Pulivendula
-
పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ
-
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
వేంపల్లికి చెందిన ప్రకాష్ పై బీటెక్ రవి అనుచరుల దాడి
-
పులివెందుల టీడీపీలో బయటపడ్డ వర్గపోరు
-
పులివెందులలో బైరెటిస్ కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
-
పులివెందులలో వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
-
పులివెందులలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ నివాళి
-
విద్యుత్ అధికారికి YS అవినాష్ రెడ్డి వినతి పత్రం.. దీనిపై చర్యలు తీసుకోండి
-
కొత్త జంటను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
పులివెందుల : కొత్త జంటకు వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదం (ఫొటోలు)
-
పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో జనం సమస్యలు విన్న వైఎస్ జగన్
-
ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. జగనన్న ఎప్పుడూ ప్రజా నాయకుడే
-
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం
సాక్షి ప్రతినిధి, కడప : ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు.. ఆరు నెలల్లోనే ఇదివరకెన్నడూ లేనంతంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రశ్నించిన వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. అందువల్ల ప్రజల గొంతుకగా మనం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశి్నద్దాం.. నిలదీద్దాం. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధమవ్వండి. ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను..’ అని భరోసా ఇచ్చారు. కష్టాలు కొద్ది కాలమేనని.. ఆ తర్వాత మన టైమ్ వస్తుందని ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అధికార అండ చూసుకుని ఆ పార్టీ నేతలు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్య పడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదని భరోసా కల్పించారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథా ఎంచుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.పులివెందులలోని క్యాంపు కార్యాలయం గురువారం పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ సూచించారు. వివిధ సమస్యలతో బాధ పడుతున్న పలువురు జగన్ను కలిసి విన్నవించుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచి్చన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ చార్జీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిoదని చెప్పారు. కాగా కుప్పం అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వారిని కట్టడి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ ప్రాంత సర్పంచ్లు, యూత్ వింగ్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఓ అభిమాని గీసిన జననేత చిత్రం ఫొటో ఫ్రేమ్పై జగన్తో సంతకం చేయించుకున్నాడు. జగన్ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవిందురెడ్డి, రమేష్ యాదవ్, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బి అంజాద్భాషా, గడికోట శ్రీకాంత్రెడ్డి, శెట్టిపల్లె రఘురావిురెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్సార్ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్ టీచర్స్ అసోషియేషన్ క్యాలెండర్, డైరీని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వెంకటనాథరెడ్డి, సురేష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రక్తంతో జగనన్న ఫోటో వేసిన అభిమాని..
-
పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో కొనసాగుతోన్న ప్రజాదర్బార్ కార్యక్రమం
-
నాతో సన్నిహితంగా ఉన్న టీడీపీ నాయకులు నాకు చెప్పిన మాట
-
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్కు హాజరైన ప్రజలు, కార్యకర్తలు (ఫొటోలు)
-
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. వినతులు స్వీకరణ
సాక్షి, వైఎస్సార్: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్ జగన్ సూచించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు. -
పులివెందులలో జననేతకు ఘన స్వాగతం
-
జననేతకు నీరా‘జనం’
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందుల–తాతిరెడ్డిపల్లె మార్గంలోని పల్లెల జనమంతా బుధవారం రోడ్డుపైకి వచ్చేశారు.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. తమ అభిమాన నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు.. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వారి అభిమానానికి ముగ్దుడైన వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు 11 గంటలకు బయలుదేరారు. అడుగడుగునా అభిమాన జనం పోటెత్తడంతో 30 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు ఏకంగా ఆరు గంటలు పట్టింది. ప్రతి గ్రామం వద్ద రోడ్డుపైకి వచ్చిన ప్రజలు వైఎస్ జగన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకు ఆలయం వద్దకు వచ్చే సరికి ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసింది. వైఎస్ జగన్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోదండరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ మూర్తులకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. కాగా, ఈ ఆలయానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.34 లక్షలు మంజూరు చేశారు. పేరు పేరునా ఆత్మీయ పలకరింపు తాతిరెడ్డిపల్లెకు బయలు దేరిన మాజీ సీఎం వైఎస్ జగన్.. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కర్నపాపాయపల్లెలో నాగశేషులరెడ్డి కన్పించలేదు. ఆయన గురించి వాకబు చేయడంతో అనారోగ్యంతో ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. అప్పటికప్పుడు నాగశేషులరెడ్డి ఇంటికి వాహనాన్ని మళ్లించారు. ఆయన్ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లింగాలలో సీనియర్ నాయకుడు కొండారెడ్డి కన్పించక పోవడంతో వాహనం దిగి, ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు. ఇలా ప్రతి గ్రామంలో నేతలను పేరు పేరునా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సినీ నటుడు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. పెద్దనాన్న వైఎస్ శివప్రకాష్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, పెద్దమ్మ వైఎస్ భారతమ్మతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మనోహార్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మదన్మోహన్రెడ్డి, వైఎస్ జగన్ సతీమణీ వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ 2025 కేలండర్ను ఆవిష్కరించారు. -
కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్
సాక్షి,పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా బుధవారం లింగాల మండలం తాతిరెడ్డి పల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో రామాలయానికి రూ.34లక్షలు మంజూరు చేశారు. ఇక, వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత రావడంతో ప్రజలు వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ,వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. -
క్రిస్మస్ వేడుకల్లో YS భారతీ
-
పిల్లలతో సరదాగా వైఎస్ జగన్
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
-
4 రోజుల పాటు పులివెందులలో జగన్ పర్యటన
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు సొంత నియోజవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.వైఎస్ జగన్.. రేపు ఉదయం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులతో ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిశాక సాయంత్ర సమయంలో పులివెందుల బయల్దేరుతారు. 25న సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు.26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు27వ తేదీన స్థానికంగా ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అదే మధ్యాహ్నాం పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు -
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారంటూ ధ్వజమెత్తారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించకుండా అడ్డుకున్న హీన చరిత్ర బీటెక్ రవిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అప్రజాస్వామ్యంగా గెలిచిన వీటిని ఎన్నికలు అంటారా..? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీటెక్ రవిని పులివెందుల ప్రజలు ఓడించిన చరిత్ర మరిచిపోయావా? వైఎస్ వివేకా హత్యను రాజకీయంగా వాడుకోకపోతే బీటెక్ రవికి ఆ పార్టీలో మనుగడ కూడా లేదు. మీ సొంత గ్రామంలో ఇప్పటివరకు ఏ ఎలక్షన్లోనూ గెలవని చరిత్ర నీది. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాము’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్
-
అధైర్యపడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పులివెందులలో పార్టీ శ్రేణులు, అభిమానులతో మమేకమయ్యారు. ఉదయం 9.15 గంటల నుంచి ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి తదితరుల వెంట వెళ్లిన కేడర్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిన ఇప్పట్ల గ్రామానికి చెందిన శ్రుతిలయ తన దీననగాథను కుటుంబ సభ్యుల ద్వారా వివరించారు.ఆర్థికంగా కుటుంబం చితికిపోయిందని వారు జగన్ వద్ద వాపోయారు. అదేవిధంగా కడపకు చెందిన ముస్లిం మైనార్టీ దంపతులు వారి కుమార్తె అనారోగ్యాన్ని వివరించి, వైద్య సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన జగన్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ అవినాష్రెడ్డిని ఆదేశించారు.పెద్దనాన్నతో కాసేపు..వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ బుధవారం వెళ్లారు. ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డితో పాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.నూతన జంటలకు ఆశీర్వాదంఇటీవల వివాహాలైన నూతన జంటలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సమీప బంధువు శ్రీధర్రెడ్డి కుమారుడు యశ్వంత్రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. దొండ్లవాగు వైఎస్సార్సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం ఇటీవల జరిగింది. విద్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ నూతన జంట మాధురి, నరేంద్రరెడ్డిని ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
పులివెందులలో రెండో రోజు జనంతో జగన్
-
పులివెందుల ప్రజాదర్బార్లో వైఎస్ జగన్తో ప్రజలు, అభిమానులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్ను కలిసిన ఉల్లి రైతులు.. అన్నదాతల ఆవేదన
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. పులివెందులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు.. వైఎస్ జగన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఉల్లి రైతులు.. వైఎస జగన్ను కలిశారు. ఈ సందర్బంగా వారి కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.రైతులు మాట్లాడుతూ..‘ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదన్నారు. తినడానికి తిండి కూడా లేక మార్కెట్ నుంచి వెనక్కి వచ్చేశామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, మద్దతు ధర లేదా అని వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతవరకూ రైతుకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పిన రైతులు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని వైఎస్ జగన్ వారి హామీ ఇచ్చారు. -
ఎనలేని అభిమానం.. జగన్తో సెల్ఫీలు
-
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్.. కష్టాలు వింటూ.. నేనున్నానంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించారు. భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చర్చించారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
-
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్ జగన్.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు.వైఎస్ జగన్ రేపు వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
వైఎస్ఆర్ జిల్లాలో డిటోనేటర్ల పేలుడు కలకలం
-
AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి
సాక్షి,వైఎస్సార్జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని వేముల కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడులో వీఆర్ఏ నరసింహులు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ మైనింగ్ కోసం దాచి ఉంచిన డిటోనేటర్ల వల్లే పేలుడు జరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ హైటెక్ టీడీపీ నేత బైరెటీస్ అక్రమ మైనింగ్ కోసం ఈ డిటోనేటర్లు తెచ్చినట్లు సమాచారం. ఇలా తెచ్చిన డిటోనేటర్లు వాడి వీఆర్ఏ నరసింహులును హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ సంబంధం నేపథ్యంలో నరసింహులు నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే లెక్కలేదా -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. .. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది... పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం? -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్ఓపీని విత్డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతులు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు. 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్ ఇన్స్పెక్షన్ అనంతరం ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఇవ్వకపోయినప్పటికీ ఎన్ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. -
ధైర్యంగా కష్టాలు ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప : ‘కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులొస్తాయి. ఎవరూ అధైర్యపడొద్ద’ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రెండోరోజు పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, కలిసికట్టుగా అందరం ముందుకెళ్లాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉంద’ని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలి.. పులివెందుల వెంకటప్ప మెమోరియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్–18 గ్రూపు కింద రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సంతోషాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకునేందుకు పులివెందుల క్యాంపు కార్యాలయంలో వారంతా జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ఆయన.. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని, అందుకు ప్రత్యేకంగా తరీ్ఫదు పొందాలని సూచించారు. కష్టపడితే సాధించలేనిది లేదన్న విషయాన్ని జీవితంలో గుర్తుపెట్టుకోవాలని ఉద్భోదించారు. దీంతో.. ‘మీ ఆకాంక్షను నెరవేరుస్తాం సార్’ అంటూ విద్యార్థులు ధీమాగా చెప్పారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోవు కాలం మనదే.. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్ మనదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. -
జగన్కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు..
-
జగన్కు జన నీరాజనం
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల పర్యటనకు వచ్చి న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రాక కోసం రహదారి వెంబడి గంటల తరబడి వేచి ఉండి అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ, వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఎక్కడ కూడా ఇసుమంతైనా విసుగు లేకుండా ప్రజలతో సెల్ఫీలు దిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందులకు వచ్చారు. వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్పోర్టు నుంచి పులివెందుల చేరుకునేందుకు ఆయనకు 9 గంటల సమయం పట్టింది. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు వచ్చిన వైఎస్ జగన్ రాత్రి 8.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. తొలుత తోళ్లగంగనపల్లె వద్దకు పెద్దఎత్తున చేరుకున్న ప్రజానీకం పలకరింపుతో మొదలైన పర్యటన పులివెందుల వరకూ కొనసాగింది. అండగా ఉంటా.. అధైర్యపడొద్దుకడప నుంచి మాచునూరుకు వెళ్లిన వైఎస్ జగన్.. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ మండలశాఖ అధ్యక్షుడు మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీకి ఆ కుటుంబం అందించిన సేవలు గుర్తున్నాయని, దివంగత మాచునూరు చంద్రారెడ్డి తనకు అండగా నిలిచారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటాను, అధైర్యపడొద్దని మాచునూరు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను చూడగానే చంద్రారెడ్డి సతీమణీ లక్ష్మీనారాయణమ్మ బోరున విలపించారు. ఆమెను ఓదార్చిన జగన్.. ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా చేరదీసి చంద్రారెడ్డి సేవలు గుర్తుచేసుకున్నారు. చంద్రారెడ్డి కుమారులు పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి, కోడలు, పెండ్లిమర్రి ఎంపీపీ వరలక్ష్మిలను పలకరించి.. అధైర్యపడొద్దు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. నూతన జంటకు ఆశీస్సులు ఇటీవల వివాహమైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రహాసరెడ్డి కుమార్తె, అల్లుడికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. చంద్రహాసరెడ్డి స్వగ్రామం గొందిపల్లెలో నూతన జంట ఆశా, శివారెడ్డిలకు వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న వివిధ గ్రామాలకు చెందిన నాయకులను పేరుపేరునా పలుకరించి, ఫోటోలు దిగారు.ఎయిర్పోర్టులో ఘనస్వాగతంకడప ఎయిర్పోర్టులో వైఎస్ జగన్కు ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ దాసరి సు«ధ, ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్బాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు జగన్కు స్వాగతం పలికారు. -
నేడు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.శనివారం (ఆగస్ట్31)ఉదయం 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్కి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవనున్నారు. పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడిని మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.అక్కడి నుంచి అదే మండలంలోని గొందిపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె అశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందులలో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
ప్రకృతి సాగులో ప్రపంచ చాంపియన్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచి్చన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్గా నిలిచింది.పోర్చుగల్కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమరి్పంచాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపీసీఎన్ఎఫ్, ఈజిప్్టకు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవ హారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సా«ధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫారి్మంగ్ (జెడ్బీఎన్ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆరి్థక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు.2019లో అధికారంలోకి వచి్చన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్ఎఫ్కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెరి్నంగ్ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకీ సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది.2022–23 ఆరి్థక సర్వేలో నీతి అయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్íÙప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతిని«ధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్లలో సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కని్పస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు..
-
ఆగని అరాచకం.. పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. అర్థరాత్రి వైఎస్సార్ కాలనీలో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. అబ్ధుల్ ఇంట్లో వస్తువులు, బైక్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న అబ్దుల్ మామను తలపై కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే దాడి చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలుచిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త విఘ్నేష్ కనిపించకుండా పోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విఘ్నేష్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్రేగిపోతున్న టీడీపీ నేతలుఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలను అరికట్టాల్సిన పోలీసులు.. ప్రేక్షక పాత్ర పోషించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో హింసా రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల దాకా ప్రశాంతంగా ఉన్న అనంతలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమారుస్తున్నారు. శింగనమల నియోజకవర్గం పుట్లూరు లో ఎరికలయ్య (50), హిందూపురం నియోజకవర్గంలో సతీష్ (40) లపై టీడీపీ దాడులు చేసింది. ఈ ఇద్దరు నేతలు బెంగళూరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు.తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మల్లికార్జున పల్లిలో టీడీపీ వేధింపులకు ఇద్దరు బలయ్యారు. మల్లికార్జునపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శాంతకుమార్పై టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారు. పోలీసులు కూడా విచారణ పేరుతో శాంతకుమార్ను వేధించారు. ఈ మనస్తాపంతో శాంతకుమార్ భార్య మమత (30) ఆరుమాసాల కూతురిని చంపి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేతల దాష్టీకానికి ఇదే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ కదిరి, తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. -
వైఎస్ జగన్ మానవత్వం
-
పులివెందులలో వైఎస్ జగన్.. తరలివచ్చిన జనం (ఫోటోలు)
-
పులివెందులలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జగన్ రాకతో పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో పోటెత్తిన జనం
-
కాసేపట్లో క్యాంపు కార్యాలయానికి వైఎస్ జగన్
-
పులివెందులలో జననేత.. ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగుతూ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫొటోలు)
-
పులివెందుల బయలుదేరిన వైఎస్ జగన్
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
నేనున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తకు జగన్ పరామర్శ
వైఎస్సార్, సాక్షి: టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. కడప రిమ్స్కు వెళ్లి బాధితుడు అజయ్ను కలిసి నేనున్నాను అని ధైర్యం చెప్పారు. వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్కుమార్రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్.. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్కు వెళ్లారు. దాడి జరిగిన విధానం గురించి తెలుసుకున్న ఆయన.. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్పోర్టు వద్ద కోలాహలంఅంతకు ముందు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్కు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ రాకతో ఎయిర్పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, అర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు. ఇక.. తన పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో ఉండనున్న జగన్.. పలువురు కార్యకర్తలు, నేతల్ని కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే వేడుక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. -
YSRCP నేత తల పగలగొట్టిన టీడీపీ గూండాలు
-
బెంగళూరు కు వైఎస్ జగన్
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లా డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలను స్వీకరించారు.సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పులివెందులలో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అందరితోనూ ఓపికగా మాట్లాడారు. పలువురు నేతలను పేరుపేరునా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా జనం భారీగా కనిపించారు. ‘వైఎస్సార్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనం చేసిన మంచి అందరికీ తెలుసు. ప్రజల గుండెల్లో ఉండిపోయింది. తప్పకుండా ప్రజలు మళ్లీ మన వైపే చూస్తారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటాం’ అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రెండు కుటుంబాలకు పరామర్శ పులివెందుల నారాయణ పాఠశాల సమీపంలోని పురుషోత్తం నగర్లో నివాసముంటున్న దివంగత మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు మైఖెల్ వర్ధంతి కార్యక్రమం ఇటీవల జరిగింది. అప్పట్లో రాలేక పోయిన వైఎస్ జగన్.. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి సోమవారం ఉదయం మైఖెల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైఖెల్ సతీమణి అమూల్యారాణి, కుమారుడు వినీత్లను ఓదార్చారు. సమీప బంధువు నర్రెడ్డి సంగిరెడ్డి మృతి చెందారని తెలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డిలు నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి.. సంగిరెడ్డి భార్య సత్యవతి, కుమారులు సుధాకర్రెడ్డి, సునీల్రెడ్డిలను జగన్ దంపతులు ఓదార్చారు. ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతో పాటు చవ్వా సుదర్శన్రెడ్డి, మిట్టా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు. మరోసారి విషం కక్కిన ఎల్లో మీడియాసాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. వైఎస్ జగన్పై కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని ఒక మార్ఫింగ్ వీడియోను వదిలారు. వైఎస్ జగన్ సోమవారం పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసం వద్దకు వందలాదిగా చేరుకున్నారు. జగన్తో మాట్లాడాలని, ఫొటో దిగాలని పెద్ద సంఖ్యలో యువకులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంటి వద్దకు ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది గిట్టని ఎల్లో మీడియా కొద్ది గంటల్లోనే ఈ వీడియోలోని వాయిస్ను మార్చి ‘జగన్ డౌన్ డౌన్..’ అన్నారని నిస్సిగ్గుగా విషం కక్కింది. పులివెందులలో సైతం ఇదే రీతిలో దుష్ప్రచారం చేసి ఖంగుతింది. అయినా పద్ధతి మార్చుకోక బెంగళూరులోనూ అదే వైఖరి ప్రదర్శించి అభాసుపాలైంది. -
పులివెందుల: అభిమాన నేత.. ఉప్పొంగిన ఉత్సాహం (ఫోటోలు)
-
రాబోయే రోజులు మనవే
-
వైఎస్సార్సీపీ నేత సంకిరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించారు. క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఆయన కలిశారు.పులివెందుల పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నాయకులు నివాళులర్పించారు.పులివెందులలో ఇటీవల మృతి చెందిన సమీప బంధువు మైఖేల్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. -
YSRCP నాయకుడు సంకిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ మూడవరోజు పర్యటన