![CM YS Jagan review with authorities on Pulivendula constituency development - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/4/STS_8072.jpg.webp?itok=an1jQHBb)
పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్గ్రిడ్ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్–2019లో కడపకు చెందిన ఆర్.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment