్తు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. వ్యాక్సిన్ కేంద్రం సమాచారం, స్లాట్ బుకింగ్ ఆప్షన్లు కనిపించడమే లేదు. ప్రైవేటు కేంద్రాల వివరాలు కూడా ఉండటం లేదు. దీనితో ముందస్తు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టడం లేదు. ప్రైవేటు కేంద్రాల వద్ద అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసి టీకా ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతోపాటు సర్వీసు చార్జీ కింద మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ► ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వారం రోజుల నుంచి టీకాల పంపిణీ జోరు పెరిగింది. అంతకుముందు రోజూ పది వేల వరకు టీకాలు పంపిణీ చేయగా.. ప్రస్తుతం రోజూ 50–60 వేల వరకు ఇస్తున్నారు. ► ప్రభుత్వ టీకా కేంద్రాల్లో హైరిస్క్, ఫ్రంట్ లైన్ కేటగిరీలు, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ఈ కేటగిరీల్లో లేని 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టీకా తీసుకుంటున్నారు. ► సగటున ఒక్కో ప్రైవేటు సెంటర్లో రోజూ 2 వేల మందికిపైనే వ్యాక్సిన్లు తీసుకుంటుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో రోజుకు సగటున 2 వందల మందికే వేస్తున్నారు. ► ప్రైవేటు కేంద్రాల్లో టీకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువగా తీసుకుంటున్నారని.. సర్వీస్, ఇతర చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అవగాహన పెరగడంతోనే.. ప్రజల్లో వ్యాక్సిన్ అవగాహన పెరిగింది. టీకాల కోసం ఎక్కువమంది ముందుకొస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీల్లోని వారికే టీకాలు వేస్తుండటంతో.. ప్రైవేటుకు వచ్చే వారి సంఖ్య కొద్దిరోజులుగా పెరిగింది. మేం టీకా కేంద్రానికి వచ్చిన వారికే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు కోరితే.. ఆయా చోట్ల ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు ఇస్తున్నాం. నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా టీకాలు పంపిణీ చేస్తున్నాం. –సి.భార్గవ ప్రసాద్, జనరల్ మేనేజర్, సిటీన్యూరో సెంటర్ చదవండి: కోవిడ్ తీవ్రతకు ఆ డీఎన్ఏకు లంకె -
ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం .. డబ్బు వెనక్కు..
సాక్షి, తూర్పుగోదావరి : ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేస్తూ రోగి బంధువుల నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం చెందింది. ఆసుపత్రి యాజమాన్యం రోగి నుండి వసూలు చేసిన రూ.4.50 లక్షలు కలెక్టర్ సమక్షంలో తిరిగి బాధితుని బంధువులకు అందచేసింది. ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేస్తూ..వారి బంధువుల నుండి అక్రమంగా రూ.4.50 లక్షలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బాధితులు ఆశ్రయించడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు. -
అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారు
-
ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. ఠాగూర్ సినిమా సీన్ను తలపించారు
సాక్షి, చెన్నై: ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్ను తలపించారు తెరుప్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు. విషమంగా ఉన్న రోగి కోలుకుంటున్నాడని చెప్పి రూ.19 లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి నిర్వాకంపై కుటుంబ సభ్యులు తిరుప్పూర్ కలెక్టర్ను ఆశ్రయించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి తీసుకోవాల్సిన ఫీజులపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే అనేక ఆస్పత్రులు దోపిడే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్లోని ఓ ఆస్పత్రి లీలపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వివరాలు...తిరుప్పూర్కు చెందిన సుబ్రమణ్యం (62) మే 3న కరోనా బారినపడ్డారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. మే 23న ఆస్పత్రి సిబ్బంది సుబ్రమణ్యం తనయుడు కార్తికేయన్తో మాట్లాడి బిల్లు చెల్లించాలని కోరారు. బిల్లు కట్టించుకుని.. సుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నట్టు పేర్కొనడంతో రూ. 19 లక్షలను కార్తికేయన్ చెల్లించాడు. అయితే, ఆ మరుసటి రోజు రాత్రే సుబ్రమణ్యం ఆరోగ్యం విషమించినట్టు, పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు హడావుడి సృష్టించాయి. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాయి. ఆగమేఘాలపై మరో ఆస్పత్రికి తరలించగా సుబ్రమణ్యం మరణించాడు. అయితే తొలుత చికిత్స పొందిన ఆస్పత్రిపై అనుమానం కలగడంతో మంగళవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. కంప్యూటరైజ్డ్ బిల్లు కాకుండా చేతితో రాసిన బిల్లులు ఇచ్చి ఉండటం గమనార్హం. జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్ వైరల్: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు! -
కరోనా పేషెంట్లకు రూ.10 లక్షలు చెల్లించండి
ముంబై: కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి.దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు కరోనావైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడాను ఝులిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న 92 మంది బాధితులకు రూ.10 లక్షలు తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధితులకు కరోనా టెస్ట్ లు చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నాగ్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) అధికారులు ట్రీట్మెంట్ చేసినందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని అన్నీ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అధారంగా రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లో రేడియన్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా బాధితులు, లేదంటే వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శర్మ ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని అన్నారు. అంటువ్యాధి మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జలాజ్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి
సాక్షి, అమరావతి: దేశంలో అర్హులందరికీ సకాలంలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యానికి ‘ప్రైవేటు సరఫరా’ గండికొడుతోంది. ఉత్పత్తి అవుతున్నవ్యాక్సిన్లలో పావు వంతు గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు రంగానికి తరలిపోతున్నాయి. వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు సతమతమవుతుంటే.. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు దండుకుంటున్నాయి. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల సరఫరా నిలిపేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం సూచనకు నిపుణుల నుంచి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ కలిపి రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం ఇన్స్టిటూŠయ్ట్ నెలకు 6.50 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, భారత్ బయోటెక్ నెలకు దాదాపు 2 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీని ప్రకారం.. మేలో దేశంలో 8.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. రాష్ట్రాలను విస్మరించి ప్రైవేటుకు తరలింపు మేలో దేశంలో 8.50 కోట్ల డోసులు ఉత్పత్తి అయితే.. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కలిపి 5 కోట్ల డోసులే వేయనున్నాయి. మిగిలిన 3.50 కోట్ల డోసులను ప్రైవేటు సెక్టార్కు తరలిస్తున్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ముందుగానే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెబుతుండటం గమనార్హం. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు వేసే రాష్ట్రాల అవసరాలను విస్మరించి మరీ ప్రైవేటు రంగానికి ఇవ్వడం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు కరోనా విజృంభణతో ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి ఏకంగా రూ.25 వేల వరకు వసూలు చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఇంత అత్యధిక ధరకు దేశంలో బడా కార్పొరేట్ సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇలా ఒక్కమేలోనే 3.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డాయన్నది ఊహకే అంతు చిక్కడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే టీకా.. దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టీకాలు వేసే ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే సాగాలని.. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేయొద్దని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఒక్కో డోసుకు ప్రైవేటు ఆస్పత్రులు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి భారీగా పెరిగే వరకు టీకాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వేయాలని.. అంతవరకు ప్రైవేటు రంగానికి సరఫరా నిలిపివేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి తగినంత సరఫరా లేక.. మేలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, రాష్ట్రాలు వేస్తున్న వ్యాక్సిన్ల గణాంకాలను పరిశీలిస్తే.. వాస్తవ పరిస్థితి బోధపడుతుంది. కేంద్ర ప్రభుత్వ కోవిన్ పోర్టల్ ప్రకారం.. అన్ని రాష్ట్రాలు మే మొదటి మూడు వారాల్లో రోజుకు సగటున 16.2 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లు వేశాయి. వ్యాక్సిన్ల కొరతతో ముందు 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్లు వేస్తున్నాయి. కేంద్రం నుంచి తగినంతగా వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో మే 22 నుంచి సగటున రోజుకు 13 లక్షల వ్యాక్సిన్లే వేస్తున్నారు. పోనీ రోజుకు సగటున 16.2 లక్షల డోసుల లెక్కన తీసుకున్నా.. మే 31 నాటికి దేశంలో గరిష్టంగా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్లు మాత్రమే వేయగలరని తేలింది. -
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
-
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి: ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంపై సర్పవరం పీఎస్లో క్రిమినల్ కేసులు నమోదయ్యింది. ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే -
‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’
-
రూ. 20లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లండి!
-
ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు?
హైదరాబాద్: ‘మా పేషెంట్కు ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు? మొన్నటి వరకు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి.. శవాన్ని అప్పగిస్తారా’అంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని విరించి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ (40)కు కరోనా సోకి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 9న విరించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సల నిమిత్తం రూ.11 లక్షలు చెల్లించారు. మొదట్లో ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు భరోసా ఇచ్చారు. అయితే.. 22న వంశీకృష్ణ మృతి చెందాడని, మిగిలిన డబ్బులు కట్టకున్నా పర్వాలేదు మృతదేహాన్ని తీసుకెళ్లండని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వంశీకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది తీరుపై అనుమానం రావడంతో గురువారం మృతుడి బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి తమ పేషెంట్కు ఏం మందులు వాడారు.. ఏం చికిత్స చేశారో చెప్పాలని అడిగారు. ఆ వివరాలిస్తే తమ కుటుంబంలో ఉన్న వైద్యులకు చూపించుకుంటామని పేర్కొన్నారు. అయితే, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. హైడోస్ మందులు వాడటం వల్లే వంశీకృష్ణ మృతి చెందాడని, అతని మృతికి ఆస్పత్రి వర్గాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో 16 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. (చదవండి: జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్ పెంపు) -
ఎంజీఎంలో ఇంటిదొంగలు!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సరఫరా చేసిన రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆస్పత్రిలో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం ఘటనలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నారు. అయితే, ఎంజీఎం మాజీ పరిపాలనాధికారి ఇంజెక్షన్లను బయటకు తరలించారని, దీనిపై ఆరోగ్యశాఖ మాజీ మంత్రిని సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం కేటాయించిన రెమ్డెసివిర్లను ప్రైవేట్ క్లినిక్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఆ క్లినిక్ కాంపౌండర్ కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. కమిటీ వేశాం: సూపరింటెండెంట్ ఈ ఘటనపై విచారణ కోసం సీనియర్ ప్రొఫెస ర్లతో కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. సదరు కమిటీ రెండు నెలలుగా ఆస్పత్రికి వచ్చిన ఇంజక్షన్లు, వినియో గంపై ఆరా తీస్తుందన్నారు. ఇక ఎంజీఎం ఆస్ప త్రిలో ఫ్లోమీటర్లు కూడా చోరీకి గురయ్యాయని పరి పాలనాధికారులు నిర్ధారణకు వచ్చారు. చోరీ బాధ్యులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. -
చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు
బంజారాహిల్స్/ లింగాలఘణపురం: చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్తే అక్షరాల రూ.25లక్షల బిల్లు వేశారు.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు కొంత అప్పు చేసి సుమారు రూ.9లక్షల వరకు చెల్లించారు. అయినా చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32)కు ఈనెల 7వ తేదీన లింగాలఘన్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స నిమిత్తం బంధుమిత్రులంతా తలా కొంత పోగు చేసుకొని రూ.9లక్షల దాకా చెల్లించారు. ఈక్రమంలో అక్కడ అందుతోన్న చికిత్సతో కోలుకుంటున్నాడని అందరూ భావించారు. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అడిగినంత డబ్బు చెల్లిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం నాగరాజు మృతి చెందాండంటూ ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. రెండు రోజుల క్రితం కూడా తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడంటూ బంధుమిత్రులు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేయి విరిగిందని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 లక్షల బిల్లు వేశారని ఇప్పటికే రూ.9 లక్షలు చెల్లించామని ఇంకో రూ.15 లక్షలు చెల్లించి బాడీ తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి. మూడు గంటల పాటు గ్రామస్తులంతా ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో బకాయి బిల్లు లేకుండానే మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రానికి మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వర్గాలు బాధితకుటుంబానికి రూ.2 లక్షలు అందజేసినట్లు సమాచారం. చదవండి: చెరువులో విషప్రయోగం.. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
కాసుల కోసం కక్కుర్తి: బిల్లు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
మలక్పేట(హైదరాబాద్): ... అయినా ప్రైవేట్ ఆస్పత్రుల తీరు మారలేదు. అదే ధోరణి.. కాసుల కోసం అదే కక్కుర్తి.. బకాయి బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని తెగేసి చెప్పింది. మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన, అధికార పార్టీ ఎమ్మెల్సీ చొరవతో ఆఖరికి ఆస్పత్రి యాజమాన్యం దిగొచ్చింది. ఈ ఘటన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అది దిల్సుఖ్నగర్లోని ఆయూష్ ఆస్పత్రి. అందులో ఈ నెల 5న మహబూబాబాద్ జిల్లాకు చెందిన యెర్నం శ్రీధర్(37) అనే కరోనా రోగి చేరారు. వైద్యులు 12 రోజులపాటు చికిత్స అందించారు. సోమవారం ఉదయం కూడా శ్రీధర్ ఆరోగ్యంగానే ఉన్నారు. కుటంబసభ్యులతో బాగానే మాట్లాడారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఊపిరి వదిలారు. తమ కుటుంబసభ్యుడు చనిపోయాడనే బాధలో ఉండగానే బిల్లు చెల్లించాలంటూ యాజమాన్యం బాధితులపై ఒత్తిడి చేసింది. చేసేదేమీలేక వారు రూ.8 లక్షలు చెల్లించారు. అయినా మృతదేహాన్ని వారికి అప్పగించలేదు. అదేంటని అడిగితే మరో రూ.3 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే అప్పు చేశామని, ఇక ఏమాత్రం చెల్లించలేమని బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొని వచ్చిన మలక్పేట ఎస్ఐ వీరబాబు వారిని సముదాయించారు. బ్లాక్లో సినిమా టికెట్లు అమ్ముకునే విధంగా ఆస్పత్రి యాజమాన్యం రెమిడిసివిర్ జంక్షన్లకు ఒక్కో దానికి రూ.50 వేలు, ప్లాస్మాకు రూ.30 వేలు వసూలు చేస్తోందని మృతుడి సోదరుడు, జర్నలిస్టు సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా ప్రజల ప్రాణాలను అడ్డం పెటుకుని దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేయడంతో ఎట్టకేలకు మృతహదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు ‘మృతుడి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బకాయి ఉన్న బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని అనలేదు. మిగిలిన బిల్లు కట్టాలని చెప్పాం. కోవిడ్తో బాధపడుతున్న శ్రీధర్కు సరైన చికిత్స అందించాం, కార్డియో ఎటాక్ కావడం వల్ల మృతి చెందారు’అని ఆయుష్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రమోద్ తెలిపారు. ∙ కాసుల కోసం దిల్సుఖ్నగర్ ఆయూష్ ఆస్పత్రి కక్కుర్తి -
మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే
సాక్షి, హైదరాబాద్: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.. వేసిందే బిల్లు! కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మొన్న నాగోల్లోని ఓ ఆస్పత్రి కరోనా రోగి నుంచి ఏకంగా రూ.23 లక్షల బిల్లు వసూలు చేయగా, నిన్న బీఎన్రెడ్డి నగర్లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులు రోజుకు రూ.లక్ష చొప్పున దండుకున్నాయి. తాజాగా మాదాపూర్లోని మరో కార్పొరేట్ ఆస్పత్రి చేయని చికిత్సలకు భారీ బిల్లు వేసి ఇద్దరు రోగుల జేబులకు చిల్లులు పెట్టింది. లబోదిబోమంటూ బాధితులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలకు అదనంగా పైసా కూడా తీసుకోవద్దని వైద్య, ఆరోగ్య వాఖ హెచ్చరికలు జారీ చేసినా కార్పొరేట్ ఆస్పత్రులు వాటిని పెడచెవిన పెడుతూ అందినకాడికి దోచుకుంటున్నాయి. అసలు విషయం ఏంటంటే... ఇద్దరికి ఒకే గది.. బిల్లు మాత్రం.. ఓయూ కాలనీకి చెందిన రవికుమార్, ఆయన సతీమణి రజనికి ఇటీవల కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సాచురేషన్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండటంతో తెలిసిన వైద్యుడి సహాయంతో తొలుత మణికొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రిలో ఐసీయూ వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో ఈ నెల 4న మాదాపూర్లోని మరో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. భార్యభర్తలిద్దరూ ఒకే గదిలో ఉండి చికిత్స పొందారు. భర్తకు బెడ్ కేటాయించగా, భార్యను మాత్రం బెడ్సైడ్ సోపాలోనే ఉంచి చికిత్స అందించారు. అయితే వీరిని వేర్వేరు గదుల్లో ఉంచి చికిత్సలు అందించినట్లు యాజమాన్యం బిల్లు వేసింది. ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.8,500 చొప్పున ఐదు రోజులకు మొత్తం రూ.42,500 వసూలు చేసింది. మందుల్లోనూ మాయాజాలమే... నిజానికి వీరిద్దరూ సదరు ఆస్పత్రిలో చేరక ముం దే వేరే ఆస్పత్రిలో ఒకరు రెండు, మరొకరు మూ డు చొప్పున రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తీసుకున్నా రు. కానీ, ఆ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమవద్దే ఒకరు ఆరు, మరొకరు ఐదు ఇంజక్షన్లు తీసుకున్నట్లు వాటికి కూడా కలిపి బిల్లు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు రూ.900 విలువ చేసే పీపీఈ కిట్టుకు రూ.మూడు వేల చొప్పున బిల్లు వేసింది. ఇలా మొత్తం రూ.6.50 లక్షల బిల్లు వసూలు చేసింది. కోలుకోవడంతో ఈ నెల 12న డిశ్చార్జై ఇంటికి చేరుకున్న బాధితులు బిల్లును చూసి అవాక్కయ్యారు. అందించిన సేవలకు మిం చి మెడికల్ బిల్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సదరు కార్పొరేట్ ఆస్పత్రి దోపిడిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్కు ట్విట్టర్లో ఫిర్యా దు చేశారు. బాధితుల ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ స్పందించి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
పాజిటివ్ బాధితుల ‘పడక’ పాట్లు..!
కోవిడ్ బారిన పడ్డ హన్మకొండకు చెందిన రాజారావుకు నాలుగు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో సంప్రదిస్తే జనరల్ బెడ్లు తప్ప ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో రాజారావు కొడుకు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న తొర్రూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. కూకట్పల్లికి చెందిన జి.అనసూయకు రెండ్రోజులుగా ఆక్సిజన్ స్థాయిలు 91కి పడిపోయాయి. ఆక్సిజన్ పెట్టించాలని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రయత్నించినా ఎక్కడా బెడ్ అందుబాటులో లేదు. దీంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రిలో బెడ్ దొరకడంతో అడ్మిట్ చేశారు. రోజుకు రూ.40వేల చొప్పున బెడ్ చార్జీలు చెల్లిస్తున్నట్లు సమాచారం. సాక్షి, హైదరాబాద్: సెకండ్ వేవ్లో కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే తీవ్రఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే గొంతు, ఊపిరితిత్తులు, పొట్టలో తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలను వేగంగా పెంచుతోంది. దీంతో బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతున్నా.. మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఉద్దేశంతో రోగులు ముందుగా ప్రైవేట్ వైపు చూస్తున్నారు. బెడ్ల కొరత... రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 54,832. వైద్యా రోగ్య శాఖ గణాంకాల ప్రకారం వీరిలో 28,825 (52.55 శాతం) మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 50.5 శాతం మంది ఆక్సిజన్ బెడ్లపై ఉండగా.. 29.47 శాతం మంది ఐసీయూ ల్లో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని కరోనా బెడ్ల సంఖ్య ప్రకారం.. యాక్టివ్ కేసులన్నింటిలో 96 శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించొచ్చు. అంతేకాదు ఈ బెడ్లలో సగం ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం బెడ్లు ఖాళీగాలేవంటూ బాధితులను తిప్పిపంపిస్తున్నాయి. గత్యంతరంలేక కొందరు ఆక్సిజన్ సిలిండర్లు బుక్ చేసుకుని ఇంటివద్దే ఊపిరి పీలుస్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక, ప్రాణవాయువు దొరక్క మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వసతుల్లేకనే ‘ప్రైవేట్’కు... కోవిడ్ బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను ఏర్పాటు చేసింది. ఇందులో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ప్రారంభించి ఏడాది కావొస్తున్నా.. రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. సమీపంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్కు నమూనాలను పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా సరైన వసతులు లేకపోవడంతోనే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు. సగం బెడ్లు ఖాళీగా ఉన్నాయట... రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల లభ్యతను ప్రజలకు వివరించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బెడ్ అవైలబిలిటీ డాష్బోర్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వారీగా మొత్తం పడకలు, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవి... అనే వివరాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో ఉన్న బెడ్లు 53,782. వీటిలో 28,825 బాధితులతో భర్తీ కాగా, 24,957 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోని బెడ్లలో 46.4 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు డాష్బోర్డు సమాచారం చెబుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46.22 శాతం ఖాళీగా ఉండగా... ప్రైవేట్ ఆస్పత్రుల్లో 46.47 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. బెడ్ అవైలబులిటీ డాష్బోర్డు ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితి ఇది మొత్తం భర్తీ ఖాళీ శాతం జనరల్ బెడ్లు... ప్రభుత్వ 5,473 1,228 4,245 77.56 ప్రైవేట్ 15,884 4,534 11,350 71.45 ఆక్సిజన్ బెడ్లు.. ప్రభుత్వ 7,560 5,311 2,249 29.74 ప్రైవేట్ 13,425 9,257 4,168 31.04 ఐసీయూ బెడ్లు ప్రభుత్వ 2,170 1,636 534 24.60 ప్రైవేట్ 9,270 6,859 2,411 26.00 ఇన్ని ఆంక్షలెందుకు...? వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన డాష్బోర్డు సమాచారం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు సగం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితుల రాకపై ఆంక్షలు విధించడం, రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ వారు హోం ఐసోలేషన్లో మాత్రమే ఉండాలని సూచించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. (చదవండి: England: లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!) -
గురువు రుణం తీర్చుకున్నాడు
కేయూ క్యాంపస్ (వరంగల్): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్ చిదిమేసింది. కోవిడ్ కారణంగా గురువు చనిపోవడంతో శిష్యుడే అంత్యక్రియలు పూర్తిచేసి గురువు రుణం తీర్చుకున్నాడు. మాజీ వీసీ పశుల సాంబయ్య బుధవారం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని పరకాల మండలం నాగారానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కుమారుడు వరుణ్కు ఇటీవల కరోనా సోకి తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కుమార్తె ప్రణయ గర్భవతి కావడంతో అంత్యక్రియలు పూర్తిచేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం వరుణ్ చేయి పట్టుకుని తలకొరివి పెట్టిద్దామదనుకున్నా ఆయన నీరసించి నిలబడలేని స్థితికి చేరడంతో సాంబయ్య శిష్యుడు డాక్టర్ బండి శ్రీను గురువు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆచార్య సాంబయ్యతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనలోనే తండ్రిని చూసుకుంటున్నానని,ఆయన పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన తాను ఇలా రుణం తీర్చుకున్నానని వెల్లడించారు. (చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి) -
డబ్బు ఇస్తేనే మృతదేహం
కేయూ క్యాంపస్ (వరంగల్): నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు, వరంగల్కు చెందిన పసుల సాంబయ్య(67) కరోనాతో కన్నుమూశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన ఆయన హన్మకొండలోని ప్రశాంత్నగర్లో నివాసముంటున్నారు. గత నెలలో మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న సాంబయ్య ఇటీవల కరోనా సోకగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ 15రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కరోనాతో పోరాడే క్రమంలో చివరికి నెగెటివ్ వచ్చినా గుండెపోటుతో రావడంతో ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. బిల్లు చెల్లిస్తేనే మృతదేహం సాంబయ్య కరోనా చికిత్స పొందుతున్న విషయాన్ని పలువురు జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆస్పత్రి బిల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతలోనే ఆయన మృతి చెందారు. మొత్తం రూ.10.50లక్షల బిల్లులో ఇప్పటి వరకు రూ.4 లక్షలు చెల్లించారు. మిగతాది చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేయగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బిల్లు వస్తుందని ఓ ప్రజాప్రతినిధి, వైద్య ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారి సైతం యాజమాన్యానికి ఫోన్లో చెప్పినా ఒప్పుకోలేదు. సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కు రాకపోతే మిగతా రూ.6.50లక్షలు చెల్లిస్తానని సాంబయ్య శిష్యుడు డాక్టర్ బండి శ్రీను ఇచ్చిన హామీ పత్రంతో మృతదేహాన్ని సాయంత్రం అప్పగించారు. అనంతరం సాంబయ్య మృతదేహాన్నిస్వగ్రామమైన నాగారానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
తల్లీకొడుకులను బలితీసుకున్న కరోనా
కేశంపేట: కరోనాతో తల్లీ కొడుకులు మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన శంకర్ (55)కు పది రోజుల క్రితం కరోనా రావడంతో మహబూబ్నగర్లోని ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శంకర్ తల్లి చంద్రమ్మ (75) కూడా మూడు రోజుల క్రితం కరోనాతోనే మృతి చెందింది. తల్లి కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. (చదవండి: హైదరాబాద్లో కిక్కిరిసిపోతున్న ఐసోలేషన్ కేంద్రాలు) -
మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్
గుంటూరు ఈస్ట్: కోవిడ్ బారినపడి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఇచ్చేందుకు సుమారు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంపై గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్హెచ్వో రాజశేఖరరెడ్డి కథనం మేరకు.. యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన యనమదల ప్రసాద్ సమీప బంధువులైన పి. బాబు, శివపార్వతి దంపతులు కొద్దిరోజుల కిం దట గుంటూరులోని నారాయణ సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్లో కోవిడ్ చికిత్స నిమిత్తం చేరారు. కరోనా నుంచి కోలుకున్న శివపార్వతి డిశ్చార్జి అయ్యారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి బాబు మృతిచెందారు. ఆస్పత్రి యాజమాన్యం రూ.4,98,558 చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించింది. డబ్బులు చెల్లించలేకపోతే మృతదేహాన్ని కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని యనమల ప్రసాద్.. ఆస్పత్రిలో తనిఖీ చేసేందుకు వచ్చిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.కిషోర్కు తెలిపారు. దీంతో డాక్టర్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట పోలీసులు విచారించి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. -
విజిలెన్స్ దాడులు.. ఆరు ఆస్పత్రులపై కేసులు
విజయవాడ: ఏపీలో వరుసగా పలు ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులలో పలు ఆసుపత్రులపై కేసులను నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి , శ్రీకాకుళం లోని సూర్యముఖి ఆస్పత్రులు పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్ చేశారు. కాగా కడప జిల్లా సిటీ కేర్ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెండ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో నెగెటివ్..
సాక్షి, వేములవాడ(సిరిసిల్ల): పట్టణంలోని మల్లారం రోడ్డులో ఉన్న మాతృశ్రీ అనే ఆసుపత్రిలో కరోనాపై తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. చిట్టి మంగమ్మ అనే పేషెంట్ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రికి చేరుకోవడంతో కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిందని అడ్మిట్ చేసుకున్నారు. ఇందుకు రూ.లక్షన్నర కావాలని చెప్పడంతో తన వద్ద డబ్బులు లేవని పేర్కొంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరోసారి కరోనా టెస్టు చేయించగా ఆమెకు నెగెటివ్ రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెగటివ్ రిపోర్టు ఆధారంగా ఆమె ఫిర్యాదు మేరకు మాతృశ్రీ ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి
కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రి కేఎస్ కేర్లో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్వహణ వైఫల్యంతో ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. వీరిలో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఆర్ఎస్ పెండేకల్కు చెందిన మద్దిలేటి (40), డోన్కు చెందిన అనంతయ్య (70), ఎమ్మిగనూరు మండలం నందవరం గ్రామానికి చెందిన హంపమ్మ(65)తోపాటు వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన రఘునాథరెడ్డి(40), కడపకు చెందిన జైనాబీ (53) ఉన్నారు. మరొకరు వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయితే ఆక్సిజన్ అందకపోవడమే మరణాలకు కారణమని చెప్పలేమని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్కు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి మరో ముగ్గురు మృతి! ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్కు చికిత్స అందిస్తున్న కేఎస్ కేర్ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి కూడా ముగ్గురు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా.. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న మిగిలిన రోగుల బంధువులు వారిని హుటాహుటిన ఇతర ఆస్పత్రులకు తరలించారు. తమవారిని కాపాడుకునేందుకు ప్రైవేటుగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి.. వారికి అమర్చి కాపాడుకునే ప్రయత్నం చేశారు. అనుమతులు లేకుండానే.. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కేఎస్ కేర్ హాస్పిటల్ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నా.. ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ రోగులను చేర్చుకుని రెండు వారాలుగా చికిత్స అందిస్తోంది. యాజమాన్యంపై క్రిమినల్ కేసు అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం అందించిన కేఎస్ కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఎండీ డాక్టర్ లాల్బహుదూర్ శాస్త్రిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్తో కలిసి ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రిపై అధికారుల దాడులు గుంటూరు రూరల్: అనుమతులు తీసుకోకుండా కోవిడ్కు చికిత్స చేస్తూ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై శనివారం అధికారులు దాడులు చేశారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరులోని ప్రవీణ్ ఆస్పత్రి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అనుమతులు తీసుకోకుండా కోవిడ్కు చికిత్స అందిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆస్పత్రికి ఒక వలంటీరును పంపి కోవిడ్ పరీక్ష చేయించారు. దీనికి ఆస్పత్రిలోని ల్యాబ్ అసిస్టెంట్ రూ.3,500 వసూలు చేశాడు. పరీక్ష రసీదును తీసుకున్న వలంటీర్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆస్పత్రిలో 12 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండటాన్ని గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో రోగి వద్ద కోవిడ్ పరీక్షకు రూ.3,500, రోజుకు ఒక బెడ్కు రూ.30 వేలు, ఇతర ఇంజక్షన్లు, చికిత్స నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం అధికారుల దృష్టికొచ్చింది. దీంతో డాక్టర్ ప్రవీణ్తోపాటు మరో వైద్యుడిపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి రికార్డులను సీజ్ చేశారు. -
కర్నూలులో విషాదం
-
ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి
సాక్షి, కర్నూలు: కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. అనుమతి లేకుండానే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్ తెలిపారు. కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి చెందారు. అనుమతి లేకుండానే కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో కోవిడ్ వైద్యానికి అనుమతి లేదు కలెక్టర్ స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్ఓ విచారణ చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రిగా నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారనితెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. కేఎస్కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్లో కర్నూలు జీజీహెచ్కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం/జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆస్పత్రులు లేదా కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపితే క్రిమినల్ కేస్ పెడతాం... సీజ్ చేయిస్తామని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం చదవండి: ఈటల మాట ఎత్తకుండానే టీఆర్ఎస్ ప్రెస్మీట్ -
ఆన్లైన్ పేమెంట్కు ఒప్పుకోని ఆస్పత్రి యాజమాన్యం
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రి తీరు ఓ కరోనా రోగి పాలిట శాపంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలంలోని పెంటఅగ్రహారం గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి వారు చెప్పారు. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్లు అంగీకరించబోమని ఆస్పత్రి యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయడం కోసం మూడు గంటల పాటు పట్టణమంతా తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. వారు తిరిగి వచ్చేసరికి మహిళ పరిస్థితి విషమించి ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే మృతి చెందింది. ఆస్పత్రి యాజమాన్యం వ్యాపారాత్మక ధోరణే తమ తల్లి మృతికి కారణమని బాధిత మహిళ కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. ముందు వైద్యం చేయాలి గానీ, డబ్బుల రూపంలో ఫీజు కడితేనే జాయిన్ చేసుకుంటామని అనడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నా కానీ ఎలాంటి సహకారం అందించలేదని స్థానికులు తెలిపారు. రాజాం ప్రెస్క్లబ్ సభ్యులు, రెడ్క్రాస్ సభ్యులు ఏర్పాటు చేసిన వాహనంలో మృతదేహాన్ని తరలించారు. -
ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
-
ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. థానెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఐసీయూలోని ఆరుగురు రోగులతో సహా మరో 20 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని యస్మీన్ జెడ్ సయ్యద్(46), నవాబ్ ఎం షేక్ (47), హలీమా బి.సల్మనీ (70)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మృతుల కుటుంబానికి రూ. ఐదు లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక, ఇటీవల ముంబైకి సమీపంలోని విరార్లోని ఓ ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్తో పేలుడు సంభవించి మంటలు చెలిరేగిన విషయం తెలిసిందే. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. చదవండి: మహారాష్ట్రలో మరో ఘోరం.. ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’ -
దారుణం: రూ.6.50 లక్షలు డబ్బు కట్టు.. శవాన్ని తీసుకెళ్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి శవాన్ని రూ.6.5 లక్షలు కడితేనే అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం.. మూడురోజుల పాటు మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన దారుణ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్పురికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (41) కరోనా లక్షణాలతో ఈ నెల 17వ తేదీన నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఆస్పత్రిలో చేరాడు. చేరే సమయంలో రూ.1.40 లక్షలు, ఆ తర్వాత పరీక్షలంటూ రూ.53,800, మందుల పేరిట అదనంగా వసూలు చేశారు. ఇంతజేసినా ఫలితం దక్కలేదు. ఈ నెల 25వ తేదీన అతను మరణించినట్లు కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు రాగా, తమకు ఇంకా రావాల్సిన రూ.6.5 లక్షలు కడితే కానీ మృతదేహం అప్పగించబోమని తేల్చిచెప్పింది. తమ వద్ద ఇప్పుడు అంత డబ్బులు లేవని, మృతదేహాన్ని ఇస్తే రెండురోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు చెప్పారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు. డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బాక్సులో పెట్టి హాస్పిటల్ సెల్లార్లో ఉంచారు. డబ్బుల కోసం ప్రయత్నించినా.. తెలిసిన వారి దగ్గర డబ్బుల కోసం విఫల ప్రయత్నం చేసిన కుటుంబసభ్యులు మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని తాము చేసిన ప్రయత్నాలు వివరించారు. మృతదేహాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఆస్పత్రి యాజమాన్యం కనికరించకపోవడంతో బంధువులతో పాటు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి. మానవత్వం మరిచిపోయారు మృతదేహాన్ని మూడురోజులు ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన యాజమాన్యం మానవత్వం మరిచి వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన తాము, మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో మరింత మనోవేదనకు గురయ్యామని వాపోయారు. రోగులను ఆదుకోవాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐసీయూలో పది మంది కరోనా పేషెంట్లకు ఒకే నర్స్ చికిత్స చేస్తోందని తెలిపారు. సరైన చికిత్స చేయకపోగా, రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్స్టర్: రెండు ప్రాణాలు బలి చదవండి: మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్ -
పోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా: సుచరిత
గుంటూరు : కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించండి: వెల్లంపల్లి సాక్షి విజయవాడ: కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ ఆసుపత్రులపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రత్యేక అధికారి సునీత, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ కేటాయించాలి అన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్పై కఠినంగా వ్యవహరించండి అని మంత్రి వెల్లంపల్లి అధికారులకు సూచించారు. చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
కరోనా: బయటపడ్డ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రజల నిర్లక్ష్యంతో కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,500కుపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రైవేటు ఆసుప్రత్రులు మాత్రం బెట్స్ ఖాళీగా లేవని చెబుతున్నాయి. కోవిడ్ బెడ్స్కు సంబంధించి ‘సాక్షి’ చేసిన పరిశోధనలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ తీరా సాక్షి ప్రతినిధి అక్కడికి వెళ్లి కరోనా బెడ్స్ కోసం ఆరా తీయగా ఖాళీ లేవని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఎప్పుడు ఖాళీ అవుతాయో కూడా చెప్పలేమని చేతులెత్తేస్తున్నారు. అయితే స్థానిక సెక్యూరిటీని కదిలిస్తే.. ‘మహారాష్ట్ర నాందేడ్ నుంచి పేషెంట్లు వస్తున్నారని, వారితోనేబెడ్స్ నిండిపోయాయి సార్’ అంటూ బాంబు పేల్చాడు. పైగా ఇక్కడ ఖాళీ లేవు కానీ తనకు తెలిసిన ఆస్పత్రిలో ఫ్రెండ్ పని చేస్తాడట... అక్కడ కాస్త కాసులు ఎక్కువ పెడితే బెడ్ దొరికిపోతుందని ఉచిత సలహా ఇస్తున్నాడు. ఆ కథేంటో... కార్పొ‘రేటు’ ఆసుపత్రుల ఆటలు ఏవో మీరే చూడండి.. -
ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: రోగికి కాలం చెల్లిన మందులు
సాక్షి, ఆదిలాబాద్ టౌన్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలు మితిమీరుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేయడమే కాకుండా కాలం చెల్లిన మందులను అంటగట్టి పేషంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అనుమతి లేనప్పటిట్లిటీవలి వరకు వైద్యం కొనసాగించారు. వైద్యులు లేకుండానే సిబ్బందే మందులు ఇచ్చిన వ్యవహారం కూడా బయటపడిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోగికి కాలం చెల్లిన మందులు ఇవ్వడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మందులు వాడటంతో పేషంట్కు వాంతులు, విరేచనలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి 10గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇంద్రవెల్లి మండలం ఆంద్గూడకు చెందిన షెల్కే సావిత్రిబాయి గర్భసంచి ఆపరేషన్ కోసం జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈనెల 10న చేరింది. అదేరోజు సాయంత్రం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. మందులతో పాటు ఆపరేషన్ ఖర్చు కోసం రూ. 30వేలు చెల్లించాలని వైద్యులు సూచించడంతో ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆమెకు ఓ పౌడర్ను ఇచ్చారు. మధ్యాహ్నం విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యాయని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. 2016 సంవత్సరానికి సంబంధించి కాలం చెల్లిన మందులు ఇచ్చారు. దీంతో డాక్టర్ను సంప్రదించగా.. క్షమించండి వేరే మందులు ఇస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మరో పౌడర్ ఇచ్చినప్పటికీ ఆ పౌడర్లు కూడా 2017, 2020కు సంబంధించినవి కావడంతో మెడికల్ షాపు వారితో వాగ్వాదానికి దిగారు. ఇవి మా ఇంట్లో తయారు కావని, కంపెనీ నుంచి వచ్చినవే ఇస్తున్నట్లు వైద్యులతో పాటు మెడికల్ సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. బాధితురాలి భర్త బలిరాం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎంహెచ్ఓను వివరణ కోరగా తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం 4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం -
కరోనా ఉధృతి.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!
హైదరాబాద్: వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చేవారిలో అవసరమైన అందరికీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా పరీక్ష తప్పనిసరిగా చేయాలని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. తీవ్ర శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, కరోనా లక్షణాలు లేకుండా ఆస్పత్రిలో చేరే హైరిస్క్ రోగులకు, వివిధ రకాల శస్త్రచికిత్సలు, సాధారణ వైద్యం కోసం వచ్చే లక్షణాలు లేని రోగులకు, ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 శాతంగానే ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలను 40 శాతానికిపైగా పెంచేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. నేడు మంత్రి ఈటల మీటింగ్ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మంత్రి బుధవారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సలపై సమీక్షిం చారు. కరోనా పరీక్షలను సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. అయితే అందరికీ వ్యాక్సిన్ అందించడానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
‘అమ్మ’ను గెలిపించిన మెడికవర్ వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: పుట్టుకతోనే తక్కువ బరువు (550 గ్రాములు)తో జన్మించి..మృత్యువుతో పోరాడుతున్న ఓ శిశువుకు మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 140 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడారు. ప్రస్తుతం శిశువు బరువు 2.5 కేజీలకు చేరుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు చికిత్స సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. నెలలు నిండక ముందే సిజేరియన్ ద్వారా ప్రసవం.. నగరానికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ గతేడాది నవంబర్ ఆరో తేదీన తొలి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. 24 వారాల ఐదు రోజులకు శిశువు జన్మించింది. ఈ సమయంలో శిశువు బరువు కేవలం 550 గ్రాములే. సాధారణంగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బతకడం చాలా కష్టం. కానీ మెడికవర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె, డాక్టర్ నవిత, డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, డాక్టర్ జనార్దన్రెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ రాకేష్ల నేతృత్వంలోని వైద్య బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువును ఎలాగైనా బతికించాలని భావించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత ఎన్ఐసీయూకు తరలించి సీపీఏపీతో శ్వాసను అందించారు. పుట్టిన రెండో రోజు నుంచే శిశువుకు ఐవీప్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ట్యూబ్ ద్వారా పాలు అందించారు. ఇదే సమయంలో శిశువుకు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫీడింగ్ ఆపేసి..యాంటిబయా టిక్ డోస్ను పెంచారు. శిశువు కోలుకున్న తర్వాత నేరుగా పాలు పట్టడంతో పాటు సీపీఏపీ ప్రక్రియను నిలిపివేసి, స్వయంగా శ్వాసతీసుకునే విధంగా చేశారు. ప్రస్తుతం శిశువు 2.5 కేజీల బరువు పెరిగింది. శ్వాస తీసుకోవడంతో పాటు స్వయంగా పాలు తాగుతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. దీంతో శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అయినట్లు ఆస్పత్రి వర్గాల తెలిపాయి. -
10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..
ముంబై: మహమ్మారి వైరస్ బాధితులు ఉన్న సన్రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాండూప్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘క్షమించండి’ అంటూ బాధిత కుటుంబసభ్యులను సీఎం థాకరే కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో వెంటిలేటర్పై ఉన్న వారే మరణించారని చెప్పారు. ఆస్పత్రి భవనాన్ని శుక్రవారం సీఎం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. సన్ రైజ్ ఆస్పత్రిలో మొత్తం 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటిలేటర్పై ఉన్న వారు బయటకు వెళ్లలేని పరిస్థితి కావడంతో వారంతా అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. దీంతో వారు సజీవ దహనం అయ్యి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గతంలో రక్షణ చర్యలు లేవని ఈ ఆస్పత్రికి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు అందించారు. అయినా కూడా ఆస్పత్రి నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించింది. Deeply mourn the loss of lives in a fire accident at a hospital in Bhandup, Mumbai. My thoughts and prayers are with the families of the victims of this tragedy. I pray for speedy recovery of the injured. — President of India (@rashtrapatibhvn) March 26, 2021 -
దారుణం: ఐసీయూలో ఉన్న మహిళపై అకృత్యం
జైపూర్: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మనిషిపై జాలి, దయ చూపించాల్సింది పోయి.. దారుణానికి పాల్పడ్డాడు ఓ మృగాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారానికి ఓడిగట్టాడు నర్స్. రాజస్తాన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న బాధితురాలికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన మహిళపై సోమవారం రాత్రి మగ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల జరిగే దారుణం గురించి ఆమెకు తెలుస్తున్నప్పటికి ప్రతిఘటించలేకపోయింది. ఆ మరుసటి రోజు తనని చూడటానికి వచ్చిన భర్తతో జరిగిన దారుణం గురించి పేపర్ మీద రాసి అతడికి వెల్లడించింది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నర్స్ని అరెస్ట్ చేశారు పోలీసులు. చదవండి: స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది -
నేడు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల శనివారం కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణకు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో అంచనా వేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్కు సంబంధించి రూపొందించిన వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ కోవిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో పరిశీలించనున్నట్లు తెలిపారు. డ్రై రన్లో వెలుగుచూసే అంశాలు, ఇతర వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక రూపంలో అందజేస్తామని భాస్కర్ వివరించారు. ఈ డ్రై రన్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి, కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్కు అందజేస్తారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది ప్రోత్సాహకర ఫలితాలు ఇచ్చినట్లు భాస్కర్ తెలిపారు. వ్యాక్సిన్ రవాణా మొదలు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఫోన్ మెసేజ్లు పంపడం, వారు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తున్నట్టుగానే మొత్తం ప్రక్రియ (డమ్మీ ప్రక్రియ) నిర్వహిస్తారు. అనంతరం వారిని అబ్జర్వేషన్లో కూడా ఉంచుతారు. శనివారం ఒక్కో జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో, ఒక ఎంపిక చేసిన బయటి ప్రదేశంలో.. ఇలా మూడు చోట్ల డ్రైరన్ నిర్వహించనున్నారు. డ్రై రన్ నిర్వహించే ప్రదేశాలు -
టెన్త్ చదివి.. డాక్టర్నంటూ వైద్యం
నరసాపురం: పదో తరగతి చదివి కోవిడ్తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎంఅండ్హెచ్వో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సునంద శనివారం తనిఖీ చేశారు. డాక్టర్ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్ (35)ను సర్టిఫికెట్లు, అనుమతులు చూపాలని కోరారు. తనకు పీఎంపీ, ఆర్ఎంపీ సర్టిఫికెట్ కూడా లేదని, పదో తరగతి వరకు చదివానని సతీష్ చెప్పడంతో వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసి అక్కడ ఉన్న హైపవర్ యాంటీ బయోటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. సతీష్పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న అక్రమ వైద్యం చేస్తున్న పీఎంపీ, ఆర్ఎంపీలు కొందరు తమ వైద్యశాలలు మూసేసి పరారయ్యారు. -
మానవత్వం లేకపోతే ఎలా?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్ఖానగడ్డలోని మహతి ఆసుపత్రిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన పేషెంట్కు వైద్యం చేయగా వికటించిన ఘటనపై డీఎంహెచ్వో విచారణ ప్రా రంభించారు. హాస్పిటల్ యాజమాన్యాన్ని మంగళవారం తన కార్యాలయానికి పిలిపించారు. ప్రజారోగ్యాన్ని కాపాడుతామని ఆసుపత్రిని ఏ ర్పాటు చేశారు.. కనీస మానవత్వం లేకపోతే ఎలా.. రూ.2లక్షలకు పైగా బిల్లు వేసి, వైద్యం వి కటించి, పేషెంట్కు ఇన్ఫెక్షన్ వస్తే పట్టించుకోక పోవడం ఏంటని మండిపడ్డారు. ఇష్టానుసారంగా బిల్లులు వేస్తే నిరుపేదలు ఆస్తులు అమ్ముకొ ని, చెల్లించాలా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొత్తగా ఆసుపత్రిని తీసుకున్నామని నిర్వాహకులు తెలుపగా గతంలో ఉన్న మే నేజ్మెంట్ మారినప్పుడు వైద్యాధికారుల అనుమతి లేకుండా హాస్పిటల్ ఎలా నిర్వహిస్తారని డీఎంహెచ్వో ప్రశ్నించారు. బాధితుడు, రేకుర్తికి చెందిన రంగయ్యది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమని, ఇంత బిల్లు ఎలా వేశారని ప్రశ్నించారు. ఆసుపత్రిని వైద్యేతరులు నడిపించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో కోవిడ్–19 చికిత్సకు అనుమతి పొంది, నిబంధనలు పాటించడం లేదని, అన్ని వివరాలతో మరోసారి హాజరు కావాలని ఆదేశించారు. త్వరలోనే ఆసుపత్రిని సందర్శించి, పూర్తిస్తాయిలో విచారణ చేపడుతామన్నారు. కాగా తమను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపరిచిన మహతి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని రంగయ్య కుటుంబీకులు కోరుతున్నారు. వివాహిత ఆందోళన ఇబ్రహీంపట్నం(కోరుట్ల): గోధూర్లో భర్త విడాకులు ఇవ్వకుండానే మూ డో పెళ్లి చేసుకున్నాడని ఓ వివాహిత అతని ఇంటి ఎదుట బైఠాయించింది. ఏఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్కు చెందిన ఆరీఫాకు గోధూర్కు చెందిన సల్మాన్తో వివాహం జరిగింది. కొన్ని నెలలు బాగానే ఉన్న సల్మాన్ ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టడంతో పుట్టింటికి చేరింది. అతనిపై మెట్పల్లి ఠాణా లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సల్మాన్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించడంతో వెళ్లిపోయింది. మళ్లీ ఈ నెల 11న మూడో పెళ్లి చేసుకున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే భర్త పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని, న్యాయం చేయాలని ఆరీఫా మంగళవారం భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఏఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, ప్రస్తుతం భర్త ఇంటిలోనే ఉండాలని సూచించచడంతో ఆందోళన విరమించింది దొంగపై పీడీయాక్టు అమలు సాక్షి, రామగుండం క్రైం: గోదావరిఖని వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో మైనర్ బాలురను చేరదీసి, దొంగతనాలకు పాల్పడుతున్న పెంకి బలరాం(23)పై పీడీయాక్టు నమోదు చేసినట్లు సీ ఐలు పర్శ రమేష్, రాజ్కుమార్గౌడ్లు మంగళవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో అందించామని, అనంతరం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించి నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రూరల్ ఆగంపుడికి చెందిన బలరాంకు భా ర్య ఉండగా మూడేళ్లుగా గోదావరిఖని విఠల్నగర్లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మైనర్ బా లురతో కలిసి 2019 నుంచి ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 ఘటనల్లో రూ.10 లక్షల విలువైన ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించాడు. వరుస దొంగతనాలు చేస్తున్న బలరాంపై పీడీయాక్టు అమలుకు కృషి చేసిన ఏసీపీ ఉమేందర్, సీఐలను సీపీ సత్యనారాయణ అభినందించారు. -
మృతదేహాలు తారుమారు
ఇందల్వాయి/భిక్కనూరు: హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం వల్ల మృతదేహాలు తారుమారయ్యాయి. మృతదేహాన్ని చితిపై ఉంచి నిప్పు పెట్టే సమయంలో ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆఖరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన అంకం హన్మాండ్లు (58)కు కరోనా సోకడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు 11 రోజుల క్రితం హైదరాబాద్లోని సన్షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ హన్మాండ్లు గురువారం రాత్రి మృతి చెందాడు. అయితే, చికిత్సకు రూ.10 లక్షలకు పైగా బిల్లు కాగా, అది చెల్లించే వరకూ మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రోజంతా డబ్బు కోసం ఇబ్బందులు పడ్డారు. చివరకు శనివారం ఉదయం బిల్లు చెల్లించగా, కరోనా నిబంధనల మేరకు ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని పూర్తిగా ప్యాక్ చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించింది. చివరి నిమిషంలో ఆగిన అంత్యక్రియలు మృతదేహాన్ని అంబులెన్సులో గన్నారం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. చితి పేర్చి, దానిపై ఉంచారు. మరో రెండు నిమిషాల్లో చితికి నిప్పంటిస్తారనగా, అంబులెన్స్ డ్రైవర్కు ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహాలు తారుమారయ్యాయని,, హన్మాండ్లు మృతదేహానికి బదులు మరొకరిది ఇచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. దీంతో చివరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. మృతదేహాన్ని తిప్పి పంపించాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా, కుటుంబ సభ్యులు నిరాకరించారు. హన్మాండ్లు మృతదేహం తీసుకొచ్చే వరకూ ఈ మృతదేహాన్ని అప్పగించబోమని స్పష్టం చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది మరో అంబులెన్స్లో హన్మాండ్లు మృతదేహాన్ని తరలించింది. సుమారు నాలుగు గంటల తర్వాత మృతదేహం గన్నారం చేరుకుంది. ప్యాకింగ్ తెరిచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించగా.. వారు తమదేనని నిర్ధారించుకున్నారు. అప్పటికే చితిపై ఉంచిన మోహన్గౌడ్ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసి అంబులెన్స్లోకి మార్చి, హన్మాండ్లు అంత్యక్రియలు పూర్తి చేశారు. నిర్లక్ష్యం వల్లే.. హన్మాండ్లు మృతదేహమని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అప్పగించిన మృతదేహం కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన మోహన్గౌడ్ది. అతనికి కూడా కరోనా సోకడంతో సన్షైన్ ఆస్పత్రిలో చేర్చించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆస్పత్రి మార్చురీలో లేదు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ఆస్పత్రి సిబ్బంది.. అసలేం జరిగిందని ఆరా తీయగా మృతదేహాలు తారుమారైనట్లు తేలింది. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మృతదేహాలను మార్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సన్షైన్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హన్మాండ్లు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చికిత్స వివరాలు తెలపకుండా రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
హాయ్ల్యాండ్లో అనధికార కోవిడ్ సెంటర్!
సాక్షి, మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్ల్యాండ్లో ఓ ప్రయివేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో అనధికార కోవిడ్ సెంటర్ను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం రాత్రి మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు తనిఖీకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొంతమంది కోవిడ్ రోగులు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. మిగిలిన వారిని విచారించగా.. తాము హోం క్వారంటైన్లో ఉండలేక హాయ్ల్యాండ్లో ఉంటున్నట్టు చెప్పారు. రోజుకు ఒక్కో రూమ్కు ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. -
కరోనా వైద్యం పేరుతో 29 లక్షలు...
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని చార్మినార్ డివిజన్ మేహిదీపట్నం సిటివో సర్కిల్–2 లో ఏసిటీవోగా విధులు నిర్వహిస్తున్న శ్వేతా రెడ్డి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గేజిటేడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. గ్రూప్ 2 అధికారిని శ్వేతా రెడ్డి మృతికి కారణమైన కార్పోరేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ తోటి ఉద్యోగిని కోల్పోవడం చాలా బాధాకరం విషయం అని అన్నారు. కాన్పు కోసం అని శ్వేతా రెడ్డి భర్త హైదరాబాద్లోని కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అక్కడ తనకు మగ బిడ్డ పుట్టినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత ఆయాసం రావడంతో కరోనా పరీక్షలు జరిపి ఫలితాలు చూపకుండానే బాధితురాలికి కరోనా పాజిటివ్ అని చెప్పి లక్షలలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. (కోవిడే మన కొంప ముంచిందా?! ) 20 రోజులు ఐసియూలో ఉంచి సుమారు 29 లక్షలు వసూలు చేయటం హేయమైన చర్య అన్నారు. మృతురాలి భర్త మాధవరెడ్డి తన భార్యను చూస్తానని పట్టు బట్టడంతో చూపించారని, తన భార్య పరిస్థితి చూసి అనుమానంతో ఇతర వైద్యుల అభిప్రాయం తీసుకుంటాను రిపోర్టులు ఇవ్వమని గట్టిగా నిలదీయడంతో మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించారన్నారు. శ్వేతా రెడ్డి మృతి పై సమగ్ర విచారణ జరిపించి ,కారణమైన కార్పోరేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే శ్వేతారెడ్డి మరణానికి ప్రైవేటు ఆస్పత్రి కారణం అయి ఉంటుందని మహ్మద్ మజాహిద్ హుస్సేన్ ఆరోపించారు. (ఏడేళ్ల క్రితం స్పెర్మ్తో పండంటి బిడ్డ) ‘శ్వేతారెడ్డి ఎలా మరణించిందో చెప్పమంటే చెప్పకుండా దాటేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలియడంతో ఆస్పత్రి యాజమాన్యం బేరసారాలకు దిగింది. సిజేరియన్ ఆపై కరోనా అని చెప్పి 29 లక్షలు దోపిడీ చేసి గుండెపోటుగా చిత్రించడం ఎంత దారుణమో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ప్రశ్నించాలి. గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి కుటుంబాన్ని దారుణంగా దోచుకుని మరణానికి కారణమైన ప్రైవేటు యజామాన్యం ఇంతకు ముందు నుంచి ఇదే వ్యాపార ధోరణీతో వేలాదిమంది పేద ప్రజలకు తప్పుడు రోగాలు అంటగట్టి లక్షలు దోచుకుంటున్నదని ప్రజలు ఎంత గగ్గోలుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు.ఇటీవల కరోనా కారణంగా ఇదే ఆస్ప్రత్రిపై వేలాది పిర్యాదులు ఇటు రాష్ట్రప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన కూడా కేవలం కేంద్రం స్పందించి నోటీసులు ఇచ్చింది. అయిన యాజమాన్యంలో మార్పు రాలేదు కదా ఇంకా దారుణంగా దోచుకుంటున్నది. (రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజల పిర్యాదులతో డెక్కన్ హాస్పిటల్స్, విరించి హాస్పిటల్స్ చర్యలు తీసుకున్నది కానీ అంతకన్నా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ఆ ఆస్పత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఒక గ్రూప్ 2 అధికారినినే ఇంత దారుణంగా మోసం చేస్తే చదువుకొని కుటుంబాలకు ఎంత దోచుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి? ఇంకా ఆలోచిస్తే అసలు యశోదాలో ఏం జరుగుతుందో కేంద్ర స్థాయి దర్యాప్తు జరుపాల్సిన అవసరం ఉంది. ఏమైనా బహుళజాతి ఫార్మా కంపెనీల ప్రయోజనం కోసం ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా? ఎందుకు యశోధ హస్పిటల్స్ లోనే ఏళ్ల తరబడి ఈ విధంగా జరుగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రజల బాగుకోసం తెలంగాణ ప్రభుత్వం యశోధ హాస్పిటల్స్ ని నిషేధించి యాజమాన్యం ఆస్తులను స్వాధీనం చేసుకోని దర్యాప్తు జరపాలి.’ అని డిమాండ్ చేశారు. -
రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోవిడ్ నిర్వహణపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తీరు పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ హాస్పటల్ ఓవర్ చార్జీలపై ఈ నెల 22న రిపోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు.. చర్యలపై నివేదిక సమర్పించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని కోర్టు ప్రశ్నించింది. 50శాతం బెడ్స్పై ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలి. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి.. దానితో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కోర్టు ఆదేశించింది. పబ్లిక్ హెల్త్పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో నివేదిక ఇవ్వాలన్నది. (చదవండి: ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?) అంతేకాక తెలంగాణ కోవిడ్ డెత్ రిపోర్ట్స్పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి రోజు 8 నుంచి 10 మంది మాత్రమే చనిపోతున్నారా.. అని ప్రశ్నించింది. కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు. మార్చి నుంచి ఇదే విధంగా వ్యవహారిస్తున్నారు అంటూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితమైన రిపోర్టులు సమర్పించాలని.. తప్పుడు నివేదికలు ఇస్తే మళ్లీ సీఎస్ని కోర్టుకు పిలువాల్సి వస్తుందని హెచ్చరించింది.ఈ నెల 22వరకు రిపోర్టులన్ని నివేదించాలని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం. తదుపరి విచారణ 24 కి వాయిదా వేసింది. -
జ్వరమా.. డాక్టర్ లేరు..!
కరీంనగర్లోని అశోక్నగర్కు చెందిన ఓ మహిళకు జ్వరంగా ఉండడంతో నగరంలోని చాలా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లింది. ఎక్కడా ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాలేదు. డాక్టర్స్ట్రీట్లోని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు కరోనా పరీక్ష చేయించుకుంటేనే వైద్యం చేస్తామని వెల్లడించారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకున్నానని చెప్పినా... హెచ్ఆర్ సీటీస్కాన్ తప్పకుండా చేసుకోవాలని చిట్టీ రాసి ఇచ్చారు. ధర ఎంత అంటే రూ.5500 అని చెప్పారు. కూలీ పని చేసుకునే పద్మ చేతిలో రూ.వెయ్యి మాత్రమే ఉండడంతో చివరకు కోవిడ్ చికిత్స నడుస్తున్న ప్రభుత్వాసుపత్రికి చేరింది. ఇది ఒక్క ఆమె పరిస్థితి కాదు. నగరంలోని చాలా మంది పేదల పరిస్థితి ఇదే. సాక్షి, కరీంనగర్: జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రాథమికంగా కరోనా పరీక్ష చేయించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లా ఆసుపత్రితో సహా అన్ని పీహెచ్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిత్యం నిర్వహిస్తున్నారు. అనుమానితులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతుండడంతో జ్వరంతో బాధపడుతున్న వారు కరోనా పరీక్ష చేయించుకొని వైద్యం కోసం వెళ్లడం అసాధ్యమే అవుతోంది. ఆసుపత్రికి వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక నరకం చూస్తున్నారు. పీహెచ్సీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకొని వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసులకు చికిత్స నడుస్తుందని భయపడే వారు సాధారణ జ్వరమే కదా అని ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. జ్వరమా.. అయ్యో డాక్టర్ లేరండీ అని సమాధానం చెబుతున్నారు. లేదంటే హెచ్ఆర్ సీటీ స్కాన్ చేయించుకొని వస్తే వైద్యం చేస్తామని పొమ్మనలేక పొగబెడుతున్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకున్నామని చెప్పినా.. సిటీ స్కాన్ ఉంటేనే వైద్యం చేస్తామని తెగేసి చెబుతున్నారు. హెచ్ఆర్ సీటీస్కాన్కు నగరంలో రూ.5500 వసూలు చేస్తున్నారు. వైద్యం ఖర్చులకే అప్పులు చేసే నిరుపేదలు ఇక స్కానింగ్ ఎలా చేయించుకుంటారు. వైద్యమెలా పొందుతారు. కరోనా రోగుల మధ్య.. కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా పాజిటివ్ పేషెంట్లతోపాటు ప్రమాదాల బారిన పడిన వారు, జ్వర పీడితులు, ఇతర రోగులకు చికిత్స అందిస్తున్నారు. కరో నా అనుమానిత లక్షణాలైన జ్వరం, శ్వాస అందకపోవడం వంటి వాటితో ఎవరైనా వస్తే కోవిడ్ వార్డుకు తరలిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లాక కరోనా వైరస్ బారిన పడిన వాళ్ల మధ్యలో ఉంచి మిగతా వారికీ వైద్యం అందిస్తున్నారు. ఇలా వీరి మధ్య ఉంచితే వైరస్ బారిన పడకుండా ఉంటామా అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీటీ స్కాన్ల దందా... ప్రైవేటు ఆసుపత్రులలో ర్యాపిడ్ యాటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా నమ్మడం లేదు. హెచ్ఆర్సీటీ స్కాన్ తీయించుకుంటేనే వైద్యం చేస్తామని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు చెప్పడం శోచనీయం. గతంలో రూ.1800 నుంచి రూ.2 వేలకు తీసే సీటీ స్కాన్ ఇప్పుడు రూ.5500 నుంచి రూ.6 వేలకు చేరింది. అయినా పీపీఈ కిట్ ధర అదనంగా వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సీటీస్కాన్ నిర్వాహకులకు మధ్య జరిగిన ఒప్పందంలో 50 శాతం కమిషన్ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సిటీ స్కాన్ను పంపిస్తే రూ.2500 ఆసుపత్రి అకౌంట్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో అవసరం ఉన్నా లేకున్నా సీటీ స్కాన్కు రెఫర్ చేస్తున్నారు. కొత్తగా 164 పాజిటివ్ కేసులు.. జిల్లాలో గురువారం 164 కరోనా పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య 8500కు చేరింది. కేసుల తీవ్రత పెరుగుతున్నా ప్రజల్లో భయం లేకుండా పోయింది. మాస్కులు, భౌతిక దూరం మాటే మరిచారు. గుంపులుగా తిరుగుతూ కరోనాను ఆహ్వానిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. -
ఏలూరు మురళీకృష్ణ ఆసుపత్రికి నోటీసులు
ఏలూరు టౌన్: కరోనా చికిత్సలో ప్రైవేటు, కార్పొరేటు దోపిడీ పెచ్చుమీరుతోంది. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులకు వెళ్లకుండా కరోనా రోగులు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తూ జేబులు గుల్లచేసుకుంటున్నారు. ఆ ఆస్పత్రులు కనీసం వెంటిలేటర్ లేకుండానే రోజుకు రూ.వేలల్లో బిల్లులు వేస్తూ వారంలో రూ.లక్షలు వసూలు చేస్తూ రోగులను నిండా ముంచేస్తున్నాయి. ఏలూరు నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లోనూ అనధికారికంగా కోవిడ్ చికిత్సలు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మాత్రం ఈ విషయాలేవీ పట్టనట్లు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు నగరంలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, రైట్ ల్యాబ్ల్లో జరుగుతున్న అక్రమాలు జిల్లాలోని పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. కలెక్టర్ రేవు ముత్యాలరాజు సీరియస్ కావటంతో అధికారులు అప్రమత్తమై మురళీకృష్ణ హాస్పిటల్, రైట్ల్యాబ్లను సీజ్ చేయటంతోపాటు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో వసూళ్లు ఏలూరు నగరానికి చెందిన 60ఏళ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్తో ఏలూరు ఎన్ఆర్పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరారు. వారంపాటు చికిత్స అందించి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఇంటికి పంపించివేశారు. మళ్ళీ నాలుగురోజులకే అస్వస్థతకు గురికాగా ఇదేమిటని డాక్టర్ను ప్రశ్నించగా కరోనా మరోసారి వచ్చిందంటూ చెప్పి తప్పించుకున్నారు. ఆమెను మరో హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. నగరానికి చెందిన ఒక యువకుడు తన స్నేహితుడ్ని మురళీకృష్ణ హాస్పిటల్లో చేర్పించగా రోజుకు రూ.35వేలు చొప్పున చెల్లించాలని చెప్పి, ముందుగా రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్నారు. మరుసటి రోజే ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ రావటంతో ఇంటికి వెళ్తానని చెప్పినా వినకుండా సిటీస్కాన్లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని తేలిందంటూ నాలుగు రోజులు చికిత్స చేసి రూ.2.50 లక్షలు వసూలు చేశారు. ప్రైవేటు చేతికి ప్రభుత్వ టెస్టు కిట్లు ? ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేటలో రైట్ ల్యాబ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ రూ.వేలల్లో దోచుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునంద ఆకస్మిక తనిఖీలు చేసి, అక్రమాలు జరుగుతున్నాయనే నిర్ధారణతో ల్యాబ్ను సీజ్ చేశారు. రైట్ ల్యాబ్లో కోవిడ్–19 యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు లభించటం అక్రమాలు జరుగుతున్నాయనేందుకు సాక్ష్యంగా మారింది. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా పరీక్షలకు వినియోగించే యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టు కిట్లు అక్రమ మార్గంలో ప్రైవేటు ల్యాబ్లకు చేరుతున్నాయి. ల్యాబ్లో కరోనా పరీక్ష చేసినందుకు ఏకంగా రూ.2,500 నుంచి రూ.3.500 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలుస్తోంది. ఈ కరోనా టెస్టు కిట్లు జూలైలో ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేసినవిగా చెబుతున్నారు. సిబ్బంది అక్రమంగా వీటిని బయట ల్యాబ్లకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.10లక్షల విలువైన ఇంజెక్షన్లు ? మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో వెంటిలేటర్లు లేకపోయినా క్రిటికల్ కేర్ పేరుతో భారీ దోపిడీ చేయటంపై జిల్లా ఉన్నతా«ధికారులు సీరియస్గా ఉన్నారు. ఏకంగా రూ.10లక్షల విలువైన రెమ్డెసివర్ ఇంజక్షన్లు అనధికారికంగా నిల్వ చేయటంపైనా దృష్టి సారించారు. ఇష్టారాజ్యంగా వైద్యం చేయటంతో కొందరు రోగులు మృత్యువాత పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేసే సమయంలో హాస్పిటల్లో 20మంది వరకు రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులకు తెలియదంట! జిల్లా కేంద్రం ఏలూరు నడిబొడ్డున ఉన్న మురళీకృష్ణ హాస్పిటల్లో కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియకపోవటంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కొందరు నాయకుల అండతోనే డాక్టర్ మురళీకృష్ణ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆరోగ్యశ్రీలో వైద్యం వికటించటంతో వ్యక్తి మృతిచెందగా కేసు నమోదు కాకుండా లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా ఎక్కడా కేసు నమోదు కాకుండా సెటిల్మెంట్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారులూ హాస్పిటల్ యాజమాన్యానికి సహకారం అందిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీ.. మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 5 రోజులలో వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి ఎండీ మురళీకృష్ణకు నోటీసులు అందించారు. పదిహేను రోజుల పాటు ఆసుపత్రి సేవలు రద్దు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మూడు రోజుల సోదాలనంతరం ఆసుపత్రిలోని పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అనుమతి లేకున్న చికిత్స చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. 11 మంది చికిత్స పొందుతూ మృతి చెందిన కానీ ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. -
ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రి దందా
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి అనధికారికంగా కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు చేస్తూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఆసుపత్రిని శనివారం సీజ్ చేశారు. వివరాలలోకి వెళితే.. ► ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ సమీపంలో డాక్టర్ బొర్రా మురళీకృష్ణ గత కొంత కాలంగా ‘మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్’ను నిర్వహిస్తున్నారు. ► ఈ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ అనుమతులు ఉండగా గత నెలలో కోవిడ్ హాస్పిటల్గా అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ► ఈ నెల 21న ఆసుపత్రిని పరిశీలించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునంద, మరికొందరు వైద్యాధికారులు వెళ్లారు. ► పరిశీలనకు వెళ్లిన అధికారులకు విస్తుబోయే విషయాలు తెలిశాయి. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాకుండానే డాక్టర్ మురళీకృష్ణ తన హాస్పిటల్లో పెద్ద ఎత్తున కరోనా చికిత్సలు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ► కరోనా బాధితుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువులు అధికారులకు చెప్పారు. రూ.10 లక్షల విలువైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ► ప్రస్తుతం 20 మంది కరోనా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. వైద్యం వికటించి కొందరు మృతిచెందినట్లుగా కూడా తెలుస్తోంది. ► తనిఖీలకు సంబంధించిన విషయాలను వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించామని డాక్టర్ సునంద తెలిపారు. -
నకిలీ ఐఏఎస్ అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): నకిలీ ఐఏఎస్ అధికారి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న పెద్దాడ విజయలక్ష్మి అనే ఓ కిలాడీ లేడి కృష్ణాజిల్లా, హనుమాన్జంక్షన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్నంటూ వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం విలేకరులకు వెల్లడించారు. రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావుగా నమ్మించి... గుంటూరు జిల్లా మంగళగిరిలోని మన్యం వారి వీధికి చెందిన పెద్దాడ విజయలక్ష్మి... పద్మభూషణ్ కేఎల్ రావు కుమార్తె, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.సుజాతరావు పేరుతో పలువురిని నమ్మించి కేఎల్ రావు విగ్రహ ఏర్పాటు పేరుతో వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఎలా చిక్కిందంటే.. హనుమాన్జంక్షన్లోని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్ హోంకు ఈ నెల 8వ తేదీన ఓ కారులో వచ్చిన విజయలక్ష్మి తాను ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ సుజాతరావునని, తాను తిరుపతి వెళుతున్నానని, పూజల కోసం రూ.3,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానించిన రామచంద్రరావు తనయుడు రవిశంకర్ నేరుగా కె.సుజాతరావుకు ఫోన్ చేయగా, తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఆమె చెప్పారు. నకిలీ అధికారి ఫోటోలు తీసేందుకు యత్నించటంతో వెంటనే పరారయ్యారు. ఆ తర్వాత ఎస్పీ రవీంద్రబాబుకు కె.సుజాతరావు ఫోన్ చేసి నకిలీ అధికారిని పట్టుకోవాలని కోరారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఆమెను విజయవాడలో పట్టుకున్నారు. టీడీపీతో కిలాడీ లేడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటో ఆమె వద్ద పోలీసులకు లభించింది. -
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నికీలలు
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 8 మంది కోవిడ్–19 బాధితులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.6 లక్షల పరిహారం ప్రకటించాయి. నగరంలోని నవ్రంగ్పురా ప్రాంతంలోని శ్రేయ్ ఆస్పత్రి చివరి, నాలుగో అంతస్తులో గురువారం వేకువజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ అంతస్తులోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఘటన జరిగిన సమయానికి వార్డులో 11 మంది రోగులున్నారని, ముగ్గురు రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన వార్డ్బాయ్ చిరాగ్ పటేల్ తెలిపాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే దిగువ జనరల్ వార్డుల్లో ఉన్న 41 మందిని సురక్షితంగా వేరే ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు, క్షణాల్లోనే వార్డును చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధాని సహాయ నిధి నుంచి కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు.. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.50 వేల చొప్పున పరిహారంగా ప్రకటించాయి. అహ్మదాబాద్లో కోవిడ్ చికిత్సకు యంత్రాంగం గుర్తించిన 60 ప్రైవేట్ ఆస్పత్రుల్లో శ్రేయ్ ఒకటి. అహ్మదాబాద్ ఆస్పత్రిలో ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రూపానీకి ఫోన్ చేసి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన శ్రేయ్ ఆస్పత్రిని సీజ్ చేయాలని సీఎం రూపానీ ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ట్రస్టీల్లో ఒకరైన భరత్ మహంత్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై మంత్రి కేటీఆర్ ఫైర్
-
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్ను ట్విటర్లో కోరారు. (చదవండి: ఒకే ఇంట్లో ముగ్గురు కోవిడ్తో మృతి) అదే విధంగా ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి అంబులెన్స్లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. జెండా ఊపి అంబులెన్స్లు ప్రారంభిస్తున్న కేటీఆర్ అదే విధంగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 44,572 మంది కోలుకొని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో మృతి చెందగా,మొత్తం మృతుల సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15, 640 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 521 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారిగా రంగారెడ్డి 289, వరంగల్ అర్బన్ 102, మేడ్చల్ 151, కరీంనగర్ 97, నల్గొండ 61 మహబూబ్నగర్ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఊరట : పది లక్షలు దాటిన రికవరీలు) -
తెలంగాణలో కొనసాగుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ
-
కరోనా రోగులపై చార్జీల బాదుడు : షాక్
సాక్షి, ముంబై: దొరికిందే చాన్స్ అన్నట్టుగా కోవిడ్-19 రోగులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్న ఆసుపత్రికి థానే మున్సిపల్ కార్పొరేషన్ భలే షాక్ ఇచ్చింది. భారీగా చార్జీలు వసూలు చేశారంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రి లైసెన్సును రద్దు చేసింది. (చెవుల్లో కూడా కరోనా వైరస్) కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరిన రోగులనుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలతో మహారాష్ట్ర, థానే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్ను శనివారం నిలిపివేసింది. అలాగే కోవిడ్-19 సెంటర్ను కూడా రద్దు చేసింది. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ నివేదిక మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 ఆస్పత్రుల ద్వారా 27 లక్షల రూపాయల మేర అదనపు చార్జీలను వసూలు చేసినట్టు ఆడిట్ కమిటి నివేదించింది. దీని ఆధారంగా ఘోడ్బందర్ రోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్ను నెల పాటు నిలిపివేసినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. జూలై 12 వరకు ఇక్కడ చికిత్స పొందుతున్న 797మంది రోగులనుంచి 56 బిల్లుల్లో 6,08,900 రూపాయలను అదనంగా వసూలు చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్సను పర్యవేక్షించడానికి, వారికి చార్జీల భారం లేకుండా నియంత్రించేందుకు ఇద్దరు అధికారులను నియమించామన్నారు. మరోవైపు అసుపత్రులపై నిఘా కొనసాగుతుందనీ, మిగిలిన ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సందీప్ మాలావి ప్రకటించారు. -
అమ్మకు సీరియస్గా ఉంది.. డబ్బులు కట్టాలి
పంజగుట్ట: ‘‘మా అమ్మకు సీరియస్గా ఉంది ... అర్జెంటుగా ఆసుపత్రిలో డబ్బులు కట్టాలి ... నా కార్డులు పనిచేయడంలేదు.. కొద్దిగా డబ్బులు ఉంటే సర్దండి. వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేస్తా’’ అని నమ్మబలికి 13 కార్పొరేట్ ఆసుపత్రుల వద్ద పలువురి నుంచి సుమారు రెండు లక్షల వరకూ వసూలు చేసి పారిపోయిన నిందితుడ్ని పంజగుట్ట క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పశ్బిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ తిరుపతన్న, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ, వికాస్ నగర్కు చెందిన కాసిడి రాజ రోహిత్ రెడ్డి అలియాస్ రోహిత్ అలియాస్ చిన్ను(27) నిరుద్యోగి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలు చేస్తున్నాడు. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులను ఎంచుకుంటాడు. అక్కడ మాటువేసి తన డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయడం లేదని అమాయకులకు చెప్పి నగదు తీసుకుంటాడు. ఆన్లైన్లో పేమెంట్ చేసినట్టు నటించి తన ఫోన్లో ఉన్న ట్రాన్సక్షన్ సక్సెస్ అనే పాత మెసేజ్ను చూపించి అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా రూ.1,98,850 వరకు చీటింగ్ చేశాడు. పంజగుట్ట క్రైమ్ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని రూ.30 వేల నగదు, ఓ మొబైల్ ఫోన్ స్వాధీనంచేసుకున్నారు. -
కరోనా వేళ.. కాసులవేట
హైబీపీ వచ్చి మెదడులో బ్లడ్ క్లాట్ అయిన వ్యక్తి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. అతడికి ట్రీట్మెంట్ పేరుతో రూ.లక్షల్లో ఫీజు వసూలు చేశారు. అయితే రోగి కోలుకోలేక చనిపోయాడు. ఆ మృతదేహాన్ని అప్పగించాలంటే మొత్తం ఫీజు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కరోనా విపత్తులోనూ కార్పొరేట్ ఆస్పత్రులు ధనదాహంతో రెచ్చిపోతున్నాయి. బిల్లులు చూస్తే గుండె గుబేలుమంటోంది. ఏ చికిత్స కోసం వెళ్లినా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అత్యవసర సేవల పేరుతో భారీ మొత్తంలో ఫీజులు గుంజుతున్నాయి. కాసుల కక్కుర్తితో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో అయితే మచ్చుకైనా కోవిడ్ నిబంధనలు అమలు కావడంలేదు. యాజమాన్యాలనిర్లక్ష్యం ఫలితంగా వైద్యులు, సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. నగరంలోని కొన్ని ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ వచ్చింది.(ఆక్సిజన్ పెట్టకుండానే బిల్లు!) సాక్షి, నెల్లూరు: కరోనా మహమ్మరి విజృంభన.. మొదటి విడత లాక్డౌన్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు పూర్తిస్థాయిలో ఓపీలు నిలిపివేశాయి. త్యవసర చికిత్సకు మాత్రమే అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత పలు కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పెద్దాస్పత్రిని కోవిడ్ కేంద్రంగా మార్పు చేశారు. అలాగే పలువురు కీలక వైద్యులను కరోనా డ్యూటీలు చేస్తుండడంతో పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల గడప తొక్కాల్సి వస్తోంది.ఇదే అదనుగా భావించిన యాజమన్యాలు కాసుల వేట ప్రారంభించాయి. ♦ అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూ విభాగంలో ఉంచి రోజుకు రూ.లక్షల్లో బిల్లులు వేస్తూ దోచేస్తున్నాయి. ♦ నగరంలోని పలు ఆస్పత్రుల్లో సుమారు 400 మంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. జిల్లాలో సమాచారం ♦ జిల్లాలో క్లినిక్లు 112, పడకల ఆస్పత్రులు 124, మేజర్ ఆస్పత్రులు 51, ల్యాబ్లు 48, స్కానింగ్ సెంటర్లు 176 వరకు అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అనుమతుల్లేకుండా సుమారు 150 వరకు క్లినిక్లు, ఆస్పత్రులున్నాయి. నిబంధనల జాడలేదు ♦ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ♦ ఈక్రమంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని తమకేం పట్టనట్లుగా ఉన్నాయి. ♦ హాస్పిటల్స్కు వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ప్రతిఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కొన్నింట్లో ఇవేమీ అమలు కావడంలేదు. ♦ కొందరికి కరోనా లక్షణాలున్నా టెస్ట్ చేయడంలేదు. కాగా కోవిడ్ బాధితులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం లేదు. ♦ రోగితోపాటు ఎక్కువ మందిని ఆస్పత్రుల్లోకి పంపుతున్నారు. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. ♦ ఇటీవల ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్కు కరోనా టెస్ట్ చేయించకుండా డయాలసిస్ చేశారు. ఆ వ్యక్తి కరోనాతో మృతిచెందడంతో మృతదేహన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో కనీస జాగ్రతలు కూడా పాటించలేదు. ఫలితంగా ఆ ఆస్పత్రిలో 10 మందికి పైగా సిబ్బందితోపాటు ఓ వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్గా వచ్చింది. ♦ గతంలో కూడా ఓ ప్రైవేట్ వైద్యుడు కోవిడ్–19 నిబంధనలు పట్టించుకోకుండా వైద్యసేవలు అందించడతో కరోనా బారిన పడి చెన్నైలో మృతిచెందిన విషయం తెలిసిందే. ♦ నగరంలోని రామలింగపురం అండర్బ్రిడ్జి పక్కనే ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ ఇద్దరు వైద్యాధికారుల చేత ఆకస్మిక తనిఖీలు చేయించారు. కానీ తనిఖీల సమాచారం ముందుగానే ఆస్పత్రి వర్గాలకు చేరడంతో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించాల్సిందే.. జిల్లాలోని దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఓపీకి అనుమతి ఇచ్చాం. కోవిడ్–19 నిబంధనలు అన్ని ఆస్పత్రులు పాటించాల్సిందే. మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఆర్ఎంపీలు వైద్యం చేయరాదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి సీజ్ చేశాం. – రాజ్యలక్ష్మి, డీఎంఅండ్హెచ్ఓ -
ఆసుపత్రి నిర్వాకం..పెరిగిన కరోనా కేసుల సంఖ్య
భువనేశ్వర్ : కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ప్రైవేటు హాస్పిటల్ని అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో ఇప్పటిరకు 27 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. మాంచెస్టర్లోని బ్లూ వీల్ హాస్పిటల్లో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనల్ని గాలికొదిలేశారు. కరోనా సోకిన బాధితుల్ని కూడా మిగతా సాధారణ రోగులతో కలిపి ఉంచారు. (కరోనాను అడ్డుకునే అత్యవసరాలు రైల్వే స్టేషన్లో లభ్యం ) సాధారణంగా అయితే వైరస్ సోకిన బాధుతుల్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తారు. అంతేకాకుండా పీపీఈ కిట్, ఎన్95 మాస్క్ సహా పలు జాగ్రత్తలు పాటించి వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ బ్లూవీల్ ఆస్పత్రి వైద్యాధికారులు మాత్రం ఈ నిబంధనల్ని గాలికొదిలేసి సాధారణ రోగులతో సహా వీరిని కూడా ఒకే వార్డులో ఉంచారు. ఆకస్మిక తనఖీలు చేపట్టిన అధికారులు సైతం యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణికి నివ్వెరపోయారు. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా 27 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. (రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా ) -
మా 'రేటే' వేరు.. రోజుకు లక్ష చెల్లించాల్సిందే!
ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర్నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ (56) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్లోనిఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. వెంటిలేటర్పై చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఆస్పత్రియాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఒకరోజు వెంటిలేటర్ చికిత్సకు రూ.9500 నిర్ణయించింది కదా! అని ఆమె బంధువులు ఆస్పత్రి వైద్యులను నిలదీయగా.. ప్రభుత్వ నిర్ణయంతో మాకు సంబంధం లేదు. ఆ ధరలు మాకు గిట్టుబాటు కావు. బిల్లు చెల్లించే స్తోమత ఉంటే.. ఉండండి.. లేదంటే పేషెంట్ను తీసుకెళ్లండి’ అని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు రోగి బంధువులు. ఒక్క సికింద్రాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రి మాత్రమే కాదు.. కరోనా చికిత్సలకు ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి. సామాజిక బాధ్యతను విస్మరించడమే కాదు.. ఏకంగా ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఆ ధరలు తమకు గిట్టుబాటు కావని.. ఆ ధరలకు తాము చికిత్సలు చేయలేమని.. తమ ఆస్పత్రిలో తాము నిర్ణయించిందే ధర అని తెగేసి చెబుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజుకు సగటున 150 నుంచి 190 కేసులు నమోదువుతున్నాయి. కోవిడ్ రోగులకు ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలోనే చికిత్సలు అందించారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య నిపుణులు సహా ఐసీయూ, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసుకునే సామర్థ్యం ఉన్న ఆస్పత్రులకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. నగరంలో 39 కార్పొరేట్ ఆస్పత్రులు అనుమతి పొందాయి. వీటిలో సుమారు పది ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్సలు కూడా ఇప్పటికే ప్రారంభించాయి. (ఫీజు కోసం దారుణం: ఆస్పత్రి సీజ్) ఆదేశాలు బేఖాతర్.. కరోనా వైరస్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడీ చేసే ప్రమాదం లేకపోలేదని భావించిన ప్రభుత్వం.. చికిత్సలకు ధరలను నిర్ణయించింది. ఆ మేరకు జీఓను కూడా జారీ చేసింది. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.2500 నిర్ణయించింది. ఇంటి నుంచి నమూనాలు సేకరిస్తే అందుకు రూ.2800 చార్జీ నిర్ణయించింది. ఈ ధరలు గిట్టుబాటు కాకపోవడంతో నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా టెస్టులు చేయడం లేదు. ప్రస్తుతం 18 ల్యాబ్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అనుమతి పొందాయి. వీటిలో సీసీఎంబీ, నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఐపీఎం, డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ కేంద్రాల్లో మాత్రమే టెస్టులు చేస్తున్నారు. మిగిలిన ప్రై వేటు ఆస్పత్రులు పరీక్షలు చేయడం లేదు. శాంపిల్స్ సేకరించి ఎప్పటిలాగే నిమ్స్కు పంపుతున్నాయి. ఇక కోవిడ్ చికిత్సలను కూడా నిరాకరిస్తున్నాయి. ఐసోలేషన్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.4000, ఐసీయూ చికిత్సలకు రోజుకు రూ.7500, వెంటిలేటర్ చికిత్సలకు రూ.9500 నిర్ణయించింది. పీపీఈ, ఇతర సర్జికల్ కిట్స్, సీటీ, ఎంఆర్ఐ లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది. నగరంలోని పలు కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఈ ఆదేశాలనే బేఖాతర్ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తమకు గిట్టు టు కావంటూ చికిత్సలకు నిరాకరిస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. రూ.14 లక్షలు ఖర్చవుతుందన్నారు:రోగి కుమారుడు మా అమ్మ (56) జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం శనివారం సికింద్రాబాద్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశాను. శ్వాస సరిగా తీసుకోలేక పోతుండటంతో వెంటిలేటర్పైకి తరలించారు. ఇప్పటికే రూ.3 లక్షలు చెల్లించాను. కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. రోజుకు రూ.లక్ష చొప్పున ఖర్చు అవుతుందని, ఆ మేరకు 14 రోజులకు కలిపి రూ.14 లక్షలు చెల్లించేందుకు అంగీకరిస్తేనే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంనిర్ణయించిన ధరలతో తమకు సంబంధం లేదన్నారు. మాది మధ్య తరగతి కుటుంబం. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తాం.? మంత్రిని కలిశాకే నిర్ణయం ప్రకటిస్తాం డాక్టర్ భాస్కర్రావు, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘంప్రభుత్వం నిర్ణయించిన కరోనా చికిత్సల ధరల్లో స్పష్టత లేదు. ఏ చికిత్సకు ఎంత వసూలు చేయాలనే అంశంలో స్పష్టత లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నాం. గురువారం మధ్యాహ్నం మంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాం. -
కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్ : కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఆపరేషన్ చేసి...కణితులు తొలగించాల్సింది పోయి...సర్జరీ సమయంలో ఉపయోగించే క్లాత్, కాటన్ కుక్కేశారు. దీంతో బాధితురాలికి మళ్లీ కడుపునొప్పి తిరగబెట్టింది. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్లకంటి లాలమ్మ(43) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఆమనగల్లులోని ఓ ఆసుపత్రిలో చూపించగా కడుపులో కణితులు ఉన్నాయని హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెబుతూ బాలానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ మేరకు లాలమ్మకు గతేడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. ఇటీవల లాలమ్మకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం కర్మన్ఘాట్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని అనగా.. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా కడుపులో కణితులతో పాటు క్లాత్, ఆపరేషన్లో వినియోగించే పత్తి ఉండలు బైటపడ్డాయి. గతంలో ఎక్కడ ఆపరేషన్ చేయించారో వాళ్ల నిర్లక్ష్యమేనని అక్కడి ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రి వద్దకు చేరుకుని నిలదీద్దామని వస్తే అది మూసివేశారు. దీనిపై బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని లాలమ్మ కుమారుడు శేఖర్ తెలిపారు. చదవండి: ఇది మదురై కాదా..! -
ఫీజు కోసం దారుణం: ఆస్పత్రి సీజ్
భోపాల్ : బకాయిలు చెల్లించనందుకు తన తండ్రిని మంచానికి కట్టిపడేసారని మహిళ ఆరోపించిన మూడు రోజుల తరువాత, జిల్లా యంత్రాంగం సదరు ఆసుపత్రిని సీజ్ చేసింది. వివరాల ప్రకారం..రాజ్గర్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ కడుపునొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. మొదట 10,800 రూపాయలు జమ చేయగా, శుక్రవారం ఆస్పత్రి యాజమాన్యం మరో పదివేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అంత మొత్తాన్ని ఇవ్వడానికి కుటుంబసభ్యులు నిరాకరించారు. (డయాబెటీస్కు కరోనా యమ డేంజర్! ) డిశ్చార్జ్ చెయ్యమని అడగ్గా చికిత్స పొందుతున్న తండ్రిని నిర్ధాక్షిణ్యంగా మంచానికి కట్టివేశారని బాధితుడి కుమార్తె ఆరోపించింది. ఆసుపత్రి యాజమాన్యం ఎంతో అమానుషంగా ప్రవర్తించారు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. హాస్పిటల్కి వెళ్లి చూడగా..బాధితుడిని తాళ్లతో మంచానికి కట్టేసి ఉంది. ఇదేంటని ప్రశ్నించగా...ఆయనకు ఫిట్స్ ఉందని అందుకే మంచానికి కట్టేసినట్లు వైద్యులు తెలిపారు. ఇది కూడా చికిత్సలో ఒక భాగం అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యంపై ఐపిసి సెక్షన్ 342 కింద కేసు నమోదు చేసినట్లు షాజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో హాస్పిటల్ యాజామాన్యం కావాలనే మంచానికి కట్టేసిందని తేలడంతో జిల్లా యంత్రాంగం ఆసుపత్రిని సీజ్ చేసింది. (పాఠశాలలు అప్పటి నుంచే మొదలు! ) -
ప్రైవేటు అయితే ఖరీదెక్కువ..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ‘లోకల్సర్కిల్స్’ ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో దాదాపు 40 వేల అభిప్రాయాలు వచ్చాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ప్రారంభిస్తే వైద్యం ఖర్చు విపరీతంగా పెరుగుతుందని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే రెండోసారి కరోనా సోకే అవకాశం ఉందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే నిర్దేశించాలని 61 శాతం మంది కోరారు. కరోనాకు చికిత్స చేసేందుకు తగిన పరికరాలు ఆస్పత్రుల వద్ద లేవని 32 శాతం మంది చెప్పారు. చికిత్స ఎక్కడ చేయించుకోవాలనే విషయంపై 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులను, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులను, 32 శాతం మంది ఇళ్లలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని అభిప్రాయపడ్డారు. మరో 14 శాతం మంది మాత్రం ఆ విషయం తమకు తెలియదని చెప్పారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరు మహిళల మృతి
సాక్షి, సిరిసిల్ల : వైద్యుల నిర్లక్ష్యంతో జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయడంతోనే ఈ అనర్థం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు మహిళలు మృతి చెందారని బంధువుల ఆరోపించడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎంహెచ్వో ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. -
లోకాన్ని చూపించకుండానే..!
సాక్షి, నిర్మల్ : కళ్లు తెరిచి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడదామని 9 నెలలపాటు తల్లి కడుపులో తలదాచుకున్న ఆ పసికందు బయటకు రాకముందే కన్నుమూసింది. కన్నబిడ్డను కళ్లారా చూసి 9 నెలలు పడిన కష్టం మరిచిపోదామనుకున్న ఆ తల్లి కూడా తన ఆశ నెరవేరకుండానే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మండలంలోని ప్యారమూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమా..? విధి వంచించిందో.. తెలియదుగాని ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్యారమూర్కు చెందిన మమత(21) అదేగ్రామానికి చెందిన క్యాతం సంతోష్ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమత గర్భం దాల్చినప్పటినుంచి ప్రతినెలా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటోంది. మమతకు నెలలు నిండడంతో రెండురోజుల క్రితం బంధువుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పురుడుకు ఇంకా సమయం ఉందని చెప్పడంతో అదే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అదేరోజు సాయంత్రం వైద్యురాలు వచ్చి మమతను పరీక్షించి ప్రసవం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కడుపులోనే పాప మృతిచెందినట్లు గుర్తించారు. మమత పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ కూడా సరైన వైద్యం అందించలేదని, అడ్వాన్సు చెల్లించేవరకూ వైద్యులు రాలేదని మమత భర్త సంతోష్ తెలిపారు. డబ్బులు చెల్లించాక.. పరీక్షించి.. వైద్యం అందించేలోపే పరిస్థితి విషమించి మమత ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. సమయానికి వైద్యం అంది ఉంటే.. మమతకు సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతోనే తన భార్య మృతి చెందినట్లు సంతోష్ ఆరోపించారు. నిర్మల్లోని ఆసుపత్రికి సకాలంలో వెళ్లామని, వైద్యులు ఆలస్యంగా స్పందించడంతోనే పాపతోపాటు తల్లి కూడా ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య మృతికి కారణమైన రెండు ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మృతురాలికి ‘ఠాగూర్’ తరహాలో చికిత్స
సాక్షి, చెన్నై: నగర శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై ఆంధ్రప్రదేశ్కు చెందిన వలస కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. మరణించిన మహిళకు ఠాకూర్ చిత్రం తరహాలో చికిత్స అందించి, చికిత్సకు తగ్గ ఫీజుల్ని కట్టించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఓ కాంగ్రెస్ ప్రముఖుడు రంగంలోకి దిగి పంచాయితీ పెట్టే పరిస్థితి నెలకొంది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళం పరిసరాలకు చెందిన వలస కూలీలు అనేక మంది పళ్లికరణై – పెరుంబాక్కం మార్గంలో ఉన్నారు. వీరంతా భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిర్మాణాలు జరిగే ప్రాంతాలే వీరికి ఆశ్రయంగా మారింది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ కష్టాల్ని ఎదుర్కొంటున్న ఈ కూలీల్లో ఓ కుటుంబం రెండు రోజుల నుంచి తీవ్ర మనో వేదనలో మునిగింది. ఈ ప్రాంతానికి చెందిన వెంకటరావు భార్య సుజాత హఠాత్తుగా స్పృహ తప్పింది. అపస్మారక స్థితిలోకి ఆమె వెళ్లడంతో ఆందోళన చెందిన వలస కూలీలు చేసేది లేక సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లాక్డౌన్ వేళ వైద్య సేవలు కష్టమేనని పేర్కొన్న ఆస్పత్రి వర్గాలు చివరకు రూ. 40 వేలు చెల్లిస్తే అడ్మిట్ చేసుకుంటామని సలహా ఇచ్చినట్టు సమాచారం. లక్షా 24 వేలు బిల్లు.. కడుపు మాడ్చుకుని రేయింబవళ్లు కూలి నాలి చేసుకుని సంపాదించిన మొత్తంలో తమ వద్ద ఉన్న రూ. 35 వేలు చెల్లించి సుజాతను ఆస్పత్రిలో చేర్చారు. ఠాకూర్ సినిమా తరహాలో చికిత్స సుజాతకు సాగినట్టు సమాచారం. రూ.60 వేలుకు మందులు, మాత్రులు, స్కానింగ్లు, ఇతర వెద్యపరికరాల బిల్లు వెంకట్రావు చేతికి చేరింది. అయితే, తన వద్ద అంత మొత్తం లేదని ఆస్పత్రి వర్గాల వద్ద వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశాడు. ఉదయాన్నే గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని, అంత వరకు చికిత్స అందించాలని వేడుకున్నాడు. అంగీకరించిన ఆస్పత్రి వర్గాలు మరుసటి రోజు సుజాత మరణించినట్టు, రూ.లక్షా 24 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వెంకట్రావుకు సలహా ఇచ్చాయి. అయితే తన భార్యకు రాత్రంతా ఏం చికిత్స చేశారంటూ వెంకట్రావు నిలదీశాడు. ఠాకూర్ సినిమా ఘటనను గుర్తు చేసుకుని ఆస్పత్రి వర్గాలపై వలస కూలీలు విరుచుకు పడ్డాయి. ఇక, చేసేది లేఖ ఆంధ్రాలో ఉన్న బంధువుల ద్వారా ఓ కాంగ్రెస్ నాయకుడిని వెంకట్రావు సంప్రదించినట్టున్నారు. ఆయన ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడికి చెప్పడంతో శనివారం వ్యవహారం మీడియా దృష్టి చేరింది. దీంతో మీడియాలో రచ్చ మొదలు కావడం, కాంగ్రెస్ నాయకుడు పంచాయితీ వెరసి రూ.50 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు సలహా ఇవ్వడం గమనార్హం. చివరకు 30 వేలు ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈ వలస కూలీలకు ఏర్పడింది. అయితే, మీడియాలో వ్యవహారం రచ్చకెక్కడంతో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆమెను 11.30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని, 12.30 గంటలకు తొలిసారిగా గుండె పోటు వచ్చినట్టు, మళ్లీ..మళ్లీ గుండె పోటు రావడంతో 3.30 గంటలకు మరణించినట్టు వివరించారు. ఆస్పత్రి బిల్లు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు తమపై నిందలు వేస్తున్నారని ఆ బులిటెన్లో ఆస్పత్రి వర్గాలు వివరించి చేతులు దులుపుకున్నాయి. -
ఆ హాస్పిటల్కు వెళ్లిన వారు వివరాలు తెలపండి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్న కేఎం హాస్పిటల్కు మార్చి 20వ తేదీ నుంచి వెళ్లిన వారికి కరోనా సోకే ప్రమాదం ఉందని, అలాంటి వారు వెంటనే 8333988955 నంబర్కు ఎంఎస్ఎం మెసేజ్, వాట్సాప్ యాప్ ద్వారా వివరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేఎం హాస్పిటల్లో ఒకరికి కరోనా వైరస్ సోకిందని, ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. వివరాలు తెలిపిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తుందని , వ్యాధి లక్షణాలు ఉన్నదీ, లేనిదీ తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు ఇంటిలోనే విడివిడిగా ఉండాలని, ఇతరులు తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదని పేర్కొన్నారు. -
వృత్తి ధర్మం మరచిన ప్రైవేటు
సాక్షి, అనంతపురం: కరోనా కల్లోలంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో సాయంగా నిలవాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు బాధ్యత మరిచాయి. ఎమర్జెన్సీ సేవలతో పాటు ఓపీ తప్పనిసరిగా చూడాలని కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా వైద్యాధికారి అనిల్కుమార్ ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులను ఆదేశించినా.. కొందరు వైద్యుల్లో మార్పు రాలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ నిక్కచ్చిగా చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినా.. మరికొందరు మాత్రం తీరు మార్చుకోలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృతమైన సేవలందిస్తున్న ఈ తరుణంలో ప్రైవేటు వైద్యులు అండగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 90 శాతం ఆస్పత్రులు మూత.. జిల్లాలో మొత్తం 258 ప్రైవేట్ ఆస్పత్రులుండగా.. వీటిలో ప్రముఖ ఆస్పత్రులు మాత్రమే తెరిచారు. మిగతా 90 శాతం ఆస్పత్రులను మూసేశారు. వాస్తవంగా రోజూ వేల సంఖ్యలో రోగులు వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి. ఆస్పత్రులు మూతపడడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయం.. భయం కరోనా నేపథ్యంలో ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో మూడు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు తమ ఆస్పత్రులను ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని ముందస్తుగా వైద్య సేవలు బంద్ చేశారు. జిల్లాలోని చాలా ఆస్పత్రులు మూతపడగా.. ఇబ్బంది పడుతున్న రోగులు ఆరోగ్యశాఖాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పటికే కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి సైతం వెళ్లగా ఆయన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోగులకు ప్రత్యక్ష నరకం.. డయాబెటిక్తో బాధపడుతున్న శ్రీనివాస్ నగరంలోని సాయినగర్లోని ఓ ఆస్పత్రిలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇదివరకే హార్ట్ స్ట్రోక్ రాగా...వెంటనే ఆస్పత్రిలో చేరగా గండం గడిచింది. ప్రస్తుతం అతను క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ అతను వెళ్లే ఆస్పత్రి వారం రోజులు క్రితం మూసివేయగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈయన రెవెన్యూ కాలనీకి చెందిన రాము. తన కూతురు జేష్వితకు సోమవారం విరేచనాలు, జ్వరం రావడంతో ఆస్పత్రులవైపు పరుగుతీశాడు. కానీ నగరంలో చాలా ఆస్పత్రులు మూసివేశారు. బిడ్డ పరిస్థితి చూసి రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ ద్వారా ఓ వైద్యున్ని సంప్రదించి మందులు తీసుకుని వెళ్లిపోయాడు. ..జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూసివేయగా.. రాము లాంటి వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లాలోని 258 ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఎమర్జెన్సీ సేవలు అందించాలని, ఎవరైనా తాళం వేస్తే ఎస్మా చట్టం కింద లైసెన్స్లను రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించినా ప్రైవేటు వైద్యులు తీరు మారలేదు. హౌసింగ్బోర్డుకు చెందిన ఆంజనేయులు గుండె సంబంధ వ్యాధితో పాటు డయాబెటిక్, హైపర్టెన్షన్తో బాధపడుతున్నాడు. నగరంలోని బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందేవాడు. ఆ ఆస్పత్రి మూసివేయడంతో ఆయన సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ కరోనా కేసుల నేపథ్యంలో వైద్యులు బిజీగా ఉన్నారు. అదే ప్రైవేట్ ఆస్పత్రి తెరిచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నగరానికి చెందిన దంపతులకు మూడ్రోజుల క్రితం ఓ పాప జన్మించింది. జాండిస్ లక్షణాలు కనిపించడంతో చిన్నారిని ఫోటోథెరపీలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో వారు నగరంలోని పలు ఆస్పత్రులకు వెళ్లగా ఎక్కడా చేర్చుకోలేదు. మూడ్రోజుల బిడ్డను తీసుకుని వారు పరుగులు పెట్టారు. చివరకు బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చిన్నారిని అడ్మిషన్ చేసుకోగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు మూసివేయగా.. కిడ్నీ, మధుమేహం, హైపర్టెన్షన్, మానసిక ఒత్తిడి, గుండె తదితర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు అవస్థలు పడుతున్నారు. వీరికి రెగ్యులర్గా డాక్టర్ చెకప్ తప్పనిసరి. రెగ్యులర్గా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు క్రమం తప్పకుండా వాడకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. -
పాపం.. పసివాడు
పదకొండు నెలల ఓ పసిబాలుడు సీసం గోలి మింగి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదాన్ని నింపింది. స్థానిక పోచమ్మగల్లీకి చెందిన కోరుట్ల రవిరాజ్ మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో కార్యదర్శిగా పనిచేస్తూ జగిత్యాలలో నివసిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రవిరాజ్ ఆయన భార్య అపర్ణ, కూతురు శాన్వీ (3), బాబు అభియాత్ (11 నెలలు)లతో కలిసి కోరుట్లకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం శాన్వీ, అభియాత్తో కలసి సీసం గోలీలతో ఆడుకునే క్రమంలో అభియాత్ గోలిని మింగాడు. శ్వాస తీయడం ఇబ్బందిగా మారడంతో గమనించిన తల్లి, వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించిందని చెప్పి జగిత్యాలకు పంపారు. అక్కడికి తీసుకెళ్లేలోపే శ్వాస ఆడక తుదిశ్వాస విడిచాడు. – కోరుట్ల -
బాలిక గొంతు కోసి ఆపై..
సాక్షి, చిలకలూరిపేట : పెళ్లికి నిరాకరించిన మైనర్ బాలిక గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి సంబంధించి ఎస్ఐ కె.నాగేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సంజీవ నగర్కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లితో కలిసి స్పిన్నింగ్ మిల్లులో కూలి పనులకు వెళుతోంది. ఇదిలావుంటే.. నరసరావుపేటకు చెందిన ఆమె బావ (అక్క భర్త)కు తమ్ముడైన అంకం అఖిల్కుమార్ కొంత కాలంగా బాలిక వెంటపడి.. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. బాలిక తల్లి తన కుమార్తెకు మైనార్టీ తీరకపోవడం, అఖిల్ కుమార్ సత్ప్రవర్తనతో ఉండకపోవడం వంటి కారణాల వల్ల అతడికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లిన అఖిల్ తనను పెళ్లి చేసుకోవాలని బాలికను బలవంత పెట్టాడు. బాలిక కుదరదనటంతో వెంట తెచ్చుకున్న షేవింగ్ బ్లేడ్తో బాలిక గొంతుపై కోసి తాను కూడా గొంతుపై గాయం చేసుకున్నాడు. బాలిక కేకలు వేయటంతో ఆమె తల్లి, చుట్టుపక్కల వారొచ్చి బాలికను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడు కూడా ఆదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆర్జనపై మక్కువ.. సేవలు తక్కువ
నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన పవన్కుమార్ అనే పదేళ్ల బాలుడు నెల రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వారం క్రితం అతన్ని చికిత్స కోసం తండ్రి శంకర్ నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించి.. కడుపులో పేగుకు ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. రెండు రోజులు చికిత్స అందించిన తర్వాత ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని తండ్రికి చెప్పారు. అయితే.. ఆపరేషన్ చేయాల్సిన వైద్యురాలు ఇక్కడ కుదరదని, బయటకు వెళ్లి చేయించుకోవాలని సూచించారు. దీంతో శంకర్ బయట వడ్డీకి అప్పు తెచ్చి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుమారుడికి ఆపరేషన్ చేయించాడు. సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. మరోవైపు కొందరు వైద్యుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సొంత ప్రాక్టీసుపైనే మొగ్గు చూపుతూ..ప్రభుత్వాసుపత్రిలో సేవలను గాలికొదిలేస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేటు క్లినిక్ల పేరుతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులను నడుపుతున్నారు. వారు ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయారు. ఒకవేళ బదిలీ చేసినా..వారికున్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వస్తున్నారు. అలా కుదరకపోతే ఉన్నతాధికారులకు మేనేజ్ చేసుకుని డిప్యుటేషన్ పేరుతో తిరిగి రావడం పరిపాటిగా మారింది. పాత వైద్యుల స్థానాలు ఖాళీ కాకపోవడంతో కొత్తవారికి అవకాశం లేకుండా పోతోంది. పేదలకు నిజంగా సేవ చేయాలనుకునే వైద్యులు.. ఇక్కడి సీనియర్ల తీరును చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. శస్త్రచికిత్స చేయాలంటే సొంత క్లినిక్కు వెళ్లాల్సిందే.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ 1,200 నుంచి 1,400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వారిలో 300 నుంచి 400 మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. వారిలో ప్రతి రోజూ దాదాపు 40 మంది రోగులకు ఏదో ఒక శస్త్రచికిత్స అవసరమవుతోంది. అయితే.. పది మందికి కూడా వైద్యులు శస్త్రచికిత్సలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటే సొంత క్లినిక్కు రావాలని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఓపీకే పరిమితం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో సర్జరీలు నిర్వహించాల్సిన వైద్యులలో కొందరు ఓపీ సేవలకే పరిమితమవుతున్నారు. మరికొందరు ఓపీ సేవలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఉదయం మొక్కుబడిగా కొంత సమయం రోగులకు కేటాయించి.. తర్వాత అక్కడి నుంచి నేరుగా సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు జనరల్ సర్జన్లు, ముగ్గురు ఆర్థోపెడిక్ సర్జన్లు, ముగ్గురు కంటి వైద్యనిపుణులు, ఒకరు ఈఎన్టీ స్పెషలిస్ట్ పనిచేస్తున్నారు. గతంలో జనరల్ సర్జరీలు నెలకు 50 దాకా నిర్వహించేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య 30కి పడిపోయింది. ఆర్థోకు సంబంధించి గతంలో 12 నుంచి 15 వరకు శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం 5 నుంచి 8 మాత్రమే జరుగుతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు గతంలో 250 నుంచి 300 దాకా నిర్వహించేవారు. ప్రస్తుతం 200కు మించడం లేదు. మిగిలిన కేసులను సొంత క్లినిక్లకు తరలించుకుపోతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒక కంటి వైద్య విభాగంలో మాత్రమే ప్రతి నెలా 80 నుంచి 100 ఆపరేషన్లు క్రమంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ తరహా ఆసుపత్రులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులకు కార్పొరేట్ తరహా ఆసుపత్రులు ఉన్నాయి. సొంత క్లినిక్లకు వచ్చే రోగులకు వైద్యం అందించడానికే వారికి సమయం చాలడం లేదు. ఇక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సేవలు ఏ మేరకు అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో జనరల్ సర్జన్గా పనిచేస్తున్న ఓ వైద్యురాలు పట్టణంలోని పద్మావతినగర్లో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అలాగే ఓ ప్రసూతి వైద్య నిపుణురాలు కూడా అదే ప్రాంతంలో క్లినిక్ నడుపుతున్నారు. ఓ చిన్నపిల్లల వైద్యుడు స్థానిక రెవెన్యూ క్వార్టర్స్లో, ఇదే విభాగానికి చెందిన వైద్యురాలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగానే ప్రైవేటు ప్రాక్టీసు చేస్తుండడం గమనార్హం. వీరితో పాటు మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నారు. శస్త్రచికిత్సలు తగ్గిన మాట వాస్తవమే నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించటంలో నిర్లక్ష్యం వహిస్తున్న మాట వాస్తవమే. వారిని హెచ్చరించాల్సిందిగా ఇది వరకే సూపరింటెండెంట్ విజయ్కుమార్ను ఆదేశించా. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తుంటే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగులను సొంత క్లినిక్లకు తరలించినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవు. –రామకృష్ణారావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (డీఎస్హెచ్ఎస్) -
జ్వరమొస్తే జేబు ఖాళీ..
సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 482 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. అందులో ఖమ్మం నగరంలోనే 240 ప్రైవేటు ఆస్పత్రులు నడుస్తున్నాయి. అనధికారికంగా జిల్లాలో వందల సంఖ్యలో క్లినిక్లు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. సీజనల్ జ్వరాలు తీవ్రరూపం దాల్చడంతో చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా బెడ్లు ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది. జ్వరంతో వచ్చిన పేషెంట్లకు అవసరం లేకపోయినా అన్ని రకాల టెస్టులు రాసి.. వారి వద్ద నుంచి అందినంత గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సాధారణ జ్వరం వచ్చినా డెంగీ టెస్టుల పేరుతో రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.200కోట్ల వ్యాపారం.. వైద్య, ఆరోగ్య శాఖ వైఫల్యంతో జిల్లాలో ఈ సీజన్లో జ్వరాలు తీవ్రమయ్యాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు వృద్ధిచెంది వాటి బారినపడి ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రెండు నెలల కాలంలో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు రూ.180కోట్ల నుంచి రూ.200కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా ఇంత వ్యాపారం ఏ జిల్లాలో జరగలేదని తెలుస్తోంది. ఈసారి జ్వరాల సీజన్ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు సిరులు కురిపించిందని చెప్పొచ్చు. అయితే వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఇంత వ్యాపారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దోపిడీ జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు ఉండడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైంది. నిబంధనలు గాలికి.. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు ఉండాలి. అలాగే ఆస్పత్రిలో బెడ్లు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫైర్ సేఫ్టీ తదితర విషయాల్లో తప్పనిసరిగా వారు సూచించిన విధంగా ఉండాలి. ఆయా పరీక్షల ఫీజు వివరాల బోర్డులు ప్రదర్శించాలి. కానీ.. చాలా ఆస్పత్రుల్లో నిబంధనలు ఖాతరు చేయట్లేదు. అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక అర్హత లేకున్నా ల్యాబ్లలో టెస్టులు చేయిస్తున్నారు. అప్పుడప్పుడు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా ఒకటి, రెండు ఆస్పత్రులను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆర్ఎంపీల వైద్యంతో ఇక్కట్లు.. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ సాధారణ జ్వరం, ఇతర నొప్పులు రాగానే స్పెషలిస్ట్ వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడరు. ఆ వీధిలోనో, ఆ గ్రామంలోనో ఉండే ఆర్ఎంపీని పిలిపించుకొని చూపించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాధారణ చికిత్స అందించి నయం చేసేవారు. కానీ.. ప్రస్తుతం కొందరు ఆర్ఎంపీలు ధర్జనే ధ్యేయంగా రోగుల వద్ద నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. పారాసిటమాల్ మాత్రవేస్తే నయమయ్యే జ్వరాన్ని డెకట్రాన్ వంటి ఇంజక్షన్లు వేసి రోగులను మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నారని కొందరు డాక్టర్లు పేర్కొంటున్నారు. వచ్చీరాని వైద్యం వల్ల రోగులకు అంతర్గతంగా బ్లీడింగ్ జరిగి ప్లేట్లెట్స్ పడిపోయి మృత్యువాత పడుతున్నట్లు కొందరు వైద్యులు వివరిస్తున్నారు. సాధారణంగా రోగిని పరీక్షించిన ఆర్ఎంపీలు మెరుగైన వైద్యం కోసం స్పెషలిస్ట్ డాక్టర్ల వద్దకు తీసుకెళితే.. వెంటనే జ్వరం అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. దీనికి తోడు కొందరు ఆర్ఎంపీలు కమీషన్ కోసం కక్కుర్తిపడి వారు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రైవేటు యాజమాన్యాలు పేషెంట్ను తమ ఆస్పత్రికి తీసుకువచ్చిన ఆర్ఎంపీకి 30 నుంచి 50 శాతం కమీషన్ ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. చూసీచూడనట్లు ఉన్నందుకు అధిక మొత్తంలో ప్రైవేటు యాజమాన్యాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు భారీగానే నగదు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆయా ఆస్పత్రులను సీజ్ చేస్తాం. ప్రైవేటు ఆస్పత్రులపై కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలు పాటించని ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నాం. ఇటీవల కొన్నింటిని సీజ్ కూడా చేశాం. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. – డాక్టర్ కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
డెంగీ మృతుల వివరాల్ని చెప్పొద్దంటారా?
సాక్షి, హైదరాబాద్: డెంగీ వల్ల అవయవాలు దెబ్బతిని రోగులకు ప్రాణాంతకమవుతోందని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రుల్లోని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలనడం సరికాదని హైకోర్టు తేల్చిచెప్పింది. వైద్యం పొందుతూ మరణించిన డెంగీ రోగుల వివరాల్ని వెళ్లడించొద్దని ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అధికారుల తీరు సమర్థనీయం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. డెంగీ నివారణకు తీసుకున్న చర్యల్ని వివరించాలని ఆదేశిస్తూ విచారణను 25కి వాయిదా వేసింది. -
దోచేందుకే పరీక్ష
మహేంద్ర కుమార్తెకు జ్వరంగా ఉండడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతికి డెంగీ సోకినట్లు అనుమానంగా ఉందని వైద్యులు రాసిచ్చిన పరీక్షలకు రూ.6వేలు ఖర్చు చేశాడు. అయినా సరే ఏ జ్వరం అనే దానిపై నివేదికల్లో స్పష్టత లేదు. మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ రూ.4వేలు ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గకపోవడంతో నెల్లూరులోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా రూ.800 ఖర్చుతో వైరల్ జ్వరం వచ్చినట్లు తేల్చారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి సైతం కుదుటపడింది.’’ చిత్తూరు అర్బన్ : ఇది మహేంద్ర ఒక్కడి సమస్యే కాదు జిల్లాలోని చాలామంది తల్లిదండ్రుల ఆవేదన. ఇటీవల జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో నివాసాల మధ్య నీటి నిల్వ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దోమల వ్యాప్తి పెరిగింది. ఇదే అదునుగా జ్వరమొచ్చి రక్తపరీక్షల్లో ప్లేట్లెట్లు కాస్త తగ్గినా కొందరు వైద్యులు డెంగీని బూచిగా చూపుతూ బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. డెంగీ జ్వరాలపై ప్రజలకు కనీస అవగాహన ఉంటే తప్ప ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేటట్లు కనిపిం చడం లేదు. డెంగీ వ్యాప్తి ఇలా.. డెంగీ జ్వరం ఎడిస్ ఈజిప్టి (టైగర్ దోమ) దోమవల్ల వ్యాప్తి చెందుతుంది. ఆర్బో అనే వైరస్ ఎడిసన్ దోమలోకి ప్రవేశించి అది మనిషిని కుట్టడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశి స్తుంది. దోమ కుట్టిన ఐదు రోజులుతర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమలు ఇళ్లల్లోని మంచినీళ్లు, పూలకుండీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, నిల్వ ఉన్న వర్షపు నీళ్లల్లో వృద్ధి చెందుతుంటాయి. కేవలం ఇది పగటి పూట కుట్టడం ద్వారానే డెంగీ వ్యాప్తి చెందుతుంది. నిర్ధారణ పరీక్షలు మ్యాక్ ఎలీసా పరీక్ష తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో మ్యాక్ ఎలీసా ద్వారా డెంగీ నిర్థారణ పరీక్ష ఉచితంగా చేస్తారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి రక్తనమూనా సేకరిస్తారు. రక్తంలోని సీరంకు ఐజీజీ, ఐజీఎం పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి 8 గంటల సమయం పడుతుంది. ఇందులో పాజిటివ్ వస్తే డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్థారిస్తారు. డెంగీ జ్వరం నుంచి కోలుకున్న ఆరునెలల వరకు మ్యాక్ ఎలిసా పరీక్ష ఎప్పుడు నిర్వహించినా పాజిటివ్ వస్తుంది. అంతమాత్రాన డెంగీ జ్వరం ఆరునెలలుగా ఉందని అర్థం కాదు. ఈ పరీక్షలకు కొన్ని ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రుల్లో రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్డీటీ పరీక్ష ర్యాపిడ్ డయోగ్నస్టిక్ టెస్ట్ (ఆర్డీటీ) ద్వారా ఇటీవల డెంగీ జ్వరాలను నిర్థారణ చేయడం చాలా ల్యాబ్లకు అలవాటైపోయింది. ఈ పరీక్ష ద్వారా రక్త నమూనా సేకరించి ఐదు రోజుల్లోపు జ్వరంతో బాధపడుతుంటే ఎన్ఎస్–1 పరీక్ష చేస్తారు. ఐదు రోజులకు పైబడి జ్వరం వస్తూనే ఉంటే ఐజీజీ, ఐజీఎం పరీక్షలు చేస్తారు. ఇది అరగంటలో పూర్తయిపోతుంది. అయితే డెంగీ నిర్థారణకు ఇది సరైన పరీక్ష కాదు. డెంగీతో పాటు ఇతర వైరల్ జ్వరాలు వస్తే కూడా ఈ పరీక్షలో పాజిటివ్ వస్తుంది. ఈ పరీక్ష చేయడానికి రూ.300 పైన చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేటు వైద్యులు రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. ప్లేట్లెట్ల పరీక్ష సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని ప్లేట్లెట్లు సంఖ్య 2లక్షల వరకు ఉంటుంది. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్యను తెలిపే పరీక్షకు రూ.100 – 200 చెల్లిస్తే సరిపోతుంది. గంటలో ఫలితాన్ని ఇచ్చేస్తారు. పౌష్టికాహారం, వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే ప్లేట్లెట్లు పెరుగుతాయి. ఒక్కోసారి ప్లేట్లెట్లు 10వేలకు కూడా పడిపోతాయి. అంతమాత్రాన కంగారు పడాల్సినవసరం లేదు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో రోగికి నేరుగా ప్లేట్లెట్లనే ఎక్కించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో ప్లేట్లెట్లు పడిపోయిన వ్యక్తికి 1.40లక్షల వరకు ప్లేట్లెట్లను పునరుత్పత్తి చేసే యంత్రాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారంటే ♦ ప్లేట్లెట్లు తగ్గినా, ఆర్డీడీ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా డెంగీ వచ్చినట్లు కాదు. ♦ కొందరు ల్యాబ్ నిర్వాహకులు, మరికొందరు ప్రైవేటు వైద్యులు డెంగీపై కంగారు పెట్టేస్తుంటారు. అలాంటి వాటికి భయపడొద్దు. ♦ ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక, సామాజిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో అనుభవమున్న వైద్యులున్నారు. విడవని జ్వరంతో బాధపడుతున్న వారిని అక్కడికి తీసుకెళ్తే రోగికి ఉన్న లక్షణాల ఆధారంగానే డెంగీ ఉందా, లేదా అని చెప్పేస్తారు. ♦ డెంగీ నిర్ధారణ కోసం మ్యాక్ ఎలీసా పరీక్షలకు రక్తనమూనా సేకరించి తిరుపతికి పంపిస్తారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత డెంగీ ఉంటే చికిత్స ప్రారంభిస్తారు. ఇవన్నీ ఉచితంగా చేయాలి. ఇక డెంగీ వైరస్ ద్వారా వచ్చే జ్వరానికి పారాసిట్మాల్ మాత్ర వేస్తేనే క్రమంగా తగ్గిపోతుంది. బొప్పాయి, దానిమ్మ పండ్లను బాగా తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ప్లేట్లెట్లు కూడా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.– డాక్టర్ పి.సరళమ్మ, జిల్లా ప్రభుత్వవైద్యశాలల సమన్వయాధికారి -
బాల భీముడు
అనంతపురం న్యూసిటీ : నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ధర్మవరానికి చెందిన ముస్తాఫా భార్య షాహీనా బీ.. తన తొలి కాన్పులో నాలుగు కిలోల బాబుకు జన్మనిచ్చా రు. గైనకాలజిస్టు డాక్టర్ శివజ్యోతి పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగింది. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ శివజ్యోతి తెలిపారు. -
సర్కారు దవాఖానాలకు రోగుల క్యూ
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవల బంద్ నాలుగో రోజూ కొనసాగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మరోవైపు బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్వర్క్ ఆస్పత్రుల మధ్య నెలకొన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రుల వారీగా బకాయిల వివరాలను నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా)కు ప్రభుత్వం అందజేసింది. ఈ లెక్కలను ఆస్పత్రుల వారీగా అసోసియేషన్ సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించ తలపెట్టిన తన్హా అత్యవసర సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం మొత్తం 236 ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.3,44,17,50,892 బకాయిలు ఉన్నాయి. ఈజేహెచ్ఎస్కు సంబంధించి 241 ప్రైవేటు హాస్పిటళ్లకు కలిపి రూ.23,58,28,032 బకాయిలు ఉన్నాయి. ఈజేహెచ్ఎస్కు సంబంధించి 15 కార్పొరేట్ ఆస్పత్రులకు (టీషా–తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్) రూ.89,99,90,072 బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రభుత్వం వెల్లడించిన లెక్కతో, తమ లెక్కలు సరిపోలడం లేదని తన్హా ప్రతినిధులు చెబుతున్నారు. తన్హాలోని అన్ని ఆస్పత్రుల నుంచి బకాయిలు లెక్కలు తెప్పిస్తున్నామని, వాటన్నింటినీ క్రోఢీకరించి మంగళవారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. -
కొనసాగుతున్న ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సేవలు నిలిచిపోవడంతో ఖరీదైన చికిత్సలను ఉచితంగా పొందేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. వరుసగా మూడోరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా గ్రామీణ ప్రాంత రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చి వెనుదిరుగుతున్నారు. డయాలసిస్ మొదలుకొని గుండెకు సంబం ధించిన చికిత్సల కోసం నిత్యం వేల మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటారు. వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందుతుంటాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవటంతో ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలను నిలిపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. బకాయిలను విడుదల చేస్తే తప్ప సేవలను అందించేది లేదని ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉన్నఫళంగా పేద రోగులు నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు వెళ్తుండటంతో ఆయా ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడుతోంది. భవిష్యత్తు కార్యాచరణ... బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్న లెక్కకు పొంతన కుదరక చర్చలు ముందుకు సాగడం లేదు. సమస్య పరిష్కారానికి ఈ మూడు రోజుల్లో ఒక్కడ అడుగు కూడా ముందుకు పడలేదు. బకాయిల వివరాలను ప్రభుత్వం పూర్తిగా అందించలేదని నెట్వర్క్ హాస్పి టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. రెండ్రోజుల్లో మరోసారి చర్చలకు పిలుస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు రెండు నెలల దాకా డబ్బు ఇవ్వలేమని చెబుతోందని అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సోమవారం తమ జనరల్ బాడీ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తా మని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. -
కార్డుల కొర్రీ.. వైద్యం వర్రీ
హైదరాబాద్కు చెందిన సావిత్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది. ఆమె వద్ద తెల్ల రేషన్కార్డు ఉండటంతో దాని కింద వైద్యం పొందొచ్చని భావించింది. కానీ తెల్ల రేషన్కార్డుతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలని కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు చెప్పేశాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి ఆరోగ్యశ్రీ కార్డుంది. కానీ ఆహారభద్రత కార్డు లేకపోవడంతో కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యం చేయలేమని ఓ ప్రైవేటు ఆసుపత్రివర్గాలు చెప్పడంతో 3 లక్షలు పోసి వైద్యం చేయించుకున్నాడు. సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా.. కొన్ని ఆసుపత్రుల తీరుతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుల్లో ఏదో ఒక కార్డు ఉన్నప్పటికీ ఉచిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలంటే అటు ఆరోగ్యశ్రీ కార్డుతోపాటు ఇటు ఆహార భద్రత కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ఉచిత వైద్యం చేయించుకోవాలనే పేదలకు ఆరోగ్యశ్రీ అక్కరకు రాకుండా పోతోంది. ఈ విషయంపై ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోగ్యశ్రీ కార్డులున్న కుటుంబాలు, ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలను ఒకసారి పరిశీలించి ఉమ్మడిగా మరో కార్డు ఇవ్వాలని గతంలో ట్రస్టు భావించినట్టు తెలిసింది. కానీ తర్వాత ఆ ఆలోచనను ఉపసంహరిం చుకుంది. అయినా ప్రైవేటు ఆస్పత్రులు 2 కార్డులూ ఉండాల్సిందేనని కొర్రీలు పెడుతున్నాయి. ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయి పడినందున ఈ నెల 16 నుంచి సమ్మెకు వెళ్లాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలోనే ఆసుపత్రులు 2 కార్డులు కావాలని కొర్రీలు పెడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచితానికి లక్షలాది మంది దూరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆ పథకం ఇప్పటివరకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణలో 330 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 77.19 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉండగా.. 87.89 లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులున్నాయి. అంటే 10.70 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నప్పటికీ, ఆహార భద్రత కార్డులు లేవు. ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పడంలేదు. పౌరసరఫరాల లెక్కల ప్రకారం ఒక్కో కుటుంబం కింద సరాసరి 3.20 మంది సభ్యులున్నారు. అంటే ఆహార భద్రత కార్డులు లేని కారణంగా దాదాపు 34 లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వైద్య సేవలు అందడంలేదు. అయితే, ఏ ఒక్క కార్డు ఉన్నా వైద్యం చేయడానికి అంగీకరించాలని తాము స్పష్టంచేసినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు కార్డులకూ లింక్ పెట్టాలని అనుకున్నా.. తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నామని తెలిపాయి. సీఎం కార్యాలయ లెటరే దిక్కు... ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుల్లో ఏదో ఒకటి మాత్రమే ఉన్న పేదలకు ఉచిత వైద్యం అందాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా లేఖలు తీసుకోవాల్సిందే. ఈ లేఖలు ఇవ్వడం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. తొలుత ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలనే పేదలు తమ వద్దనున్న కార్డును ఆసుపత్రికి చూపించాలి. ఆసుపత్రి వర్గాలు రోగం, అందుకయ్యే వ్యయం వివరాలతో కూడిన లెటర్ ఇస్తాయి. ఆ లేఖను తీసుకెళ్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇవ్వాలి. వారు దాన్ని పరిశీలించిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి అనుమతి ఇస్తున్నారు. ఇదంతా పెద్ద ప్రహసనంగా ఉండటంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి ఆయా ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని పలువురు కోరుతున్నారు. 330 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు 77 : ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న కుటుంబాలు 88 : ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలు 11 : ఆరోగ్యశ్రీ కార్డున్నాఆహార భద్రత కార్డు లేని కుటుంబాలు -
మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప
తల్లి పొత్తిళ్లలో.. వెచ్చని కౌగిలితో.. ముర్రు పాలు తాగుతూ.. అప్పుడే తెరిచిన కళ్లతో తన అమ్మ లోగిళ్లలోని లోకాన్ని వీక్షిస్తూ.. తల్లి జో కొడుతుంటే హాయిగా నిద్రించాల్సి ఆడ శిశువు భూమి పైకి వచ్చి మూడు రోజులకే అనాథగా మారింది. తన ఆకలి తీర్చే దిక్కు లేక.. అమ్మ కౌగిలికి దూరమై.. క్యారు మంటోంది. నిబంధనల ఆటంకంతో వైద్యానికి దూరమై.. ఎవరి అక్కున చేరక.. ఆస్పత్రి గదిలోని కాంతుల వెలుగులో తల్లడిల్లుతున్న ఓ చిన్నారి దీనగాథ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సాక్షి, కనిగిరి: కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్లులో గల ఓ ప్రవేటు ఆస్పత్రిలో ఓ అవివాహిత మూడు రోజుల కిందట ఓ శిశువుకు జన్మనిచ్చింది. తెలిసి చేసిన ‘పాప’మా.. లేక తెలియక చేసిన ‘పాప’మా.. లేక ఆడపిల్ల కావడంతో వదలించుకునేందుకు చేసిన మహా పాపమా తెలియదు కాని.. ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ తల్లికి దూరమైంది. ఆస్పత్రిలోని ఓ ఆయా ఆ బిడ్డను స్థానిక ఓ ప్రవేటు చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించింది. తల్లి దండ్రులు ఎవరు లేరని వదిలేసి వెళ్లారని వైద్యం చేయాలని వైద్యునికి తెలిపింది. ఇంతలో విషయం తెలుసుకున్న సంతానం లేని బాషా దంపతులు ఆ పసి పాపను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చిన్న పిల్లల వైద్యుడు శిశువును పరీక్షించి.. పాపలో ప్రాణం ఉంది కాని పూర్తి అవయవాలు రూపుదిద్దుకోలేదని, ఒంగోలులోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సహకారంతో దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ఆ శిశువును ఒంగోలుకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ప్రవేటు ఆస్పత్రుల్లో శిశువును చూపించారు. శిశువును పరీక్షించిన వైద్యులు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారన్నారు. ఆరోగ్య శ్రీ లో చికిత్స చేయాలంటే తల్లి దండ్రుల పేర్లు నమోదుతో పాటు, పలు నిబంధనలు వర్తిస్తాయని చెప్పినట్లు బాషా దంపతులు తెలిపారు. దీంతో మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాషా దంపతులు అంత ఖర్చు పెట్టలేమని ఆదివారం రాత్రి తిరిగి ఒంగోలు నుంచి కనిగిరికి తీసుకోచ్చారు. వారికి శిశువును అప్పగించిన చిన్నపిల్లల ప్రవేటు వైద్యశాలలోనే చేర్పించారు. బరువు కూడా తక్కువగా ఉన్న ఆ శిశువు ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రాణంతో ఉందని డాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. నిజంగా పురుడు పోశారా.. అబార్షన్ చేశారా? అసలు శిశువు జనం అక్రమమా.. సక్రమమా అనేది అటుంచితే.. పట్టణంలోని గార్లపేట రోడ్డులో గల ఓ ప్రవేటు వైద్యశాలలో నుంచి బయటకు వచ్చింది. అయితే అక్కడ ఆ శిశువు తల్లికి ఆబార్షన్ చేసి బిడ్డను బయటకు తీశారా.. లేకా పూర్తి నెలలు నిండిన తర్వాత పురుడు పోశారు. అనేది ప్రశ్నార్ధకం. నిజంగా బేబి పరిపూర్ణంగా లేక పోవడానికి కారణం ఏమిటి అనేది కూడా చర్చ జరుగుతోంది. తల్లి అవివాహితై.. రహస్య కాన్పు అయినా పరిపూర్ణంగా అవయవాలు లేక పోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తల్లిది సీతరామపురం.. అందిన సమాచారం మేరకు ఆ శిశువుకు జన్మనిచ్చిన తల్లి హెచ్ఎం పాడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన అవివాహితగా తెలుస్తోంది. దీనిపై ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్నను సాక్షి వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. చిన్న పిల్లల ఆస్పత్రిలో పాపను తాము చూశామన్నారు. అశిశువుకు పురుడు పోసిన ఆస్పత్రికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారం ఆ శిశువును స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఐసీడీఎస్ అధికారుల ఆధీనంలోకి శిశువు ఆస్పత్రిలో వదిలి వేసిన నవజాత శిశువు(ఆడ)ను ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీఓ సీడీపీఓ లక్ష్మీప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనాథ శిశువుకు అయ్యే వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ గఫార్ భరాయిస్తానని తెలిపినట్లు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ప్రస్తుతం పాప పరిస్థితి బాగా లేదని.. వెంటిలేషన్పై ఉందన్నారు. కనిగిరి ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్సలు చేయించి.. వైద్యుల పర్యవేక్షణలో పెద్పాస్పత్రులకు తీసుకెళ్తామని సీడీపీఓ తెలిపారు. -
‘ప్రైవేటు’లో ఎస్సై ఫిట్నెస్ సర్టిఫికెట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో వరంగల్ రీజియన్ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ పరీక్షలను వరంగల్లోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉండగా తమ వద్ద తగిన వసతులు, పరికరాలు లేవంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రికి బాధ్యత అప్పగించింది. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు అతిక్రమించిన ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ను మందలించింది. ఆయా ఎస్సై అభ్యర్థులను తక్షణమే హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పంపాలని వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్రెడ్డి శనివారం ఆదేశించారు. ఇప్పటివరకు ఎంత మంది ఎస్సై అభ్యర్థులకు ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించారన్న దానిపై ఆయన విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కంటి సామర్థ్యాన్ని గుర్తించే పరికరాలు లేవా? ఒకవేళ లేకుంటే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంటి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు అనుమతించారన్న దానిపై డీఎంఈ విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం కూడా వివరాలు తెప్పించుకుంది. మంత్రికి కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల దాదాపు 1,200 మంది ఎస్సై పోస్టులకు ఎంపికవగా వారికి ప్రస్తుతం దేహదారుఢ్య, కంటి సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థుల్లో ఎవరికైనా కేన్సర్, గుండె జబ్బులుంటే వారిని ఎస్సై పోస్టుకు ఎంపిక చేసే అవకాశాలు తక్కువ. అలాగే దృష్టిలోపాలు ఉన్న వారిని ఎస్సై పోస్టుకు ఏమాత్రం ఎంపిక చేయరు. ఈ పరీక్షలను తప్పనిసరిగా నిర్ణీత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి. ప్రభుత్వ వైద్యులే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వరంగల్లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వాహకులు కావాలనే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. -
కేరళలో నిఫా కలకలం!
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కొచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి నిఫా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. విద్యార్ధికి సంబంధించిన రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, కాలమస్సరి వైద్యకళాశాల ఆస్పత్రివర్గాలు ఆ విద్యార్థికి ప్రత్యేకవార్డు కేటాయించాయని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఎర్నాకుళంకు చెందిన సదరు విద్యార్థి ఇటీవల క్యాంపు నిమిత్తం త్రిశూర్కు వెళ్లాడని, ఆ సందర్భంగా అతడికి జ్వరం సోకడంతో ఆసుపత్రిలో చేరాడని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రీనా తెలిపారు. ఆ క్యాంపులో 16 మంది విద్యార్థులు ఉన్నారని, అతడితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు విద్యార్థులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఏవైనా అనుమానిత కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను మంత్రి ఆదేశించారు. కేరళలో గత ఏడాది మే నెలలో నిఫా వైరస్ సోకి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
టీడీపీ నగర అధ్యక్షుడి గూండా గిరి
గుంటూరు ఈస్ట్: వైద్యం పేరుతో విడతల వారీగా రూ. 6 లక్షలు ఖర్చు చేయించి, చివరికి రోగి బతకడని చెప్పిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి కొమ్ముకాస్తూ రోగి బంధువులను బెదిరించి తన అనుచరులతో దాడి చేయించాడో టీడీపీ నేత. ఈ ఘటన గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో శనివారం కలకలం రేపింది. నూజెండ్ల మండలం కొండ్రపాడు గ్రామానికి చెందిన దాలి యలమందరావు కౌలు రైతుగా జీవనం సాగిస్తుంటాడు. అతను మే 18న రోడ్డు ప్రమాదంలో పక్కటెముకల లోపల గాయమయింది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సిఫారసుతో అదే రోజు రాత్రి యలమందరావును బంధువులు గుంటూరు సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 24న వైద్యులు డిస్చార్జ్ చేశారు. అయితే ఒక్కరోజుకే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో 26 రాత్రిన తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 30న యలమందరావు ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వైద్యులు డయాలసిస్ ప్రారంభించారు. అప్పటికే రూ. 6లక్షలు కట్టించుకున్నారు. ఆ తర్వాత 31న యలమందరావు బతికే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ సమయంలోనూ వైద్య పరీక్షలు అంటూ రూ. 20 వేలు కట్టించుకున్నారు. యలమందరావు బంధువులు ఆస్పత్రికి వచ్చి వైద్యం పేరుతో లక్షల రూపాయలు కట్టించుకొని ఇలా చేయడమేంటని వైద్యులను ప్రశ్నించారు. దీంతో వాగ్వావాదం జరిగింది. ఆస్పత్రి యాజమాన్యంతో సంబంధాలు కలిగిన టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కలుగ చేసుకుని యలమంద బంధువులను బెదిరించాడు. యలమంద బావమరిది వెంకటేశ్వర్లు, మరో ఇద్దరిని గదిలోకి పిలిచి తలుపులు వేసి తీవ్ర పదజాలంతో దూషించాడు. ప్రభాకర్ అనుచరులు 30 మంది ఆస్పత్రి దగ్గరకు వచ్చి రోగి బంధువులపై దాడి చేశారు. మహిళలు, పిల్లలను కూడా చితకబాదారు. కొత్తపేట పోలీసులు ఇరువర్గాల వారిని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. డేగల ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అక్కడ ధర్నా చేశారు. ఈ ఘటనపై కొత్తపేట ఎస్హెచ్ఓ మధుసూదనరావు వివరణ ఇస్తూ.. ఘర్షణ నివారించడానికి ఇరువర్గాలను స్టేషన్కు తరలించామని చెప్పారు. యలమందకు ఉచితంగా వైద్యం చేయడానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో కేసు నమోదు చేయలేదని చెప్పారు. గతంతోనూ ఎస్హెచ్వోపై దౌర్జన్యం నగరంలోని అనేక ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మెడికల్ షాపులు నిర్వహిస్తున్న డేగల ప్రభాకర్ టీడీపీ అధికారం ఉన్న సమయంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్కు అనుచరుడిగా ఉంటూ అనేక దారుణాలు చేశాడు. గతంలో కొత్తపేట భగత్సింగ్ సెంటర్లో ఓ ఆస్పత్రిని ఖాళీ చేయించే విషయంలో భవన యజమానిని బంధించాడు. దీనిని అడ్డుకోవడానికి వెళ్లిన అప్పటి ఎస్హెచ్ఓపై దాడికి దిగగా అతడు డేగల ప్రభాకర్పై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించారు. చిన్నబాబు జోక్యంతో ఎస్హెచ్వో మిన్నకుండిపోయారు. -
సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రిలో రోగి భందువులు ఆందోళన
-
కిడ్నీ మార్పిడి ఘటనపై త్రిసభ్య కమిటీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో కిడ్నీ మార్పిడి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జించిన శ్రద్దా ఆసుపత్రి.. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. శ్రద్ద ఆసుపత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ల తీరుపై ఆరా తీశారు. శ్రద్ధ ఆస్పత్రికి రాష్ట్రంతోపాటూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్రోకర్లున్నారు. వీరు కిడ్నీ ఎవరికి అవసరం? ఎవరిస్తారు? వంటి వాటిపైనే దృష్టి సారిస్తారు. అలా దొరికిన వారితో ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుడు (నెఫ్రాలజిస్టు)కు బ్రోకర్లు పరిచయం చేసి బేరం కుదురుస్తారు. ఇలా శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యానికి దేశంలోని వివిధ ప్రాంతాల బ్రోకర్లతో లింకులున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా వెలుగు చూసిన పార్థసారథి వ్యవహారంలో పోలీసులకు అశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయినట్టు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో విశాఖకంటే మెరుగైన, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఎన్నో ఉన్నా... అంతగా పేరు ప్రఖ్యాతల్లేని విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రికే కిడ్నీ మార్పిడి కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కిడ్నీ వ్యాపారం పైనే 'శ్రద్ధ'
సాక్షి, విశాఖపట్నం: ఆ ఆస్పత్రికి కాసుల వర్షం కురిపించే కిడ్నీ మార్పిడిపైనే అత్యధిక ‘శ్రద్ధ’! లక్షలాది రూపాయలు వచ్చి పడుతుండడంతో యాజమాన్యం అడ్డదారులు తొక్కింది. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. విశాఖలో కిడ్నీ మార్పిడికి కేంద్రం ముసుగులో కిడ్నీ రాకెట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది..! డొంక కదిలిందిలా.. హైదరాబాద్కు చెందిన సెక్యూరిటీ గార్డు పార్థసారథి తన కిడ్నీని రూ.12 లక్షలకు అమ్ముకున్నా రూ.5 లక్షలే ఇచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న శ్రద్ధ ఆస్పత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ ఆస్పత్రిలో జరుగుతున్న కిడ్నీ మార్పిడులపై ఎవరూ దృష్టి సారించలేదు. ఒక కిడ్నీ మార్పిడికి రోగి నుంచి రూ.60 – రూ.70 లక్షలు వసూలు చేస్తుంటారు. ఇందులో విధిలేక కిడ్నీని అమ్ముకున్న అభాగ్యులకు రూ.12 నుంచి రూ.15 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నా ఐదారు లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ ఆస్పత్రి యాజమాన్యంపై గానీ, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిపై గానీ ఫిర్యాదు చేసే సాహసం ఈ అభాగ్యులు చేయలేరు. ఇదే ‘శ్రద్ధ’కు వరంగా మారింది. దేశవ్యాప్తంగా బ్రోకర్లు శ్రద్ధ ఆస్పత్రికి రాష్ట్రంతోపాటూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్రోకర్లున్నారు. వీరు కిడ్నీ ఎవరికి అవసరం? ఎవరిస్తారు? వంటి వాటిపైనే దృష్టి సారిస్తారు. అలా దొరికిన వారితో ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుడు (నెఫ్రాలజిస్టు)కు బ్రోకర్లు పరిచయం చేసి బేరం కుదురుస్తారు. ఇలా శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యానికి దేశంలోని వివిధ ప్రాంతాల బ్రోకర్లతో లింకులున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా వెలుగు చూసిన పార్థసారథి వ్యవహారంలో పోలీసులకు అశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయినట్టు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో విశాఖకంటే మెరుగైన, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఎన్నో ఉన్నా... అంతగా పేరు ప్రఖ్యాతల్లేని విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రికే కిడ్నీ మార్పిడి కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏడాదికి 10 నుంచి 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఈ ఒక్క ఆస్పత్రిలోనే జరుగుతున్నాయని తెలుసుకుని పోలీసులు నివ్వెరపోతున్నారు. అందుకే ఇప్పుడు ఇలా ఎవరెవరు కిడ్నీ మార్పిడులు చేయించుకున్నారు? వారికి కిడ్నీలు ఎవరిచ్చారు? ఎంత చెల్లించారు? వారితో ఎవరికైనా వివాదాలు తలెత్తాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిర్వాహకులకు మద్దతుగా అధికార పార్టీ నేత! ఇప్పటికే ఈ కిడ్నీ రాకెట్ కేసులో ఈ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ను, బ్రోకర్గా వ్యవహరిస్తున్న బెంగళూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేడో రేపో ఆస్పత్రి నిర్వాహకులను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. దీంతో వీరు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఆస్పత్రి యాజమాన్యం అధికార పార్టీ ‘ముఖ్య’ నేతతో సత్సంబంధాలున్నాయని, అటు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ బాగోతం వెలుగులోకి రావడంతో విశాఖ నగరంలో ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్థసారథిలాంటి బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరడంతో అలాంటి వారెవరైనా ఫిర్యాదు చేస్తారేమోనని ఈ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
జ్వరంతో గిరిజన బాలిక మృతి
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ రెండేళ్ల గిరిజన బాలిక గురువారం సాయంత్రం మృతి చెందింది. వేలేరుపాడు మండలం మోదేలుకు చెందిన కెచ్చెల బాలకృష్ణారెడ్డి, గంగారత్నంల కుమార్తె గాయత్రి (2) గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండగా గ్రామంలోని ఒక ప్రైవేట్ వైద్యుడితో వైద్యం చేయించారు. అయితే పరిస్థితి మరింత విషమంగా మారడంతో గాయత్రికి మెరుగైన వైద్యం కోసం ద్విచక్ర వాహనంపై తండ్రి బాలకృష్ణారెడ్డి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేసి వైద్యం చేసే ప్రయత్నం చేశారని అయితే రిపోర్ట్ వచ్చేలోగా గాయత్రి మృతి చెందినట్టు తల్లిదండ్రులు తెలిపారు. మోదేలు గ్రామం బుట్టాయగూడెం మండలం మీదుగా కొండల్లో నుంచి దగ్గర మార్గం కావడంతో బాలిక మృతదేహాన్ని మళ్లీ ద్విచక్రవాహనంపై మోదేలు గ్రామం తీసుకువెళ్లారు. మోదేలులో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి మోదేలు గ్రామంలో గిరిజన బాలిక గాయత్రి మృతి నేపథ్యంలో ఆ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పీవైఎల్ నాయకుడు తగరం బాబూరావు కోరారు. మండలంలోని మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామంలో మలేరియా స్ప్రేయింగ్ పనులు ఇంతవరకూ చేయలేదని ఆరోపించారు. దీని కారణంగా అక్కడి గిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్ప్రేయింగ్ పనులు చేయించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని కోరారు. -
మానవత్వానికే మచ్చ !
సాక్షి,నెల్లూరు: ‘అవయవదానం చేయండి. పదిమంది జీవితాల్లో వెలుగు నింపండి. ప్రాణదానం చేయండి’. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు దీని అర్థాన్నే మార్చేస్తున్నాయి. అవయవదానం ముసుగులో అక్రమాలకుపాల్పడుతూ మానవత్వానికే మాయని మచ్చ తెస్తున్నారు. ఇటీవల కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యవహారాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చేసిన శస్త్రచికిత్స విఫలమై బ్రెయిన్డెడ్ అయింది. బాధితుడి పేదరికం ఆస్పత్రికి వరంగా మారింది. అతని అవయవాలపై కన్నేసింది. చికిత్సకైన బిల్లును చెల్లించు.. లేదా అవయవాలు దానం చేస్తావా? అంటూ ఆస్పత్రి యాజమాన్యం బాధితుని భార్యను బ్లాక్మెయిల్ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అంగీకరించింది. తర్వాత ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకంపై ఆమె జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అవయవదానం ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రి వ్యవహారం అధికార బృందం విచారణ జరిపి చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఏం జరిగిందంటే.. అల్లూరు మండలం ఉద్దేపుగుంటకు చెందిన ఏకొల్లు శ్రీనివాసులు (45) అనే వ్యక్తి ఈనెల 17వ తేదీ రాత్రి రోడ్డుపై నడిచి వెళుతుండగా బీరంగుంట గ్రామం వద్ద వెనుకనుంచి మోటార్బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి అతడిని 108 వాహనంలో వైద్యం కోసం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 18వ తేదీన అతని మెదడుకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా విఫలమై శ్రీనివాసులు కోమాలోకి వెళ్లిపోయాడు. బ్రెయిన్డెడ్ కావడంతో బతకడని భావించిన వైద్యులు అతని భార్య అరుణమ్మకు విషయం చెప్పారు. డిశ్చార్జి చేయాలంటే ఆపరేషన్ ఖర్చు రూ.1.27 లక్షలుచెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అసలే రెకా>్కడితే డొక్కాడని ఆ కుటుంబం బిల్లు చెల్లించలేని పరిస్థితి కావడంతో ఆస్పత్రి యాజమాన్యం శ్రీనివాసులు అవయవాలపై కన్నేసింది. బిల్లు చెల్లిస్తావా? కిడ్నీఇస్తావా? అంటూ అతని భార్యపై ఒత్తిడి పెంచారు. యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేని అరుణమ్మ అవయవాలు తీసుకోమని చెప్పింది. అంతే ఆగమేఘాలపై ఆస్పత్రి యాజమాన్యం రెండు కిడ్నీలు, గుండె, రెండుకళ్లు, సేకరించి అందులో కిడ్నీ మాత్రం ఉంచుకుని మిగిలిన అవయవాలు ఇతర ఆస్పత్రులకు పంపింది. అవయవాలు సేకరించిన ఆస్పత్రి యాజమాన్యం కనీస మానవత్వం కూడా చూపకుండా అంత్యక్రియలకు కూడా సాయం చేయలేదు. దీంతో గిరిజన మహిళ అరుణమ్మ తన భర్తను అనాథశవంలా వదిలివేయలేక అష్టకష్టాలు పడి మృతదేహన్ని తీసుకుని సొంతూరికి చేరుకుని ఇతరుల సాయంతో అంత్యక్రియలు చేసింది. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె రొడ్డెక్కింది. అధికారులకు ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది. అవయవ సేకరణలో ఎన్నెన్నో అనుమానాలు? శ్రీనివాసులు అవయవదానంలో ఆస్పత్రి వర్గాలు వ్యవహరించిన వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితుల దగ్గర్నుంచి ముందస్తుగా బిల్లు కట్టించుకోలేదు. ఎన్టీఆర్ వైద్యసేవలు వర్తించవని తెలిసినా ఖరీదైన శస్త్ర చికిత్స ఎలాచేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..తలపైన బలమైన గాయాలు లేకపోయినా మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏముంది? నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అవయవాలపై కన్నేసి బిల్లు చెల్లించలేరని తెలుసుకుని అతని భార్యను బ్లాక్మెయిల్ చేశారా? జీవన్దాన్ సంస్థ నిబంధనల ప్రకారం అవయవ దానం స్వీకరించే ఆస్పత్రి ఒక అవయవాన్ని మాత్రం తీసుకునే అవకాశం ఉంది. దానిని ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్షల్లో విక్రయించే అవకాశం ఉంది. ఈ కోణంలో ఆస్పత్రి యాజమాన్యం కాసుల కోసం మానవత్వం మరిచిందా? మిగిలిన అవయవాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రులకు పంపిన వైనంలో కూడా కాసులు వేట ఉందా? అవయవ సేకరణ సమయంలో నిబంధనలు సక్రమంగా పాటించారా? ఇలా ఎన్నో అనుమానాలను అనేకమంది వ్యక్తం చేస్తున్నారు. నివేదిక సిద్ధం నెల్లూరులో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన అవయవ సేకరణపై దుమారం రేగడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వైద్య అధికారుల బృందంతోపాటు కావలి సబ్కలెక్టర్, తహసీల్దార్ విచారణ జరిపి నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు ఇచ్చారు. అధికారులు విచారణలో అవయవదానం ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలను ఎన్నో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆస్పత్రి నిర్వాకంపై నివేదిక సిద్ధిం చేసి జిల్లా కలెక్టర్కు పంపారు. అయితే సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవద్దంటూ రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నడిరోడ్డుపై గర్భిణి నరకయాతన
పొదలకూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెలలు నిండకుండానే ఓ గర్భిణికి రక్తస్రావం అయ్యింది. సకాలంలో గమ్యస్థానానికి చేర్చి వైద్యం అందించాల్సిన 108 వాహనానికి ఇంధనం లేకపోవడంతో ఆయిల్ పట్టుకుని వస్తామని చెప్పి సిబ్బంది గర్భిణిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ నడిరోడ్డుపై నరకయాతన అనుభవించింది. బస్టాండ్లో ఉన్న ఓ ఆటో డ్రైవర్ 108 వచ్చేలోగా తాను గర్భవతిని నెల్లూరుకు తరలిస్తానని ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ఆరో నెల గర్భిణికి రక్తస్రావం అవుతుండటంతో 108 అంబులెన్స్లో బంధువులు పొదలకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రతినెలా ఇదే ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో వైద్యురాలు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో నెల్లూరుకు తరలించాల్సిందిగా సూచించారు. ఈలోగా 108 సిబ్బంది వాహనంలో ఇంధనం లేదని దాన్ని నింపుకుని వస్తామని గర్భిణిని రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో రక్తస్రావం అవుతున్న గర్భిణి నరకయాతన అనుభవించింది. ఆమె ఆర్తనాదాలకు స్థానికులు చుట్టుముట్టారు. బంధువులకు ఏమి చేయాలో పాలుపోక అయోమయంలో ఉండగా గర్భిణిని తాను నెల్లూరుకు తీసుకెళతానని ఓ ఆటోడ్రైవర్ ముందుకొచ్చారు. అయితే ఇంధనం వేయించుకుని 108 వాహనం అక్కడికి రావడంతో గర్భిణిని అందులోనే నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ..తాము ముందుగానే నెల్లూరుకు తరలిస్తామని చెప్పినా గర్భిణి పొదలకూరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా తమకు చెప్పిందని తెలిపారు. 108 సిబ్బంది చెప్పినట్లు వారు నేరుగా నెల్లూరుకు వెళ్లినా మధ్యలో ఇంధన సమస్య వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బంధువులు అంటున్నారు. -
ఆస్పత్రి నిర్వాకం; కిడ్నీ చోరీ కలకలం!?
సాక్షి, హైదరాబాద్ : మలక్పేటలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ రోగి కడుపులో ఉన్న గడ్డతో పాటు కిడ్నీ తొలగించడంతో కలకలం రేగింది. వివరాలు.... హయత్నగర్కు చెందిన శివ ప్రసాద్(29) అనే వ్యక్తి కడుపులో గడ్డ ఉందని వారం రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో అతడి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ఆస్పత్రి వర్గాలు నిన్న(సోమవారం) గడ్డను తొలగించామని పేర్కొన్నాయి. అయితే గడ్డతో పాటు శివ ప్రసాద్ కిడ్నీ కూడా తొలగించామంటూ మంగళవారం వైద్యులు చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఈ క్రమంలో ఎవరికీ చెప్పకుండా అసలు ఇలా ఎందుకు చేశారంటూ శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. శివ ప్రసాద్ కిడ్నీ చోరీ చేశారంటూ నిరసన చేపట్టారు. కాగా శివ ప్రసాద్ శరీరంలో ఇన్ఫెక్షన్ సోకినందు వల్లే కిడ్నీ తొలగించామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శివప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫోన్ కొట్టు.. రూ.వెయ్యి పట్టు
వైఎస్ఆర్ జిల్లా,ప్రొద్దుటూరు క్రైం : ప్రైవేట్ అంబులెన్స్కు సమాచారమిస్తే రూ.500.. ప్రైవేట్ ఆస్పత్రులకు ఫోన్ చేస్తే రూ. 1000–రూ.1500. పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించిన నజరానాలు ఇవి. వీటికి ఆశపడిన కొందరు జిల్లా ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది కేసులు రాగానే వారికి సమాచారమిస్తున్నారు. ఫోన్లు చేయడానికి ఒక్కోసారి వీరి మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో నిత్యం కమీషన్ల దందా జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వచ్చిన ప్రతి యాక్సిడెంట్ కేసు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తోంది. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది దగ్గరుండి మరీ పంపిస్తున్నారు. రాజుపాళెం మండలంలోని వెలవలి గ్రామానికి చెందిన అల్లామి అనే బేల్దారి బైక్లో మంగళవారం ప్రొద్దుటూరుకు వస్తున్న సమయంలో ఉప్పవాగు వంక వద్దకు రాగానే ఎదురుగా మరో బైక్ తగిలి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతని కాలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రైవేట్ ఆస్పత్రి ప్రతినిధి క్షణాల్లో ప్రత్యక్షం.. గాయపడిన అతనికి జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసేలోపే గాంధీరోడ్డులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వ్యక్తి జిల్లా ఆస్పత్రిలోని క్యాజువాలిటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న కొందరు సిబ్బంది ‘ఇక్కడ వైద్యం సరిగా ఉండదు.. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండి.. అక్కడ ఆరోగ్యశ్రీ కూడా ఉంది’ అని గాయపడిన వ్యక్తి బంధువులకు సూచించారు. మేమే ఫోన్ చేస్తాం.. వాళ్ల అంబులెన్స్లో తీసుకొని వెళ్తారని చెప్పారు. వారి సూచన మేరకు అల్లామి బంధువులు సరేనని అన్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్లో అతన్ని బయటికి పంపించారు. ఈ దందా ఈనాటిది కాదు. రోజు ఇలాంటి ఎన్నో కేసులను ఆస్పత్రి సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ప్రైవేట్æ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. దీంతో ఇటీవల కొన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కేసులు బాగా తగ్గిపోయాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గర్భిణి మృతి
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆమె తరఫు బంధువులు ఆస్పత్రి ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్లసంకీస గ్రామానికి చెందిన గుగులోతు ఉమ (25) ఏడు నెలల గర్భవతి. కడుపులో నొప్పిగా ఉండటంతో ఈ నెల 8న ఆమెను కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులపాటు వైద్య సేవలందించారు. 10న స్నేహ డయాగ్నస్టిక్స్లో స్కానింగ్ చేయించగా.. పరిశీలించిన వైద్యులు ఆమె పరిస్థితి బాలేదని, వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. ఆమెను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు కడుపులో పిండం కదలిక లేకపోవడంతో ఆమె శరీరం విషతుల్య మైందని చెప్పారు. బతకడం కష్టమని చెప్పగా.. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. దీనికి ఖమ్మం ఆస్పత్రి వైద్యులే కారణమని ఆమె కుటుంబీకులు నిర్ధారణకు వచ్చి మృతదేహాన్ని తరలించి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
జ్వరమొచ్చిందని వెళ్తే..
వైద్యుల కమీషన్ల కక్కుర్తి.. డయోగ్నోసిస్ సెంటర్ల తప్పుడు రిపోర్టులు రోగులనుఅప్పులపాలు చేయడంతో పాటు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కుమార్తెకు జ్వరంగా ఉందని వైద్యుడి వద్దకు తీసుకెళ్లిన ఓ తండ్రికి తణుకులో చేదు అనుభవం ఎదురైంది. కమీషన్ కోసం వైద్యుడు ఎడాపెడా వైద్య పరీక్షలు రాయగా.. ల్యాబ్ నిర్వాహకులు తప్పుడు రిపోర్టు ఇచ్చారు. దీనిపై బాధితుడు డీఎంహెచ్ఓను ఆశ్రయించాడు. పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: తణుకు పట్టణంలో ప్రైవేట్ వైద్యం మరోసారి వివాదాస్పదమైంది. కమీషన్ల కోసం ఓ వైద్యుడు వివిధ రకాల పరీక్షలు రాయగా డయాగ్నోసిస్ నిర్వాహకులు తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. ఆ రిపోర్టులను ఆసరాగా వైద్యుడు మరిన్ని పరీక్షలు చేయించాలంటూ చాంతాడంత జాబితా రాసిచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకులో నివాసముంటున్న పీవీఎస్ రాధాకృష్ణ 19 సంవత్సరాల తన కుమార్తెకు జ్వరం వచ్చి తగ్గడం లేదనే ఉద్దేశంతో పట్టణంలో పాత పోస్టాఫీస్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి గతనెల 16న తీసుకువెళ్లారు. వెంటనే వైద్యుడు వైద్యపరీక్షలు రాసి ఇచ్చారు. రాధాకృష్ణ తన కుమార్తెను పట్టణంలోని ప్రముఖ డయాగ్నోసిస్ సెంటర్లో వైద్యపరీక్షల్లో భాగంగా రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలకు రూ.1,720 బిల్లు కట్టారు. రిపోర్టుల్లో హిమోగ్లోబిన్ 9 గ్రాములు, రక్తంలోని వైట్ సెల్స్ కౌంట్ 47,000 ఉన్నట్లుగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ రిపోర్టులు చూసిన వైద్యుడు వెంటనే చాంతాడంత ట్రీట్మెంట్ రాయడంతో పాటు ఎమర్జన్సీగా ఆసుపత్రిలో జాయిన్ చేయాలని, స్కానింగ్ తదితర పరీక్షలు చేయాలని హడావుడి చేశాడు. దీంతో కంగారుపడిన సదరు తండ్రి మిత్రుడి సూచనల మేరకు మరొక వైద్యుడిని ఆశ్రయించారు. అదే ల్యాబ్లో మళ్లీ పరీక్షలు రిపోర్టుల్లో తేడా వచ్చిన పరీక్షలను మళ్లీ అదే డయోగ్నోసిస్ సెంటర్కు వైద్య పరీక్షలకు పంపించారు. 20 గంటల వ్యవధిలో రెండోసారి చేయించిన పరీక్షల్లో రిపోర్టు నార్మల్గా చూపించగా హిమోగ్లోబిన్ 10.9 గ్రాములు రాగా వైట్సెల్స్ కౌంట్ 10,700లుగా రిపోర్టు ఇచ్చారు. దీంతో రెండో వైద్యుడు జ్వరానికి మందుబిళ్ల వేసుకుంటే సరిపోతుందని ఏ విధమైన చికిత్స అవసరంలేదని తేల్చారు. డీఎంహెచ్ఓకు ఫిర్యాదు ముందు వైద్యుడు రాసిన విధంగా చికిత్స చేయించుకుంటే డబ్బు మాట పక్కనపెట్టినా తన కుమార్తెకు అవసరం లేని వైద్యం చేయడం వల్ల ఏ అనర్థం వచ్చేదోనని బెంబేలెత్తిపోయారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడిని, డయోగ్నోసిస్ సెంటర్ ప్రతినిధులను ప్రశ్నించినా పట్టించుకోపోగా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో గత నెల 18న డీఎంహెచ్ఓ, ఏలూరు వారికి తణుకుకు చెందిన వైద్యుడు, డయోగ్నోసిస్ సెంటర్పై ఫిర్యాదు చేశారు. తపాలా ద్వారా రిజిస్టర్ పోస్టు చేసిన తన ఫిర్యాదు వైద్యాధికారికి అందినప్పటికీ ఇంతవరకు ఎటువంటి విచారణ చేయలేదని బాధితుడు రామకృష్ణ ఆరోపిస్తున్నారు. రిపోర్టుల్లో అంత తేడానా? జ్వరంగా ఉందని తీసుకువెళ్లిన నా కుమార్తె నాడి పరీక్షించలేదు. కనీసం స్టెత్తో కూడా పరీక్ష చేయకుండా ఒకేసారి ఏకంగా రూ.1,720 విలువైన రక్తపరీక్షలు చేయించారు. పరీక్షల్లో కమీషన్లు తప్ప ముందుగా రోగి స్థితి తెలుసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఒకే డయాగ్నోసిస్ సెంటర్లో 20 గంటల్లో రిపోర్టులు ఎందుకు తేడా వస్తాయి? ఆసుపత్రి, డయోగ్నోసిస్ సెంటర్ రెండింటిపై ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు విచారణ చేపట్టకపోవడం దారుణం.– పీవీఎస్ రాధాకృష్ణ, తణుకు విచారణకు ఆదేశించాం తణుకులో ఒక ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు, ఒక డయోగ్నోసిస్ సెంటర్పై వచ్చిన ఫిర్యాదుపై ఒక మెడికల్ ఆఫీసర్ను విచారణ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాను. విచారణలో తప్పులు ధ్రువీకరణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి,డీఎంహెచ్ఓ, ఏలూరు -
నాటక దిగ్గజం మొదలి అస్తమయం
తెనాలి: నటుడు, దర్శకుడు, రచయిత, నాటకరంగ పరిశోధకుడు, ఆచార్యుడు ‘కళారత్న’ మొదలి నాగభూషణశర్మ (84) మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో కన్నుమూశారు. నాజరు పేటలోని మల్లాదివారి వీధిలో నివసిస్తున్న నాగభూషణశర్మ, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఆయనకు ఇద్దరు కుమారులు. బుధవారం సాయంత్రం బుర్రిపాలెం రోడ్డులోని శ్మశానవాటికలో ఆంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సతీమణి సరస్వతి 2015లో మృతిచెందారు. ఏపీ నాటక అకాడమీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, వివిధ కళాసంస్థల నిర్వాహకులు, కళాకారులు నాగభూషణశర్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏడు పదుల కాలం తన జీవితాన్ని నాటకకళ, నాటక రచన, పరిశోధన, బోధనకు అంకితం చేసిన నాగభూషణశర్మ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేస్తూనే నాటకకళపై అభిరుచితో, అమెరికా వెళ్లి మాస్టర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (థియేటర్) చేశారు. నాటకరంగ సేవలకుగానూ ఈనెల 6న తెనాలిలో అజో–విభొ–కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు. -
ఆరోగ్యశ్రీ రోగుల నుంచి డబ్బు వసూలు
సాక్షి, హైదరాబాద్: అతని పేరు సీహెచ్ సంజు... హైదరాబాద్కు చెందిన అతని చేతులు, కాళ్లు, నాలుక పక్షవాతానికి గురయ్యాయి. దీంతో అతన్ని గతేడాది జూలై 12న లక్డీకాపూల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతనికి బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. ఆరోగ్యశ్రీ కిందే కేసును రిజిస్టర్ చేశారు. కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయడం సాధ్యంకాదని అతని నుంచి ఏకంగా రూ.6.30 లక్షలు ఒత్తిడి చేసి మరీ వసూలు చేశారు. ఆమె పేరు జంగమ్మ... భువనగిరి జిల్లాకు చెందిన ఆమె కిడ్నీలో రాళ్ల సమస్యతో దిల్సుఖ్నగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద రోగిని చేర్చుకున్నారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసినట్లు వైద్యులు ప్రకటించినా, ఎక్కడా ఆపరేషన్ చేసిన గుర్తులు లేవు. దీనిపై నిలదీయగా అప్పటికప్పుడు ఆమెను పిలిపించి బ్లేడ్తో పక్కటెముక వద్ద కోసి వెంటనే కుట్లు వేశారు. ఎలాంటి మత్తుమందు కూడా ఇవ్వలేదు. ఫొటోలు తీసుకొని బయటకు పంపించారు. దీనిపై విచారణ చేయగా ఆస్పత్రిదే తప్పని తేలింది. చికిత్స చేయకుండానే వారు ఆరోగ్యశ్రీ కింద సొమ్ము చేసుకున్నారు. ఇలా రాష్ట్రంలో అనేక ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ రోగులను మోసం చేస్తూ నుంచి డబ్బులు గుంజుతున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇలా 200 మంది మోస పోయినట్లు విజిలెన్స్ నిర్ధారించినట్లు సమాచారం. ఆస్పత్రులకు అండగా అధికారులు.. 200 మంది ఆరోగ్యశ్రీ రోగులను మోసం చేయడం, వారి నుంచి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే అవకాశమున్నా రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం నేరం. అలాచేస్తే రోగి నుంచి వసూలు చేసిన సొమ్ములో ఐదు రెట్ల వరకు ఆస్పత్రికి జరిమానా విధించాలి. కానీ అనేక కేసుల్లో అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమయ్యారు. కొన్ని కేసుల్లో బాధితులకు వారు చెల్లించిన సొమ్మును ఇప్పించి ఊరుకున్నారు. ఉదాహరణకు బాధితుని నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తే ఆస్పత్రిపై రూ.30 లక్షల జరిమానా విధించాలి. కానీ బా« దితులకు రూ.6 లక్షలు ఇప్పించి, కొందరు అధికారులు 4, 5 లక్షలు పుచ్చుకొని కేసును మూసేశారన్న ఆ రోపణలూ ఉన్నాయి. తాము అడిగినంత ఇవ్వని ఆ స్పత్రు లపై కఠిన చర్యలు తీసుకుని, ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తూ ఆరోగ్యశ్రీ రోగులను వేధించిన వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులపై శీతకన్ను... ఇదిలావుంటే నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులను చులకనగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి కేటాయించే వార్డులు, అందించే వైద్యం విషయంలో నాణ్యతా లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. రోగులనుంచి తీసుకుంటే ఊరుకోవడంలేదు. కాబట్టి అంతకంటే ఎక్కువ సౌకర్యాలు ఏం కల్పించగలం అన్న భావన ఆస్పత్రి వర్గాల్లో నెలకొంది. ఇవన్నీ తెలిసినా ఆరోగ్యశ్రీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ నెట్వర్క్ ఆస్పత్రుల సొమ్ము చేసుకునే కేంద్రాలుగా భావిస్తూ లక్షలు గడిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
ప్రైవేటు ‘పైసా’చికం..
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: స్వైన్ఫ్లూ భయం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పికే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల్లో నెలకొన్న భయాన్ని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ‘పైసా’చికంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే ప్లూను నిర్ధారించే అవకాశం ఉన్నా పలు కార్పొరేట్ ఆసుపత్రులు నమూనాలు సేకరిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పేరుతో రోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ రోగులను భయాందోళనకు గురి చేసి చికిత్సల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. అమలాపురానికి చెందిన ఓ మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే ఆమెను భర్త, బంధువులు స్థానికంగా చూపించారు. నాలుగు రోజుల తరువాత కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనుమానిత స్వైన్ఫ్లూ పేరుతో చికిత్సలు అందించి సుమారు రూ. 2.5 లక్షలకు పైగా బిల్లు వసూలు చేశారు. స్వైన్ఫ్లూ పేరుతో రోగుల నుంచి ఎంతలా డబ్బులు గుంజుతున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అదే విధంగా రాజమహేంద్రవరంలో ఇద్దరు వ్యక్తులకు వ్యాధి సోకడంతో వారి నుంచి కూడా భారీగా సొమ్ములు గుంజినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో స్వైన్ఫ్లూ కోసం ప్రత్యేక వార్డును కేటాయించినా దీనికి రక్షణ లేకపోవడంతో రోగులు, వారితో ఉన్న సహాయకులు సైతం ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ డయాలసిస్ పేరుతో బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగి వచ్చినట్టే వచ్చి కనిపించకుండా పోవడం, ఆ తరువాత అధికారులు వెతికి అల్లవరం మండలం కొమరిగిరిపట్నం కొడప నుంచి తిరిగి కాకినాడ జీజీహెచ్కు తీసుకురావడం తెలిసిందే. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని, ప్లూ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉన్నా జిల్లా వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదు. స్వైన్ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు అవుతుండడంతో ఇదే అదనుగా పలు కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి తెర తీస్తున్నాయి. చిన్నపాటి జలుబు, దగ్గు, గొంతునొప్పినే స్వైన్ఫ్లూగా అనుమానించి పరీక్షలు చేసి డబ్బులు గుంజుతున్నారు. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు పరీక్షలకు రూ.పది వేలు వరకు ఖర్చవుతోంది. ఇక స్వైన్ఫ్లూ ఉన్నట్టు తేలితే ఇక రోగులకు చుక్కలే. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన నమూనాలను కాకినాడ జీజీహెచ్లో ఉచితంగా పరిశీలిస్తారు. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఒక్కోదానికి రూ.3,500 నుంచి రూ.ఐదు వేలు వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. వైద్యపరంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను అనుమానాస్పద స్వైన్ఫ్లూ కేసుగా అడ్మిట్ చేసుకుని వైద్యం ముసుగులో దోచుకుంటున్నారు. కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన ఆమెకు రోజుకు రూ.13వేలు ఫీజు రూపంలో, రూ.12 వేలు మందుల రూపంలో దాదాపు పది రోజుల పాటు వసూలు చేశారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ‘వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా’ సోకడంతో ఆమెను శనివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్లోని ఆర్ఐఎస్యూలో చికిత్స నిమిత్తం తరలించారు. వారి చేతిలో మోసపోవద్దు చాలా ప్రాంతాల్లో ప్రజలకు స్వైన్ఫ్లూపై సరైన అవగాహన లేదు. హైజిన్ లోపం, పిల్లలకు ఇమ్యూనైజేషన్ సరిగా చేయించకపోవడం, గాలి వెలుతురు సోకని గదుల్లో ఎక్కువ మంది నివసిస్తుండడమే ఫ్లూ విస్తరణకు కారణం. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడడానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ తేడా ఉంది. ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. కానీ కొన్ని ఆసుపత్రులు అవసరం లేకపోయినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాకినాడ జీజీహెచ్లో ప్రత్యే క వార్డులను ఏర్పాటు చేశాం. ఇక్కడ రోగులకు అన్ని రకాల సేవలు ఉచితంగా అందిస్తుంది. జ్వ రం, జలుబుతో ఆందోళన చెంది ప్రైవేటు ఆసుపత్రుకు పరుగులు తీసి, వారి చేతిలో మోసపోవద్దు. డాక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, స్వైన్ఫ్లూ నోడల్ అధికారి, జీజీహెచ్, కాకినాడ -
వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి!
శ్రీకాకుళం, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు: కడుపులో బిడ్డతో ప్రసవానికి వచ్చిన ఆ గర్భిణికి మరణమే శరణమైంది. సకాలంలో వైద్యసేవలందకపోవడంతో మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన శుక్రవారం కాశీబుగ్గలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు పంచా యతీ బొర్రాతోట గ్రామానికి చెందిన బొర్రా కామయ్య కుమార్తె సౌజన్య(28)ను విశాఖకు చెందిన కర్రి రవికుమార్తో వివాహం చేశారు. నెలలు నిండటంతో కాన్పు కోసం కొన్ని నెలల కిందట స్వగ్రామం వచ్చింది. ఈమె కాశీబుగ్గలోని కావ్యనర్సింగ్ హోమ్లో నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ప్రసవం సమయం సమీపించడంతో కాన్పు కోసం ఆస్పత్రికి రాగా ఇంకొన్ని రోజులు ఆగాలంటూ వైద్యురాలు స్వరాజ్యలక్ష్మి వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజులు కిందట కడుపులో బిడ్డ కదలికలు లేవని తెలపగా, ఏమీ కాదంటూ పంపించేశారు. తిరిగి రెండు రోజులు క్రితం వచ్చిన ఆమెకు కడుపులో బిడ్డ చనిపోయినట్లు వైద్యురాలు తెలిపింది. ఆపరేషన్ చేసి బిడ్డ మృతదేహాన్ని తొలగించాలని కోరినా స్పందించలేదు. చివరకు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ చేస్తుండగా పరి స్థితి విషమించి సౌజన్య మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహోద్రక్తులయ్యారు. వైద్యుల తీరును నిరసిస్తూ బంధువులతో కలిసి నర్సింగ్ హోమ్ వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన గర్భిణికి కూడా ఇదే మాదిరిగా కడుపులో బిడ్డ మరణించడం గమనార్హం. సమయమే లేదట.. కాశీబుగ్గ కావ్యనర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ కణితి కేశవరావు, స్వరాజ్యలక్ష్మిలు గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారు. తర్వాత కాశీబుగ్గలో ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించి సొంతంగా మందులు దుకాణం పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. తర్వాత అధికార పార్టీ నేతల పలుకుబడితో స్వరాజ్యలక్ష్మి తిరిగి పలాస సామాజిక ఆస్పత్రిలో చేరి ప్రసూతి వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. -
స్వైన్ స్వైప్
సాక్షి, సిటీబ్యూరో: స్వైన్ఫ్లూ భయం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల నగరంలో స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పికే ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల్లో నెలకొన్న భయాన్ని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే ఫ్లూను నిర్ధారించే అవకాశం ఉన్నప్పటికీ..పలు కార్పొరేట్ ఆస్పత్రులు నమూనాలు సేకరిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పేరుతో రోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. నిజానికి గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ రోగులను భయాందోళనకు గురిచేసి చికిత్సల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన తల్లిని చికిత్స కోసం ఇటీవల మలక్పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా, అనుమానిత ఫ్లూ పేరుతో చికిత్సలు అందించి రూ.3.50 లక్షలకుపైగా బిల్లు వసూలు చేశారు. స్వైన్ఫ్లూ పేరుతో రోగుల నుంచి ఎంతలా డబ్బులు గుంజుతున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అనుమానాస్పద కేసు అంటూ... గ్రేటర్హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 125 కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 101 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఫ్లూ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. సాధారణంగా క్లోజ్ కాంటాక్ట్లో త్వరగా విస్తరించాలి. కానీ ఇప్పటి వరకు నగరంలో నమోదైన పలు కేసులను పరిశీలిస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకే ఇంట్లో వారు కాకుండా ఆ ఇంటికి చుట్టుపక్కల నివసించే పిల్లలు, వృద్ధులు, గర్భిణులు త్వరగా ఫ్లూ బారినపడుతున్నారు. డబీర్పుర–9, మలక్పేట్–9, ముషీరాబాద్–6, కుత్భుల్లాపూర్–4, కింగ్కోఠి పరిధిలో 6 చొప్పున స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదవడం విశేషం. ప్రస్తుతం గాంధీలో పది మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన పలు కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి తెర తీస్తున్నాయి. చిన్న పాటి జలుబు, దగ్గు, గొంతు నొప్పినే స్వైన్ఫ్లూగా అనుమానించి పరీక్షలు చేయిస్తున్నాయి. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు...పరీక్షలు ఇతరాల కింద రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. ఇక స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలితే ఇక రోగులకు చుక్కలే. నిజానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేకరించిన నమూనాలను నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో ఉచితంగా పరీక్షిస్తారు. అదే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే పరీక్షలకు ఒక్కో దానికి రూ.3,500 ఛార్జీ చేస్తుంటారు. వైద్యపరంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను అనుమానాస్పద స్వైన్ఫ్లూ కేసుగా అడ్మిట్ చేసుకుని వైద్యం ముసుగులో దోచుకుంటున్నారు. ఫ్లూ వ్యాపిస్తుంది ఇలా... హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఫ్లూ కారక వైరస్ వాతావరణంలోకి ప్రవేస్తుంది. ఇలా వాతావరణంలోకి చేరిన వైరస్ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు జీవిస్తుంది. సాధారణంగా ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు జనసమూహంలోకి వెళ్లకపోవడమే ఉత్తమం. అనివార్యమైతే ముక్కుకు మాస్క్ ధరించాలి. ఫ్లూ సోక కుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్ర త పాటించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పు డు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పి ల్లలకు విధిగా ఈ అలవాటు నేర్పించాలి. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే... ♦ దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం. ♦ 101, 102 డిగ్రీల జ్వరం ♦ ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ ♦ తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు ♦ మూడు రోజులు కంటే ఎక్కువ వేధిస్తే ఫ్లూగా అనుమానించాలి ఉస్మానియా ఆస్పత్రిలో7 స్వైన్ఫ్లూ కేసులు అఫ్జల్గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 7 సైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. గత జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 18 మంది అనుమానితులు ఆస్పత్రిలో అడ్మిట్ కాగా వారందరికి సైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో ఏడుగురికి సైన్ ఫ్లూ సోకినట్లు తేలిందన్నారు. వీరిలో ముగ్గురు చనిపోయారని, మరో ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారని తెలిపారు. మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారన్నారు. వీరందరికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ రోగుల కోసం ప్రత్యేక వార్డును సైతం ఏర్పాటు చేశామన్నారు. వారి చేతిలో మోసపోవద్దు చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఫ్లూపై సరైన అవగాహన లేదు. బస్తీల్లో నిరక్షరాస్యతకు తోడు హైజిన్ లోపం, పిల్లలకు ఇమ్యునైజేషన్ సరిగా చేయించకపోవడం, గాలి వెలుతురు సోకని గదుల్లో ఎక్కువ మంది నివసిస్తుండటమే ఫ్లూ విస్తరణకు కారణం. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ తేడా ఉంది. ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. కానీ కొన్ని ఆస్పత్రులు అవసరం లేకపోయినా పరీక్షలు నిర్వహి స్తున్నాయి. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అనుమానాస్పద ఫ్లూ కేసుగా నమోదు చేసుకుని చికిత్స చేస్తున్నాయి. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఇక్కడ రోగులకు అన్ని రకాల సేవలు ఉచింతంగా అందిస్తుంది. జ్వరం, జలుబుతో ఆందోళన చెంది ప్రైవేటు ఆస్పత్రు లకు పరుగులు తీసి, వారి చేతిలో మోసపోవద్దు.– డాక్టర్ శ్రీహర్ష, స్వైన్ఫ్లూకో ఆర్డినేటర్, హైదరాబాద్ జిల్లా -
అమృత్సర్ ప్రమాదం : డబ్బులు అడుగుతున్న వైద్యులు
అమృతసర్ : దసరా పండుగ నాడు రావణ దహనం సందర్భంగా పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఆదేశించినప్పటికి లాభం లేకుండా పోయింది. రైలు ప్రమాద బాధితుల పట్ల ప్రైవేట్ ఆస్పత్రుల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటూ ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన జనాలు ప్రమాదం చోటు చేసుకున్న జోడా ఫాటక్ రైల్వే ట్రాక్ మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల వచ్చి నిరసనకారులను శాంతింపచేసి అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అంతేకాక ఎవరైనా బాధితుని వద్ద నుంచి ప్రైవేట్ ఆస్పత్రి వారు డబ్బు వసూలు చేస్తే, దాన్ని తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. శుక్రవారం నుంచి వైద్యం పొందుతున్న రైలు ప్రమాద బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
మూడు రోజులు.. ఇంకా కోమాలోనే మాధవీలత !
ఒంగోలు /చీమకుర్తి: మండల పరిధిలో మూడురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిడసల మాధవీలత, కుమారుడు జనార్దన్లు ఇంకా కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం రిమ్స్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 8న పేర్నమిట్ట శాంతినగర్కు చెందిన మాధవీలత, కొడుకు, కూతురు కూల్డ్రింక్లో పురుగుల మందును కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కూతురు విజయలక్ష్మి అప్పుడే మృతిచెందగా మాధవీలత, జనార్దన్ మృత్యువుతో పోరాడుతున్నారు. శరీరంలో పురుగుల మందు ప్రభావం కనీసం వారం రోజుల వరకు ఉంటుందని వైద్యం చేస్తున్న డాక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని వారం రోజులు గడిస్తేగాని వారి ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నట్లు తాలూకా సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్నోట్ను నిపుణులచే పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మాధవీలత ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొంతమందికి ఇవ్వాల్సిన చిన్న అప్పులను కూడా పిలిచి ఇచ్చినట్లు, అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ముందే అనుకుని ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు సీఎంను, కలెక్టర్ను అడ్రెస్ చేస్తూ తన భర్త చనిపోవడానికి గల కారకుల పేర్లను సూసైడ్నోట్లో రాసి ఉంచటమే కాకుండా మాధవీలత చేతుల మీదకూడా వారి పేర్లు రాసినట్లు చెప్పుకుంటున్నారు. -
శవానికి చికిత్స..!
-
శవానికి మూడు రోజుల చికిత్స..
చెన్నై : ఈ భూమ్మిద మనం గట్టిగా నమ్మేది ఒక వైద్యులను మాత్రమే. అందుకే డాక్టర్లను దేవుడిగా అభివర్ణిస్తాం. కానీ కొన్ని ఘటనలు మాత్రం వైద్యులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. డబ్బు ఆశతో చచ్చిన శవానికి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి సీన్ చిరంజీవి ‘ఠాగుర్’ లో చూశాం. తాజాగా అలాంటి ఘటననే నిజజీవితంలో జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని చనిపోయిన మూడు రోజులకి కూడా వైద్యం పేరిట లక్షల్లో డబ్బు వసూలు చేశారు. బాధితులు ఆ విషయం కనిపెట్టే లోపు తమకేం తెలియదని చేతులెత్తేశారు. తమిళానాడులోని నాగపట్టినం జిల్లాకు చెందిన శేఖర్కు(55) ఈనెల 9న కడుపునొప్పి రావడంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి చేర్పించారు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఈ నెల 10న తంజావూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ శేఖర్కు ఆపరేషన్ చేయాలని రూ.5లక్షలు ఫీజు చెల్లించాలని డాక్టర్లు సూచించారు. దీంతో శేఖర్ కొడుకు సుభాష్ ఆ మొత్తాన్ని చెల్లించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ మరో రూ.3లక్షలు చెల్లించాలని సిబ్బంది సూచించడంతో సుభాష్కు అనుమానం వచ్చింది. శేఖర్ డిశ్చార్జ్ చేస్తే తాము వేరే ఆసుపత్రికి తీసుకెళ్తామని సిబ్బందిని కోరారు. అందుకు నిరాకరించిన సిబ్బంది తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు. దీంతో శేఖర్ని తంజావుర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శేఖర్ మరణించి మూడు రోజులు అవుతుందని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని అక్కడే పెట్టి ధర్నాకు దిగారు. తమ తండ్రి చనిపోయి మూడు రోజులైనా చెప్పకుండా తమ వద్ద రూ.లక్షలు వసూలు చేశాడని సుభాష్ వాపోయాడు. తమకు అన్యాయం చేసిన ఆస్పత్రి యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమకేమి తెలియదని చేతులెత్తేసింది. తమ ఆస్పత్రికి చెడ్డ పేరు తీసుకురావడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
కాలి నొప్పితో వస్తే కాటికి పంపారు
రాంగోపాల్పేట్: కాలి నొప్పితో బాధపడుతూ సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వస్తే వైద్యులు ఏకంగా కాటికే పంపారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాలకు చెందిన యాదయ్య (38) గత కొద్ది రోజుల నుంచి వాస్కులర్ సమస్యతో బాధపడుతున్నాడు. కాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన అతను వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ను సంప్రదించాడు. గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాళంలో క్యానర్స్ గడ్డ ఉన్నందున శస్త్ర చికిత్సచేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.4లక్షలు ఖర్చవుతుందన్నారు. యాదయ్య ఈ నెల 24న రూ. 3 లక్షలు చెల్లించి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 25న అబ్జ్వర్వేషన్లో ఉంచిన వైద్యులు 26న శస్త్ర చికిత్స చేశారు. రాత్రి 9గంటల సమయంలో యాదయ్య చనిపోయినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరుదైన కేసు: ఆస్పత్రి యాజమాన్యం యాదయ్యకు సంబంధించి అరుదైన క్లిష్టమైన కేసు. 1996 నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం 22 కేసులు మాత్రమే గుర్తించారు. గుండె నుంచి రక్తం సరఫరా చేసే ప్రదాన రక్త నాళంలో క్యాన్సర్ గడ్డ ఉంది. ఇలాంటి కేసుల్లో శస్త్ర చికిత్స చేసినా బతకడం కష్టం. కీ విషయాన్ని బంధువులకు ముందుగానే చెప్పాము. -
డబ్బు కట్టి మృతదేహం తీసుకెళ్లండి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఆదాయమే లక్ష్యంగా రోగులను, వారి బంధువులను కష్టాలకు గురి చేస్తున్నారు. కేజీహెచ్ ఓపీ గేట్కు అత్యంత సమీపంలో ఉన్న ఆదిత్య మల్టీకేర్ ఆస్పత్రి వైద్యులు ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. మృతురాలి తల్లి, భర్త, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సీపట్నం సమీప రోలుగుంట మండలం, రాజన్నపేట గ్రామానికి చెందిన నమ్మి లోవ (30)ను అనారోగ్యంతో ఈ నెల 22న సాయత్రం 5 గంటల ప్రాంతంలో ఆదిత్య మల్టీకేర్లో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది. అయితే రూ.62వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని, చెల్లించకపోతే మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగకుండా అదే గదిలో లోవ బంధువులను నిర్బంధించారు. డబ్బు కడితేగానీ బయటకు పంపేదిలేదని చెప్పడంతో వీరంతా హతాశులయ్యారు. రెక్కాడితేకాని డొక్కాడని, అక్షరం ముక్క రాని తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. అనంతరం రూ.20 వేలు చెల్లించిన తరువాతనే గదిలో నిర్బంధించి ఉన్న వారిని బయటకు పంపారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రూ.65 వేలు చెల్లించామని చెప్పారు. తమ వద్ద డబ్బు లేదని, మృతదేహాన్ని ఇస్తే తమ ఊరు వెళ్లిపోతామని బాధితులు విలపిస్తున్నారు. మృతదేహం ఇవ్వమంటున్నారు ఆస్పత్రిలో చేర్పించినప్పుడు జ్వరంతో ఉందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని వైద్యులు చెప్పారు. ఐదు రోజులు వైద్యం అందించి ఇప్పుడు చనిపోయిందని చెబుతున్నారు. నా కూతురి మరణంతో ఇద్దరు బిడ్డలు తల్లిలేని వారయ్యారు. ఆస్పత్రికి చెల్లించిన డబ్బుతో పాటు ఇంకా చెల్లించాలని, లేకపోతే మృతదేహాన్ని ఇవ్వమని చెబుతున్నారు. – ఎం.మారేశమ్మ, మృతురాలి తల్లి -
డెంగీతో వైద్యాధికారి మృతి
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాథమిక వైద్యాధికారి కామెర రశ్పాల్ (26) డెంగీ వ్యాధికి బలయ్యారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస వదిలారు. కోటపల్లి మండలం మల్లంపేటకు చెందిన రశ్పాల్కు వారం క్రితం జ్వరం రాగా స్వీయ చికిత్స చేసుకున్నా తగ్గలేదు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రక్తకణాల సంఖ్య పూర్తిగా తగ్గడంతో ప్లేట్లెట్స్ ఎక్కించినప్పటికీ కోలుకోలేదు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. సోమవారం రాత్రి కరీంనగర్కు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. పెళ్లి అయిన మూడు నెలలకే.. రశ్పాల్కు మూడు నెలల కిందట ప్రగతితో వివాహం జరిగింది. పెళ్లి అయిన మూడు నెలలకే రశ్పాల్ మరణించడంతో మల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రశ్పాల్ కష్టపడి చదివి డాక్టర్ కొలువు సాధించాడని, అతడి లక్ష్యం ఐఏఎస్ అని, అది నెరవేరకుండానే మరణించాడని మృతుడి తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. కాగా, చికిత్స సమయంలో డబ్బులు లేకపోవడంతో తోటి డాక్టర్లు తలా కొంత జమ చేసి చికిత్సకు తోడ్పాటు అందించారు. -
కడుపు నొప్పి అని వెళ్తే.. పిచ్చోడిని చేశారు!
సాక్షి, విజయవాడ : కడుపు నొప్పి అని వెళ్లిన ఓ వ్యక్తికి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు ఓ ప్రయివేట్ ఆసుపత్రి వైద్యులు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన బాజీ.. కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రయివేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ నెల 26న ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ అనంతరం బాజీ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాజీని పరిశీలించిన గుంటూరు వైద్యులు.. ఆపరేషన్ సమయంలో ఎనస్తీషియా ఎక్కువ కావడంతో అది మెదడు మీద ప్రభావం చూపిందని తెలిపారు. ప్రస్తుతం అతని పరస్థితి విషమించిందని, మరో ఆపరేషన్ చేయడానికి కుదరదని పేర్కొన్నారు. ఎనస్తీషియా డోస్ ఎక్కువ కావడంతోనే ఆపరేషన్ కష్టంగా మారిందన్నారు. దీనికి కారణమైన ఆ ప్రయివేట్ ఆసుపత్రి యాజమాన్యంపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.