Water grid
-
వాటర్ గ్రిడ్కు ఆద్యులు మహానేత వైఎస్సార్
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. రైతు శ్రేయస్సు లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మ ఇచ్చారు.. ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం పోటీపడి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు.. అడుగడుగునా ఆయన గురుతులతో మదిమదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. బుధవారం ఆయన జయంతి సందర్భంగా మహానేత.. అందుకో మా జ్యోత అంటూ జిల్లావాసులు నివాళులర్పిస్తున్నారు. సాక్షి, ఏలూరు: జిల్లా అభివృద్ధి, గోదావరి వాసుల సంక్షేమం లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషిచేశారు. ఆయన హయాంలో నిత్య సమీ క్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులను అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రూపకల్పన చేసిన పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు జిల్లా గతిని మారుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలుమార్లు జిల్లాకు వచ్చిన ఆయన అడగకుండానే వరాలు ఇచ్చారు. జిల్లా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. జీవనాడి పోలవరం: 2004లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10,151 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేశారు. నిర్వాసితుల ఆందోళనల మధ్య హెడ్వర్క్స్ పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల తవ్వకాలను వేగంగా పూర్తిచేశారు. ఆయన హయాంలో 70 శాతం వరకు కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరంలో రూ.3.75 కోట్లతో నెక్లెస్ బండ్, ముంపు జలాలను గోదావరిలోకి మళ్లించడానికి రూ.58 కోట్లతో కొవ్వాడ అవుట్ ఫాల్స్లూయిజ్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.2,700 కోట్లతో ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని కూడా వైఎస్ ప్రారంభించారు. తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించిన తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాల్లోని 22,348 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాణధార ‘చింతలపూడి’ మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి అందిచేందుకు రూ.1,701 కోట్ల అంచనాలతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. 2008 అక్టోబర్ 30న పథకానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్న ఈ ఎత్తిపోతల పథకం వల్ల 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. పోగొండతో జలకళ బుట్టాయగూడెం మండలంలోని పోగొండ రిజర్వాయర్ను 2008లో రూ.28 కోట్ల అంచనాలతో వైఎస్సార్ మంజూరు చేశారు. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పథకం మంజూరు చేశారు. దీనిద్వారా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో దాదాపు 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ‘ఉద్యాన’ వెలుగులు తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడం ద్వారా యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు కలి్పంచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి రూ.600 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. ఆరోగ్య ప్రదాత మెట్ట ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ జంగారెడ్డిగూడెంలో సుమారు రూ.7.54 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. డెల్టాకు వరాల జల్లు నరసాపురంలో రూ.10 కోట్లతో సుమారు 600 మందికి ఇళ్లు నిర్మించారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరుచేసినా తర్వాత పాలకులు దీనిపై దృష్టి సారించలేదు. అంతర్జాతీయంగా రాణించేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్మెంట్ నిర్మించడానికి ఆయన తీసుకున్న చొరవతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు. ఏలూరుకు వరదల నుంచి విముక్తి ఏలూరులో సుమారు రూ.90 కోట్లతో తమ్మిలేరు ఏటిగట్టును పటిష్ట పర్చడం ద్వారా న గరవాసులకు వరదల నుంచి విముక్తి కలి్పంచారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సుమారు 100 ఎకరాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. వాటర్ గ్రిడ్కు ఆద్యులు పెనుగొండ: జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్కు ఆద్యులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2008లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా డెల్టాలో తాగునీటి సమస్య నివారణకు వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు చేశారు.ఆయన సూచనల మేరకు అప్పటి అత్తిలి ఎమ్మెల్యేగా నేను కసరత్తు చేశాను. దాదాపు రూ.300 కోట్ల అంచనాలు సైతం రూపొందించాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం పథకం అటకెక్కింది. ఇప్పుడు తండ్రి ఆశయాన్ని సీఎం జగన్ పట్టాలెక్కిస్తున్నారు. జిల్లాలో మరో 50 ఏళ్ల పాటు తాగునీటి సమస్య లేకుండా వాటర్గ్రిడ్ను కానుకగా అందించనున్నారు. నాటి కలను నేడు సాకారం చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ఎందరికో ఇళ్ల స్థలాలు అందించారు. అదే స్ఫూర్తితో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్ ఆశయాల మేరకు పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించేలా వాటర్ గ్రిడ్ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతిలో చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ► హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతి అంటే.. కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంకు వడ్డీతోగానీ అంతకంటే తక్కువ వడ్డీరేటుతో లెక్కకట్టి 10–12 ఏళ్ల పాటు చెల్లించడం. ► రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా అవసరమైన నీటిని అందించేందుకు వీలుగా భారీ వాటర్ గ్రిడ్కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ► కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాక, ఫ్లోరైడ్ వంటి సమస్యను పరిష్కరించడంతోపాటు తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీరు కాకుండా కాపాడినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఆరు జిల్లాల్లో.. రోజూ ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంద లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం మేర కాంట్రాక్టర్లకు పనులు చేపట్టే సమయంలో, మిగిలిన 70 శాతం నిధులను 12 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలతో కలిపి మొత్తం ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఏటా 90 టీఎంసీలు అవసరం – వాటర్ గ్రిడ్లో భాగంగా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తం 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ఎలాంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఏడాది పొడవునా నీటి సరఫరాకు 90 టీఎంసీల నీరు అవసరం కాగా నీటి వనరుల కోసం 52 రిజర్వాయర్లను గుర్తించారు. రూ.12,308 కోట్లతో తొలిదశ – శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడంవల్ల కిడ్నీ వ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించనున్నారు. – జీవనది గోదావరి చెంతనే ప్రవహిస్తున్నా.. ఆక్వా సాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. దీంతో మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ఆదుకోనున్నారు. – ఇక.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో ప్రతి ఏటా వందలాది గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోంది. – అలాగే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సున్నపు రాయి నిక్షేపాలు, ఫ్లోరైడ్ కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. మంచినీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తొలి విడతలో ఈ ప్రాంతాలను వాటర్ గ్రిడ్లో ఎంపిక చేశారు. తొలి విడత పనులకు రూ.12,308 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఉద్దానంలో 100 శాతం ప్రభుత్వ నిధులతో.. – రాష్ట్రమంతటా వాటర్గ్రిడ్ ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయించినా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు అందుబాటులో లేక పెద్దఎత్తున నమోదవుతున్న కిడ్నీ జబ్బులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మాత్రం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. మొదలైన టెండర్ల ప్రక్రియ తొలి విడత వాటర్గ్రిడ్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రాథమికంగా మొదలు పెట్టారు. తొలి విడతలో ఆరు జిల్లాలో ఆరు ప్యాకేజీల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టడంపై ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టŠట్) నోటిఫికేషన్ జారీచేశారు. కాంట్రాక్టర్లు తమ ఆసక్తిని తెలియజేసేందుకు ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంది. 16లోగా జ్యుడీషియల్ ప్రివ్యూకు వివరాలు వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు నిర్వహించేందుకు తొలుత జ్యుడీషియల్ ప్రివ్యూకు ఈనెల 16లోగా వివరాలు పంపాలని నిర్ణయించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతి రాగానే జూన్ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించి ఆ తర్వాత పనులను ప్రారంభించేందుకు ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పల్నాడులో తీరనున్న దాహార్తి
మాచర్ల: ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్నాటి గ్రామాల దాహార్తి తీరనుంది. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాలు, 902 గ్రామాలకు మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.2,665 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ గ్రిడ్ అందుబాటులోకి వస్తే మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అన్న మాటే వినిపించదు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ప్రాంతమైన విజయపురిసౌత్లోని మేకల గొంది వద్ద వాటర్ గ్రిడ్ నిర్మించనున్నారు. త్వరలోనే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 34 మండలాలకు లబ్ధిచేకూరే ఈ పథకాన్ని చేపట్టాలని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) కోరడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గిపోయినప్పుడూ ఎండాకాలం సైతం నీటి నిల్వలు రిజర్వాయర్లో ఉన్నప్పుడు ఈ వాటర్ గ్రిడ్లోని పథకాలు చేపట్టేందుకు సర్వేచేయించి పల్నాటి ప్రాంతంలోని ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరిక మేరకు జి.ఓ.నెం. ఈ నెల 16న జారీ చేసి సంబంధిత వాటర్ గ్రిడ్ పధకానికి సంబం«ధించి చేపట్టబోయే పనుల వివరాలను పేర్కొన్నారు. మాచర్ల నియోజక వర్గంలోని 5 మండలాలు, గురజాల నియోజక వర్గంలోని 4 మండలాలు, వినుకొండలో 4, నర్సరావుపేటలో 2, చిలకలూరి పేటలో 3, సత్తెనపల్లిలో 4, పెదకూరపాడులో 4, గుంటూరు రూరల్ లో 3, ప్రకాశం జిల్లాలో 5 మండలాలు ఈ వాటర్ గ్రిడ్ పధకం ద్వారా మంచినీటిని ప్రజలకు అందించటం జరుగుతుందన్నారు. నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి పురపాలక సంఘ కార్యాలయాలకు వాటర్ స్కీంను అనుసంధానం చేస్తారు. విజయపురిసౌత్లోని మేకల గొంది వద్ద మొదటిగా సాగర్ రిజర్వాయర్లో హెడ్ వర్క్స్ నిర్మిస్తారు. అంచనాలను ప్రభుత్వం ఆమోదించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. -
వాటర్గ్రిడ్తో నీటి సమస్యలకు చెక్
పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్గ్రిడ్ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్–2019లో కడపకు చెందిన ఆర్.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు. -
నీటి సమస్యకు పరిష్కారం.. వాటర్ గ్రిడ్
జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో ఇటు ప్రజలు.. అటు రైతాంగం అల్లాడుతోంది. గత పాలకులు ముందు చూపు కొరవడి, ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేని పరిస్థితి. శాశ్వతంగా నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటే దీనికి పరిష్కార మార్గంగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపింది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లా వాసులకు నీటి కష్టాలకు చెక్ పెట్టినట్టే. సాక్షి , నెల్లూరు : జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ఏకైక రిజర్వారుగా సోమశిల ప్రాజెక్ట్ ఉంది. ఏటా ఈ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసి కండలేరు, కనిగిరి, తెలుగుగంగతో ఇతర ప్రధాన కాల్వలకు, జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారు. కండలేరు ద్వారా తిరుపతికి, తెలుగుగంగ ద్వారా చెన్నై నగరాలకు నీటిని తరలిస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో ఐదేళ్లుగా కరువు వెంటాడుతూనే ఉంది. గతేడాది కూడా జిల్లాలో 26 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన క్రమంలో జిల్లాలో తాగునీటి అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించింది. రెండు నెలలుగా ట్యాంకర్ల ద్వారా కరువు మండలాల్లోని 436 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. సమీపంలో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లలో నింపుకొని సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి రైతుకు నెలకు రూ. 9 వేలు చెల్లిస్తోంది. మరో నెల రోజుల పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా కొనసాగే అవకాశం ఉంది. అడుగంటిన 70 శాతం బోర్లు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో జిల్లాలోని 18,500 చేతి పంపుల్లో దాదాపు 70 శాతం నీరులేక నిరుపయోగంగా మారిపోయాయి. వర్షాకాలం వచ్చి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నా.. జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు కురవని పరిస్థితి. ఇదే తరహా ఇబ్బందులు ఏటా జిల్లాలో ఉంటున్నాయి. వీటి అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేలా గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్ అధికారులు, పశు సంవర్థక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు. జిల్లాలోని 46 మండలాలు, 7 మున్సిపాలిటీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పరిశ్రమలకు, పశువులకు అవసరమైన నీటి వినియోగంపై అంచనాలు సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి అవసరాలకు కోసం వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇవ్వడానికి, దానికి అవసరమైన ఏర్పాట్ల నిర్వహణకు సుమారు రూ. 4,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమశిల నుంచి తాగు, పరిశ్రమల నీటి అవసరాలకు 10 టీఎంసీలు ఏడాది పొడువునా అవసరం అవుతాయని గుర్తించారు. జిల్లాలోని అన్ని కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్కు సోమశిల నుంచి నీరు విడుదల కావాల్సి ఉండడంతో సోమశిల నీటి కేటాయింపులపై దృష్టి సారించి ప్రతి ఏటా పది టీఎంసీల వినియోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏటా సోమశిలకు వచ్చే ఇన్ఫ్లో, ఆవుట్ ఫ్లోను పరిశీలించి నీటి కేటాయింపులు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు వాటర్ గ్రిడ్ ద్వారా రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నదే వాటర్ గ్రిడ్ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపారు. తక్షణ అవసరాలపైనా దృష్టి రానున్న ఆరు నెలల కాలంలో కనీనం ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సోమశిలకు నీరు చేరితే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లిలకు కండలేరు ద్వారా, మిగిలిన నియోజకవర్గాల్లోని మండలాలకు సోమశిల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిని కొనసాగిస్తే డెడ్ స్టోరేజ్లో కూడా నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. -
ఔటర్ చుట్టూ జలహారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టూ జలవలయం లా వాటర్గ్రిడ్ను ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 158 కిలోమీటర్ల మార్గంలో విస్తరించిన ఓఆర్ఆర్ చుట్టూ రూ.3 వేల కోట్లతో ఈ వాటర్గ్రిడ్ను నిర్మించనున్నారు. ఇందుకోసం 3,000 ఎంఎం డయా వ్యాసార్థంగల మైల్డ్ స్టీల్తో సిద్ధం చేసిన భారీ మంచినీటి పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమా యత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల నీటిని నగరం నలుచెరగులా సరఫరా చేసేం దుకు వీలుగా ఈ గ్రిడ్ను నిర్మించనున్నారు. ఈ జలవలయం పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మరో మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధంచేసి పనులు మొదలుపెట్టే దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది. భారీ జలవలయం.. దాహార్తి దూరం.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీతోపాటు.. ఔటర్కు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్వేర్ పార్క్లు, నూతనంగా ఏర్పాటుకానున్న టౌన్ షిప్లు, కాలనీలకు 24 గంటలు తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతీ వ్యక్తికి తలసరిగా నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటాడైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వాటర్గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది. ఏ మూలకైనా తరలించేలా.. ఈ నీటిని ఔటర్ లోపల ఏ మూలకైనా తరలించే అవకాశం ఉంది. ఈ గ్రిడ్ వ్యవస్థతో జల మండలి పరిధిలోని 500 స్టోరేజీ రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా జలాశయాల నుంచి వచ్చే నీరు పంపింగ్ అంతగా అవసరం లేకుం డా గ్రావిటీ(భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నేరుగా గ్రిడ్ పైప్లైన్లోకి చేరేలా నేలవాలు అధికంగా ఉండే చోటనే అనుసంధానించనుండటం విశేషం. ఈ వాటర్గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమలులో ఉంది. ఆయా నగరాల అనుభవాలను కూడా పరిశీలించిన తర్వాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. 7 చోట్ల వాటర్గ్రిడ్ జంక్షన్లు.. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాల నీటిని ఈ వాటర్గ్రిడ్ భారీ పైప్లైన్కు అనుసంధానించేందుకు ఔటర్ చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్చెరు వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైప్లైన్కు అనుసంధానించనున్నారు. శామీర్పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్సాగర్,ఉస్మాన్సాగర్ నీటిని కిస్మత్పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మనాగారం(చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేసిన తాగునీరు ఈ గ్రిడ్లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. -
కీలక శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
2 వేల మందిని నియమిస్తామన్న సీఎం సాక్షి, అమరావతి: అన్ని ముఖ్యమైన శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయ డానికి త్వరలో 2 వేల గ్రూప్–1, గ్రూప్–2 నియామకాలు జరుపుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో చేపడుతు న్న పనులపై సీఎం మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వివరాలను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సాధ్యమైనంత త్వరలో ఈ నియామకాలు జరుపుతామని అందులో పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచినీటి వసతి కల్పించేందుకు వాటర్గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం దాని స్థానంలో ప్రత్యేక తాగునీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తు న్నట్టు తాజా సమావేశంలో తెలిపారు. ఈ నెలలో జరిగే కలెక్టర్ల సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. భూవివాదాల పరిష్కారానికి భూసేవ పేరుతో త్వరలో ల్యాండ్హబ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు. ప్రతీ స్థలానికి, పొలానికి భూధార్ పేరుతో యునిక్ ఐడీ నంబర్ను కేటాయిస్తామని చెప్పారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఒక మున్సిపాలిటీ, ఒక మండలంలో అమలు చేసి పరిశీలించాలని సూచించారు. -
‘సాగునీటి’ టెండర్లలో భారీ అక్రమాలు
విచారణకు సభాసంఘం ఏర్పాటు చేయాలి: ఉత్తమ్ ⇒ కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ ⇒ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేస్తున్నారు ⇒ వృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు ⇒ వాయిదాల్లో రుణమాఫీతో రైతులకు అందని రుణాలు సాక్షి, హైదరాబాద్: వాటర్గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, వాటికి కేటాయింపులు చూస్తుంటే కాంట్రాక్టర్ల కోసమే వాటిని చేపడుతున్నారా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానిం చింది. సోమవారం శాసనసభలో ద్యవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. వాటర్గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై సభాసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల తెలంగాణ చేస్తున్నారు రాష్ట్రం ఏర్పాటయ్యాక కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నారని.. మూడేళ్లలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటాయని ఉత్తమ్ పేర్కొ న్నారు. ఇవేగాక కార్పొరేషన్ల పేరిట చేస్తున్న అప్పులు రూ.31 వేల కోట్లు, డిస్కంల అప్పు రూ.9 వేల కోట్లు అదనమని.. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని అభివర్ణించారు. గత బడ్జెట్లో రూ.4,404 కోట్లు మిగులు చూపించారని, వాస్తవానికి రూ.238 కోట్లు లోటు ఉందని పేర్కొన్నారు. జీఎస్డీపీ వృద్ధిని కూడా ఎక్కువ చేసి చూపించారని విమర్శించారు. ఆవేదనలో రాష్ట్ర రైతులు రుణమాఫీని వాయిదాల రూపంలో చెల్లిం చడంతో రైతులకు బ్యాంకులు తక్కువగా రుణాలు ఇచ్చాయని.. వడ్డీ భారాన్ని ప్రభుత్వం రైతులపైనే వేసిందని ఉత్తమ్ విమర్శించారు. కేంద్రం నుంచి ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు పైసా ఇవ్వలే దన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 2013–14లో 107 లక్షల టన్నులుంటే.. 2015–16 నాటికి 51 లక్షల టన్నులకు పడిపోయిందని గుర్తు చేశారు. పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు అదనంగా వరికి రూ.200, జొన్నకు రూ.200, కందికి రూ.450 బోనస్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సెప్టెంబర్లో కురిసిన వర్షాలతో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కనీసం నష్టం అంచనా కూడా వేయలేదని మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, మహిళా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 2,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. హామీలన్నీ గాల్లోనే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు గాల్లోనే ఉన్నాయని, అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేజీ టు పీజీ విద్య కలగానే మిగిలిపోయిందని, దళితులకు ఒక్క ఎకరా భూమిని కూడా పంపిణీ చేయలేదని.. దళిత పారిశ్రామిక వేత్తలకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని మండిపడ్డారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందన్నారు. మహదేవ్పూర్లో వన్యప్రాణుల చట్టాన్ని అతి క్రమించిన వారిలో మంత్రుల కుమారులు న్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ లైన్లతోనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదంటూ వ్యంగ్యంగా విమర్శించారు. అసహన ధోరణి మంచిదికాదు బడ్జెట్ అంచనాలను, సవరించిన అంచనాలను పరిశీలిస్తే సంక్షేమానికి భారీగా కోత పడుతోందన్న ఎమ్మెల్యే సంపత్ను సీఎంతప్పుపట్టారని, ఇంత అసహన ధోరణితో మాట్లాడటం సరికాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, సీఎం సమాధానం అనంతరం సంపత్ మాట్లాడుతూ.. సంక్షేమంపై ప్రభుత్వ లెక్కలను తప్పుపట్టారు. దీనికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టం చేసిన తరువాత ఖర్చు చేయకపోవడం ఉండదని పేర్కొన్నారు. ఈ దశలో ఉత్తమ్ జోక్యం చేసుకుని ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, అందరూ భజన సంఘంగా ఉండరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
ప్రజల రుణం తీర్చుకోవడమే నా ఎజెండా
కమలాపూర్ను అన్ని రంగాల్లోఅభివృద్ధి చేస్తా ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కమలాపూర్ : ముక్కూ, ముఖం తెలియని నాడు అండగా ఉండి ఇంతగా ఆశీర్వదించిన మండల ప్రజల రుణం తీర్చుకోవడమే తన ఎజెండా అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలో పర్యటించి రూ.2.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కమలాపూర్ను వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన తర్వాత మొద టి సారిగా మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. కమలాపూర్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాకు తీసిపోని విధంగా విద్య, ఇన్ఫ్రాస్టక్చ్రర్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యంగా సీడ్ బౌల్ అఫ్ తెలంగాణలో భాగంగా కమలాపూర్ మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే మండలానికి హెచ్పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వచ్చిందని, బీపీసీఎల్, ఐఓసీ ఫిల్లింగ్ స్టేషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాటర్గ్రిడ్ (మిషన్ భగీరథ)రాకముందే కమలాపూర్లో రూ.20 కోట్లతో ఫిల్టర్బెడ్ నిర్మించి దానిని మిషన్ భగీరథకు అనుసంధానం చేసి 2018 లోగా మండల ఆడబిడ్డలకు కానుకగా ఇంటింటికి నల్లా ఇస్తానన్నారు. గతంలో వాగులపై బ్రిడ్జిలు లేక వర్షం వస్తే మండలం ఐలాండ్గా మారేదని, ఇప్పుడా పరిస్థితి లేకుండా మండల వ్యాప్తంగా రూ.40 కోట్లతో 10 బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. రూ.170 కోట్లతో హుజూరాబాద్ నుంచి పరకాల వరకు ఫోర్లేన్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మణ్రావు, జెడ్పీటీసీ సభ్యుడు నవీన్కుమార్, సింగిల్విండో చైర్మన్ సంపత్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే వరంగల్లోకి.. కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లాకు కూత వేటు దూరంలో ఉంద ని, నిత్యం మండల ప్రజలు ఏ పని కోసమైనా వరంగల్కే వెళ్తారని, ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యానికే మం డలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలి పామని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై మండల ప్రజలు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కానీ త్వరలో అంతా సర్దుకుంటుందన్నారు. -
'వాటర్ గ్రిడ్'పై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: దళిత వాడల నుంచే ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వాటర్ గ్రిడ్ పథకంపై ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ కోసం అన్ని మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. 2017 డిసెంబర్ నాటికి గోదావరి, కృష్ణా నీళ్లు ఇంటింటికి చేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనుకున్న వేగంతో పనులు జరగని చోట వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేయాలన్నారు. నీరు పారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని వాడాలని కేసీఆర్ సూచించారు. -
2017లోగా ఇంటింటికీ తాగునీరు
మార్చి వరకు మొదటి దశలో పూర్తి నాణ్యతతో పనులు చేయాలి మిషన్భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల హుస్నాబాద్/తిమ్మాపూర్/చిగురుమామిడి : రాష్ట్రంలోని ప్రతీ ఇంటింటికీ 2017లోగా తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్భగీరథ పనులు వేగవంతంచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని రాములపల్లె, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి వద్ద జరుగుతున్న వాటర్గ్రిడ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ప«థకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో రూ.6,170కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు మొదటి దశలో పలు గ్రామాలకు, జూన్లో రెండో దశ, సెప్టెంబర్లో మూడో దశకు, డిసెంబర్ వరకు మిషన్ భగీరథను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పనులు నాణ్యతగా సాగాలని, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ అమరేంద్ర, డీఈఈ త్రినాథ్, బాలరాజ్, జేఈ రంజిత్, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న ఉన్నారు. -
రెండేళ్లయినా దొరల బడ్జెటేనా?
మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం విమర్శ సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ దొరల బడ్జెట్లాగే ఉందని, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కలేదని మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ వారు తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, సాగునీటి పారుదల శాఖలకే అధిక నిధులు కేటాయించారు. వారు చేపట్టింది వాటర్ గ్రిడ్ కాదు.. అవినీతి గ్రిడ్. రెండు పడకల ఇళ్లకు నిధులేవి? తెలంగాణ అమరవీరులకు గుర్తింపేదీ? ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలే తప్ప.. ప్రజావాణికి చోటులేదు. నిరుద్యోగుల వేదన అరణ్య రోదనగానే మిగిలింది..’ అని మధుయాష్కీ పేర్కొన్నారు. పొన్నం మాట్లాడుతూ ‘చేనేత కార్మికులు, గీతకార్మికులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు అంది స్తున్న ఆసరా పెన్షన్లను ఇంటి పన్ను బకాయిల కింద పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయని ఇంటి పన్నులు మాఫీ చేసిన మీరు, గ్రామీణ ప్రాంతాలను ఎందుకు విస్మరిస్తున్నారు’ అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ఆ వర్గాల ప్రజలకు న్యాయం దక్కలేదన్నారు. -
వాటర్ గ్రిడ్ అంతా అవినీతి మయం: భట్టి విక్రమార్క
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం అంతా అవినీతి మయం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వైరా రిజయర్వాయర్ వద్ద విలేకరుల తో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ కుమార్తె కవితకు చోటు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టాడని ధ్వజమెత్తారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీని బహిరంగ విచారణకు రావాలని సవాల్ విసిరారు. -
'వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయండి'
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బుధవారం వేములవాడ మండలం అగ్రహారం వద్ద వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న క్వారీల్లో బ్లాస్టింగ్ల వలన పనులకు అంతరాయం కలుగుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరారు. -
వాటర్గ్రిడ్కు నిధులు ఇవ్వలేం
లోక్సభలో ఎంపీ జితేందర్రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో గురువారం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర తాగునీటి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాటర్గ్రిడ్ పథకానికి అయ్యే మొత్తం వ్యయం రూ. 42,474 కోట్లలో సగం నిధులను భరించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ సీఎం కోరారని, ఆ విధంగా నిధులు ఇవ్వలేమని పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి అందే నిధులను వాటర్గ్రిడ్ పథకానికి వినియోగించుకోవచ్చని చెప్పారు. అవసరమైతే విదేశీ సంస్థల నుంచి ఆర్థికసాయం పొందే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. -
కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ లో కలిశారు. స్థానిక సంస్థలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్.. కేంద్ర మంత్రిని కోరారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా నిధులన్నీ గ్రామ పంచాయితీలకే వెళుతున్నాయని.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఈ సందర్భంగా కేటీఆర్.. బీరేంద్ర సింగ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రులతో సమావేశం కానున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్థానిక సంస్థలకు బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తెస్తామని అన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్... మిగతా రాష్ట్రాలు కూడా ఈ సమస్యను తమ దృష్టికి తీసుకు వచ్చాయని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం అందరికీ ఆదర్శప్రాయం అని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. -
ఏప్రిల్కల్లా 9నియోజకవర్గాలకు వాటర్ గ్రిడ్
-
దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం
సందర్భం ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నీటి సరఫరా పనుల్లో ఏ ప్రమాణాలనూ వాప్కోస్ పాటించలేదు. అలాంటి వాప్కోస్ను తెలంగాణకు శాశ్వతంగా సాగు, తాగునీటిని అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్యవేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? వాటర్ అండ్ పవర్ కన్సె ల్టెన్సీ (వాప్కోస్) తెలంగాణలో అత్యంత వివాదాస్పద మైన సంస్థగా ప్రజలముందు నిలుస్తోంది. కార్పొరేట్ దోపిడీ లీలలు ప్రజలు పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో వెలుగు చూడటమే కలవరపెడుతోం ది. వైఎస్ హయాంలో వాప్ కోస్ డీపీఆర్ ఆధారంగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టును చేపట్టగా 9 వేల కోట్ల పనులయ్యాయి. తెలంగా ణకు ఎనలేని మేలు చేసే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణా నికి తుమ్మిడి హెట్టి అన్ని విధాల అనువైనదని ఆనాడు వాప్కోస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వాప్కోస్ గత డిజైన్లోనే 1,500 కోట్ల పనులు చేసిందనేది గమనిం చాలి. ప్రాణహితపై వాప్కోస్ ఇచ్చిన నివేదికను ఆ సంస్థే తలకిందులు చేసి, కాళేశ్వరం-మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చి వేల కోట్ల దుర్వినియోగం చేసి, నిర్మించిన భారీ కాలువలు నిరుపయోగమయ్యాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, విశ్రాంత ఇంజనీర్లు, వారి సంఘాలు, మేధావులు, ప్రజలందరు ఈ రీడిజైన్ను వ్యతిరేకించి ఉద్యమిస్తూనే ఉన్నాయి. వ్యాప్కోస్ మేడిగడ్డ సర్వేకు అనేక కోట్ల ఫీజు తీసుకొని, లైడార్ లేజర్ సర్వే చేసి, కాళేశ్వరం నుండి ఎల్లంపెల్లికి కాల్వ, సొరంగానికి 150 క్రాసింగ్లు, అడ్డంకులున్నాయని, అసాధ్యమని తేల్చి, ప్రతిపాదించిన ప్రభుత్వమే ఈ రీడిజైనింగును రద్దు చేసింది. ఎల్లంపెల్లి నుండి దారిలో ఉన్న జిల్లాలు, హైద రాబాద్కు నీరందించే పథకంలో వాప్కోస్ చేస్తున్న ఘోరమైన తప్పులపై మెట్రో వాటర్ వర్క్స్ దుమ్మెత్తి పోసింది. వాప్కోస్ ఏ ఒక్క తప్పును సరిదిద్దుకోకపోగా, జవాబిచ్చే బాధ్యతనూ విస్మరించింది. 'మౌలానా అబ్దుల్ కలాం హైదరాబాద్ సుజల స్రవంతి' గోదావరి తాగునీటి పథకం దశ-1తో ఎల్లంపెల్లి నుండి హైదరాబాద్కు నీళ్లు తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పథకంపై సర్వేకు వాప్కోస్ను నియ మించారు. ఈ పథకం అకౌంట్స్ జనరల్ 17.11.2012న వాప్కోస్ తప్పులపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. వాప్ కోస్ అర్హత, అనుభవం లేని ఇంజనీర్లను వినియోగిస్తుం దని. ఒక ప్యాకేజీలో ఉన్న అదే పేర్లు గల ఇంజనీర్లనే మరో ప్యాకేజీలో వినియోగిస్తుందని నిర్దిష్టంగా వాప్ కోస్ను ఆ లేఖలో తీవ్రంగా మందలించింది. మెట్రో వాటర్వర్క్స్ డీజీఎం వాప్కోస్ ప్రాజెక్టు డెరైక్టర్కు రాసిన మరో లేఖలో వాప్కోస్ తప్పులను తూర్పారబట్టారు. అర్హత, ఏ మాత్రం అనుభవం లేని యువ ఇంజనీర్లను నియమిస్తున్నారు. 14 మంది సీని యర్ ఇంజనీర్లు ఉండవలసిన చోట, కేవలం ఎలాంటి అర్హత, అనుభవం లేని అప్పుడే చదువులు పూర్తి చేసు కున్న ఆరుగురు జూనియర్ ఇంజనీర్లను, సర్టిఫికెట్లు కూడా రాని ఇంజనీర్లను వాప్కోస్ కారు చౌక జీతాలు చెల్లించి కుదుర్చుకుంది. అనుభవలేమితో ప్రాజెక్టుల భవిష్యత్తునే వాప్కోస్ ప్రశ్నార్థకం చేస్తోంది. కేంద్ర నీటిశాఖ నిబంధనల ప్రకారం వ్యాప్కోస్ పనిచేస్తున్న రాష్ట్రాలలో అత్యున్నత సాంకేతిక సౌకర్యా లతో సెంట్రల్ లాబొరేటరీ ఉండాలి. అన్ని సాంకేతిక వసతులున్న మొబైల్ లాబొరేటరీ ఉండాలి. కానీ వాప్ కోస్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిది పక్కకు పెడితే ఏ స్థాయి పరిశోధనా సంస్థాలేదు. ప్రమాణాలను పాతరేసిన వీరి తప్పుడు నివేదికల ఆధారంగా వేల కోట్లతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తే ఎన్నిచోట్ల పేలుతున్నాయో చూస్తూనే ఉన్నాం. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీమ్ ప్రాజెక్టు ఫేస్-1, ప్యాకేజీ-2లో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న పీఎస్ కాశీనాథ్ (రిటైర్డ్ సీఈ) వాప్కోస్కు, హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బీకి తేది 3.8.2013న లేఖ రాశారు. ప్రతి ప్యాకేజీలో 14 మంది 15 సంవత్సరాలు ఆపై అర్హత, అనుభవంగల ఇంజనీర్లుండాలని, సెంట్రల్ ట్యాబ్, మొబైల్ ట్యాబ్ ఉండాలనీ, అయితే అమలు చేయవల సిన వాప్కోస్ పీడీ దీనికి విరుద్ధంగా ప్యాకేజ్-1ను ఏ మాత్రం అనుభవం లేని ఉప కాంట్రాక్టర్లకిచ్చారు. ఉప కాంట్రాక్టర్లకు ఇవ్వడం అగ్రిమెంట్ నిబంధనలకు విరు ద్ధం. జీతాలివ్వని వారిని, జీతాల గురించి దీనంగా అడ గడానికి వెళ్లిన పేద ఇంజనీర్లను, వాప్కోస్ పీడీ, నాకు మీ జీతాలతో ఎలాంటి సంబంధం లేదని బుకా యించారు. సర్వే పనులు సాగుతున్న చాలా పని స్థలాల వద్ద వాప్కోస్కు ఎక్కడా ఒక కార్యాలయం, ప్రాజెక్టు మేనే జర్ లేరు. 3, 4 గురు అనుభవంలేని ఇంజనీర్లతో కాలం వెళ్లబుచ్చుతోంది. అదే సమయంలో ప్రభుత్వాల నుండి 14 మంది సీనియర్ ఇంజనీర్ల పేర కోట్లు కాజేస్తోంది. వాప్కోస్ దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలోనూ మారక పోగా మరింత పెరిగింది. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ల గురించి వాప్కోస్ లక్ష్యాలుగా చెప్పుకొంటుంది. కానీ ఈ ఏ అర్హతలు వాప్ కోస్కు లేవు. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు జరి గిన నీటి సరఫరా పనులలో పై ఏ నియమాలను, ప్రమా ణాలను వాప్కోస్ పాటించలేదు. పైగా తుంగలో తొక్కింది. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నిర్మిం చిన పైపులతో నీళ్లందించినప్పుడు పాటించిన ప్రమా ణాలెంతటివనేది తేలుతుంది. అలాంటి వాప్కోస్ను తెలంగాణ జనావళికి శాశ్వతంగా ఉపయోగపడే సాగు, తాగునీరును అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్య వేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? ప్రమా ణాలు పాటించని, పైసలే ప్రమాణాలైన వాప్కోస్కు ఎలాంటి టెండర్లు లేకుండా తెలంగాణ వాటర్ గ్రిడ్ కన్సెల్టెన్సీగా నెలకో కోటితో ప్రభుత్వం కట్టబెట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేమిటో తెలంగాణ ప్రభు త్వమే వెల్లడించాలి. వ్యాసకర్త: తెలంగాణ జలసాధన సమితి కార్యదర్శి, నైనాల గోవర్ధన్. మొబైల్:9701381799 -
వాటర్ గ్రిడ్ను కోరుతూ.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
వాటర్ గ్రిడ్ను తమ ఊరిలో ఏర్పాటు చేయాలంటూ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ నివాసాన్ని ముట్టడించారు. అంతకు ముందు మెట్పల్లిలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. -
కేటీఆర్తో బెంగాల్ బృందం భేటీ
♦ వాటర్ గ్రిడ్ పై బెంగాల్ ఆసక్తి ♦ రాష్ట్రానికి వచ్చిన ముగ్గురు అధికారుల బృందం ♦ తమ రాష్ట్రంలో ప్రాజెక్టు ప్రారంభంపై చర్చలు సాక్షి, హైదరాబాద్: వాటర్గ్రిడ్ పథకం అధ్యయనానికి రాష్ట్రానికి విచ్చేసిన పశ్చిమబెంగాల్ అధికారుల బృందం తెలంగాణలో పర్యటించింది. అక్కడి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్కు చెందిన అధికారుల బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును కలుసుకుంది. తెలంగాణ వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తితో ఉన్నారని ఈ బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు లక్ష్యాలు.. అమలు తీరు, విధివిధానాలను మంత్రి అధికారులకు వివరించారు. తెలంగాణలోని ఆడపడుచులెవరూ తాగునీటికి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగా ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనను అభినందించిందని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు అవలంబించిన విధానాలను మంత్రి అధికారులకు వివరించారు. బెంగాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటే అందుకు సంబంధించిన ఇంజనీరింగ్, సాంకేతిక సహకారాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బెంగాల్లో ప్రస్తుతమున్న నీటి సమస్యను అధిగమించేందుకు తమ సీఎం మమతా బెనర్జీ వాటర్ గ్రిడ్ లాంటి పథకమే శాశ్వత పరిష్కారమని భావిస్తున్నారని అధికారుల బృందం మంత్రికి వివరించింది. అంతకు ముందు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఈఎన్సీ సురేందర్రెడ్డి బెంగాల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బెంగాల్ నుంచి వచ్చిన డెరైక్టర్ అనిమేశ్ భట్టాచార్య, ఈఈ పిడేయ్ ఏ రాయ్తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నేపథ్యంపైనే అధిక ప్రశ్నలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్సప్లై అండ్ సేవరేజ్ బోర్డులో మేనేజర్(ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాత పరీక్షను ఆదివారం నిర్వహించింది. గతంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను ఆన్లైన్లోనే టీఎస్పీఎస్సీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొలిసారి ఆఫ్లైన్లో పరీక్షను నిర్వహించింది. అభ్యర్థుల్లోని సాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలు పరీక్షించేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని అంశాల నుంచి ప్రామాణిక ప్రశ్నలను అడిగారు. చరిత్ర నుంచి సుమారు 35 ప్రశ్నలు! ప్రశ్న పత్రంలో తెలంగాణ నేపథ్యం ఉన్న భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ, భారతదేశ చరిత్రకు సంబంధించి సుమారు 35 వరకు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలుకుబడిలో ఉన్న ప్రశ్నలనే ఇచ్చారు. ఉదాహరణకు ‘దసరా పండగ రోజు ఒకరికొకకు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?’, ‘బతుకమ్మ పండగ తొలిరోజును ఏమంటారు?’తోపాటు కాకతీయులు తవ్వించిన చెరువులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలపై ప్రశ్నలు ఇచ్చారు. సాలార్ జంగ్ సంస్కరణలపై రెండు మూడు ప్రశ్నలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా పండగలు, జాతరల గురించి అడిగారు. ‘ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర?’, ‘కొండగట్టు దేనికి ప్రసిద్ధి?’, ‘మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రా స్థలం ఏది?’ మొదలైన ప్రశ్నలతోపాటు 1969 ఉద్యమంపై, భౌగోళిక సూచికగా నమోదైన హైదరాబాద్ హలీమ్పై, కుతుబ్షాహీ సాహిత్యంపై ప్రశ్నలు ఇచ్చారు. భారత దేశ చరిత్రలో సంస్కరణ ఉద్యమాలు, ఆర్యసమాజంపై ప్రశ్నలు ఇచ్చారు. జాగ్రఫీలో తెలంగాణ నేలలు, వర్షపాతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, చెరువులు, ప్రాజెక్టులు తదితర అంశాలతోపాటు ఇండియన్ జాగ్రఫీపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఆర్థిక అంశాలు, ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రశ్నలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు! జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంశంలో జాతీయ అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. నోబెల్ బహుమతిపై, బ్రహ్మోస్ క్షిప ణి, జలాంతర్గా మి నుంచి ప్రయోగించే బాలెస్టిక్ క్షిపణిపై, అంతర్జాతీయ దినోత్సవాల గురించి ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. సుమారు 15 ప్రశ్నలు ఈ అంశాలకు సంబంధించినవే. పాలిటీ విభాగంలో అన్ని అంశాల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. గతంలో టీఎస్పీఎస్సీ పరీక్షల కంటే కొద్దిగా క్లిష్టంగానే ప్రశ్నలు రూపొందించారు. ఇంగ్లిష్ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్ప్రిటేషన్లో ప్రశ్నలు అభ్యర్థులు తార్కిక నైపుణ్యాలు పరీక్షించే విధంగా ఉన్నాయి. క్లిష్టం, సందిగ్ధం! క్రీడలకు సంబంధించి లోతుగా ప్రశ్నలు ఇచ్చారు. ‘కల్టివేటెడ్ స్టైలిస్ట్గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు?’, ‘వరంగల్కు చెందిన ఏ ఆటగాడు బాల్బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించాడు?’ అనే ప్రశ్నలు ఈ తరం విద్యార్థులకు పెద్దగా తెలిసే అవకాశం లేదని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే ‘ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ?’ అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు, మరో ప్రశ్నలో తెలంగాణ ప్రభుత్వ పథకం పేరును ఇంగ్లిష్లో వాటర్ గ్రిడ్కు బదులు జలహారంగా ఇవ్వడం ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను సందిగ్ధానికి గురిచేసిందని నిపుణులు పేర్కొన్నారు. -
చెప్పినవన్నీ చేస్తున్నాం
♦ కేజీ టు పీజీ మినహా 99.5 శాతం హామీలు అమల్లోకి..: సీఎం కేసీఆర్ ♦ వరంగల్ టీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో బీ ఫారం అందజేత సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ మినహా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను 99.5 శాతం నెరవేరుస్తున్న ఘనత టీఆర్ఎస్దేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నామని, మేనిఫెస్టోలో లేని ఎన్నో మంచి పథకాలను ప్రారంభించామని చెప్పారు. విద్యుత్ కోతలతో అల్లాడిన రాష్ట్రాన్ని అసలు కోతలే లేని స్థితికి తెచ్చామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నుంచీ ముందు వరుసలో ఉన్న వారికి పదవులు ఇస్తామని, అదే క్రమంలో వరంగల్ అభ్యర్థిగా పసునూరు దయాకర్కు అవకాశమిచ్చామని పేర్కొన్నారు. శనివారం వరంగల్ జిల్లా నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మనమే నంబర్వన్.. కేజీ టు పీజీ మినహా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను 99.5 శాతం నెరవేరుస్తున్న ఘనత టీఆర్ఎస్దేనని... రాష్ట్ర విభజన తర్వాత ఆరేడు నెలల పాటు ఐఎఎస్, ఐపీఎస్ల కేటాయింపు జరగకున్నా అనేక మంచి పనులు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సంక్షేమ పథకాల అమలులో దేశంలో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. మీడియా సంస్థ సీఎన్ఎన్ నంబర్వన్ స్టేట్ అవార్డు కూడా ప్రకటించింది. ఇండియా టుడే అవార్డును ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో అందుకోబోతున్నాం. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోతల మూలంగా పడిన బాధ వర్ణనాతీతం. ఆరు నెలల్లోనే కరెంటు కోతలు లేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 38 లక్షల మంది సామాజిక పింఛన్లు ఇస్తున్నాం. మేనిఫెస్టోలో లేకున్నా చరిత్రలో మొదటి సారిగా హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి కాలేజీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల కోసం ఎవరూ డిమాండ్ చేయకున్నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్కార్డుదారులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైనా ఈ ఏడాది 60 వేలు నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెంచుతాం..’’ అని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ల హయాంలో నిర్మించిన ఏడు ఇళ్లు ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క డబుల్ బెడ్రూంతో సమానమని పేర్కొన్నారు. అందరికీ అవకాశం.. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నుంచీ ముందు వరుసలో ఉన్న వారికి పదవులు ఇస్తాం. వరంగ ల్ లోక్సభ ఉప ఎన్నిక టికెట్ను చాలా మంది ఆశించారు. రవికుమార్, పరంజ్యోతి, పరమేశ్వర్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు టికెట్ అడిగారు. ఏ పార్టీ అయినా ఒక్కరికే అవకాశం ఇవ్వగలుగుతుంది. అదే వరుసలో పసునూరి దయాకర్కు అవకాశం ఇచ్చాం. ఆయనకు రెండు మూడు పర్యాయాలు పోటీ చేసే అవకాశం దగ్గరగా వచ్చినా చివరి నిమిషంలో దక్కలేదు. అయినా ఉద్యమంలో, ఎన్నికల సందర్భంలో విధేయతతో పనిచేశాడు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపశిల్పి కూడా. టికెట్ కోసం పోటీ పడిన నేతలందరినీ పిలిచి ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశా. సమయం వచ్చినపుడు నాయకుల అర్హతలను బట్టి అందరికీ అవకాశాలు ఇస్తాం..’’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కారు చేసిన మంచి పనులను అందరూ గుర్తిస్తున్నారని, సర్వే ప్రకారం అద్భుత విజయం సాధించబోతున్నామని చెప్పారు. దయాకర్ డబ్బులున్న వ్యక్తి కాదని, పార్టీయే ఎన్నికల ఖర్చును భరిస్తుందని పేర్కొంటూ... దయాకర్కు కేసీఆర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీ వినోద్కుమార్, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల సమక్షంలో పసునూరి దయాకర్కు సీఎం కేసీఆర్ పార్టీ బీఫారం అందజేశారు. వాటర్ గ్రిడ్పై రాష్ట్రాల ఆసక్తి రూ. 40 వేల కోట్లతో రెండున్నరేళ్లలో వాటర్గ్రిడ్ను పూర్తి చేసేందుకు రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటర్గ్రిడ్ పథకంపై బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల్లో గందరగోళం జరిగిందన్నారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేసిన దేవాదుల ప్రాజెక్టు నుంచి కనీసం 60-70 రోజులు కూడా నీరు తీసుకునే పరిస్థితి లేదని... ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తిచేసి త్వరలో ఇరిగేషన్ పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్ రీడిజైనింగ్ కొలిక్కి వచ్చిందని, ఎల్ఎండీ కాలువకు రూ. 130 కోట్లతో వచ్చే జూన్ నాటికి మరమ్మతు పూర్తిచేసి నీరు అందిస్తామని చెప్పారు. 28 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ద్వారా భవిష్యత్తులో కోతలు లేని రాష్ట్రంగా చేసుకుంటామన్నారు. -
ఆర్నెలల్లో 3వేల గ్రామాలకు తాగునీరు
♦ నిర్దిష్ట లక్ష్యాలతో వేగంగా వాటర్ గ్రిడ్ పనులు ♦ అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో కేటీఆర్ సమీక్ష ♦ సెగ్మెంట్ల వారీగా నీరిచ్చే తేదీలను ప్రకటించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్ గ్రిడ్) ద్వారా రాబోయే ఆర్నెళ్లలోపే సుమారు మూడు వేల గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించబోతున్నామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం అన్ని జిల్లాల సూపరింటిండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలిదశను ఏప్రిల్ 30కల్లా పూర్తి చేసి గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేసేందుకు ఇంజనీర్లంతా పట్టుదలతో పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సెగ్మెంట్ల వారీగా తేదీలు ప్రకటించండి... వాటర్ గ్రిడ్ పరిధిలోని సెగ్మెంట్ల వారీగా ఏఏ ప్రాంతాలకు నీటి సరఫరాను ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని తేదీలతో సహా ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ అన్ని జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. డెడ్లైన్లు పెట్టుకొని పనులు పూర్తిచేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో అవసరమైన అన్ని సదుపాయాలను క ల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిన తాత్కాలిక నియామకాలను చేపట్టాలని సూచించారు. అటవీ అనుమతులపై ఆరా... జిల్లాల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి కేటీఆర్... ప్రాజెక్ట్కు సంబంధించి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాటుచేసిన జిల్లా జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు ఎలా జరుగుతున్నాయని ఎస్ఈలను మంత్రి ప్రశ్నించారు. డిజైన్లను ఆమోదించే అధికారాలను జిల్లా సూపరింటిండెంట్ ఇంజనీర్లకే అప్పగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గ్రిడ్ పనులతో పాటు గ్రామాల్లో అంతర్గత పైప్లైన్ ఏర్పాటును కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
వాటర్ గ్రిడ్లో అవినీతి ఆరోపణలపై కేటీఆర్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వాటర్ గ్రిడ్లో అవి నీతి, అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. 1,800 పేజీలతో కూడిన వాటర్ గ్రిడ్ డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను బయటపెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్ మండలం వెల్మల్ వద్ద వాటర్గ్రిడ్ ఇంటెక్వెల్ పనులు పరిశీలించారు. దిలావర్పూర్ మండలం మాడేగాంలో గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించేందుకు రూ.35 వేల కోట్లతో ఓ భగీర థ ప్రయత్నం చేస్తున్నాం. 1.25 లక్షల కి.మీ. పైప్లైన్లు, 50 వరకు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటర్ గ్రిడ్ ద్వారా తెలంగాణ ప్రజలకు నీళ్లిస్తాం. ప్రతిపక్షాలకు కూడా మూడు చెర్ల నీళ్లు తాగిస్తాం’ అన్నారు. ‘ఇంటింటికీ శుద్ధ జలాలు అందిస్తే.. నీటి పన్నులు చెల్లించేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పనులు పూర్తయ్యాక పన్ను ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తాం. అఖిలేష్ యాదవ్ పిలిస్తేనే నేను యూపీకి వెళ్లా. కోడిగుడ్డుపై ఈకలు పీకితే ఎలా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ప్రజల్లో కలుస్తున్నం దుకు సంతోషం. గ్రిడ్ పనులకు డీపీఆర్లున్నా యా అని అడుగుతున్నారు. డీపీఆర్లు లేకుండానే నాబార్డు, హడ్కో వంటి సంస్థలు రుణాలిస్తాయా? ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి సొంత జిల్లా చిత్తూరు తాగునీటి ప్రాజెక్టుకు రూ.7వేల కోట్లు ఇస్తూ సంతకం పెట్టిన అప్పటి ఓ మంత్రి తన సొంత జిల్లా నల్లగొండలో ఫ్లోరోసిస్ బాధితులకు సురక్షిత జలాలు ఇవ్వలేకపోయారు. మీ మాదిరిగా కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం పైప్లైన్లు వేస్తున్నాం. తెలంగాణకు టీఆర్ఎస్ కన్నతల్లి అయితే కాంగ్రెస్ మంత్రసాని. వచ్చే జూన్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ను సరఫరా చేసేందుకు రూ.2వేల కోట్లతో పనులు చేపట్టాం. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’ అన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందన్నారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, విఠల్రెడ్డి, రాథోడ్బాపూరావు, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్
మాడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను విజయవంతం చేస్తామని ప్రకటించారు. వాటర్ గ్రిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ35 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్షం అన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘గ్రిడ్’ గుట్టు బయటపెడతాం
♦ ఈ అక్రమాలను త్వరలో మీడియా ముందుంచుతాం ♦ సర్కారుపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వాటర్ గ్రిడ్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బట్టబయలు చేస్తామని, ఆ వివరాలను త్వరలో మీడియా ముందు ఉంచుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు గ్రిడ్ గురించి మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడారు. వాటర్ గ్రిడ్ డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)ను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులని విమర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఈ గ్రిడ్ పనులను ఆంధ్ర కంపెనీకే అప్పగిస్తోందని, ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ ఎవరిదో తెలపాలని డిమాండ్ చేశారు. పాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు డిజైన్లు మార్చుతూ తెలంగాణలోని 16లక్షల ఎకరాల ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చుతున్నారని విమర్శించారు. నిత్యం పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క బాధిత కుటుంబాన్నైనా పరామర్శించకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదన్నారు. జైపూర్ పవర్ ప్లాంటును తమ ప్రభుత్వమే మంజూరు చేసిందని గుర్తు చేశారు. వారు ప్రభుత్వ పందులు రైతు భరోసా యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నాయకులను రాబందులంటూ విమర్శించిన టీఆర్ఎస్ మంత్రులే ప్రభుత్వ పందులని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ధాన్యం ధర క్వింటాల్కు రూ.1,450 చొప్పున కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ప్రభుత్వం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన అభివృద్ధి పునాదులపై నిలబడి ప్రదర్శనలిస్తున్నారని అభివర్ణించారు. ‘ప్రాణహిత’ను నిర్వీర్యం చేసేందుకే.. వాటర్గ్రిడ్ పైపుల కంపెనీకి మార్కెటింగ్ చేసేందుకే మంత్రి కేటీఆర్ యూపీ వెళ్లి అక్కడి సీఎంను కలిశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పనులు చేయనున్న కాంట్రాక్టు కంపెనీలకు కేటీఆర్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ వాటర్గ్రిడ్ ఆదర్శవంతమైన ప్రాజెక్టే అయితే యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా తెలంగాణకు వచ్చి పరిశీలించాలే గానీ, ఎలాంటి ప్రయోజనం లేని యూపీ సీఎంను కలిసేందుకు ప్రత్యేక విమానంలో మందీ మార్భలంతో వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వాటర్గ్రిడ్లో ముడుపుల కోసమే ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వాస్తు పండితుల మాటలు వినే కేసీఆర్ కరువు మండలాలను ప్రకటించడం లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల అమలు చేసేందుకు కమిటీలతో పనిలేదని, కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. శాసనసభా పక్ష ఉపనేత జీవన్రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధిపై సీఐడీ విచారణ చేపట్టిందంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమే అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జి.వినోద్, కోదండరెడ్డి, నర్సారెడ్డి, సి.రాంచెంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
రైతు బంధువులు కాదు.. రాబందులు వాళ్లు
కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్ మూడేళ్లలో వాటర్గ్రిడ్ పూర్తి... ప్రజలకు నల్లాల ద్వారా నీరు తాగిస్తాం రైతు కష్టాలకు 42 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కారణం కాదా? సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు చేపడుతున్న రైతు భరోసా యాత్రపై మండిపడ్డారు. వాళ్లు రైతు బంధువులు కాదని, బతికున్న వాళ్లను పీక్కుతినే రాబందులని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి గల్లంతవుతోందన్న భయం వల్లే.. అభివృద్ధిపథంలో వెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ద వాటర్గ్రిడ్ పనులకు మంత్రులు జగదీశ్రెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పీజీ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే ముందుందని, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా మూడేళ్లలో వాటర్గ్రిడ్ పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలకు న ళ్లాల ద్వారా నీళ్లు తాగించి, ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని వ్యాఖ్యానించారు. మీ ఊళ్లో అడుగుదామా? తనకు జానారెడ్డి అంటే ఎంతో గౌరవమని కేటీఆర్ చెప్పారు. ‘‘అయితే ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ.. ‘నీకేం తెలుసు నా సంగతి.. మీ అయ్యను అడిగితే చెప్తడు’ అని అన్నారు. మా అయ్యనెందుకు? ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఉన్న అయ్యలనడిగితే మీ చరిత్ర, కాంగ్రెస్ నేతల చరిత్ర చెప్తరు..’’ అని అన్నారు. ‘‘నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు.. లేదంటే మీ ఊర్లోనయినా అడుగుదాం. నల్లగొండ జిల్లా విషపు నీళ్లు తాగడానికి కారణమెవరో తేల్చుదాం’’ అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి.. ఉత్తరకుమార్రెడ్డి అని ఎద్దేవా చేశారు. ‘‘ఈయన కార్లో కాదా ఎన్నికలప్పుడు రూ.3 కోట్లు దొరికింది.. ఎక్కడివి ఆ కట్టలు మర్చిపోయిండా? అలాంటి ఆయన టీఆర్ఎస్ను అవినీతిలో దేశముదురు అంటాడా? మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఉద్యమంలో సింగిల్గా ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కేసీఆర్లున్నరు. మాకు ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం ఇస్తే.. మీరు 15 నెలలకే బొబ్బలు పెడ్తరా?’’ అని విరుచుకుపడ్డారు. రైతుల వెతలకు ఆ పార్టీలే కారణం ‘‘ఉమ్మడి రాష్ట్రాన్ని 42 ఏళ్లు కాంగ్రెస్, 17 ఏళ్లు టీడీపీ పాలించాయి. ఇప్పుడు తెలంగాణలో రైతుల అవస్థలకు ఆ రెండు పార్టీలు కారణం కాదా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. అయితే ఒకేసారి మాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మూటలుండవని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలెవ్వరూ తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్లు కాదన్నారు. వాళ్లంతా తెలంగాణ వద్దన్నోళ్లు, ఒకవేళ వచ్చినా ముఖ్యమంత్రులం అవుదామని కలలు కన్నోళ్లు అని విమర్శించారు. వాటర్గ్రిడ్కు రూ.36 వేల కోట్లు ఖర్చవుతాయా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అయితే గతంలో సీఎం కిరణ్ ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకానికే రూ.7 వేల కోట్లతో ప్రతిపాదనలు పెట్టినప్పుడు, కేబినెట్లో ఉండి ఎలా సంతకాలు చేశారని ప్రశ్నించారు. వాటర్గ్రిడ్ గురించి ఎక్కడో ఉన్న యూపీ అఖిలేశ్కు అర్థమయింది కానీ... జానారెడ్డికి, ఉత్తమ్కు మాత్రం అర్థం కావడం లేదన్నారు. భూస్వామ్య విధానాన్ని తెచ్చే కుట్ర: జగదీశ్రెడ్డి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో పాత భూస్వామ్య విధానాన్ని తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అధికార పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారన్నారు. అయితే వారి ట్రాప్లో తాము పడబోమని చెప్పారు. గత పాలకుల చేతగాని తనం వల్లే రాష్ట్రంలో తాగునీరు కూడా లేకుండా పోయిందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 150 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. సభలో ఆశ వర్కర్ల నిరసన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ఆశ వర్కర్లు నిరసన తెలియజేశారు. సభా ప్రాంగణంలో నల్లజెండాలు ప్రదర్శించి, ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. తమకిచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. నేతలు సముదాయించినా వినకపోవడంతో మంత్రి జగదీశ్రెడ్డి వారిపై మండిపడ్డారు. ‘మీరు సమస్య పరిష్కారానికి వచ్చినట్టు కనిపించడం లేదు. ఎవరో పంపితే ఇక్కడకు వచ్చి ఉంటారు. ఎక్కువసేపు గొడవ చేస్తే పార్టీ కార్యకర్తల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు మీరు తట్టుకోలేరు.’ అని వ్యాఖ్యానించారు. -
'రూ. 2 కోట్ల పైలాన్కు 36 పగుళ్లు'
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో రూ.2 కోట్లు పెట్టి ప్రభుత్వం నిర్మించిన వాటర్గ్రిడ్ పథకం పైలాన్కు మూడు నెలల్లోనే 36 పగుళ్లిచ్చాయని, ఇక రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఆ పథకం తీరు ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చౌటుప్పల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం వాటర్గ్రిడ్ పథకం పైలాన్ను సందర్శించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లీ బిడ్డల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దొంగ నోట్ల కేసులో, మరో ఎమ్మెల్యే ఇసుక దందాలో ఇరుక్కున్నారని ఆరోపించారు. -
ప్రపంచానికే ఆదర్శంగా వాటర్గ్రిడ్
అక్రమాలకు తావివ్వకుండా చూస్తున్నాం: కేటీఆర్ ♦ తెలంగాణకు భవిష్యత్తులో తాగునీటి కష్టాలుండవు ♦ అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని వెల్లడి ♦ 18ఏళ్ల క్రితమే సిద్ధిపేటలో ఇంటింటికీ నీరివ్వడమే దీనికి ఆదర్శం సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఓ ఆదర్శ పథకంగా నిలిచిపోయేలా వాటర్గ్రిడ్కు రూపకల్పన చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మిస్తుండడం సాహసోపేతమని... నీటి కోసం పాలమూరు కష్టాలు, నల్లగొండకు ఫ్లోరైడ్ బాధలు భవిష్యత్తులో ఉండవని చెప్పారు. మంగళవారం శాసనసభలో వాటర్గ్రిడ్పై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రూపొందిన నీటి పథకాలను వాటర్గ్రిడ్తో అనుసంధానిస్తున్నామని చెప్పారు. నల్లగొండలో పరిస్థితి మారకుంటే మానవ రహిత ప్రాంతంగా మారుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 18 ఏళ్ల కింద సిద్ధిపేటలో ఇంటింటికి తాగునీటిని అందించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు రాష్ట్రమంతటా దాన్ని విస్తరించే క్రమంలో రూ.36 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును ప్రారంభించారని వెల్లడించారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసేలా 26 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి దానికి కాలపరిమితి విధిస్తున్నామని తెలిపారు. అవినీతికి తావులేకుండా ఈపీసీ విధానానికి స్వస్తి చెప్పామని... ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకే అన్నిరకాల బాధ్యతలు అప్పగించే విధానాన్ని నిలిపివేశామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యయన బాధ్యతతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను వ్యా ప్కోస్కు అప్పగించామన్నారు. ఇప్పటికే 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లిస్తున్నందున ఈ ప్రాజెక్టు అవసరమే లేదని కొందరు అంటున్నారని... 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు అందుతున్న విషయం వాస్తవమైతే తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్నారు. వినియోగదారులపై భారం మోపుతారా? వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు వినియోగించే విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందా, వినియోగదారులపై మోపుతారా అని అధికారపార్టీ సభ్యుడు గంగుల కమలాకర్ ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటి సేకరణ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించే సమావేశాలకు ఎమ్మెల్యేలను పిలవాలని మరో సభ్యుడు కిషోర్ కోరారు. గతంలో ఇంజనీర్గా పనిచేసిన అనుభవమున్న తనలాంటి వారి సేవలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టు గుజరాత్లో అమలవుతున్నందున అక్కడ పనిచేసిన రిటైర్డ్ అధికారుల సేవలు తీసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టును హైదరాబాద్తో కూడా అనుసంధానించాలని మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్ కోరారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభలో ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్క ఎంఐఎం పార్టీ మాత్రమే సమావేశాలలో పాల్గొంది. వ్యాట్ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వాటర్ గ్రిడ్ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు నుంచి జిల్లాల్లో రైతు భరోసాయాత్రలు చేపడుతున్నారు. -
వేగంగా వాటర్గ్రిడ్ పనులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్గ్రిడ్)ను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనులు పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే నీటి సరఫరా చేస్తామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు తె లిపారు. వాటర్గ్రిడ్కు సుమారు 200 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, విద్యుత్ పనుల ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే వాటిని చేపట్టేందుకు రూ.100 కోట్లు అడ్వాన్స్ను ఇచ్చామని చెప్పారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వాటర్గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేసేలా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రెండు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వారంలోగా రెండు విభాగాల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిస్కమ్లు, జిల్లాలవారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. విద్యుత్ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే షార్ట్ టెండర్లు పిలవాలని మంత్రి సూచించారు. ప్రాజెక్ట్కు అవసరమైన ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లకు సంబంధించిన వివరాలను వెంటనే విద్యుత్ శాఖకు అందజేయాలని వాటర్గ్రిడ్ అధికారులను ఆదేశించారు. -
రూ.లక్షన్నర కోట్లకు పైగా!
వచ్చే ఏడాది బడ్జెట్పై ముందస్తు కసరత్తు రికార్డు స్థాయిలో పెంచే సంకేతాలు ముందుగానే ఆరా తీసిన ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు డబుల్ బెడ్రూం ఇళ్లు, వాటర్గ్రిడ్కు భారీ కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ లక్షన్నర కోట్లు దాటిపోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ ఏడాది ఎంత ఖర్చు చేస్తాం, వచ్చే ఏడాది ఎంత బడ్జెట్ ప్రవేశపెడదామని సీఎం ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న తెలంగాణ జల వినియోగ విధానంపై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్ కేటాయింపులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల చొప్పున సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఎంచుకున్న వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు, గ్రామజ్యోతి, సంక్షేమ పథకాలన్నింటికీ భారీ మొత్తంలో నిధుల అవసరం ఉంది. ఈ ఏడాది డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలని ఇటీవలి కేబినేట్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ కేటాయింపులు, ఖర్చులకు అనుగుణంగా ఆర్థిక అవసరాలు, అంచనాలెలా ఉన్నాయని కేసీఆర్ ఆరా తీయడంతో పాటు బడ్జెట్ ప్రస్తావన లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరుసటి రోజున క్యాంపు కార్యాలయంలో తనను కలసి సమస్యలను విన్నవించేందుకు వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులతోనూ సీఎం ఆర్థిక పరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూ.1.58 లక్షల కోట్లకు చేరుతుందని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. దీంతో వచ్చే బడ్జెట్ రికార్డు స్థాయి లో పెరిగిపోనుంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాది పది నెలల కాలానికి రూ. లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వరుసగా అదే పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,637 కోట్లు. ఈ ఏడాది మార్చిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. -
709 తాత్కాలిక ఉద్యోగాలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యుఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడిన నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. ఆర్డబ్ల్యుఎస్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47మంది జూనియర్ అసిస్టెంట్లను, వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ నిమిత్తం కొత్తగా 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ను సర్కారు ఆదే శించింది. ఉద్యోగాలకు అర్హతలు ఇలా.. ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నియమ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు, మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం పోస్టులు డిప్లమో అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 26పోస్టుల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 60ఏళ్ల వయస్సు దాటిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరు. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు రోజువారీ వేతనం రూ.735 చొప్పున నెలలో 25రోజులకు 18,375 చెల్లిస్తారు. డిప్లమో అభ్యర్థులకు రోజుకు రూ.550 చొప్పున నెలలో 25రోజులకు కలిపి రూ.13,750 వేతనాన్ని చెల్లిస్తారు. -
కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు
బొమ్మలరామారం : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఫొటోలకు ఫోజులివ్వడం, ప్రచార ఆర్భాటమే తప్ప తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. బొమ్మలరామారంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనదన్నారు. రుణమాఫీకాక, కొత్తగా బ్యాం కు రుణాలు అందక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేసీఆర్కు వారి ఉసురు తగులుతుందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాణహిత డిజైన్ మార్పు చేస్తున్నారని, అలాగే మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్లకు కేటాయిస్తున్న నిధుల్లో రూ.30వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని ధనవంతంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం పేదరికంలో ఉంచుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మోకు మదుసూదన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేషం, తిరుమల భాస్కర్గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చీర సత్యనారయణ, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మోటే గట్టయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాటిమాటే నిజమైంది..
♦ పదేళ్ల కిందటే సిద్దిపేటను బంగారు తునక చేస్తానన్న కేసీఆర్ ♦ సాగు, రైల్వే, జిల్లా కేంద్రం సాధనే ప్రధాన లక్ష్యం ♦ హరితహారానికి నెల వేతనం విరాళం ♦ రాష్ట్రనీటిపారుదల శాఖమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్ : నాటి కేసీఆర్ మాట నేడు నిజం కాబోతున్నదని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పదేళ్ల కిందట సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. సిద్దిపేటను బంగారు తునకగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ మాట నేడు వాస్తవ రూపం దాలుస్తోందన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేటకు సాగునీరు, రైల్వేలైన్తో పాటు జిల్లా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని కేసీఆర్ తనకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి ఆశీర్వదించారన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట బంగారు తునకగా మారనుందని ఆనాడే చెప్పారని, నేడు ఆదిశగా కృషి జరుగుతోందన్నారు. సిద్దిపేట ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. హరితహారం సిద్దిపేట వాసులకు కొత్తకాదన్నారు. 1966-67లో ఎమ్మెల్యేగా కేసీఆర్ హరితహారానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నేడు నాటనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఇంటింటికి తాగునీటిని మానేరు డ్యామ్ నుంచి తెప్పించిన కేసీఆర్ నేడు వాటర్గ్రిడ్తో తెలంగాణ వ్యాప్తంగా తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కలెక్టర్ నేతృత్వంలో హరితహారం వేగవంతంగా కొనసాగుతోందన్నారు. అధికారులు వేతనాన్ని విరాళంగా అందించి ఆదర్శంగా నిలిచారన్నారు. మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని హరితహారానికి అందించనున్నట్లు సభాముఖంగా పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాలో 3.50 కోట్ల మొక్కలను పెంచనున్నట్లు అందుకు 1.25 కోట్ల ట్రీగార్డులను సేకరించినట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి జోగు రామన్న, ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, ఫారూఖ్హుస్సేన్, స్థానిక నాయకులు రాజనర్సు, చిన్న, మచ్చ వేణుగోపాల్రెడ్డి, సంపత్రెడ్డి, పాల సాయిరాం, కనకరాజు, నగేష్, చిప్ప ప్రభాకర్, కూర బాల్రెడ్డి, మల్లికార్జున్, శేషు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి
* నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి * మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నుంచి నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను కోరారు. ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన అరవింద్ పనగరియా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలి శారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పథకాల నిర్వహణ, ప్రభుత్వవిధానాలు తది తర అంశాలపై చర్చ జరిగింది. గతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసేదని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులివ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతోపాటు రాష్ట్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్, హరితహారం పథకాలను సీఎం వివరించారు. కొత్త పారిశ్రామిక విధానంతోపాటు రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగరియా ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేసిన వినతులపట్ల పనగరియా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, జగదీశ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్చంద్ర, బీపీ ఆచార్య, నర్సింగ్రావు, ఎంజీ గోపాల్, సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎంతో సమావేశానికి ముందు పనగరియా మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కిషన్నగర్ను సందర్శించారు. -
వాటర్గ్రిడ్కు మరో రూ.18,965 కోట్లు
ఆర్డబ్ల్యూఎస్లో బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్(వాటర్గ్రిడ్)కు మరో రూ. 18,965కోట్ల మంజూరుకు సర్కారు పరిపాలన ఆమోదం తెలిపింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని సెగ్మెంట్ల నిర్మాణం కోసం రూ.10,570 కోట్లు, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని సెగ్మెంట్ల కోసం రూ.8,395 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 సెగ్మెంట్లలో కొన్నింటి కోసం ఈ నెల 1న రూ. 15,603 కోట్లు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతోపాటుగా ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఇంజనీర్లు, నాన్ టెక్నికల్ సిబ్బంది బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం వేరొక ఉత్తర్వును జారీచేసింది. -
మంజీర తీరాన... మహా జలహారం
మెదక్: మంజీర తీరాన మహా జలహారం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న వాటర్గ్రిడ్ పథకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును రూపొందించారు. సుమారు పది లక్షల మందికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. గ్రిడ్ పైలాన్ కూడా సిద్ధమైంది. పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ ఈ పైలాన్ను శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లాలో చేపట్టనున్న వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు కేటాయించారు. 873 గ్రామాల్లో సుమారు పది లక్షల మందికి తాగు నీరందించేలా రూపకల్పన చేశారు. సింగూర్ ప్రాజెక్ట్ దిగువన గల పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట శివారులోని బ్యాక్ వాటర్ నుంచి సెకండ్ లెవల్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నారాయణఖేడ్, అందోల్, మెదక్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తారు. ఈ పథకం కింద నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, అందోల్లోని ఐదు మండలాలు, మెదక్లోని నాలుగు మండలాలతోపాటు మెదక్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలకు తాగునీరందిస్తారు. రోజుకు గ్రామీణ ప్రాంతంలో ఒక్కో వ్యక్తికి వంద లీటర్లు, మున్సిపల్ ప్రాంతంలో 130 లీటర్ల తాగునీటిని అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దారెడ్డిపేట నుంచి ప్రారంభమయ్యే పైప్లైన్ మధ్యలో ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, గ్రౌండ్ లెవల్ ట్యాంకులు నిర్మించనున్నారు. రామాయంపేట మండలం వరకు సెకండ్ లెవల్ గ్రిడ్ ద్వారా తాగునీరందుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేశ్కుమార్ తెలిపారు. నేడు పైలాన్ ఆవిష్కరణ.. మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వాటర్ గ్రిడ్ పైలాన్ సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించనున్నారు. -
ప్రతి వ్యక్తికీ రోజుకు 100 లీటర్ల మంచినీరు
ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : తెలంగాణాలో ఉన్న 8,700 గ్రామాల్లో కేవలం 470 గ్రామాల్లోనే 100 శాతం మరుగుదొడ్లు ఉండడం సిగ్గుపడాల్సిన విషయమని, రాబోయే రాజుల్లో ప్రతీ గ్రామంలో మరుగుదొడ్లు, మురుగునీరు, మంచినీటి వ్యవస్థలను నిర్మించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు పేర్కొన్నారు. బేగంపేట హరిత హోటల్లో పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నిర్మల్ గంగా పురస్కార్ అవార్డు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల మంచినీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ఘన, ద్రవ వ్యర్ధాలను సమర్థవంతంగా రీసైకిల్ చేసి పరిశుభ్రమైన పల్లెల నిర్మాణానికి బాటలు వేయనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచ్తో పాటు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించి తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల నిర్మాణంలో 100 శాతం ఫలితం సాధించి ఉత్తమ పనితీరు కనపరిచిన 36 గ్రామపంచాయతీల ప్రతినిధులకు నిర్మల్ గంగా పురస్కార్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్, సెర్ప్ అదనపు సీఈవో మురళి, ఎమ్మెల్యే బడిగే శోభ, యునిసెఫ్ ప్రతినిధులు, గ్రామకార్యదర్శులు పాల్గొన్నారు. -
పరిపుష్ట పంచాయతీరాజ్
వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖను పరిపుష్ట స్థాయికి తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ వ్యవస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన వార్షిక నివేదికను బుధవారం ఆయన సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 8,600 గ్రామాలకు గాను 2,700 గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయగలగడం రికార్డుగా మంత్రి పేర్కొన్నారు. పుష్కలంగా ‘ఆసరా’ పింఛన్లు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు తెలంగాణలో 29 లక్షల మందికే పింఛన్లు ఇచ్చారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 36 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో కేవలం రూ.800 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం రూ.4,000 కోట్లు పింఛన్ల కోసం కేటాయించామన్నారు. అలాగే.. గ్రామాల్లో రూ.5,470 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.1,800 కోట్లతో తారురోడ్ల పునరుద్ధరణ, రూ.2,200 కోట్లతో కొత్తరోడ్లు, రూ.250 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం, రూ.600 కోట్లతో మట్టిరోడ్ల నిర్మాణం.. తదితర కార్యక్రమాలను చేపట్టామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ రహదారులకు ఇరువైపులా సుమారు 36 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా గ్రామీణాభివృద్ధి విభాగం చేపట్టిందన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ వాటర్గ్రిడ్తో ఇంటింటికీ మంచినీటి నల్లా ఇచ్చి.. సీఎం ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 17 ఇంటేక్ వెల్స్ రక్షితస్థాయికి వచ్చాయన్నారు. సుమారు లక్ష కిలోమీటర్ల మేర కొత్తగా పైప్లైన్ వే స్తామన్నారు. తొలిదశ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.15,600 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, మరో రూ.8 వేల కోట్లకు వారంలోగా అనుమతి మంజూరు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఈ-పంచాయత్ల ఏర్పాటు మినహా గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ చేరుకోగలిగామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. తైవాన్కు కేటీఆర్ రెండు రోజుల పర్యటనకు కేటీఆర్ బుధవారం రాత్రి తైవాన్కు బయల్దేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తైవాన్లోని ఐ టీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయ న సమావేశమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇండియా-తైవాన్ బిజినెస్ కో-ఆపరేటివ్ ఫోరమ్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి పారిశ్రామిక పార్కులు సందర్శిస్తారు. -
వాటర్గ్రిడ్: ఇంటింటికీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా వాటర్గ్రిడ్ పథకాన్ని చేపట్టారు. దాదాపు రూ.40 వేల కోట్ల అంచనాతో నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.26 లక్షల కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు నిర్మించనున్నారు. మొత్తంగా 25 వేల జనావాసాలకు 56 నీటిశుద్ధి ప్లాంట్ల ద్వా రా 39 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తారు. సగటున ప్రతి వ్యక్తికి గ్రామాల్లో వంద లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ నుంచి తన నియోజకవర్గమైన సిద్ధిపేటకు నీటిని తరలించిన తరహాలోనే.. ఈ పథకానికి స్వయంగా ఆయనే రూపకల్పన చేయడం గమనార్హం. దీనిపై మంత్రులను సిద్ధిపేట ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లిన కేసీఆర్.. వారికి స్వయంగా తానే అవగాహన కల్పించారు కూడా. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ పనులు, బావుల నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేసారి అనుమతులు ఇచ్చేలా కేసీఆర్ ఆదేశించారు. -
అప్పు సీలింగ్ రూ. 15,295 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు నిధుల సమీకరణలో ఉన్న తెలంగాణ సర్కార్కు కేంద్రం ‘అప్పుల సీలింగ్’ విధించింది. రూ. 15,295 కోట్లకు మించి అప్పులు చేయవద్దంటూ కళ్లెం వేసింది. 2015-16 వార్షిక సంవత్సరంలో అప్పుల సీలింగ్కు సంబంధించి కేంద్రం ఈ మేరకు లేఖ విడుదల చేసింది. అంటే.. జీఎస్డీపీలో 3 శాతానికి పరిమితం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ సీలింగ్ను విధించినట్లు అందులో పేర్కొంది. కొంతకాలంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నీతి అయోగ్ బృందం సభ్యులతోనూ సీఎం కె.చంద్రశేఖరరావు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలోనూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదు. అంచనాలకు అడ్డ కత్తెర..! తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్టులో రూ.16,969 కోట్లు ద్రవ్యలోటు చూపించింది. జీఎస్డీపీలో 3.49 శాతం రుణాలు తెచ్చుకునే అంచనా వేసింది. కానీ.. తాజా సీలింగ్ ప్రకారం అందులో రూ.1,674 కోట్లు కోతపడడంతో అంచనాలు తలకిందులయ్యాయి. వార్షిక ఆదాయపు అంచనాలపై ఈ ప్రభావం పడడం ఖాయంగా కన్పిస్తోంది. 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటికీ కత్తెర పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు భారీ మొత్తంలో నిధులు అవసరముంది. దీంతో రుణ సమీకరణ తప్పనిసరిగా మారింది. అందుకే ఎఫ్ఆర్బీఎం వెసులుబాటుకు సర్కారు పట్టువీడకుండా ప్రయత్నాలు చేసింది. జీఎస్డీపీలో 3.9 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతిస్తే.. రూ.18,962 కోట్లు రుణంగా తెచ్చుకొని బడ్జెట్టులో లోటు పూడ్చుకోవచ్చని ఆరాట పడింది. కానీ.. అదేమీ పట్టించుకోకుండా కేంద్రం సీలింగ్ విధించడం గమనార్హం. -
వాటర్గ్రిడ్పై విస్తృతంగా ప్రచారం
ప్రాజెక్టు సమీక్షలో అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టుైపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోనూ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ ఆ జిల్లా పరిధిలో వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను, మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టు ప్రయోజనాలను, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తే, త్వరలోనే వారికి సురక్షిత మంచినీరు అందుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్ల్లాలోని రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, అటవీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే ముఖ్యమంత్రి సమీక్షించనున్నందున అవసరమైన సమాచారాన్ని సేకరించాలని, జరిగిన పనులకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేగంగా ఇంటేక్వెల్స్ పనులు.. వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటేక్వెల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వేసవిలోగా సాధ్యమైన మేర పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు రూపకల్పనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేసిన కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు, మంత్రులు ప్రాజెక్టులోని అంశాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి అధికారులను కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి తదితరులున్నారు. -
హడ్కో అవార్డు అందుకున్న కేటీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హడ్కో అవార్డు అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రక్షిత మంచినీటి పథకాన్ని 4ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇక నేపాల్లో చిక్కుకున్న భరత్పూర్ మెడికల్ విద్యార్థులను ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. -
వాటర్గ్రిడ్కు ‘హడ్కో’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు అభినందనలు తెలుపుతూ హడ్కో అధికారులు లేఖ పంపారు. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
తాండూరుకు కృష్ణమ్మ!
► వాటర్గ్రిడ్తో తరలిరానున్న జలాలు ► ప్రభుత్వానికి రూ.53 కోట్లతో ప్రతిపాదనలు ► ఇంటింటికీ నల్లా కనెక్షన్లు తాండూరు : తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్లో భాగంగా తాండూరువాసులకు కృష్ణాజలాలు అందనున్నాయి. దాంతో వచ్చే రెండు, మూడేళ్లలో అందరికీ ఫిల్టర్ వాటర్ అందుబాటులోకి రానున్నది. వాటర్ గ్రిడ్తో పైప్లైన్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాటర్గ్రిడ్ కోసం తాండూరు మున్సిపల్ అధికారులు సుమారు రూ.53కోట్ల నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి షాద్నగర్, పరిగి, యాలాల మీదుగా తాండూరు పట్టణానికి, ఇక్కడి నుంచి చివరి పాయింట్ పెద్దేముల్కు కృష్ణాజాలలు పైప్లైన్ ద్వారా సరఫరా (గ్రావిటీ) కానున్నాయి. పట్టణంలో 65వేలకుపైగా జనాభా ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన ఆరు రిజర్వాయర్లు ద్వారా ప్రతి రోజు 6 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 14వేలకుపైగా గృహాలు ఉన్నాయి. ఇందులో 7వేల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటర్గ్రిడ్ ద్వారా పట్టణ శివారులోని ఖాంజాపూర్ గుట్టపై 10లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించనున్నారు. ఇక్కడనే ఒక సంపు కూడా నిర్మిస్తారు. శ్రీశైలం బ్యాక్వాటర్ ఖాంజాపూర్ గుట్టపై నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు చేరతాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రిజర్వాయర్లకు అదనంగా రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఖాంజాపూర్ గుట్ట సంపు నుంచి రిజర్వాయర్ల ద్వారా కృష్ణాజలాలు సరఫరా జరుగుతుంది. 6 ఎంఎల్డీ నుంచి 11ఎంఎల్డీకి తాగునీటి సామర్థ్యం పెరగనున్నది. దాంతోపాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. రెండు, మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నట్టు చెబుతున్నారు. 15ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా డిజైన్ చేసినట్టు తాండూరు మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు. -
భారీ పథకాలకు రుణాలివ్వండి
ప్రపంచబ్యాంకును కోరిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొన్నింటిలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొత్త విద్యుత్తు ప్లాంట్లపై తమ ఆసక్తిని కనబరిచింది. అందుకు అవసరమైన నిధుల సమీకరణకు తమ సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మతో ప్రపంచ బ్యాంకు అధికారి అంకుర్శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ప్లానింగ్ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు... ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎస్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఆర్థిక వనరులు పరిపుష్టంగా ఉన్నాయని.. అందుకే 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించిందని తెలిపారు. కానీ.. కొత్త రాష్ట్రం కావటంతో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు నిధుల సర్దుబాటు అవసరాన్ని అంశాల వారీగా విశ్లేషించారు. మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్, విద్యుత్తు ప్లాంట్లతో సిద్ధించే భవిష్యత్తు ప్రయోజనాలు.. ఆర్థిక లాభనష్టాలను చర్చించారు. ప్రపంచబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టులకు ఆర్థికంగా సాయం అందించాలని అధికారులు కోరారు. ఈ చర్చల సందర్భంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి ప్రపంచబ్యాంకు నుంచి రుణసాయం కోరినట్లు అధికారులు వివరించారు. కాగా, రాష్ట్రంలోని గిరిజనులు, ఇతర అట్టడుగువర్గాల అభ్యున్నతికి వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ బృందం త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఉట్నూరు, నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయనుంది. -
అవినీతిని ఉపేక్షించం...
♦ అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్గ్రిడ్ పనులు ♦ జిల్లాలో ఐదు సెగ్మెంట్ల ద్వారా నీటి సరఫరా ♦ రోడ్డు పనుల్లో అక్రమాలకు తావివ్వొద్దు ♦ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ♦ వరికోలు, పులిగిల్ల, హసన్పర్తి పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ♦ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. నాణ్యత, నిధుల విషయంలో రాజీలేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు చేపడుతున్నామని... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులతో కలిసి పరకాల మండలంలోని వరికోల్ గ్రామంలో గ్రామీణ రోడ్ల నిర్మాణ పథకం, రోడ్ల మరమ్మత్తు పనులకు పులిగిల్లలో శంకస్థాపన చేశారు. హసన్పర్తి మండలంలో రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపముఖ్యమంత్రి కడియం, మంత్రి చందులాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్భాస్కర్, కలెక్టర్ కరుణ, జెడ్పీచైర్పర్సన్ పద్మతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటర్గ్రిడ్, గ్రామీణ రోడ్లు, ఆసరా పింఛన్లు, హరిత హారం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వాటర్గ్రిడ్ పథకం ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమన్నారు. తాగు నీరు పొందడం ప్రజల హక్కు అని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అవినీతి రహితంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వాటర్ గ్రిడ్వల్ల తాగునీటితోపాటు పారిశ్రామిక ప్రగతి కూడా ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల 5 మీటర్ల లోతుకు నీరు వెళ్లిందని నివేదికలు చెబుతున్నాయని వివరించారు. జిల్లాలో ఐదు సెగ్మెంట్ల నుంచి తాగు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎల్ఎండీ సెగ్మెంట్... ఎల్ఎండీ సెగ్మెంట్ ద్వారా వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నియోజకవర్గాలు, స్టేషన్ఘన్పూర్లోని కొన్ని మండలాలు, ఒక కార్పొరేషన్, నగర పంచాయతీలకు రూ.720 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ తెలిపారు. పాలేరు.. డోర్మకల్, మహబూబాబాద్, నర్సంపేట, నియోజకవర్గాలతోపాటు ములుగులోని కొత్తగూడ, పాలకుర్తిలోని రాయపర్తి, తొర్రూరు మండలాలకు కలిపి మొత్తం 17 మండలాలు, ఒక మునిసిపాలిటీ, ఒక నగర పంచాయతీ పరిధిలో రూ.1800 కోట్లతో నీరందించే ప్రణాళికలు రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. గోదావరి, రామప్ప ... గోదావరి, రామప్ప సెగ్మెంట్ ద్వారా ములుగు నియోజకవర్గం, భూపాలపల్లిలోని గణపురానికి నీరిదించేందుకు రూ.286 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేటీఆర్ వివరించారు. ఎల్మడుగు.. ఈ సెగ్మెంట్ద్వారా రూ.342.66 కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాలకు, ఒక నగర పంచాయతీకి నీరందిస్తామని మంత్రి వెల్లడించారు. నీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం వే సవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు నిర్మాణం విషయంలో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై క ఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత పరిశీలనకు ప్రత్యేక తనిఖీ ృందాలు ఏర్పాటు చేయూలని సూచంచారు. నాణ్యత విషయంలో లోపాలు ఉన్నట్లయితే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిని పూర్తి స్థారుులో వ్యవసాయానికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్రావు మాట్లాడుతూ ప్రస్తుత తాగునీటి పనులకు మరో రూ.1.20కోట్లు విడుదల చే యాలని కోరారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజక వర్గంలో రూ.6 కోట్ల తాగునీటి పనులకు ప్రతిపాదనలు పంపించామని, ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని చెప్పారు. మిగతా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ నియోజక వర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.80లక్షలు విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ కొత్త బావుల తవ్వకానికి నిధులు ఇవ్వాలని కోరారు. అధికారుల పడిగాపులు... కలెక్టరేట్లో మధ్యాహ్నం 2గంటలకు మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం ఇవ్వడంతో అన్నిశ ాఖల అధికారులు మధ్యాహ్నం ఒంటి గంటకే కలెక్టరేట్కు చేరుకున్నారు. పరకాల, హసన్పర్తి కార్యక్రమాలతోపాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలెక్టరేట్లో సమావేశం సాయంత్రం 4గంటల తర్వాత ప్రారంభమైది.సుమారు రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. దీంతో కలెక్టరేట్లో వివిధ శాఖల ఉద్యోగులు సుమారు 7గంటలపాటు పడిగాపులు కాశారు. -
వాటర్గ్రిడ్ డీపీఆర్ బయట పెట్టాలి
షబ్బీర్ అలీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వాటర్గ్రిడ్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్డు(డీపీఆర్)ను ప్రజల ముందు పెట్టాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సీఎల్పీ ఉపనాయకులు టి.జీవన్రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వాటర్గ్రిడ్ పథకంలో ప్రాథమికస్థాయిలోనే అనేక అవకతవకలకు అవకాశం కలిగేవిధంగా ఉల్లంఘనలు ఉన్నాయని, అతిక్రమణలకు కారణాలు చెప్పకుండా కాంగ్రెస్పార్టీపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రకటించేనాటికి రూ.25 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇదివరకు చెప్పారని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని చెప్పి 40 వేల కోట్లకు ఏ సర్వే ఆధారంగా అంచనాలను పెంచారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం రూ.10,156 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొందని వివరించారు. న్యాయశాఖలో వివిధ పోస్టుల నియామకంలో ముస్లిం న్యాయవాదులపై వివక్షను ప్రదర్శించారని, దీనిని అరికట్టాలని కోరుతూ కేసీఆర్కు షబ్బీర్ అలీ లేఖను రాశారు. -
'కాంగ్రెస్కు క్లారిటీ కల్పిస్తాం'
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వాటర్గ్రిడ్ మిషన్ను ప్రారంభించామని, రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆరోపణలు చేస్తోందని మంత్రి కే టీ రామారావు అన్నారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. వాటర్గ్రిడ్పై కాంగ్రెస్ నేతలకు అవగాహనలేకపోతే పూర్తి క్లారిటీ కల్పిస్తామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరుకు భారీగా నిధులు మళ్లీస్తే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోన్న పట్టిసీమ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. రూ.10 వేల కోట్లతో వాటర్గ్రిడ్ పథకాన్ని కాంగ్రెస్ నేతలు చేపడితే అన్ని కాంట్రాక్టులు వారికే కేటాయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. -
అది కరప్షన్ గ్రిడ్..
ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ విమర్శ రూ.40వేల కోట్లు ఎందుకని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అని చెప్పుకుంటున్న వాటర్గ్రిడ్.. టీఆర్ఎస్కు కరప్షన్గ్రిడ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాటర్గ్రిడ్లో అక్రమాలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 70 శాతం గ్రామాలకు సురక్షిత తాగునీరు అందుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన గ్రామాలకు నీటిని అందించవచ్చని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కానీ, 40 వేల కోట్లతో కొత్తగా వాటర్గ్రిడ్ అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటివరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా తయారుచేయలేదు కానీ, టెండర్లు వేసి పంచుకోవడానికి మాత్రం అన్నీ సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. పథకంలో 14 ప్యాకేజీలు ఉంటాయని చెప్పి ఇప్పుడు 6 ప్యాకేజీలకు ఎందుకు కుదించారని ప్రశ్నించారు. ‘లెస్’ టెండర్ పేరుతో పంచుకోవడానికే మంత్రి కేటీఆర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాటిని తగ్గించారని ఆరోపించారు. తెలంగాణ కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నా, మొత్తం వాటర్గ్రిడ్ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. వాటర్గ్రిడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ వాటర్గ్రిడ్ ప్రజలకోసం కాదని, మంత్రి కేటీఆర్కు కమీషన్ల కోసమేనని ఆరోపించారు. కేటీఆర్ స్థాయిని, వయసును మరచి అధికార అహంకారంతో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్సింగ్ లాంటి జాతీయస్థాయి నాయకుడిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసులకు జానారెడ్డి నివాళి అర్పించారు. మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్అలీ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీని గుర్తిస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి లేఖ ప్రకారం ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీని నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీ గుర్తింపును అన్ని విభాగాలను పంపించారు. గ్రిడ్తో అదనపు భారం: జీవన్ రెడ్డి వాటర్గ్రిడ్ పేరుతో ప్రజలపై రూ. 35 వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేవలం రూ. 2 వేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి తాగు నీటిని అందించవచ్చని చెప్పారు. టీపీసీసీలో యువరక్తం.. యువత, పార్టీకోసం పనిచేసేవారితోనే టీపీసీసీ కార్యవర్గాన్ని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏఐ సీసీ నేతలు కొప్పుల రాజు, జైరాం రమేశ్తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టివిక్రమార్క శనివారం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. టీపీసీసీ కార్యవర్గం నియామకంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఒక అభిప్రాయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేయగలిగే వారినే టీపీసీసీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 60 ఏళ్లకు మించని వారినే పదవుల్లోకి తీసుకోనున్నారు. ఎక్కువగా యువతకు అవకాశం ఇవ్వాలనుకున్నా కొందరు సీనియర్లను కూడా తీసుకుంటే బాగుంటుం దనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. జిల్లాకు ఇద్దరు చొప్పున 20 మందితోనే పూర్తిస్థాయి కార్యవర్గం ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
పని తక్కువ..ప్రచారం ఎక్కువ
ప్రభుత్వ తీరుపై విపక్షాల ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాల అమలులో ఎలాంటి పురోగతి లేకపోయినా, ప్రభుత్వం ప్రచారం ఎక్కువ చేసుకుంటోంది. ఇదేదో బ్రహ్మపదార్థమంటూ ప్రజలను భ్రమల్లో ముంచుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి నీళ్లు ఇస్తామని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సీఎం కేసీఆర్ అంటున్నారు.. అదీ సాధ్యం కాదు.. ఇదీసాధ్యం కాదు’ అని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి పేర్కొన్నారు. ‘ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీరందక అవస్థలు పడుతుంటే .. వాటర్ గ్రిడ్ నిర్మించి మూడేళ్ల తర్వాత నీళ్లిస్తామనడం.. ఆకలితో ఉన్నవారికి కారంతోనైనా అన్నం పెట్టకుండా మూడేళ్ల తర్వాత బిర్యానీ పెడతాం’ అన్నట్టుగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో సోమవా రం బడ్జెట్పై నిర్వహించిన చర్చలో.. కొత్త పథకాల అమలులో జాప్యం, గత బడ్జెట్లో కేటాయింపుల్లో 43శాతానికి మించని ఖర్చు లు, తాజా బడ్జెట్లో లోపించిన వాస్తవికత తదితర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. వాటర్ గ్రిడ్పై ప్రభుత్వ హామీని నెరవేరుస్తామని, ఒకవేళ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని విపక్షాలు ఓ ఆయుధంగా వాడుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విపక్షాలకు సలహాఇచ్చారు. అధ్యయన కమిటీ ల పేరుతో కేజీ టు పీజీ ఉచిత పథకం అమలును ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తప్పుపట్టారు. గతంలో హేతుబద్ధీకరణ జరిపి ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మళ్లీ ప్రభుత్వం అందుకు సిద్ధమైందని ఆరోపించారు. కడియం శ్రీహరి సమాధానమిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని సరిచేసేందుకే ఉపాధ్యాయుల హేతబద్ధీకరణ చేపడుతామని, ఒక్క పాఠశాలను మూసివేయమని చెప్పారు. కార్పొరేట్ విద్య, వైద్య విధానాన్ని రద్దు చేసి ఆ సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కె.దిలీప్కుమార్ సూచించారు. ప్రమాదాలపై ఏర్పాటు చేసే ఎంక్వైరీ కమిటీ చట్టం కింద మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కి చట్టబద్ధత లేదని షబ్బీర్ విమర్శించారు.ఈ కమిటీ సిఫారసులు చెల్లుబాటు కావన్నారు. -
ఇంకా సర్వే దశ దాటలేదు!
నత్తనడకన ‘వాటర్గ్రిడ్’ కొన్ని జిల్లాల్లో లైన్ సర్వేకు ఖ రారు కాని టెండర్లు కొన్ని సెగ్మెంట్లలో ముందుకు రాని కాంట్రాక్టర్లు వచ్చినవారితోనే పనిచేయిస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో వాటర్గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ఓ వైపు ప్రభుత్వం దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు గ్రిడ్కు సంబంధించిన పనులేమో క్షేత్రస్థాయిలో నత్తనడకన జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ప్రాజెక్టు (వాటర్గ్రిడ్) తొలిదశకు సంబంధించిన లైన్ సర్వే ప్రక్రియ మొదలై ఆర్నెల్లు గడుస్తున్నా.. ఇంతవరకు కొన్ని జిల్లాల్లో లైన్ సర్వే కొలిక్కిరాలేదు. కొన్ని సెగ్మెంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాక లైన్ సర్వే చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అర్హతగల కాంట్రాక్టర్లు ముందుకురాని సెగ్మెంట్లలో అధికారులు వారికి.. నచ్చిన వాళ్లతోనే సర్వే పనులు చేయించాలని యోచిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే వాటర్గ్రిడ్ లైన్సర్వేలో ‘లైడార్’వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. ప్రస్తుతం జిల్లాల్లో లైన్ సర్వే పనులన్నీ సంప్రదాయ విధానంలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకనే.. వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 45 వేల కిలోమీటర్ల సెకండరీ పైప్లైన్ వేయాల్సి ఉంది. ఈ పైప్లైన్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లైన్ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆయా మార్గాల్లో ఎత్తుపల్లాలు, పొడవు, వెడల్పు..తదితర సర్వే అంశాల అధారంగానే నిర్మాణ పనులను నిర్వహిస్తారు. లైన్ సర్వే పూర్తికాకుంటే ప్రాజెక్టు అంచనాల రూపకల్పన, పైప్లైన్ నిర్మాణం ప్రారంభించేందుకు వీలుకాదు. ఈ నేపథ్యంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం గతేడాది అక్టోబర్లోనే లైన్ సర్వే కోసం టెండర్ల(ఈవోఐ)ను పిలిచింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 58 ఏజెన్సీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు 35 ఏజెన్సీలు మాత్రమే అర్హత(ఫైనాన్షియల్, టెక్నికల్) సాధించాయి. అయితే.. ఏజెన్సీలు తమ టెండర్లలో పేర్కొన్న ధరల్లో అతితక్కువ ధర(కిలోమీటరుకు రూ.3,500)నే సర్కారు ఖరారు చేసింది. దీంతో లైన్ సర్వే పనులు చేపట్టేందుకు కేవలం 18 ఏజెన్సీలే ముందుకు వచ్చాయి. ఇలా వచ్చిన ఏజెన్సీలతోనే ఆయా జిల్లాల్లోని సెగ్మెంట్లలో పనులు చేపట్టారు. అయితే.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆయా సెగ్మెంట్లలో సర్వే పనులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కానందునే అర్హత కలిగిన కంపెనీలు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదని సమాచారం. దీంతో మరలా టెండర్లు పిలిచేందుకు ఇష్టపడని అధికారులు తమకు నచ్చిన ఏజెన్సీలతోనే పనులు చేయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ‘లైడార్’పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం తెలంగాణ వాటర్గ్రిడ్ లైన్సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్)’ టెక్నాలజీని వినియోగించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలిసింది. లైడార్ టెక్నాలజీకి బదులుగా సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్(లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడమే ఇందుకు కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి కావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధునాతన పద్ధతులతోనే సాధ్యమని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమని వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. -
‘వాటర్ గ్రిడ్’కు ప్రత్యేక విభాగం
⇒ కొత్తగా డివిజన్లు, సబ్ డివిజన్ల ఏర్పాటు ⇒52 మంది వివిధ కేడర్ల ఇంజనీర్ల కేటాయింపు ⇒ఉత్తర్వులు విడుదల చేసిన రేమండ్ పీటర్ ⇒ఇక వేగంగా కొనసాగనున్న పనులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్ గ్రిడ్’ పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా పథకం పునర్విభజనలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్కు తోడు వాటర్గ్రిడ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను ఇకనుంచి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్పీ)’ చేపట్టనుంది. ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సర్కిళ్లు, 25 డివిజన్లు, 67 సబ్డివిజన్లు ఉండగా, వాటర్గ్రిడ్ కోసం 9 సర్కిళ్లు, 20 డివిజన్లు, 92 సబ్డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం జిల్లాలో మూడు డివిజన్లు, 15 సబ్ డివిజన్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఆర్డబ్ల్యూఎస్ కింద నిజామాబాద్, బాన్సువాడ డివిజన్లు ఉండగా,టీఎస్డబ్ల్యూఎస్పీ కింద నిజామాబాద్,బాన్సు వాడ, ఆర్మూరు డివిజన్లు వాటర్గ్రిడ్ కోసం పనిచేస్తాయి. వాటర్గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక చీఫ్ ఇంజినీర్, 10 ఎస్ఈలు, 31 మంది ఈఈలు, 104 మందిడిప్యూటీ ఈఈలు, 346 ఏఈఈ/ఏఈలను నియమించనుండగా, జిల్లాకు ఒక ఎస్ఈ, ముగ్గురు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లతో పాటు డిప్యూటీ ఈఈలు, ఏఈఈలను కేటాయించారు. నిజామాబాద్ కేంద్రంగా వాటర్గ్రిడ్ కోసం ఒక క్వాలిటీ కంట్రోల్ డివిజన్, నిజామాబాద్, బాన్సువాడలలో రెండు సబ్డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 35 రెగ్యులర్ వర్క్ఇన్స్పెక్టర్లకు తోడు 17 మందిని ఔట్సోర్సింగ్ ద్వారా కొత్తగా నియమిస్తే ఆ సంఖ్య మొత్తం 52కు చేరుతుంది. అలాగే టీడీడబ్ల్యూఎస్పీ కింద వివిధ కేడర్లకు చెందిన ఇంజినీర్లుగా పదవీ విరమణ చేసిన వారిని సైతం నియమించుకోవచ్చని ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో వాటర్గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం సర్వేల ప్రక్రియ పూర్తి చేయగా.. త్వరలోనే ఆ పథకం పనులు చేపట్టే క్రమంలో పెద్ద ఎత్తున మార్పులు, విభజనలకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అవుతోంది. -
మూడేళ్లలో తాగునీటి ప్రాజెక్టు పూర్తి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు (వాటర్ గ్రిడ్)ను పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై గురువారం సచి వాలయంలో సీఎస్ రాజీవ్ శర్మతో సమీక్షించారు. లైన్ సర్వే జరిగిన తీరును, ప్రాజెక్టు కింద చేపట్టబోతున్న నిర్మాణాల వివరాలను, ఇందుకోసం ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని ఈ సందర్భంగా మంత్రి సీఎస్కు వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలను అందజేశారు. రాష్ట్ర స్థాయిలో పనులు సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ అటవీ శాఖ, ప్రభుత్వ భూముల సేకరణ నిమిత్తం ఆయా శాఖల నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని మంత్రి కోరారు. వెంటనే స్పందించిన సీఎస్ అటవీశాఖ అధికారులను సమావేశానికి పిలిపించారు. ఈ నెల 27న గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని అటవీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్ఈలు, డీఎఫ్ఓలతో సమీక్ష నిర్వహించి పక్కా గా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే స్థానిక అధికారుల సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో, మెదక్లో కొంతమేరకు ప్రభుత్వ భూముల సేకరణ పూర్తయిందని అధికారులు తెలిపారు. నిధుల సేకరణపై తెలంగాణ ప్రభుత్వం నాబార్డ్, జైకా, ఎల్ఐసీ వంటి సంస్థలతో చర్చలు ప్రారంభించిందని, ఆయా సంస్థలు ప్రాజెక్టు నిధులు ఇచ్చేం దుకు సానుకూలత వ్యక్తం చేశాయని, త్వరలోనే మరిన్ని సంస్థలతో చర్చలు జరుపుతామని మంత్రికి సీఎస్ వివరించారు. తెలంగాణ తాగునీటి ప్రాజెక్టును కాస్ట్ ఎఫిషియెన్సీ ప్రాజెక్టుగా మలిచేందుకు తమ శాఖ ప్రయత్నిస్తోం దని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఇంట్రా విలేజ్ లైన్ నెట్వర్క్ కోసం చేపట్టాల్సిన పనుల అంచనాలపై మరింత కసరత్తు చేస్తున్నారన్నారు. సీఎం ఆకాంక్షల మేరకు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం తమకు ఉందని మంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ సిబ్బంది చెబుతున్న విధంగా టెండర్లు పూర్తయిన 36 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన డిజై న్లు పూర్తయిన వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారుల సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ పనిచేస్తున్న తీరును చాలా రాష్ట్రాలు మెచ్చుకున్నాయని... సిబ్బం దికి మంత్రి అభినందనలు తెలిపారు. -
వాటర్గ్రిడ్ ఆర్డినెన్స్కు నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్కు భూసేకరణ నిమిత్తం ఆర్డినెన్స్ను తెస్తూ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(3) ప్రకారం తెలంగాణ వాటర్గ్రిడ్ పైప్లైన్స్ ఆర్డినెన్స్ 3/2015ను గెజిట్లో ప్రచురించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
సగం నిధులివ్వండి
-
సగం నిధులివ్వండి
వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయపై ప్రధానికి కేసీఆర్ వినతి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వండి హైకోర్టు విభజనను వేగంగా చేపట్టండి ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించండి విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు సరఫరా లైన్లు ఏర్పాటు చేయండి విభజన హామీలు, రాష్ట్రానికి కేంద్ర నిధులపై సీఎం విజ్ఞప్తులు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానికి కేసీఆర్ ఆహ్వానం! అనంతరం ముంబైకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ’ పథకాలకు 50 శాతం కేంద్ర నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులతో పాటు మరిన్ని అంశాల్లో తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున వచ్చే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీతో కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వారు ఏకాంతంగా చర్చలు జరిపారు. ‘విభజన’ హామీలను నెరవేర్చండి: విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. భేటీలో ప్రధానంగా ఐదు అంశాలపై కేసీఆర్ విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం వీలైనంత త్వరగా హైకోర్టు విభజన చేయాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లప్రాజెక్టుకు జాతీయ హోదాను వెంటనే ప్రకటించాలని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని అడిగారు. ఆ ప్రాజెక్టుకు జల సంఘం అనుమతులు రావాల్సి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రానికి రండి: ‘మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్’ పథకాలను భేటీలో కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇంటింటికీ మంచి నీరు అందించే ఉద్దేశంతో వాటర్గ్రిడ్ పథకాన్ని రూపొందించామని... అదేవిధ ంగా తెలంగాణలోని 45 వేల చెరువులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని రూపొందించామని ప్రధానికి వివరించారు. ఈ రెండు పథకాలకు అయ్యే నిధుల్లో 50 శాతాన్ని కేంద్రం నుంచి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని కేసీఆర్ ఆహ్వానించినట్టు సమాచారం. విద్యుత్ సమస్యను తీర్చేందుకు వీలుగా మహారాష్ట్రలోని వార్ధా మీదుగా డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని మోదీని కోరారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయని... ఇందుకు కేంద్రం నుంచి కొన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ నేరుగా ముంబైకి బయలుదేరారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయన సమావేశం కానున్నారు. -
వాటర్గ్రిడ్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్
భూముల హక్కులు ధారాదత్తం ఆగమేఘాలపై సర్కారు నిర్ణయం నేడు గవర్నర్ ఆమోదానికి ఫైలు భూసేకరణ బదులు కొత్త చట్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను బలవంతంగానైనా సేకరిం చేందుకు తోడ్పడేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకుంది. భూసేకరణకు బదులుగా భూ వినియోగదారుల హక్కుల సేకరణకు వీలుగా ‘తెలంగాణ వాటర్ పైప్లైన్స్ (భూ వినియోగదారుల హక్కుల సేకరణ) ఆర్డినెన్స్-2015’ను రూపొందించింది. ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్...వాటర్గ్రిడ్కు అవసరమైన నిధులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరేందుకు ప్రధాని మోదీతో సోమవారం సమావేశమయ్యేలోగానే ఆర్డినెన్స్పై గవర్నర్ ఆమోదముద్ర వేయించేందుకు ప్రభుత్వం శరవేగంగా ఫైళ్లు కదుపుతోంది. సీఎం ఆదేశాలతో శనివారం ఉదయమే ఆర్డినెన్స్ ఫైలును నోట్ రూపంలో అధికారులు మంత్రుల ఆమోదానికి పంపి సంతకాలు సేకరించారు. దీంతో ఆదివారం ఈ ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశముంది. తెలంగాణ వాటర్గ్రిడ్ అమలుకు దీన్ని నిర్దేశించినట్లు నోట్లో ప్రస్తావించారు. గుజరాత్ మోడల్లో ప్రభుత్వం వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఆవాసాలు, పరిశ్రమల అవసరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ. 26 వేల కోట్ల అంచనా వ్యయంలో ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా, గోదావరి బేసిన్లో మొత్తం 36 నీటి వనరులను గుర్తించారు. దాదాపు 1.25 లక్షల కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలంటే భూసేకరణ అత్యంత కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగం గుర్తించింది. కేవలం గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా పైపులైన్ వేసేందుకు వీలుగా... ఎటువంటి భూములకు సంబంధించిన హక్కులనైనా సేకరించేలా (రైట్ ఆఫ్ వే) చట్టం ఉండాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న భూసేకరణ అవరోధాలను అధిగమించేందుకు గుజరాత్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని నమూనాగా స్వీకరించాలని సూచించింది. గత ఏడాది నవంబర్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో జరిగిన సమావేశంలోనే ఈ చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు వీలైనంత తొందరగా చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని రెవెన్యూ విభాగాన్ని పంచాయతీరాజ్ విభాగం కోరింది. చట్టం తేవాలంటే బిల్లు ప్రవేశపెట్టేందుకు బడ్జెట్ సమావేశాల వరకు నిరీక్షించాలి. ఈలోగానే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉండటంతో సీఎం నిర్ణయం మేరకు అధికారులు ఆర్డినెన్స్కు సన్నాహాలు చేశారు. న్యాయ సలహా తీసుకొని గుజరాత్ చట్టం తరహాలోనే ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను రూపొందించారు. ఇష్టం లేకున్నా భూములివ్వాల్సిందే... కొత్త ఆర్డినెన్స్తో తమకు ఇష్టమున్నా.. లేకున్నా.. రేటు నచ్చినా నచ్చకపోయినా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, పైపులైన్లకు అవసరమైన భూములను యజమానుల నుంచి సర్కారు నిర్బంధంగా స్వాధీనం చేసుకుంటుంది. వీటిపై ఉన్న హక్కులన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం భూములను సేకరించాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. కానీ భూముల గుర్తింపు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మొదలు ఫైనల్ నోటిఫికేషన్, బహిరంగ విచారణ.. వివిధ దశల్లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈ వ్యవధిలో ఎప్పుడైనా తన హక్కులకు భంగం కలిగినట్లుగా భావిస్తే సదరు భూ యజమానులు అభ్యంతరం తెలపటంతోపాటు కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు గిట్టుబాటు కాకపోయినా... అదనంగా చెల్లింపులు కోరే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే.. ఈ హక్కులన్నీ కాలరాసినట్లవుతుంది. ప్రాజెక్టుకు అవసరంగా ప్రభుత్వం గుర్తించిన భూములన్నీ కేవలం నెల వ్యవధిలోనే సర్కారు స్వాధీనం చేసుకోవచ్చు. -
ఊపందుకున్న వాటర్గ్రిడ్ పనులు
•సింగూరులో రూ.280 కోట్లతో ఇన్టెక్ వెల్ నిర్మాణం •పల్లెలకు నీటి సరఫరాపై కొనసాగుతున్న సర్వే •నేడు మంత్రి కేటీఆర్సమీక్ష సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ పనులకు జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇన్టెక్ వెల్, ఫిల్టర్బెడ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు ప్రారంభించారు. మెదక్, సంగారెడ్డి వాటర్గ్రిడ్లలో భాగంగా సింగూరు ప్రాజెక్టు వద్ద రెండు ఇన్టెక్ వెల్స్, ఫిల్టర్బెడ్లు నిర్మించనున్నారు. వచ్చేనెల పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 2,456 నివాస ప్రాంతాల్లోని ప్రజలకు రోజుకు ఒక్కొక్కరికి వందలీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా జిల్లాలో రూ.2,400 కోట్లతో వాటర్గ్రిడ్కు రూపకల్పన చేశారు. మెదక్ వాటర్గ్రిడ్ ద్వారా మెదక్, అందోలు, నారాయణఖేడ్ నియోజక వర్గాలకు, సంగారెడ్డి గ్రిడ్ ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు మెదక్ గ్రిడ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మొదట భావించినా ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ నియోజక వర్గంతోపాటు సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాటర్గ్రిడ్లో మంజీర మంచి నీటి పథకాన్ని విలీనం చేసి నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయనున్నట్టు సమాచారం. వాటర్గ్రిడ్ నుంచి పైప్లైన్ల ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేస్తున్నారు. పైప్లైన్ల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇదిలావుంటే గ్రిడ్కు అవసరమైన కరెంటును సరఫరా చేసేందుకు ట్రాన్స్కో సన్నద్ధమవుతోంది. సింగూరులో నిర్మించనున్న ఇన్టెక్ వెల్ వద్ద వాటర్ పంపింగ్, ఫిల్టర్లు పనిచేసేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతోంది అంచనా వేసి అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వాటర్గ్రిడ్ కోసం సింగూరు వద్ద ప్రత్యేకంగా సబ్స్టేషన్ నిర్మించనున్నట్టు సమాచారం. రూ.280 కోట్లతో ఇన్టెక్ వెల్, వాటర్ ఫిల్టర్లు.. సంగారెడ్డి, మెదక్ వాటర్గ్రిడ్లకు సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీర నీటిని వినియోగించనున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అవసరమైన తాగునీటిని కేటాయించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సంగారెడ్డి వాటర్గ్రిడ్కు 1.25 టీఎంసీలు, మెదక్ వాటర్గ్రిడ్కు మరో 1.25 టీఎంసీల నీరు అవసరమవుతాయని అంచనా. సంగారెడ్డి, మెదక్ వాటర్గ్రిడ్లకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సింగూరు ప్రాజెక్టు సమీపంలో వేర్వేరుగా ఇన్టెక్ వెల్, ఫిల్టర్లు నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదివారం ఇన్టెక్వెల్ నిర్మించే ప్రాంతాన్ని సందర్శించ నున్నారు. -
వాటర్ గ్రిడ్కు సహకరిస్తాం..
కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ నిధులిచ్చేలా ప్రపంచబ్యాంక్ వంటి సంస్థలకు సిఫారసు చేస్తాం బడ్జెట్లో తెలంగాణకు వీలైనన్ని నిధులు కేటాయిస్తాం కేసీఆర్తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెల్లడి బీఆర్జీఎఫ్, ఉపాధి హామీసహా పలు అంశాలపై చర్చ వాటర్ గ్రిడ్కు కేంద్ర నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చాలా చక్కటి పథకమని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో అవకాశాన్ని బట్టి ఈ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద పథకం కావడంతో ఆర్థిక సహాయం కోసం ప్రపంచబ్యాంకు వంటి సంస్థలను సంప్రదించాలని.. అవసరమైతే కేంద్రం తరఫున సిఫారసు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హమీ ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీలోని కృషిభవన్లో కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్తో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, బీబీ పాటిల్, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వాటర్ గ్రిడ్ ఉద్దేశం, లక్ష్యాలను కేంద్ర మంత్రికికేసీఆర్ వివరించారు. ఈ పథకానికి రాష్ట్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇక తెలంగాణలో తొమ్మిది జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినా... బీఆర్జీఎఫ్ (బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్) కింద మూడు జిల్లాలకే నిధులు ఇస్తున్నారని, అన్ని జిల్లాలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు మండలాల సంఖ్య తగ్గిస్తున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. అదే విధంగా రాష్ట్ర విభజనకు ముందున్న గణాంకాల ప్రకారం పేదరికాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారని.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెలంగాణలో పేదరికాన్ని గుర్తించాలని కోరారు. కేసీఆర్తో భేటీ అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ గురించి కేసీఆర్ చెప్పారని, ఈ కొత్త పథకానికి వీలైనంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత తెలంగాణ వాటాకు తమ శాఖ నుంచి వచ్చే నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బీఆర్జీఎఫ్ నిధుల కేటాయింపులపై విలేకరులు ప్రశ్నిం చగా... ‘‘ప్రస్తుతానికి తెలంగాణలోని నాలుగు జిల్లాలకు బీఆర్జీఎఫ్ కింద నిధులు కేటాయించాం. ఇందులో మూడు జిల్లాలు అదనపు నిధుల కోసం అడిగాయి. అయితే మేం జిల్లాను ఒక యూనిట్గా కాకుండా, బ్లాక్ ఆధారంగా నిధులు కేటాయిస్తున్నాం. అందులో మరికొన్ని జిల్లాలు రావొచ్చు. కొన్ని సంపన్న బ్లాకులు బయటికి వెళ్లొచ్చు..’’ అని బీరేంద్రసింగ్ చెప్పారు. ఉపాధి హామీ మండలాల తగ్గింపును ఒక జిల్లాలోనో, ఒక రాష్ట్రంలో చేయడం లేదని దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. -
‘వాటర్గ్రిడ్’ తొలిదశకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: వాటర్గ్రిడ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల తొలిదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటికి అవసరమైన నిధులను మంజూరు చేస్తూ సంబంధిత ఫైళ్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం సంతకం చేశారు. వాటర్గ్రిడ్ తొలిదశలో 14 సెగ్మెంట్లలో పనులను ప్రారంభించేందుకు రూ. 1,518.52 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో ఇంటేక్వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, రా వాటర్ పంపింగ్ మెయిన్స్, హైటెన్షన్ విద్యుత్ సరఫరా పనులు చేపడతారు. ఇక కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి 39.272 టీఎంసీల నీటిని వాటర్గ్రిడ్ కోసం కేటాయించేందుకు నీటి పారుదల శాఖ ఆమోదం తెలిపింది. నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలనే విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనుల కోసం రూ. 14,350 కోట్ల మేర పరిపాలనా అనుమతులకు సీఎం ఆమోదం తెలిపారు. తొలిదశ పనుల్లో జూరాల రిజర్వాయర్ నుంచి కోయలకొండ వరకు 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతో పాటు సమీప ప్రాంతాలకు తాగునీరు అందిస్తారు. -
శ్రీశైలం జలాలే కీలకం
వాటర్గ్రిడ్ ద్వారా 3 జిల్లాలకు నీరు ఎల్లూరు లిఫ్ట్ నుంచే నీటితరలింపు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వాటర్గ్రిడ్’ పథకానికి శ్రీశైలం జలాశయమే కీలకం కానుంది. రాష్ట్రంలోని దాదాపు నాలుగోవంతు మండలాలకు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచే తాగునీటిని పంపింగ్ చేయనున్నారు. రక్షితమంచినీటి జలాలు అందించేందుకు వాటర్గ్రిడ్ పథకాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజించారు. రెండు సెగ్మెంట్లకూ కృష్ణానది నీటిని పంపింగ్ చేసేలా డిజైన్లు రూపొందించారు. అత్యంత కీలకమైన మొదటి సెగ్మెంటుకు మాత్రం శ్రీశైలం బ్యాక్వాటర్ ఆధారంగా నీటిని పంపింగ్ చేస్తారు. దీనిద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని 128 మండలాలు, ఎనిమిది మున్సిపాలిటీల్లో దాహార్తి తీరనుంది. తొలుత వాటర్గ్రిడ్ కోసం ఎల్లూరు కోతిగుండు వద్ద ఇన్టేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించినా, ఆప్రతిపాదన విరమించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఎల్లూరు వద్ద శ్రీశైలం బ్యాక్వాటర్ను తోడేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ను ఉపయోగించనున్నారు. వాటర్గ్రిడ్ మొదటి సెగ్మెంటుకు ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 13.11 టీఎంసీలను వినియోగిస్తారు. మహబూబ్నగర్కు 5.10, నల్లగొండకు 4.59, రంగారెడ్డికి 3.41టీఎంసీల చొప్పున తరలిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి (53.85 టీఎంసీలు) చేరినా వాటర్గ్రిడ్ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా డిజైన్ రూపొందించారు. పారిశ్రామిక అవసరాలనూ దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు. కాగా, శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి తాగునీటిని పంప్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పథకం పూర్తిస్థాయిలో పనిచేయడం కష్టమేనన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి వాటర్గ్రిడ్కు నీటిని తరలించడంపై స్థానికంగా నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పది శాతం మేర నీటిని తాగునీటికి వాడొచ్చనే నిబంధన మేరకే వాటర్గ్రిడ్కు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఏం డిపార్ట్మెంటండీ మీది..
పంచాయతీరాజ్ అధికారుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వికారాబాద్ : జిల్లా పంచాయతీ రాజ్ శాఖ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్లోని మహావీర్ ఆస్పత్రిలోని వాటర్గ్రిడ్పై కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. వాటర్గ్రిడ్ రొటీన్ పని అనుకోవద్దని, మెల్లగా చేద్దాం అనుకుంటే కుదరదని అధికారులను హెచ్చరించారు. పీఆర్ డిపార్ట్మెంట్ ఎస్ఈ ఎక్కడ.. అని ప్రశ్నించగా, అతను రాలేదనే సమాధానం వచ్చింది. వెంటనే మంత్రి ఈఎన్సీని పిలిచి.. ఏమిటీ మీ శాఖ పనితీరు ఇలా ఉంది.. ఈ రోజు సమీక్ష ఉందని తెలిసి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి నిధులొచ్చాయి కదా.. వాటికి టెండర్లు పిలిచారా.. అని ఆ శాఖ ఈఈ ని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో.. మీరు ఆఫీసుకు వస్తున్నారా.. లేదా అని ప్రశ్నించారు. మీ శాఖ రివ్యూ జరుగుతుంటే మీ దగ్గర సమాచారం లేదు.. మీరు ఇదే పని చేస్తున్నారా.. లేదా రియల్ఎస్టేట్ ఏమైనా చేస్తున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జిల్లాలో మొత్తం కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారో చెప్పండంటూ డీఈలు, ఏఈలను ప్రశ్నించగా ఎవరి నుంచీ సమాధానం రాలేదు. దీంతో మరింత విస్తుపోయిన మంత్రి.. ‘ఏం డిపార్టుమెంటండీ.. మీదీ..’ అంటూ నిర్లక్ష్యంగా ఉన్న వారినందరినీ బదిలీ చేయండని కలెక్టర్కు సూచించారు. అనంతరం ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. -
వాటర్ గ్రిడ్ కు సవాళ్లు..!
⇒ జిల్లాలో ఎత్తయిన కొండలు, గుట్టలు ⇒ కడెం గ్రిడ్కు త్వరలో టెండర్లు ⇒ మిగితా మూడింటికి కొనసాగుతున్న సర్వే పనులు ⇒ పనుల పరిశీలనకు నేడు మంత్రి కేటీఆర్ రాక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎత్తయిన కొండలు.. గుట్టలు.. అడవి.. చెట్టు.. పుట్టలు.. భౌగోళికంగా విభిన్న పరిస్థితులున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ పనులకు ప్రధాన సవాల్గా మారనుంది. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న ఆవాసాలకు ఈ గ్రిడ్ల పైప్లైన్ల నిర్మాణం, వాటి నిర్వహణకు అనేక అడ్డంకులు అధిగమించాల్సి రానుందని ఆర్డబ్ల్యూఎస్ వర్గాలు భావిస్తున్నాయి.ఎత్తయిన ప్రదేశాలకు నీటిని తరలించడానికి సర్జ్ ట్రీట్మెంట్, జీరో వెలాసిటీ వాల్స్ వంటి నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్కు అవసరమైన నీటి వనరుల లభ్యత ఉన్నా, ఆ నీటిని జిల్లా ప్రజల చెంతకు చేర్చడానికి ఏ జిల్లాలో లేనివిధంగా అడ్డంకులు ఎదురవుతాయని గ్రామీణ నీటి సరఫరా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నార్నూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, కెరమెరి, ఇంద్రవెల్లి, బోథ్, ఆదిలాబాద్ తదితర మండలాల పరిధిలో సుమారు వందకు పైగా ఆవాసాలకు ఈ గ్రిడ్ ద్వారా అసలు తాగునీటిని సరఫరా చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది.వీటి కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. జిల్లాలో కొనసాగుతున్న ఈ వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తయిన కడెం గ్రిడ్ సర్వే పనులు.. ఖానాపూర్ నియోజకవర్గానికి తాగునీటిని సరఫరా చేసేందుకు మొదటి విడతలో కడెం గ్రిడ్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనుల సర్వే ఇప్పటికే పూర్తి కాగా, రూ.370 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన మూడు.. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి గ్రిడ్ల సర్వే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ మూడు గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులు నాలుగు ఏజెన్సీలను ఎంపిక చేసి నామినేషన్ పద్ధతిలోనే సర్వే పనులు అప్పగించారు. 26 బృందాలు ఈ సర్వే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ వాటర్గ్రిడ్ల లక్ష్యం.. రానున్న మూడున్నరేళ్ల తర్వాత తాగునీటి కోసం ఏ ఒక్క మహిళా కూడా బిందెతో రోడ్డుపై రావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం వాటర్గ్రిడ్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, పట్టణ ప్రాంతల్లో 135 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు రూ.3,940 కోట్లతో నాలుగు గ్రిడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మరో రూ.150 కోట్లతో ముథోల్ నియోజకవర్గానికి తాగునీటిని అందించేందుకు గడ్డెన్నవాగు గ్రిడ్ను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పర్యటన ఇలా.. కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకుని హెలిక్యాప్టర్లో ఉదయం 11 గంటలకు చెన్నూరు మండలంలోని ఎల్ మడుగుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న ఇన్టెక్ వెల్ పనుల ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్కు చేరకుంటారు. గ్రిడ్ పనుల్లో భాగంగా కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద నిర్మించనున్న ఇన్టెక్ వెల్ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఈ సమీక్షలో కేటీఆర్తోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార వర్గాల్లో హడావుడి నెలకొంది. చెన్నూరు మండలం సోమన్పల్లి, ఆసిఫాబాద్ వద్ద హెలిప్యాడ్లను నిర్మించారు. -
ఎలా చేద్దాం!
* వాటర్గ్రిడ్పై నేడు జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ సమీక్ష * సమావేశానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు * పంచాయతీ రాజ్ పనుల పురోగతిపైనా చర్చించనున్న మంత్రి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్గ్రిడ్’పై కరసత్తు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్షించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లాలవారీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో శనివారం ఆయన జిల్లాకు రానున్నారు. వికారాబాద్లోని మహవీర్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల పురోగతితోపాటు వాటర్గ్రిడ్పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లా మంత్రి మహేందర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రఘునందన్రావు, జేసీలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రూ.2,500 కోట్లతో వాటర్గ్రిడ్.. ప్రతిష్టాత్మక వాటర్గ్రిడ్ కోసం జిల్లా యంత్రాంగం రూ.2,500 కోట్లతో ప్రణాళిక తయారు చేసింది. వాటర్గ్రిడ్ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కృష్ణా నీటితో.. మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాలను గోదావరి నీటితో అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక తయారైంది. మొత్తంగా గ్రిడ్ ద్వారా జిల్లాలోని 1,044 హాబిటేషన్లకు తాగునీటిని అందించనున్నారు. ఈ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సర్వే మొదలైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తుది ప్రణాళిక ఖరారుకు కొంత సమయం పట్టనుందని, కాగా క్షేత్రస్థాయిలో అన్ని వార్గాలనుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గ్రిడ్ ప్రణాళికకు అసలురూపు రానుందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో ‘వాటర్గ్రిడ్’కు సీఎం శంకుస్థాపన
మార్చి నుంచి బీడీ కార్మికులకు పింఛన్: కేటీఆర్ సూర్యాపేట: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వద్ద వాటర్గ్రిడ్ పనులకు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ చౌటుప్పల్ వద్ద జరుగుతున్న వాటర్గ్రిడ్ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. గత పాలకులు వదిలేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతున్నామని చెప్పారు. బీడీ కార్మికులతోపాటు ఒంటరి స్త్రీలకు కూడా పింఛన్ పథకాన్ని అమలుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఖమ్మం, వైరాలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాకోర్టులో ఓడినవారు హైకోర్టుకు వెళ్లి కేసీఆర్ పాలన సక్రమంగా లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పింఛన్ల కోసం కొండరెడ్ల కనిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. -
తెలంగాణలో ఇంటింటికి మంచినీరు: కేటీఆర్
నల్గొండ: తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి మంచి నీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ... థర్మల్ పవర్ప్లాంట్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలేకండా చేస్తామన్నారు. అలాగే గతంలో ఇచ్చిన హామీలు మేరకు త్వరలో పునర్విభజనలో భాగంగా సూర్యాపేటను జిల్లాగా మారుస్తామని కేటీఆర్ తెలిపారు. -
వాటర్గ్రిడ్కు ‘హడ్కో’ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్గ్రిడ్ పథకానికి రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అంగీకరించింది. వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై.. బుధవారం సీఎం కె.చంద్రశేఖరరావు సమీక్షిస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన హడ్కో ప్రతినిధులు ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిని బట్టి వివిధ దశల్లో రుణ మొత్తాన్ని అందిస్తామని వారు హామీ ఇచ్చారు. వాటర్గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. -
ప్రజలందరికీ తాగునీటి హక్కు:కేటీఆర్
⇒ ఇంతకుమించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదు ⇒ మహిళలకే ప్రాజెక్టు బాధ్యతలు ⇒ మంచి పేరు పెడితే బహుమతి ⇒ వాటర్గ్రిడ్పై మీడియా సమావేశంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యా హక్కు, సమాచార హక్కు మాదిరిగానే తెలంగాణ ప్రజలందరికీ తాగునీటి హక్కు(రైట్ టు డ్రింకింగ్ వాటర్)ను కల్పించాలన్నది సీఎం కె.చంద్రశేఖర్రావు ఆకాంక్ష అని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సీఎం ఆకాంక్షకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న వాటర్గ్రిడ్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇంటింటికీ నల్లా ఇవ్వకుంటే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్లడగనని కేసీఆర్ చేసిన భీష్మ ప్రతిజ్ఞను సఫలం చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. వాటర్గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే నిమిత్తం మంత్రి కేటీఆర్ మంగళవారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్గ్రిడ్ కీలక అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మోదీ లేఖతోనే వాటర్గ్రిడ్కు నాంది.. రాష్ర్ట ప్రభుత్వం కొలువుదీరిన తొలివారంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి నాకు లేఖ వచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత నీరు అందించేలా వాటర్గ్రిడ్ ప్రాజెక్టులను చేపట్టాలని, గుజరాత్లో తాము చేపట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్న వాటర్గ్రిడ్ ప్రాజెక్టును సందర్శించాలని అందులో సూచిం చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీరందించే ప్రాజెక్టును 15 ఏళ్ల క్రితమే సిద్ధిపేట్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అయినప్పటికీ గుజరాత్ వాటర్గ్రిడ్ను, సిద్ధిపేట్ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాటర్గ్రిడ్ ప్రారంభానికి మునుపు గుజరాత్లో దుర్భర పరిస్థితులున్నాయి. నిత్యం 4 వేల ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేసేవారు. రైళ్ల ద్వారా కూడా నీటి సరఫరా జరిగేది. అలాంటిది, ప్రస్తుతం అక్కడి ప్రజలకు అవసరమైన మేరకు సురక్షిత తాగునీరు లభిస్తోంది. తెలంగాణలో నీరు దొరకని పరిస్థితి లేకున్నా.. సురక్షితమైన నీరు లభించక ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాకుండా గుజరాత్లో భౌగోళిక పరిస్థితులు తెలంగాణలోని పరిస్థితులకు భిన్నంగా ఉన్నా యి. అక్కడికన్నా ఇక్కడ ఎత్తు పల్లాలు అధిక ం. ఈ నేపథ్యంలో కరువు కాలంలోనూ నీరు లభ్యమయ్యేలా కృష్ణా, గోదావరి జీవనదుల నుంచి నీటిని తీసుకుని గ్రావిటీ ద్వారా గ్రామాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. ఈ తరహాలోనే విజయవంతంగా అమలవుతున్న సిద్ధిపేట్ ప్రాజెక్టునే మోడల్గా తీసుకున్నాం. ఇరిగేషన్ శాఖతో పేచీల్లేవ్.. వాటర్గ్రిడ్కు నీటిలభ్యతపై నీటిపారుదల శాఖతో ఎటువంటి పేచీల్లేవు. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునే హక్కుంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి 800 టీఎంసీలు పొందే హక్కుంది. ఇందులో 10 శాతం అంటే 80 టీఎంసీల నీటిని వాటర్గ్రిడ్కు వినియోగించుకోవచ్చు. వాస్తవానికి అవసరమైన నీరు 39 టీఎంసీలే. నిర్మాణాలు, పవర్స్టేషన్ల ఏర్పాటుకు భూమి తదితర అంశాలకు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయి. వచ్చే నెల రెండో వారంలో పైలాన్.. మూడేళ్లలో వాటర్గ్రిడ్ను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండో వారంలో వాటర్గ్రిడ్ పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించడంతో పనులు ప్రారంభమవుతాయి. టర్న్కీ విధానం ద్వారా నీటి వనరుల నుంచి గ్రామాలకు సరఫరా చేస్తాం. వాటర్గ్రిడ్ పూర్తయితే ప్రతి గ్రామంలో ఒక్కో వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాల్టీల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల మంచినీరు అందుతుంది. గ్రిడ్ బాధ్యతలు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి 1,238 పోస్టులను కొత్తగా మంజూరు చేశాం. తగినన్ని వాహనాలు, ల్యాప్ట్యాప్లు అందించాం. నిధుల కొరత ఏర్పడకుండా మిగిలిన ప్రాజెక్టులకు కేటాయింపులు నిలిపేసైనా వాటర్గ్రిడ్ కోసం వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 4 వేల గ్రామాలకు నీరందించే పనులకు రూ. 1,340 కోట్లను మంజూరు చేసింది. వాటర్గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ తుది దశలో ఉంది. హడ్కో, జైకా సంస్థలు నిధులిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. గ్రిడ్ నిర్వహణే సవాల్.. వాటర్గ్రిడ్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత లను మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత కూడా వారికే అప్పగిస్తున్నాం. పేరు పెట్టండి.. బహుమతి పట్టండి వాటర్గ్రిడ్ పథకానికి మంచి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మంచి పేరు సూచిం చిన వారికి ప్రభుత్వం తరఫున మంచి బహుమతిని అందిస్తాం. అభయహస్తం పథకానికి కొత్త రూపు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం 13.11 టీఎంసీల కృష్ణానీటిని వినియోగిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి దశ పంప్హౌస్ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలతో కలసి మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే నెలాఖరుకు అభయహస్తం పథకం బకాయిలు చెల్లించడంతో పాటు పథకానికి కొత్త రూపు ఇస్తాం. అభయహస్తం లబ్ధిదారులను ఆసరా పథకం కిందకు తెస్తాం. వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు. ఆసరా పథకంలో చెంచుల వయో పరిమితిని 50 ఏళ్లకు తగ్గించి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. -
'వాటర్గ్రిడ్'కు స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ వాటర్గ్రిడ్ పనులను మంగళవారం పర్యవేక్షించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఎంజీఎల్ఐ ప్రాజెక్టు సమీపంలో వాటర్గ్రిడ్ కోసం స్థలాన్ని కేటీఆర్ పరిశీలించారు. జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డి, తదితరులు కేటీఆర్కు జిల్లా పరిస్థితిని వివరించారు. అనంతరం కొల్లాపూర్లో అధికారులతో సమీక్ష జరిపారు. వాటర్గ్రిడ్ పథకానికి సంబంధించిన అంశాలపై అధికారులతో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ చర్చించారు. -
ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
-
ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఇక ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే, ఓ మహిళా ఎంపీతో పాటు మరొకరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కావాలని కోరాలని భావిస్తున్నారు. భారీ ప్రాజెక్టులు, పథకాలకు నిధులు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు నిధులు కావల్సి ఉండటం, ప్రత్యేక హోదా లేకపోవడం... ఇలాంటి కారణాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఈ దిశగా ఆలోచించేందుకు కారణమయ్యాయని అంటున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ గనక ఎన్డీయేలో చేరితే.. జాతీయ స్థాయిలో ప్రభావంతో పాటు రాష్ట్రానికి కూడా ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రలో టీడీపీ ఇప్పటికే ఎన్డీయేలో ఉన్నందున.. వాళ్లకంటే తమకు నిధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే జోరుగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ల పాటు మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందు వెనక ఆలోచించినా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో చేరితేనే మంచిదని భావిస్తున్నారు. అయితే, ఇదే తరుణంలో టీడీపీతో టీఆర్ఎస్కు ఇప్పటికి సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం, ఇటు తెలంగాణ బీజేపీ నేతలతో కూడా అంతగా సఖ్యత లేకపోవడం లాంటి కారణాల రీత్యా బీజేపీ ఎంతవరకు టీఆర్ఎస్ను దగ్గరకు చేర్చుకుంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. -
‘వాటర్ గ్రిడ్’పై సమగ్ర చర్చ అవసరం
సందర్భం తెలంగాణ ప్రభుత్వం భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అందుబాటులో ఉన్న సమాచారం స్వల్పం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ సమాచారాన్నంతా బహిరంగపరచి, విస్తృత చర్చ, సంప్రదింపులు నిర్వహించాలి. భారీ వ్యయంతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు జల ప్రాజెక్టులను తెలం గాణ ప్రభుత్వం తలపెట్టింది. మొదటిది, పైపులు, పంపుల ద్వారా తాగునీటి, గృహ అవ సరాలను తీర్చే ‘‘వాటర్ గ్రిడ్’’. రెండవది, వ్యవసాయ, గృహ అవసరాలకు నీటి లభ్య తను మెరుగుపరచే లక్ష్యంతో గ్రామీణ చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ. రూ. 50,000 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, సామా జిక అంశాలపై నిర్మాణాత్మకమైన బహిరంగ చర్చ అవ సరం. ప్రతిపాదిత వాటర్ గ్రిడ్పై ఇంతవరకు అందు బాటులో ఉన్న సమాచారం స్వల్పం. దాని పైన ఆధా రపడి ప్రాజెక్టు డిజైనింగు, అమలు, వ్యయాల తగ్గింపు నకు తోడ్పడాలనేదే ఈ వ్యాసం లక్ష్యం. గ్రామీణ నీటి సరఫరా పథకాలు మనకు కొత్తేమీ కాదు. బావుల మరమ్మతు, కొత్త పంచాయితీ బావుల తవ్వకంతో తాగునీటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ జోక్యం ప్రారంభమైంది. ఆ తర్వాత చేతి పంపులు, ఆ తదుపరి ఎమ్ 2 పంపులతో లోతైన బోరు బావులు,పెద్ద గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్లు ప్రవేశిం చాయి. నేడు ఆర్ఓ (నీటి శుద్ధి) ప్లాంట్లు, వాటర్ క్యాన్లు సురక్షితమైన తాగునీటికి సంకేతంగా మారాయి. పలు గ్రామాలకు ఇంకా చేతి పంపులే తాగునీటికి ఆధారం. అయినా ఆర్ఓ ప్లాంట్లు, వాటర్ క్యాన్లే విస్తరిస్తున్న ధోరణి. ఈ మార్పునకు చాలానే కారణాలున్నాయి. వాటిలో నీటి లభ్యత, నాణ్యత ప్రధానమైనవి. ప్రజల ఆదాయాలు, నీటి నుంచి సంక్రమించే వ్యాధులపట్ల అవగాహన పెరగడం కూడా ప్రజల తాగునీటి ఎంపి కలో గణనీయమైన మార్పును తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు డిజైనింగ్, అమలులో దిగువ అంశాలను పరిగ ణనలోకి తీసుకోవాలని భావిస్తున్నాం. గ్రామీణ జనాభాలో 50% నేడు ఆర్ఓ ప్లాంట్ల తాగునీటిని వాడుతున్నారని, 2020 నాటికి 80% ఆ నీరే వాడుతారని అంచనా. కాబట్టి వాటర్ గ్రిడ్ పూర్తయ్యేస రికి తాగునీటికి గ్రిడ్ ప్రధాన వనరుగా ఉండకపోవచ్చు. ఒకే గ్రిడ్, ఒకే వనరు ప్రభుత్వ ప్రణాళికయితే వనరు, దూరం, గ్రిడ్ నుంచి గ్రామీణ తెలంగాణకు అం తటికీ నీటి రవాణా ఏర్పాట్లు వంటి విషయాల్లో చాలా సవాళ్లు ఎదురుకావచ్చు. లేక వాటర్ గ్రిడ్ పలు నీటి వన రులతో కూడిన ప్రాజెక్టయితే, అలాంటి వనరులను ఉప యోగించుకోవడంలో నాణ్యత, పరిమాణాలకు సంబం ధించి పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రిడ్ ద్వారా సరఫరా చేసే నీటి యూనిట్ వ్యయం మరో సవాలు కావచ్చు. గ్రిడ్ ద్వారా సరఫరా చేసే నీటిని ప్రజలు తాగు నీటిగా ఉపయోగించకపోతే, గృహావసరాలు తదితరా లకు జలరవాణాపై అంత భారీ పెట్టుబడులను పెట్టడం సమంజసం కాకపోవచ్చు. ఇప్పటికే పలుచోట్ల స్థానికంగా పైపులు, పంపుల వ్యవస్థలున్నాయి. అవి లేని చోట్ల ఆ ఖాళీలను పూరించ డానికి వాటర్ గ్రిడ్ సమంజసం కావచ్చు. అందుకోస మైతే ఈ ప్రాజెక్టును ప్రతిచోటా గాక, పంపునీటి కనెక్షన్లు లేని చోట్ల ప్రారంభించడమే తర్కబద్ధమవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. తెలంగాణ ప్రజ లందరి గృహ, తాగునీటి అవసరాలకు సరిపడేటంత సురక్షితమైన నీటిని అందించాల్సిన అవశ్యకతను ఎవ రూ ప్రశ్నించడం లేదు. ప్రాజెక్టును మరింత ఆమోదయో గ్యంగా, ఆర్థికంగా మనగలిగేదిగా చేయడం కోసమే పై అంశాలను లేవనెత్తాం. దిగువ సూచనలను చేస్తున్నాం. 1.గృహ, తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రస్తుత మున్న మౌలిక సదుపాయాల స్థితిపై శీఘ్రమే వివ రమైన నివేదికను రూపొందించడం ముందుగా చేయాల్సిన పని. ఆ నివేదకలో ఈ అంశాలను చేర్చ వచ్చు: ఎ) సగటున రోజుకు 120 లీటర్ల ప్రమాణం ప్రకారం ఇప్పుడున్న తాగునీటి సదుపాయాలు, పంపిణీ, విస్తరణ; బి) ప్రస్తుతం ఉన్న శుద్ధి చేసిన తాగునీటి సదుపాయాలు, వాటి పంపిణీ, విస్తృతి; సి) వాటి పై పెట్టిన ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడు లు; డి) స్థానికంగా ఉన్న పంపు నీటి వ్యవస్థలు, వాటి సమర్థత; ఇ) స్థానికంగా వాటర్ గ్రిడ్లు ఉం డివుంటే వాటి విస్తృతి; ఎఫ్) శుద్ధిచేసిన నీటి ప్రస్తు త డిమాండు, సరఫరా. ఈ నివేదకను నెలలో తయారుచేయవచ్చు. ఆ తదుపరి ‘అందుబాటులో లేని వారికి ప్రాధాన్యం’ అనే ప్రాతిపదికన వాటర్ గ్రిడ్ను డిజైన్ చేయాలి. ఇప్పటికే ఉన్న పరిశుద్ధ నీటి వ్యవస్థలను బలోపేతం చేసి, విస్తరించడం ద్వారా త్వరితగతిన ఫలితాలను సాధించవచ్చు. 2. {Wy్ డిజైనింగ్కు, ఆమోదానికి, అమలుకు కాలం పడుతుంది. కాబట్టి జిల్లాకో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి, తదుపరి వాటిని వాటర్ గ్రిడ్తో అనుసంధానించవచ్చు. 3. ముందే చెప్పినట్టుగా శుద్ధిచేసిన క్యాన్లలోని తాగు నీటి వాడకం గ్రామీణ ప్రాంతాల్లో కూడా భవిష్యత్ ధోరణి. కాబట్టి ప్రజలు గ్రిడ్ నీటిని తాగకపో వచ్చు. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వ్యవస్థ లను బలోపేతం చేసి, నియంత్రణ వ్యవస్థను నెలకొల్పి, గ్రిడ్ నీరు నాణ్యమైనది, సురక్షితమైనది, ధర రీత్యా అందుబాటులో ఉండేదిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 4.ఇలాంటి ప్రాజెక్టుకు నిర్దిష్ట కాలపరిమితిలో స్పష్ట మైన లక్ష్యం, టార్గెట్లు, ప్రయోజనాలను నిర్వచించే ప్రభావ విశ్లేషణ అవసరం. ప్రాజెక్టు ప్రభావాన్ని ప్రభుత్వంతోపాటూ పౌర సమాజం కూడా క్రమం తప్పక పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి ముందే ప్రభు త్వం స్పష్టమైన, పారదర్శక క్రమాన్ని ప్రారంభించాలి. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు సమాచా రాన్నంతా బహిరంగపరచాలి. టెండర్ల ప్రక్రియకు ముం దే, ఇప్పుడే విస్తృత బహిరంగ చర్చ, సంప్రదింపులు చేపట్టడం మెరుగైన డిజైనింగ్కు, అమలుకు తోడ్పడు తుంది, ప్రజలందరికీ మేలు చేకూరుతుంది. (వ్యాసకర్త ఐరాసలో పనిచేసిన అంతర్జాతీయ జల నిర్వహణా నిపుణులు) email:bg@agsri.com -
ఆర్థిక చేయూతనివ్వండి
కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు సాయం అందించాలని, మరికొన్ని సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్ టీఆర్ఎస్ ఎంపీ వినోద్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడుతో కలసి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్, గ్రామీణాభివృద్ధి మంత్రి భీరేంద్రసింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరిలతో వేర్వేరుగా భేటీ అయి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రులతో భేటీ వివరాలను వెల్లడించారు. వాటర్గ్రిడ్కు ఆర్థిక సాయం.. ఇంటింటికీ రక్షిత నీరు అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభిస్తోందని, ఇందుకయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్రం భరించాలని కేంద్ర మంత్రి భీరేంద్రసింగ్ను కోరినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఉపాధి హామీ పథకాన్ని కుదించరాదని, అవసరమైతే పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన కేంద్రమంత్రి ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆర్థిక ఏడాది చివరి త్రైమాసిక నిధులు రూ.223 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు బీఆర్జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.228 కోట్లు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రానికి వచ్చే పింఛన్ కోటాను పెంచాలని కోరామని, దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయమన్నాం.. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్, దుబ్బాక, పోచంపల్లి, మహబూబ్నగర్లలో ఎక్కడైనా హ్యాండ్లూమ్ క్లసర్లు ఏర్పాటుచేయాలని జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ను కోరినట్టు కేటీఆర్ తెలిపారు. టీ-హబ్ ఇంక్యుబేషన్ సెంటర్కు మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని కేంద్రమంత్రి సుజానా చౌదరికి, సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న ఈఎస్ఐ డిస్పెన్సరీని 200 పడకలకు అప్గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు విన్నవించామన్నారు. కేంద్ర సహకారం ఉంటుంది: దత్తాత్రేయ రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. తనతో కేటీఆర్ భేటీ అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. నేడు మహబూబ్నగర్కు కేటీఆర్ వాటర్గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసే ఇంటేక్వెల్ సర్వే, డిజైన్లను ఆయన పరిశీలించనున్నారు. -
'సెలవుల్లో కూడా పని చేసేందుకు రెడీగా ఉండాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వాటర్ గ్రిడ్' పథకం పనులను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు అధికారులకు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు యుద్ధ ప్రాతిపదికన వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సెలవు రోజుల్లోనూ పని చేయడానికి అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఎలాంటి పాలనాపరమైన అనుమతులైనా ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందని అధికారులకు తెలియజేశారు. -
సబ్ కాంట్రాక్టర్లు ఇకపై కాంట్రాక్టర్లు
గుర్తింపు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసిన వారిని కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, రహదారుల పనులు చేపడుతున్నందున సబ్ కాంట్రాక్టర్లను, కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించాలని చీఫ్ ఇంజనీర్ల బోర్డు (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్) ప్రభుత్వానికి గతంలో సిఫార్సుచేసింది. క్లిష్టమైన కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించడంతో పాటు తెలంగాణకు చెందిన సబ్ కాంట్రాక్టర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి కాంట్రాక్టర్లుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. సబ్ కాంట్రాక్టర్లు నేరుగా టెండర్లు దాఖలు చేయడానికి వీలుగా, గతంలోని జీవోలను మార్పు చేయాల్సి ఉందని, గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాదైనా రూ. 2.5 కోట్ల టర్నోవర్ ఉంటే ఆ సబ్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక తరగతి కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అర్హత కల్పించాలని బోర్డు సూచించింది. స్థానిక సంస్థల పరిధిలో నిర్మాణ రంగంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్లకు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అర్హత కల్పించాలని సిఫార్సు చేసింది. సీఎంను కలసిన సబ్ కాంట్రాక్టర్ల బృందం.. సోమవారం సబ్ కాంట్రాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో రావాల్సిన బకాయిలు, తమను కాంట్రాక్టర్లుగా గుర్తించే విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ సబ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు విశ్వరాజ్పాల్, ఇతర నాయకులు హరినాథ్, శ్రీనాథ్, గౌతమ్రెడ్డి తదితరులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం వారి సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లింపు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల వరకు టెండర్ వేసేందుకు ఉన్న అర్హతను రూ.10 కోట్లకు పెంచేందుకు సీఎం సానుకూలత తెలిపినట్లు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
నెలాఖరులోగా ‘వాటర్గ్రిడ్’ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: వాటర్గ్రిడ్కు సంబంధించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రిడ్ పనుల కోసం వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులను వెంటనే పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాటర్గ్రిడ్, పంచాయతీ రహదారుల నిర్మాణాలపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రిడ్ కోసం నిర్మించబోతున్న ఇంటేక్ వెల్స్ అంచనాలు, డిజైన్లను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ .. తదితర విభాగాల అధికారులతో కలిపి రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని వారంలోగా నియమించాలని, నెలాఖరుకల్లా వాటర్గ్రిడ్ పైలాన్ నిర్మాణం పూర్తిచేసి, ఫిబ్రవరిలో ఆవిష్కరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. -
కొండెక్కేదెలా..!
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : భౌగోళికంగా అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ప్రజల గొంతులు తడపడం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన సవాల్గా మారనుంది. సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెండు నియోజకవర్గాల గ్రామాలకు తాగునీరు అందించాలంటే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామీణ నీటి సరఫరా శాఖ గుర్తించింది. ఇటీవల హైదరాబాద్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్వహించిన వాటర్గ్రిడ్ పనుల సమీక్షలో ఈ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. నిర్మల్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు, 930 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎస్సారెస్పీ గ్రిడ్ను డిజైన్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి బన్సపల్లి వద్ద నుంచి నీటిని ఎత్తిపోసుకోవాలని నిర్ణయించారు. ఈ బన్సపల్లి సముద్ర మట్టానికి 331 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల గ్రామాలు సుమారు 450 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయాలంటే కనీసం 181 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. మహబూబ్ ఘాట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఈ మేరకు పైప్లైన్లు నిర్మిస్తే.. రానున్న రోజుల్లో ఈ పైప్లైన్ల నిర్వహణలో అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం ఖాయమని ఆ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఒక్కోసారి పైపులు పగిలి పోవడం వంటి ఘటనలు చోటు చేసుకుని నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించి గ్రిడ్ రూపకల్పనకు ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో కూడా నిపుణులు అందుబాటులో లేరు. ఇందుకోసం ఉన్నత సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని గ్రిడ్ను రూపకల్పన చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీర్ ఇంద్రసేన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. రాసిమెట్ట వద్ద పంపింగ్ కేంద్రం.. బన్సపల్లి వద్ద ఎస్సారెస్పీ నీటిని శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా నీటిని బూరుగుపల్లి(నేరడిగొండ మండలం)కి తరలిస్తారు. ఇక్కడ పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి, ఇక్కడి నుంచి మామడ మండల పరిధిలో ఉన్న రాసిమెట్టకు నీటిని పంపు చేస్తారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో 512 మీటర్ల ఉన్న ఈ రాసిమెట్టకు నీటిని ఎక్కిస్తే అక్కడి నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయడం సులభమవుతుందని ఆర్డబ్ల్యూఎస్ భావిస్తోంది. కొలిక్కి వచ్చిన కడెం గ్రిడ్ సర్వే.. జిల్లాలో వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటి కటకటను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వాటర్గ్రిడ్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో నాలుగు గ్రిడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సర్వే కోసం టెండర్లు పిలువగా, ఒక్క కడెం గ్రిడ్కు మాత్రమే సర్వే చేసేందుకు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని 594 గ్రామాల ప్రజల గొంతులు తడిపేందుకు రూపొందించిన ఈ గ్రిడ్ సర్వే పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మిగిలిన గ్రిడ్ల సర్వేకు మరోమారు టెండర్లు పిలవాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. -
7 జిల్లాల్లో వాటర్ గ్రిడ్
దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ మంచినీరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజలందరికీ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో.. తొలి దశలో ఏడు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటునకు పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. తొలి దశలో అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. ఈ జిల్లాల్లో తాగునీటికి, పరిశ్రమలకు సరఫరా చేసేందుకు 73.134 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. ఏడు జిల్లాలకుగాను అనంతపురం జిల్లా వాటర్ గ్రిడ్కు మాత్రం సవివరమైన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. దీనికి రూ.1,400 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మిగతా ఆరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్కు సవివరమైన ప్రాజెక్టు నివేదికలు తయారీ దశలో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు పెన్నా అహోబిలం, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా నీటిని వాటర్ గ్రిడ్కు వినియోగించాలని ప్రతిపాదించారు. అలాగే చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి, గండికోట ద్వారా నీటిని వాటర్ గ్రిడ్కు వినియోగించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట మైలవరం నీటిని, కర్నూలు జిల్లాలో శ్రీశైలం నీటిని వాటర్ గ్రిడ్కు వినియోగించాలని ప్రతిపాదించారు. నెల్లూరు జిల్లాకు సోమశిల, కండలేరు నీటిని, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాటర్ గ్రిడ్కు కృష్ణా జలాలను వినియోగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇదిలా ఉండగా మొత్తం 13 జిల్లాలకు వాటర్ గ్రిడ్కు తాగునీటి, పరిశ్రమల అవసరాలకోసం 232.10 టీఎంసీలు అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో 13 జిల్లాల పట్టణ, గ్రామీణ మంచినీటి అవసరాలకు 166.42 టీఎంసీలు, పరిశ్రమలకోసం 65.68 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. నీటి అవసరాలను కూడా 2044 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని లెక్కకట్టారు. వాటర్ గ్రిడ్లకు జలాశయాల్లో నీటిని వినియోగించడానికి అవసరమైన అనుమతిని సాగునీటి శాఖ ఇవ్వాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభా పెరుగుదలను ఈ విధంగా అంచనా వేశారు. 20112014 10 శాతం జనాభా పెరుగుదల 20142024 9 శాతం జనాభా పెరుగుదల 20242034 8 శాతం జనాభా పెరుగుదల 20342044 7 శాతం జనాభా పెరుగుదల తాగునీరు, పరిశ్రమలకు 73.134 టీఎంసీలు 13 జిల్లాలకు 232 టీఎంసీలు అవసరం అనంతపురం వాటర్ గ్రిడ్కు 1,400 రూ. కోట్ల అంచనా