
దాడులకు నిరసనగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం
గుంటూరు: వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై జరుగుతున్నదాడులు హేయమైనవని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ...భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు. 20 మంది తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి తమ పైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన మండిపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.