District Collector
-
ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గౌడౌన్లలో తనిఖీలు
-
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
అధికారులు, జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
-
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
కర్నూలు తొలి మహిళా కలెక్టర్గా బాధ్యతలు.. డాక్టర్ సృజన ఏమన్నారంటే..
కర్నూలు(సెంట్రల్): ‘‘నేను ఎక్కువగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశా. మొదటగా జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకుంటా. ఆ తరువాత వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతూ అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తా’’ అని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం ఉదయం 9.37 గంటలకు కలెక్టర్ తన చాంబర్లో తొలి మహిళా కలెక్టర్గా సర్వమత ప్రార్థనలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు కలెక్టర్గా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే గుడిసెలు లేని రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్నారు. రీసర్వేతో వందేళ్ల భూ సమస్యలకు చెక్ పడుతుండడంతో ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తానన్నారు. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్తేజ, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీఓ హరిప్రసాద్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నాగప్రసన్న లక్ష్మీ, డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటసుబ్బయ్య, సీపీఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటా.. ప్రజా సమస్యలపై వాటాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా. ఏ అంశంలోనైనా వేగంగా స్పందించడానికే ఇష్టపడతా’’ అని కలెక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ముందుగా ఒక్కో అధికారిని పరిచయం చేసుకొని పాలనలో తన ప్రాధాన్యత అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. అధికారులు సమయ పాలన పాటించకపోయినా, బాధ్యతా రహితంగా వ్యవహరించినా సహించేది లేదని మొదటి సమావేశంలోనే నిక్కచ్చిగా తెలిపారు. నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని.. ఫైళ్లను ఈ–ఆఫీసులోనే పంపాలని, అప్పుడే వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఫైళ్ల నిర్వహణలో సమస్యలు ఉంటే అధికారులు నేరుగా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. మండలస్థాయిలోని స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డాక్టర్ జి.సృజన తనదైన శైలిలో విధి నిర్వహణలో పాల్గొన్నారు. ఉదయం స్పందన, జిల్లా ఉన్నతాధికారుల సమావేశాల్లో తన లక్ష్యాలేమిటో వివరించారు. సాయంత్రం కలెక్టరేట్ సమూదాయంలో ఏ అధికారి కార్యాలయం ఎక్కడుందో పర్యటించి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ‘స్పందన’ కంటితుడుపు కాదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కంటి తుడుపు కాదని, అధికారులు శ్రద్ధగా పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. మండల, సచివాలయ స్థాయిల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయి స్పందనకు రావడంపై ఆమె అధికారులను నిలదీశారు. తీరు మార్చుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె స్పందనలోనే మొదట పాల్గొని ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్పందనలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఎస్డీసీలు రమా, సీపీఓ అప్పలకొండ, డీఆర్డీఏపీడీ ఎం.వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఏమన్నారంటే.. ► స్పందనలో వచ్చిన 30–40 సమస్యల్లో అధికంగా మండల, గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిష్కారం కావాల్సిన చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ వచ్చి మూడేళ్లవుతున్నా అక్కడ ఎందుకు పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదు. ► స్పందనలో వచ్చిన సమస్యల్లో పరిష్కరించే అధికారికి కాకుండా ఇతరులకు పంపితే ఆ ఫిర్యాదు రిజెక్ట్ అవుతుంది. తద్వారా అర్జీదారుడు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ► స్పందన సమస్యలను గడువులోపు పరిçష్కరించాలి. తిరస్కరించిన సమస్యలకు తగిన కారణాలతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలి. ► ‘జగనన్నకు చెబుతాం’ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ కార్యక్రమాన్ని సీఎంఓ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. దివ్యాంగుల దగ్గరికే వెళ్లి అర్జీల స్వీకరణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జి.సృజన మొదటి అధికారిక కార్యక్రమం స్పందనలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు. స్పందనకు వచ్చిన వికలాంగులు, అంధుల దగ్గరికే వెళ్లి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ‘‘గతంలో స్పందన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలి. లేకపోతే ఏ కారణంతో చేయలేకపోతున్నారో ఎండార్స్మెంట్లో స్పష్టం చేయాలి.’’ – జి.సృజన, జిల్లా కలెక్టర్ -
మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎర్త్ డేకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించి ప్రకృతి పరిరక్షణ గురించి చెబుతున్న సందర్భం.. అదే సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ఓ ప్రభుత్వ వాహనం మూడు గంటలుగా ఆన్లోనే ఉంచి.. డ్రైవర్ ఏసీ వేసుకుని ఉన్నాడు.. ఇదేమిటి.. ఇన్ని గంటలు కారును ఆన్లోనే ఉంచావు అని అడిగితే ‘మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి’ అని సమాధానం. ఇంతకు ఆ కారు ఎవరిదంటే.. బల్దియా ఎస్ఈ అధికారిక వాహనం. గ్రీవెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. కార్యక్రమం ముగిసి బయటికి వచ్చేంతవరకు కారును ఇలా ఆన్లోనే ఉంచడం గమనార్హం. ఇదేనేమో ఇంధన పొదుపు.. పర్యావరణ పరిరక్షణ అంటే.. !! -
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని డిస్ట్రిక్ట్ అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఇవ్వాలని 2012లో బాల్కొండ ప్రాంత రైతాంగం కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం కింద బాధితులకు రూ.62,85,180 చెల్లించాలని కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే అధికారులు 51,13,350 మాత్రమే జమ చేశారు. దీంతో రైతులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయనందున జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. చదవండి: (వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాలలో ఓ సంచలనం: భట్టి) -
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
కేటుగాళ్లు.. కలెక్టర్ డీపీ పెట్టుకుని 1.40 లక్షలు కొట్టేశారు
సూర్యాపేట క్రైం: కలెక్టర్ డీపీ పెట్టుకుని ఏకంగా జిల్లా అధికారి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీపీతో కేటుగాళ్లు వాట్సాప్ నంబర్తో డీఎంహెచ్వో డాక్టర్ కోటాచలం నంబర్కు మెసేజ్ చేశారు. నాకు అర్జెంటుగా రూ.1.40 లక్షలు కావాలని కోరారు. దీంతో నిజంగానే కలెక్టర్ మెసేజ్ పెట్టారని నమ్మి సదరు వైద్యాధికారి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఏకంగా రూ.1.40 లక్షల విలువైన ఆరు అమెజాన్ గిఫ్ట్ కార్డులను పంపించారు. వెంటనే అదే నంబర్ నుంచి ఇంకో రూ.20 వేలు పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారి ఆ నంబర్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించి ఆ అధికారి సైబర్ సెల్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లకు వాట్సాప్ ద్వారా.. సోమవారం నుంచి వారం రోజుల పాటు దృష్టి సారించాల్సిన అంశాలు, సాధించాల్సిన పురోగతిపై స్పష్టమైన లక్ష్యాలను విధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కుంటి నడకతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి వెళ్లే సరికి ముందుకు పురోగమించడం లేదు. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో తలెత్తుతున్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్లో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలపై విస్తృత రీతిలో సమీక్షలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కొంతకాలం అధికార యంత్రాంగం హడావుడి చేసినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత అంశాల అమలుపై ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. తాజాగా ఈ వారం ఐదు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని సూచించారు. 1. పోడుపై సమన్వయ కమిటీ సమావేశాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం కల్పించడంలో భాగంగా ఈ వారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలి. గ్రామ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి గడువు నిర్దేశించుకోవాలి. ఎప్పటిలోగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియజేయాలి. 2. పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో పంపిణీ చేపట్టాలి. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు 8 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తికి లక్షిత తేదీని తెలియజేయాలి. 3. క్రమబద్ధీకరణ దరఖాస్తులు పరిశీలించాలి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలను ప్రారంభించి రెండు వారాల్లోగా పూర్తి చేయాలి. ఇందుకు సరిపడ సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరపాలి. 4. ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టీఎం33 కింద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పట్టాదారు పేరు, విస్తీర్ణం, భూమి స్వభావం, మిస్సింగ్ సర్వే నంబర్ల నమోదు గురించి వచ్చే దరఖాస్తులను పరిష్కరించాలి. ఎన్ని దరఖాస్తులు ఆమోదించారో, ఎన్ని తిరస్కరించాలో ఎప్పటికప్పుడు వివరాలు పంపాలి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. 5. విషాహార ఘటనలు పునరావృతం కావొద్దు రాష్ట్రంలోని గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లో విషాహార ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
జిల్లా కలెక్టర్కే ఝలక్ ఇచ్చిన కోతి.. ఏం చేసిందంటే?
లక్నో: ఒక జిల్లాకు కలెక్టర్ అధిపతి. జిల్లాలో ఆయనను మించిన పవర్ఫుల్ వ్యక్తి మరొకరు ఉండరు. అయితే, అలాంటి వ్యక్తికే ఝలక్ ఇచ్చింది ఓ కోతి. చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ కలెక్టర్ కంటి అద్దాలను ఎత్తుకెళ్లి తానేంటో చూపించింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్, మథురాలోని బృందావన్ నగరంలో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ చాహల్ గ్లాసెస్ను ఎత్తుకెళ్లిన వానరం దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు భారత అటవీ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద. కలెక్టర్ నవనీత్ చాహల్, పలువురు పోలీసులు ఓ భవనం వద్ద గుమిగూడి కోతి నుంచి గ్లాసెస్ ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ భవనం గోడలపై ఇతర కోతులు సైతం ఉన్నాయి. కొద్ది సేపు బుజ్జగించిన తర్వాత కంటి అద్దాలను తిరిగి ఇచ్చేసింది ఆ వానరం. ‘భారత్లోని ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజిస్టేట్ను మించిన పవర్ఫుల్ వ్యక్తి ఉండడు. బృందావన్లో డీఎం నవనీత్ చాహల్ అద్దాలను కోతీ ఎత్తుకెళ్లింది. కొద్ది సమయం బుజ్జగించిన తర్వాత తిరిగి ఇచ్చేసింది’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు సుశాంత నంద. If you had not seen someone more powerful than District Magistrate of a District in India😊 Monkey snatches glasses from DM Navneet Chahal in Vrindavan, Mathura.After some pleading,the monkeys returned the glasses. pic.twitter.com/YTERfjh62G — Susanta Nanda IFS (@susantananda3) August 21, 2022 ఇదీ చదవండి: మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి! -
కలెక్టర్వా? పోలిటికల్ ఏజెంట్వా?
భోపాల్: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని పక్కనపెట్టి.. ఓడిన అభ్యర్థిని విజేతగా ప్రకటించిన నేరానికి ఓ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ పోస్ట్కే అనర్హుడివంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించారు పన్నా జిల్లా కలెక్టర్ సంజయ్ మిశ్రా. దీంతో న్యాయమూర్తి ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పన్నా కలెక్టర్ సంజయ్ మిశ్రా-ఫైల్ ఫొటో పన్నా జిల్లాలో జులై 27వ తేదీన 25 మంది సభ్యులున్న గున్నూర్ జనపద్ పంచాయతీకి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి పరమానంద శర్మ బీజేపీ అభ్యర్థి రామ్శిరోమణి మిశ్రాను ఓడించారు. అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ పరమానంద శర్మను విజేతగా ప్రకటించగా.. రామ్శిరోమణి మాత్రం పన్నా కలెక్టర్ సంజయ్ మిశ్రాను ఆశ్రయించి వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. దీంతో ఆ మరుసటి రోజు లాటరీ ద్వారా ఎన్నికలు నిర్వహించి.. రామ్శిరోమణిని విజేతగా ప్రకటించారు కలెక్టర్ సంజయ్ మిశ్రా. దీంతో పరమానంద శర్మ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనను వినిపించేందుకు సమయం కూడా ఇవ్వలేదని పిటిషన్లో అభ్యర్థించారు. పిటిషన్పై విచారణ సందర్భగా.. జస్టిస్ వివేక్ అగర్వాల్, కలెక్టర్ సంజయ్ మిశ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక పొలిటికల్ ఏజెంట్గా వ్యవహారించారు. కలెక్టర్గా ఉండే అర్హత ఆయనకు లేదు. కలెక్టర్ విధుల నుంచి ఆయన్ని తొలగించాలి అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
వాట్ యాన్ ఐడియా సర్ జీ! అధికారులకు కొత్త రకం ఫోన్లు ఇచ్చిన కలెక్టర్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు. ఆపదలో రక్షణ కవచం.. తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి. కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్లు డైరెక్ట్గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
జోరువానలోనూ కలెక్టర్, ఎంపీ పర్యటన
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒకవైపు ఉరుములు, పిడుగులతో భారీ వర్షం పడుతున్నా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు మండలంలోని కిత్తాబు గ్రామాన్ని సందర్శించారు. మంత్రి, కలెక్టర్ సోమవారం నాడు గానుగుల వరకు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి కిత్తాబు గ్రామానికి చేరుకున్నారు. జడివానలో తడుచుకుంటూ గ్రామానికి చేరుకున్న మంత్రి, అధికారులను చూసి గిరిజనులు అమితమైన ఆనందానికి లోనయ్యారు. గ్రామంలో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్ని ఓపికగా విన్న కలెక్టర్, మంత్రి వెంటనే సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఆ అధికారం జిల్లా కలెక్టర్లకే ఉంది
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూముల్లో ఏవి నిషేధిత భూములో తెలిపే జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు పంపే అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూముల జాబితా పంపే అధికారం తహసీల్దార్లకు లేదని స్పష్టం చేసింది. కలెక్టర్లు పంపిన జాబితా ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారులు నడుచుకోవాలని తెలిపింది. ఇతర శాఖల అధికారులు కూడా ఈ జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా పంపేందుకు మాత్రమే చట్టం అనుమతిస్తుందని తెలిపింది. ఈ జాబితాలోని భూముల వివరాలను కలెక్టర్లు పరిశీలించి, సంతృప్తికరంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని స్పష్టం చేసింది. కలెక్టర్లు కాకుండా ఇతర అధికారులు నేరుగా పంపిన జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులు వెనక్కి పంపి, కలెక్టర్ల ద్వారా జాబితా పంపాలని కోరవచ్చునని తెలిపింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండల తహసీల్దార్ అంగల్లు గ్రామంలోని 3.14 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ మదనపల్లి సబ్ రిజిష్ట్రార్కు పంపడాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది. ఆ జాబితా ఆధారంగా ఆ భూమిని విక్రయించేందుకు పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. ఆ డాక్యుమెంట్లను స్వీకరించి, ఆ భూములపై రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఇతర నిషేధ ఉత్తర్వులు ఏవీ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిష్ట్రార్ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పునిచ్చారు. ఇదీ నేపథ్యం అంగల్లు గ్రామంలోని రెండు సర్వే నంబర్లలో 3.88 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు డి.కృష్ణమూర్తి నాయుడికి కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ భూమిని పొందిన వ్యక్తులు అందులో 3.14 ఎకరాలని ఇతరులకు విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్కు డాక్యుమెంట్లు సమర్పించారు. ఆ భూమి తహసీల్దార్ పంపిన నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో సబ్రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్లను స్వీకరించలేదు. దీంతో భూమి విక్రేతలు దొమ్మాలపాటి సరళ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కొవ్వూరి వీఆర్ రెడ్డి, ప్రభుత్వం తరపున సహాయ న్యాయవాది (ఏజీపీ) వాదనలు వినిపించారు. -
కోర్టుకు బయలుదేరిన తండ్రి, కుమార్తె అదృశ్యం
సాక్షి, అమరావతి: కోర్టుకు వాస్తవాలను వివరించేందుకు బయలుదేరిన తండ్రి, కుమార్తెను కొందరు అడ్డుకున్న ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ చేత విచారణ జరిపించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఆ యువతిని, ఆమె తండ్రిని శుక్రవారం ఉదయం తమ ముందు వ్యక్తిగతంగా హాజరుపరచాలని నిర్దేశించింది. ఆకస్మిక అదృశ్యంపై వారి వాంగ్మూలాలను నమోదు చేసి వాస్తవాలు తేలుస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మజ్జి మాధవి వయస్సు 20 ఏళ్లు అయినప్పటికీ 10వ తరగతి చదువుతుందన్న కారణంతో శ్రీకాకుళం జిల్లా రావిచాద్రి గ్రామస్థాయి బాల్యవివాహ నిషేధ అధికారి ఆమె వివాహాన్ని అడ్డుకుంటున్నారంటూ మజ్జి ఆదినారాయణ, ఆయన కుమార్తె మజ్జి మాధవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని శిశుసంక్షేమ శాఖ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. కేసు తిరిగి విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్ ఆదినారాయణే తన కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేస్తానంటూ అధికారులకు రాసిచ్చారని తెలిపారు. దీనిపై పిటిషనర్ల న్యాయవాది వి.సుధాకర్రెడ్డి ఈ విషయాన్ని పిటిషనర్లతో మాట్లాడి నిర్ధారణ చేసుకుంటానని చెప్పడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. న్యాయవాది సుధాకర్రెడ్డి పిటిషనర్లతో మాట్లాడగా.. అధికారులు తెల్లకాగితాలపై తమ వేలిముద్రలు తీసుకున్నారని, తామెలాంటి రాతపూర్వక వివరాలివ్వలేదని చెప్పారు. ఈ విషయాలను స్వయంగా కోర్టుకు తెలిపేందుకు రావాలని సుధాకర్రెడ్డి సూచించగా ఆదినారాయణ, మాధవి బుధవారం శ్రీకాకుళం నుంచి విజయవాడ బయలుదేరారు. వారు కోర్టుకు రాలేదు. వారిని సంప్రదించేందుకు సుధాకర్రెడ్డి ప్రయత్నించినా వారి ఆచూకీ తెలియలేదు. వారు హైకోర్టుకు వస్తున్నారన్న విషయాన్ని వారి ఇంటి ఎదురుగా ఉన్న వలంటీర్ స్థానిక వీఆర్వోకు చేరవేశారని, తర్వాత తండ్రి, కుమార్తె ఆచూకీ తెలియడంలేదని న్యాయవాది సుధాకర్రెడ్డి గురువారం కోర్టుకు నివేదించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని, పిటిషనర్లు ఆదినారాయణ, మాధవిలను శుక్రవారం కోర్టుముందు హాజరుపరచాలని కలెక్టర్ను ఆదేశించారు. -
అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా?
అన్నం తిన్నంక బిడ్డ నీళ్లడిగితే ఏం చెప్పాల్నో తెలుస్తలేదు. ఫారెస్టు వాళ్లు జంతువులకు బోర్లేస్తరు. మేం అంతకన్నా హీనమా? ఆన్లైన్ క్లాసులని పిల్లలంటే కరెంటు లేక, సిగ్నల్ రాక పిల్లలకు ఏం చెప్పమంటారు? మా ఊరికి రోడ్డు, బోరు, కరెంటు, ఆశ వర్కరు వచ్చే దాకా ఇక్కడ్నుంచి పోం. ఈడనే అటుకులు తింటం. బియ్యం వండుకుంటం. మేమేం జాబులు అడుగుతలేం. పైసలియ్యమంటలేం. ఊరి సమస్యలు తీర్చమంటున్నం. అందుకే ఇంత దూరం నడుసుకుంట వచ్చినం’అంటూ తమ పల్లె గోసను నీళ్లు తిరుగుతున్న కళ్లతో జిల్లా అధికారుల ముందు వెళ్లబోసుకుంది ఆదివాసీ బిడ్డ నిర్మల. నిర్మల్: తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ ఊరు ఊరే కదిలొచ్చింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామవాసులంతా పిల్లాపాపలతో కలిసి 75 కిలోమీటర్లు నడిచి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. కాళ్లకు చెప్పుల్లేకున్నా చిన్నారులు, మహిళలు వడివడిగా నడుస్తూ వచ్చేశారు. ఏడాది కిందే సమస్యలను విన్నవించినా పరిష్కరించలేదని ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల ముందు తమ గోడు చెప్పుకున్నారు. ఇలా ఒక్క చాకిరేవే కాదు.. నిర్మల్ జిల్లాలోని పలు అటవీ గ్రామాలు ఇంకా కరెంటును చూడకుండా.. బీటీ రోడ్డు ఎక్కకుండా.. చెలిమల నీళ్లే దిక్కుగా బతుకీడుస్తున్నాయి. రాకెట్లు నింగికి పంపుతున్న ఈ కాలంలో, మిగులు విద్యుత్ మూటగట్టుకుంటున్న మన రాష్ట్రంలో ఇంకా గుడ్డి వెలుగురులోనే ముందుకు సాగుతున్నాయి. చెలిమల నీళ్లు తోడుకుంటున్న చాకిరేవు గ్రామస్తులు రాత్రిపూట ఏం కష్టమొచ్చినా ఇబ్బందే.. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 75 కిలోమీటర్లు వెళ్తే పెంబి మండలంలోని అటవీ గ్రామం చాకిరేవు వస్తుంది. పెంబి నుంచి 4 కిలోమీటర్ల వరకు మట్టిరోడ్డుంది. మధ్యలో దొత్తివాగు వస్తుంది. దీనిపైన వంతెన లేదు. వాగు దాటాక దాదాపు 10 కిలోమీటర్లు ఆ ఊరి వరకు రోడ్డు లేదు. కరెంటు పోతే క్షణం ఉండలేని ఈరోజుల్లో అక్కడ అనాదిగా విద్యుత్ను చూడని కుటుంబాలున్నాయి. చీకటి పడితే ఇప్పటికీ నూనెలో వత్తి వేసుకుంటున్నాయి. 25–30 కుటుంబాలు ఉండే ఈ పల్లెలో పొద్దంతా వ్యవసాయం చేస్తూ చీకటి వేళకు ఇళ్లకు చేరుకుంటున్నారు. కరెంటుతో పాటు తాగు నీళ్లూ ఆ ఊరికి అందట్లేదు. కిలోమీటర్ల దూరంలోని వాగులు, చెలిమెలే దిక్కవుతున్నాయి. రాత్రిపూట ఏ కష్టం వచ్చినా ఇబ్బందే. ఊరంతా కలిసి టార్చిలైట్లు పట్టుకుని పరిష్కరించుకోవాల్సిందే. ప్రసవానికైనా, ప్రమాదం జరిగినా ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎడ్లబండ్లపైనే తీసుకురావాలి. ఈ కష్టాలను తీర్చాలంటూ ఊరు ఊరంతా నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచి వచ్చింది. ఇలా నడిచి వచ్చిన వారిలో పిల్లలు, వృద్ధులతో పాటు ఓ గర్భిణి ఉన్నారు. పెంబి నుంచి చాకిరేవుకు వెళ్లే మార్గం ఎన్నో గ్రామాల్లో నూనె దీపాలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆదివాసుల గూడేల్లో ఇంకా విద్యుత్, రోడ్డు, తాగునీటి సౌకర్యాల్లేవు. నిర్మల్ జిల్లా పెంబి మండలం సోముగూడ, చాకిరేవు, రాగిదుబ్బ.. కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్, వస్పల్లి పంచాయతీ పరిధిలోని పలు గూడేలకు కరెంటు లేదు. చాలా కుటుం బాలు కిరోసిన్, మంచి నూనెతో దీపాలు పెట్టుకుంటు న్నాయి. గతంలో ఐటీడీఏ కొన్ని గ్రామాలకు సోలార్ లైట్లను పంపినా చాలావరకు పనిచేయట్లేదు. రోడ్లు లేక కాలినడకనే జనం నడుస్తున్నారు. అటవీ చట్టాలు, అనుమతుల పేరిట పెడుతున్న నిబంధనలే వీరికి శాపంగా మారుతున్నాయి. దీపం వెలుతురులో బియ్యం ఏరుతున్న యువతి ఊర్ల ఉంటే ఎవుసం చేసుకొనైనా బతుకుతం కరెంటు, మంచి నీళ్లు లేకుండా ఆ ఊర్లో ఎట్లుంటున్నరు? ఇన్ని కష్టాల మధ్య అడవిలో ఉండే కంటే వేరే దగ్గరికి పోవచ్చు కదా’అని ఆదివాసీ మహిళ లక్ష్మీబాయిని అడిగితే.. ‘ఎటుపోతం సారూ.. తాతల కాలం నుంచి మేం నమ్ముకు న్న భూములను ఇడిసి యాడికి పోవాల? ఏం పని చేసుకుని బతకాల? ఊర్ల ఉంటే ఇంత ఎవుసం చేసుకునైనా బతుకుతం’అని చెప్పింది. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడేలకు ఊరివాళ్లంతా కలిసి వినతిపత్రం ఇచ్చారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వీరి పాదయాత్రకు తెలంగాణ ఆదివాసీ సంఘం, బీజేపీ, వైఎస్ఆర్టీపీ నాయకులు మద్దతు తెలిపారు. -
దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏళ్ల తరబడి పరి ష్కారం కాకుండా పెండింగ్లో పడిపోయిన సమస్యల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో సమస్యల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గ్రామం, మండలం, సర్వే నంబర్, భూ విస్తీర్ణం, సమస్య ఏంటి, పరిష్కారం ఎలా చేయాలి తదితర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు. దీంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రభుత్వం అడిగిన ఫార్మాట్లో నివేదికలను కలెక్టరేట్లకు పంపినట్టు సమాచారం. ఈ నివేదికల్లో పలు ఆసక్తికర భూ సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలు స్తోంది. అయితే వీటిల్లో అనేక సమస్యల పరిష్కారం అంత సులభంగా అయ్యే పని కాదని, భూ సంబంధిత చట్టాలు మార్చాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చట్టాలు మారిస్తేనే పరిష్కారం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంపై రెవెన్యూ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సమస్యలు పరి ష్కారం కావాలంటే చట్టాలు మార్చాల్సిం దేనని అంటున్నాయి. గత 20–30 ఏళ్లుగా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ భూముల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి ఆ ప్రభుత్వ భూమిని అధికారికంగా కేటాయించేందుకు రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలు అనుమతించవని అంటున్నారు. అదే విధంగా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల లోపు భూములను అసైన్ చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఈ సమస్య మరింత జఠిలం అయిందని పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అసైన్డ్ చట్టంలో మార్పులు చేయాలని అభిప్రాయపడుతున్నాయి. సమరయోధుల భూములూ చిక్కుముడులే.. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములపై జరిగిన క్రయవిక్రయ లావాదేవీల పరిష్కారం కూడా అంత సులభం కాదని తెలుస్తోంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ల తర్వాత నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకుని అమ్ముకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఎలాంటి ఎన్వోసీలు లేకుండానే చాలాచోట్ల సబ్ రిజిస్ట్రార్లు ఈ భూములను నిర్దిష్ట గడువు తర్వాత ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారు. సేల్డీడ్లు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ భూములన్నీ ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూములుగా కనబడుతున్నాయి. ఈ భూములకు ఎన్వోసీని కేవలం లబ్ధిదారుడైన స్వాతంత్య్ర సమరయోధుడు లేదా మాజీ సైనికుడి పేరిట ఇచ్చేందుకు మాత్రమే చట్టాలు అనుమతిస్తాయి. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం సేకరించిన పట్టా భూముల విస్తీర్ణాన్ని ఎడాపెడా నమోదు చేయడంతో చాలాచోట్ల సేకరించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణం ప్రభుత్వ ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఆ భూమిని పట్టాదారుకు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని ఇతరులకు బదలాయించేందుకు అనుమతి ఉండదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, వీటిని తీర్చాలంటే చట్టాలు మార్చాలనేది రెవెన్యూ వర్గాల అభిప్రాయం. సాదా బైనామాల సంక్లిష్టత భూ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది సాదా బైనామాలు. తెల్ల కాగితాల ద్వారా జరిగిన క్రయ విక్రయాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో తహశీల్దార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా ధరణి పోర్టల్లో కొత్త సర్వే నంబర్ల నమోదు, పట్టాదారు పేరు మార్పు, విస్తీర్ణంలో తేడాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
AP: ప్రాణం నిలిపిన కలెక్టర్
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కలెక్టర్ ఎ.సూర్యకుమారి కాపాడారు. సకాలంలో స్పందించి సదరు వ్యక్తిని ఆర్డీఓ వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్క డి వైద్యులు వెంటనే అత్యవసర వైద్యం అందించడంతో గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్కు తరలించారు. కలెక్టర్గా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న సూర్యకుమారి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి, తన మానవత్వాన్ని చాటుకు న్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల్లోకి వెళ్తే.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి వేణుగోపాలపురం కాలనీకి చెందిన బి.అప్పారావు(30) శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై నెల్లిమర్ల నుంచి గాజులరేగ వెళ్తుండగా జేఎన్టీయూ జంక్షన్లో ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో కలెక్టర్ సూర్యకుమారి చీపురుపల్లిలో పింఛన్ల పంపిణీకి వెళ్లి తిరిగి విజయనగరం విచ్చేస్తున్నారు. రోడ్డు పక్కన రక్తపు మడుగులో వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కారును ఆపి 108 వాహనంలో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఫోన్ చేశారు. అయితే 108 వచ్చేందుకు కొంత ఆలస్యమవుతుందని గుర్తించి, తన వెనకే వస్తున్న ఆర్డీఓ భవానీశంకర్ అధికారిక వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ నాగభూషణరావుకు విషయం తెలియజేసి, అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఆ సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న డీసీహెచ్ఎస్ ఇతర వైద్యులను అప్రమత్తం చేశారు. గాయపడిన వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యమందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నానికి గాయపడిన అప్పారావు అపస్మారక స్థితి నుంచి బయటపడినట్లు కలెక్టర్కు డీసీహెచ్ఎస్ తెలిపారు. గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి తీసుకురావడం వల్లనే ప్రాణాలు కాపాడగలిగామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కలెక్టర్ చొరవను అధికారులతో పాటు వైద్య సిబ్బంది అభినందిస్తున్నారు. -
100% టీకాలే లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ నూరు శాతం జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామా లు, మండలాలవారీగా లక్ష్యాలను ఖరారు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నా రు. ఆర్థికమంత్రి హరీశ్ తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో శనివారం బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్తోపాటు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఆరోగ్యశ్రీ కింద అందుతున్న సేవల తీరుతెన్నులను అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీసీహెచ్లకు పలు ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల సహకారం తీసుకోండి... వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని హరీశ్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి వారం వ్యాక్సినేషన్లో సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్టంలో 18 ఏళ్లు దాటిన వారు 2.77 కోట్ల మంది ఉండగా 2.35 కోట్ల మందికి మొదటి, 1.08 కోట్లమందికి రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 18.66 లక్షలమంది రెండో డోస్ వేసుకొనేందుకు కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. డిసెంబర్లోగా కొత్త వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 వైద్య కళాశాలల భవనాలను డిసెంబర్లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను హరీశ్ ఆదేశిం చారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యాలను పెంచాలని, విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్ భవనాలను గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికవసతుల కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రుల తనిఖీలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా, కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యానికి మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలన్నారు. ఇకపై పీహెచ్సీ మొదలు మెడికల్ కాలేజీ వరకు అన్నిం టినీ తనిఖీ చేస్తామని, ఆశా వర్కర్ నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరు ఆధారంగా పోస్టింగ్లు, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
వర్ష బాధితులకు తక్షణ సాయం
సాక్షి, అమరావతి: భారీ వర్షాల బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలను చేపట్టాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ శిబిరాల్లోని బాధితులకు మంచి ఆహారం అందించడంతో పాటు వారికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరుకు, మరో రెండు బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయని, కర్నూలులో ఇంకో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధం చేశామని, పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం జగన్ సహాయ పునరావాస కేంద్రాలు ► అవసరమైన చోట సహాయ శిబిరాలను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోవాలి. వారికి మంచి ఆహారం అందించడంతోపాటు బాధితులకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలి. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలి. ► ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలి. పీహెచ్సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వారి కోసం ఒక ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచాలి. బాధితులను ఆదుకోవడంతో పాటు సహాయక చర్యల అమలు కోసం వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. ఇందుకు అనుగుణంగా లైన్ డిపార్ట్మెంట్లను సిద్ధం చేయాలి. ఎస్ఓపీల ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వర్షాల అనంతరం కూడా పారిశుధ్యం విషయంలో చర్యలు తీసుకోవాలి. ► ఆహారం, తాగునీటి ప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయాలి. అవసరమైన మేరకు వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ► భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులకు గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ► వర్షాలు, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయాలి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలి. ప్రధానంగా రిజర్వాయర్లు, డామ్స్ను నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ► రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ.. జిల్లాల నుంచి ఆ వివరాలను వెంటనే పంపించాలి. ఫోన్కాల్కు మేం అందుబాటులో ఉంటాం.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయండి. ► బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్రాలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈనెల 17న ఇది తీరం దాటే అవకాశాలున్నాయని వివరించారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ► ఈ సమీక్షలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ శాఖ) ఎస్ బి అంజాద్ బాషా, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా ముందు జాగ్రత్తగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించాలి. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల సహాయ కార్యక్రమాలు వేగంగా అమలయ్యేలా చూడాలి. -
‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన మౌఖిక వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా మెజి్రస్టేట్గా ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారే.. చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది. వరిని విక్రయించిన దుకాణాలను తెరవాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా తాను లెక్కచేయనంటూ కలెక్టర్ చేసిన పేర్కొనడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘జిల్లా మెజి్రస్టేట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం క్రిమినల్ కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది. భవిష్యత్తులో కలెక్టర్కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కలెక్టర్పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. (చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా) -
బతుకమ్మ చీరల పంపిణీ బాధ్యత కలెక్టర్లకు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరలు పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చీరలు పంపిణీ చేయాలా లేక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ, వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. బతుకమ్మ చీరలు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా కాగా, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/ వార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది. -
భూమి ఆన్లైన్కి లంచం అడుగుతున్నారు
ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్కుమార్ నిర్వహించారు. పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డయల్ యువర్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్చార్జి డీఆర్ఓ సరళా వందనం పాల్గొన్నారు. -
మా మంచి కలెక్టరమ్మ: పూలరేకులపై నడిపిస్తూ.. సెల్యూట్లు చేస్తూ
గాంధీనగర్: కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. తనకు కష్టం ఉన్నా.. తన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే తాపత్రయంతో నిరంతరం శ్రమిస్తుంటారు. అటువంటి అధికారులు ఉంటే తమకు కూడా మంచే జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఒకవేళ ఆ అధికారి మరోచోటకు బదిలీ అయి వెళ్లిపోతుంటే తమ ఇంట్లో మనిషి వెళ్లిపోతున్నట్లే ఏడుస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వ అధికారి అన్నప్పుడు బదిలీలు సాధారణం. తాజాగా ఒక జిల్లా కలెక్టర్ బదిలీ పేరిట మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో అక్కడి ప్రజలు, అధికారులు ఆమెకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడం వైరల్గా మారింది. వివరాలు.. గుజరాత్ లోని రాజకోట్ జిల్లాకు రెమ్యా మోహన్ కలెక్టర్గా సేవలందిస్తున్నారు. తన పనితనంలో ఆమె అక్కడి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారం కిందట రెమ్యా మోహన్నేషనల్ హెల్త్ మిషన్, డైరెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు, ఉద్యోగులు భావోద్వేగంతో ఆమెకు చివరిసారిగా వీడ్కోలు పలికారు. పూలు జల్లుతూ.. రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పూల రథంతో వీడ్కోలు పలుకుతూ తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించిన రెమ్యా మోహన్ కన్నీటిపర్యంతం అవుతూ అక్కడి నుంచి వెళ్లారు. కాగా కోవిడ్ -19 తో పాటు ఈ మధ్యన వచ్చిన తుఫాను సమయంలోను రెమ్యా నాయక్ నిరంతరం శ్రమించారు. ఎంత కష్టం ఎదురైనా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవను కొనసాగించారు. ఈ కృతజ్ఞతాభావంతోనే అక్కడి ప్రజలు, అధికారులు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఘనంగా వీడ్కోలు పలికారు. 1980 లో ఎస్.జగదీషన్ తరువాత ఒక జిల్లా కలెక్టర్కు ఈ విధంగా గౌరవం లభించడం ఇదేనని అక్కడి స్థానికులు సంతోషంతో పేర్కొన్నారు. -
ఏపీలో నేటి నుంచి పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్
-
అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి
అనంతపురం: కోవిడ్ రోగుల కోసం జిల్లాలోని తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ గంధం చుంద్రుడు తెలిపారు. కోవిడ్కు సంబంధించి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అత్యవసర వినియోగానికి ఆక్సిజన్ ట్యాంకర్ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టించే ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. -
విశాఖ : కోవిడ్ నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు
-
టైరు మార్చిన కలెక్టర్ రోహిణి, వైరల్
మైసూరు: కలెక్టర్ అంటే సమాజంలో గొప్ప హోదా. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా తక్షణమే అందుబాటులోకి వస్తాయి. ఆ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్ను స్వయంగా మార్చుకొని వార్తల్లో నిలిచారు కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి. తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి సింధూరి తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం కొడగు తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారును డ్రైవ్ చేశారు. మార్గంమధ్యలో టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె స్వయంగా రంగంలోకి దిగి, కారు కింద జాకీ అమర్చి టైర్ను ఊడదీసి, మరో టైర్ను అమర్చారు. రోడ్డుపై వెళ్లేవారు గమనించి మీరు మైసూరు జిల్లా కలెక్టర్ కదా! అని అడగ్గా అవును తానే రోహిణి సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా శుక్రవారం వైరల్ అయ్యాయి. కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్ మార్చుకున్న కలెక్టర్పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూవివాదాలు, ఇతర వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కె.చంద్రశేఖర్రావు సంచ లన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యత లను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని ప్రకటించారు. ధరణి పోర్టల్లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై గురువారం ఆయన ప్రగతిభవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ.. ‘కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్–బీలో చేర్చిన భూములకు సంబంధించిన అంశాల న్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సంద ర్భాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకో వాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి. చదవండి: (‘ఆయుష్మాన్’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం) ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా, కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. మీ–సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిలో కొత్తగా కోర్టు పోర్టల్.. ‘కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్ను ధరణిలో చేర్చాలి. సేత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసుబుక్కులు ఇవ్వాలి. కొన్నిచోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి..’అని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సీఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలివే.. ►1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ►ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. ►‘నాలా’ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ►అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్ ద్వారా అవకాశమివ్వాలి. ►వ్యవసాయ భూమల లీజు డీడ్, ఎక్సే్చంజ్ డీడ్ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి. ►వ్యవసాయ భూముల్లో నెలకొల్పే సంస్థలు, కంపెనీలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి. ►పాస్పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్ఆర్ఐల భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలి. ►ఈసీల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలి. ►ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాని వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్ చేసుకునేందుకు అవకాశమివ్వాలి. స్లాట్ బుకింగ్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలి. ►స్లాట్ బుక్ చేసుకునేప్పుడు వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్ బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలి. ►చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాలి. ►మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. ►ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి. ►పట్టాదార్ పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ‘ట్రూ కాపీ’తీసుకునే అవకాశం కల్పించాలి. ►ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు. ►ఇనాం భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. ►ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తుదారుడికి తెలిపే ఆప్షన్ ధరణిలో ఉండాలి. రైతులకు ఇబ్బంది ఉండొద్దనే ‘ధరణి’: సీఎం కేసీఆర్ వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2 నెలల వ్యవధిలోనే లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకోగా వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, రెవెన్యూ వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్ పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం ఇద్దరు సర్పంచ్లు సస్పెండ్
సాక్షి, రంగారెడ్డి: పంచాయతీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సర్పంచులు, ఒక పంచాయతీ అధికారిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేౠరు. విధులను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని పేర్కొంటూ మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామ సర్పంచ్ కనక మామిడి శ్రీనివాస్, కేతిరెడ్డి పల్లి సర్పంచ్ ఎన్.హరీశ్ చంద్ను సస్పెండ్ చేశారు. వీరితోపాటు శంకర్ పల్లి మండలంలోని మొకీల గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ తులసిపైనా కలెక్టర్ అమోయ్ కుమార్ వేటువేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సరిగ్గా అమలు చేయక పోవడం, అభివృద్ధిలో వెనుకబడ్డందుకు బాద్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
విజయవాడ లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు
సాక్షి, విజయవాడ : కరోనా వైద్యం పేరుతో పలు ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా లక్షల్లో ఫీజు వసూలు తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆసుపత్రి యాజమాన్యంపై మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. విజయవాడకు చెందిన లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.(చదవండి : పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్) రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. లిబర్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కమిటీ అందించిన నివేదికతో ఆటోనగర్లో ఉన్న లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వేరే చోటికి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
వేలివెన్ను వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన వీఆర్ఓ సూర్యజ్యోతిని శనివారం అధికారులు సస్పెండ్ చేశారు. మండలంలోని సచివాలయంలో ఆమె వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 27న వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బలక్ష్మి అనే మహిళా రైతుకు సంబంధించిన 42 సెంట్ల భూమి మ్యుటేషన్ కోసం 42 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. తహిసీల్దార్కు వీఆర్ఓపై ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీఆర్వో లంచం అడిగినట్టు విచారణలో రుజువు కావడంతో ఆమెను సస్పెండ్ చేయాలంటూ నిన్న(శుక్రవారం) కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ సూర్యజ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు) -
వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ. 70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (‘ఆ మరణాలు దాచాల్సిన అవసరం లేదు’) -
వాలగానే వేసేద్దాం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి ఏ సమయంలోనైనా మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడతల నిరోధక చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్న మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చేందుకు అవకాశాలు అలాగే ఉన్నందున, తగిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మిడతల దండును ఎదుర్కోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. (మిడతల దండు మళ్లీ వచ్చేసింది) సాధారణంగా మిడతల దండు ఉదయం వేళ ప్రయాణం చేస్తుంటుంది. ఈ సమయంలో వీటిని చంపడం అంత సులువు కాదు. చెట్లపై, చేనుపై వాలినపుడే వాటిని చంపేందుకు సులువవుతోంది. దీంతో రాత్రివేళ, వేకువజామున మిడతలను చంపేందుకు సిద్ధపడాలని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ముందుగా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే సరిహద్దు జిల్లాలను గుర్తించాలి. అన్ని గ్రామాలలోనూ మిడతలు ప్రవేశించే మార్గాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాకు 500 లీటర్ల రసాయనాలను సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగు కలిపిన నీటితో గ్రామాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. వీటన్నింటిపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విడుదల చేయనుంది. (ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!) రూ. 53.55 లక్షలు కేటాయింపు... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రసాయనాల కొనుగోలుకు, పీపీఈ కిట్లకు జిల్లాకు రూ. 5.95 లక్షల చొప్పున రూ. 53.55 లక్షలు కేటాయించింది. ఈ నిధులను విపత్తు నిర్వహణ నిధుల నుంచి వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. (కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు...) జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు లేదా ఎస్పీ, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఫైర్ అధికారి, డీపీవోతో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి కీటక శాస్త్రవేత్తతో కలిపి ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మిడతల దాడి జరిగే అన్ని మండలాలు, సరిహద్దు గ్రామాలలో గ్రామ కమిటీలను గుర్తించాలి. ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, సమూహాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. మిడతలు ప్రవేశించే స్థలాలను గుర్తించి, వాటిని చంపేందుకు స్ప్రే చేయడానికి తగిన స్థలాన్ని గుర్తించాలి. భారీ వాహనాలు, ఫైరింజన్లు వెంటనే వచ్చేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. రాత్రివేళ పిచికారీ చేయాల్సి ఉన్నందున లైటింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నందున పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. పంటలకు, పశుపక్షాదులకు ఎటువంటి ఆరోగ్య, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. మొక్కల నర్సరీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేప పూత ముందుగా చల్లుకోవడం మంచిది. అటవీ ప్రాంతం అయితే సెల్ఫోన్ సిగ్నల్స్ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున కమ్యూనికేషన్ సెట్ వినియోగించాల్సి ఉంటుంది. -
వాహ్.. కలెక్టర్ సాబ్
దూకుడుగా వ్యవహరించడం కాదు చురుగ్గా ఆలోచించడం రావాలి.. కేడర్ ఒక్కటే కాదు తగిన సమయస్ఫూర్తీ కావాలి. ఆజ్ఞలివ్వడం సరిపోదు.. అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేయించుకునే సామర్థ్యమూ డాలి.. ఈ మూడు లక్షణాలతో మరో మూడు సూత్రాలను అమలు చేసి రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో కరోనా వైరస్కు చెక్ పెట్టారు డైనమిక్ కలెక్టర్ రాజేంద్ర భట్.. కరోనాను కట్టడి చేయడంలో దేశమంతా కేరళ ప్రణాళికలవైపు చూస్తూంటే చడీచప్పుడు లేకుండా ఆ వైరస్ వ్యాప్తిని నిలువరించారు. కరోనా కొత్త కేసు ఒక్కటి కూడా లేకుండా చేశారు.. సాక్షాత్తూ ప్రధానమంత్రి దృష్టినీ బిల్వారా వైపు తిప్పారు ఆ జిల్లా కలెక్టర్, 56 ఏళ్ల రాజేంద్ర భట్. విజయ రహస్యం ఏమిటని అడిగితే ‘అదేం భగీరథ ప్రయత్నం కాదు.. సింపుల్ త్రీ స్టెప్స్ ప్లాన్ అంతే’ అంటారు వినమ్రంగా. ఈ మూడు సూత్రాలు.. బిల్వారా.. వస్త్రపరిశ్రమకు పెట్టింది పేరు. కాబట్టి సహజంగానే వలసకార్మికులకు ఆవాసంగా మారింది. కరోనాకూ హాట్స్పాట్ అయింది మొత్తం 27 పాజిటివ్ కేసులతో. బిల్వారా వాసులకు తెలిసి.. భయంకంపితులు కాకముందే తక్షణ కార్యాచరణ మొదలుపెట్టాడు రాజేంద్ర భట్. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఐసోలేషన్లో ఉంచడం, ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్ను అమలు చేయడం.. ముఖ్యమైన ఈ మూడు అంశాలే ఆయన కార్యాచరణ. ఆయనకు మాత్రమే తెలిసిన సీక్రెట్స్ కావు.. కరోనా నివారణలో జగమెరిగిన ఉపాయాలే. ఎలా మొదలుపెట్టారు? కరోనా కర్ఫ్యూను ప్రకటించే ముందు తన సిబ్బందిని డెయిరీ ఫామ్స్కు పంపించాడు రాజేంద్ర భట్.. ప్రతి ఇల్లు రోజుకు ఎన్ని పాలను కొంటారో లెక్క తీయమని. అలాగే నిత్యావసరాల నిల్వలు, సరఫరా ఎంతో కూడా బేరీజు వేసుకున్నాడు. రోజుల తరబడి ఇంట్లో ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు జిల్లా సరిహద్దులు మూసివేయడానికి అనుమతి ఇవ్వాలని. వెంటనే ఓకే చేసింది ప్రభుత్వం. అంతేకాదు బిల్వారాలోని ఆసుపత్రులు, హోటళ్లు మొదలైన అన్నిటిమీదా పూర్తి అధికారాలు ఇచ్చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వెంటనే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయించారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా జిల్లా మొత్తం పొలిమేరలు మూసి వేయించారు. వైద్య సిబ్బందిని 24 గంటలు అలర్ట్లో ఉంచాడు. ఇంకోవైపు కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగించారు. వీటన్నిటి నేపథ్యంలో ‘కరోనా తీవ్రత జిల్లా ప్రజలకు అర్థమయ్యేలోపే ఆ వ్యాప్తిని 27 కేసులకే పరిమితం చేశారు. గడిచిన పది రోజులుగా రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ‘గ్రేట్ ఎఫర్ట్.. ’ అంటూ రాజేంద్ర భట్ను ప్రశంసించబోయేంతలోనే ‘ఇది నా ఘనత కాదు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, మా సిబ్బంది కలిసి చేసిన ప్రయత్నం. టీమ్ వర్క్’ అని తన విజయంలో అందరినీ భాగస్వామ్యం చేస్తారు. ‘అయినా.. ఒక్క కొత్త కేసు రాలేదని ఇప్పుడే ప్రకటించుకోవడం ఎందుకు? మే వరకూ వేచి చూద్దాం.. అప్పటికీ ఒక్కటి కూడా నమోదు కాకపోతే.. నిజంగానే ఈ ప్రయత్నంలో మేము సఫలీకృతమైనట్టే’ అంటారు బిల్వారా కలెక్టర్ రాజేంద్ర భట్. స్టేట్ సర్వీస్ నుంచి సివిల్ సర్వీస్కు.. రాజేంద్ర భట్ .. రాజస్థాన్ స్టేట్ సర్వీస్ నుంచి 2007లో ఐఏఎస్గా ప్రమోషన్ పొందాడు. ‘స్టేట్ సర్వీస్ ఉద్యోగ అనుభవం ఈ కరోనా క్లిష్ట సమయంలో ఆయన చురుగ్గా ఆలోచించి, సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది. డైరెక్ట్ ఐఏఎస్ యంగ్ కలెక్టర్ల కన్నా ఆయన ఎంతో సమర్థవంతుడు’ అని ఆయన టీమ్లోని యువ ఐఏఎస్ ఆఫీసర్లు రాజేంద్రభట్ను కొనియాడుతున్నారు. కరోనా విషయంలోనే కాదు.. బిల్వారా జిల్లా కలెక్టర్గా రాజేంద్ర భట్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి జిల్లా సర్వతోముఖాభివృద్ధికోసం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలతో ఆయన నిర్వహిస్తున్న స్నేహపూర్వక సంబంధాలు, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం.. దేశంలోని కలెక్టర్లు, యువ ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆదర్శం, ఆయన పాలన నైపుణ్యత అందరూ తెలుసుకొని అమలు చేయవలసిన పాఠం.. అంటున్నారు రాజస్థాన్లోని ఐఏస్ అధికారులు. -
ఆ కలెక్టర్ పేరుతోనే వెలిసిన గ్రామం
సాక్షి, ములగాడ (మల్కాపురం): కలెక్టర్ పేరు మీద వెలిసిన ఓ గ్రామం ఇప్పుడు దినదినాభివృద్ధి సాధిస్తూ జీవీఎంసీ 58వ వార్డుకు తలమానికంగా మారింది. 1909లో గుల్లలపాలెం ఏర్పడింది. గ్రామం ఏర్పడిన నాటికి కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఇక్కడుండేవి. కాలక్రమంలో ఒకొక్క గ్రామం ఇక్కడ వెలిసింది. 1963–67 సంవ్సరంలో అప్పటి కలెక్టర్ శ్రీహరిరావు సింధియా నుంచి జింక్ వరకూ గల మట్టి రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో కలెక్టర్ శ్రీహరిరావు ఈ ప్రాంతీయులకు ఆత్మీయుడయ్యారు. దీంతో కలెక్టర్ శ్రీహరిరాజు పేరుతో శ్రీహరిపురం అని గ్రామానికి పేరు పెట్టారు. గుల్లలపాలెం, శ్రీహరిపురం, శ్రీనివాసనగర్, రాంనగర్, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ, పిలకవానిపాలెం, గొందేశిపాలెం ఇప్పుడు జీవీఎంసీ 58వ వార్డులో ఉన్నాయి. జీవీఎంసీ 58వ వార్డుకు ప్రధాన ప్రాంతం శ్రీహరిపురమే. కాలుష్య సమస్యకు కారణమవుతున్న అలూఫ్లోరైడ్ పరిశ్రమ 1983లో వార్డుగా... అప్పటి వరకూ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం 1983లో వార్డుగా రూపాంతరం చెందింది. అప్పుడు 46వ వార్డుగా గుర్తించారు. 2020లో ఆ వార్డు కాస్తా 58వ వార్డుగా మారింది. 46వ వార్డులో ఉన్నప్పుడు ఓటర్లు 12 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం 17 వేల మంది ఓటర్లు ఉండగా..జనభా 20 వేలకుపైగా ఉంది. వార్డులో ప్రధాన సమస్యలు వార్డులో కోరమండల్, అలూఫ్లోరైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచే వచ్చే కాలుష్యంతో ములగాడ, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ గ్రామాల్లో చాలా మంది యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ప్రధాన గెడ్డలు ఆక్రమణకు గురి కావడంతో దిగువ ప్రాంత గ్రామాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. -
అచ్చం సినిమాలో మాదిరి.. దుమికిన కలెక్టర్!
సాక్షి, భూపాలపల్లి:‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ శుక్రవారం పలు కాలనీల్లో పర్యటించారు. ఈక్రమంలో జవహర్ కాలనీలో శ్మశాన వాటిక స్థల అన్వేషణ కోసం శివారులో ఫారెస్టు చుట్టూ ఉన్న ట్రెంచ్ దాటేందుకు జంప్ చేశారు. అచ్చం సినిమా షూటింగ్లో మాదిరి ఆయన జంప్ చేయగా.. ప్రజాప్రతినిధులు మాత్రం కాలువలో రాళ్లు వేసి దాటారు. కలిసిపోయి.. కలివిడిగా.. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ శుక్రవారం తొర్రూరులో పర్యటించారు. పార్కుల ఏర్పాటు, ఇతరత్రా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తర్వాత ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అప్పటికే మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటే మెట్లపై కూర్చుని భోజనం చేస్తూ వారి బాగోగులపై ఆరా తీయడం ఆకట్టుకుంది. -
ఇళ్లు కనిపించడం లేదు.. కాస్త వెతికి పెట్టండి
సాక్షి, చెన్నై: గృహ నిర్మాణ పథకం కింద తమకు ప్రభుత్వం కట్టి ఇచ్చిన ఇళ్లు కనిపించడం లేదని ఓ దంపతులు నామక్కల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇది కాస్త గృహ నిర్మాణ పథకం విభాగ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు పచ్చ పాళయంకు చెందిన మురుగేష్, కవిత దంపతులు శనివారం కలెక్టరేట్కు వచ్చారు. తమ వద్ద ఉన్న ఫొటోలు, ఇతర ఆధారాల్ని కలెక్టరేట్లోని ఫిర్యాదుల విభాగానికి సమర్పించారు. గతంలో తమకు ప్రభుత్వం తరఫున గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరైనట్టు ఫిర్యాదులో వివరించారు. ఇంటి పనులకు పునాదులు వేసే సమయంలో అధికారులు వచ్చారని, ఆ తర్వాత ఏ ఒక్కరూ అటు వైపుగా రాలేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆ గృహ నిర్మాణం పూర్తైనట్టు, తమకు ఆ గృహాన్ని కేటాయించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ విషయంగా గ్రామ అధికారుల్ని నిలదీయగా, ఇళ్లు కట్టి ఇచ్చేశామని, ఇక, తమకు సంబంధం లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తమకు కట్టి ఇచ్చినట్టుగా చెబుతున్న ఇళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, దీనిని తమరే కనిపెట్టి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. అయితే, ఆ దంపతులకు గృహం నిర్మించి, కేటాయించినట్టుగా రికార్డుల్లో ఉండడంతో, ఈ నిధుల్ని స్వాహా చేసిన వాళ్లెవ్వరో అన్న ప్రశ్న బయలు దేరింది. దీంతో గృహ నిర్మాణ పథకం విభాగం స్థానిక అధికారుల్లో టెన్షన్ బయలుదేరింది. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండానే, ఇచ్చేసినట్టుగా లెక్కలు తేల్చిన దృష్ట్యా, ఆ ఇళ్లు కనిపించ లేదని, కలెక్టరేట్లో ఫిర్యాదు చేశామని, దీనిపై కలెక్టర్ విచారించి తమకు న్యాయం చేకూర్చాలని మీడియాతో మాట్లాడుతూ, ఆ దంపతులు విజ్ఞప్తి చేసుకున్నారు. -
విజయనగరంలో ఎర్ర చెరువు శుద్ధి కార్యక్రమం
-
కలెక్టర్.. లెక్కల టీచర్
కొడంగల్ రూరల్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ శుక్రవారం కొడంగల్ మండల పరిధిలోని రావులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం క్లాస్లోకి వెళ్లి గణితం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీవాణితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ బోర్డుపై మ్యాథ్స్ ఈక్వేషన్ వేసి వివరించారు. -
నెలలో 15 రోజులు క్షేత్రస్థాయిలోనే..
సాక్షి, అమరావతి : పరిపాలనలో జిల్లా కలెక్టర్లే తనకు కళ్లు, చెవులు వంటి వారని.. నెలలో 15 రోజులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొంతమంది జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువగా వెళ్లడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఈ పరిస్థితి వెంటనే మారాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదివారం స్పష్టమైన కార్యాచరణను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ– అభివృద్ధి కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి మరోసారి కర్తవ్యబోధ చేశారు. క్షేత్రస్థాయి సమాచారమే మనకు కీలకం.. కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని.. వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సుల కంటే క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల వల్లే సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని.. ప్రజలు, లబ్ధిదారులు, ఇతర వర్గాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకమని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి, వాటి తక్షణ పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు ఉపయోగపడతాయని సూచించారు. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని.. ఆస్పత్రులు, హాస్టళ్లు, పల్లెల్లో రాత్రి నిద్ర చేయాలని సూచించారు. ప్రతి కలెక్టర్ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల ఆసుపత్రులు, హాస్టళ్లలో ఎక్కడో ఒక చోట రాత్రి నిద్ర చేయాలన్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడతాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇకపై వారానికి రెండుసార్లే వీడియో కాన్ఫరెన్స్ మండల స్థాయి అధికారులతో కలెక్టర్లు ఇక నుంచి వారానికి రెండుసార్లు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి. ముఖ్యమంత్రితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఒకసారి, వారంలో మరోసారి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి మరిన్ని నిధులిస్తాం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన సమస్యల తక్షణ పరిష్కారానికి ఇప్పటికే జిల్లాకు రూ.కోటి కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ నిధుల్ని సమర్థంగా ఖర్చుచేస్తే.. అవసరమైతే మళ్లీ నిధులు సమకూరుస్తామని సీఎం చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలో అక్కడికక్కడే పరిష్కరించగలిగిన సమస్యలకు నిధుల అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశంతో రూ. కోటి నిధులను ఇప్పటికే కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. -
కలెక్టర్లకు సీఎం జగన్ మార్గదర్శకాలు
సాక్షి, తాడేపల్లి : కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ల కన్నా జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదివారం రోజున అన్ని జిల్లాల కలెక్టర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనల వల్లనే సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలు, లబ్ధిదారుల, తదితర వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా కీలకం అని పేర్కొన్నారు. నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలని.. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని తన దృష్టికి వచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పరిస్థితి మారాలని అన్నారు. పరిపాలనలో తనకు జిల్లా కలెక్టర్లే కళ్లు, చెవులు అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి కలెక్టర్లే వారధి వంటివారని స్పష్టం చేశారు. -
రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్ : తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అన్ని కార్యాలయాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెవెన్యూ యంత్రాంగం భయాందోళనలకు గురవుతోందని, వెంటనే తమకు భద్రత కల్పించాలని రెవెన్యూ జేఏసీ (ట్రెసా) చేసిన విజ్ఞప్తి మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్కుమార్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు. ►అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్ కార్యాలయాల్లోకి రాకపోకల కోసం ప్రత్యేక పద్ధతిని పాటించాలి. అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలి ►తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసే ‘గ్రీవెన్స్’కార్యక్రమం కోసం నిర్దేశిత వేళలు నిర్ధారించాలి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది హాజరయ్యేలా చూడాలి. ►కలెక్టర్లు తమ నిధులతో వెంటనే అన్ని కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కార్యాలయంలోని అన్ని ప్రాంతాలు ఆ పరిధిలోకి వచ్చే విధంగా వాటిని అమర్చాలి. ►కొత్తగా ఏర్పాటయిన కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మౌలిక వసతుల కోసం తీసుకున్న చర్యల నివేదికను పంపించాలి. ►అధికారుల చాంబర్లను కోర్టు హాళ్లను మాదిరిగా ఆధునీకరించాలి. ►ముఖ్యమైన చట్టాలు, మెజిస్టీరియల్ కార్యనిర్వాహక అంశాలపై జిల్లా శిక్షణా కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. -
'వలంటీర్లతోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది'
సాక్షి, ఒంగోలు : వలంటీర్లు గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మల వంటి వారని, వారి ద్వారా క్షేత్రస్థాయిలో పాలన సులువుగా మారిందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. ‘రైతు భరోసా’ ప్రక్రియలో ఎదురైన సమస్యలను రెండు రోజుల్లోపే పరిష్కరించ గలగడం దీనివల్లే సాధ్యపడిందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పది ప్రత్యేక కార్యక్రమాలకు తాము రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్ర: వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది? కలెక్టర్: ఈనెల 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు అనేక సమస్యలు వెల్లువెత్తాయి. వాటన్నింటిని పరిష్కరించాలంటే ఫీల్డులో పని చేసేవారు కావాలి. దీంతో వలంటీర్లను రంగంలోకి దించాం. వారందరికి మొబైల్కే అప్లికేషన్ ఇవ్వడంతో కేవలం ఒకటిన్నర రోజులోనే వాటన్నింటిని పూర్తిచేశారు. వాస్తవానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేకపోతే ఇది అసాధ్యంగా ఉండేది. వలంటీర్లవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు సత్వరమే ప్రజల ముంగిటకు తీసుకువెళ్లగలుగుతున్నామనేది వందశాతం వాస్తవం. ప్ర: రైతు భరోసా పథకంలో ఎంతమందికి లబ్ది చేకూరుతుంది కలెక్టర్: రైతు భరోసా పథకం కింద ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా కొంతమంది ప్రజాసాధికార సర్వేలో లేనివారు కూడా ఉన్నారు. వారికి అర్హత కల్పించేందుకు ప్రజాసాధికార సర్వేచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అయితే ప్రజాసాధికార సర్వేతోపాటు వారు వెబ్ల్యాండ్లో కూడా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గతంలో వీటికి సంబంధించి కొంత పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అందువల్ల వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. అయితే తాము, గ్రామస్థాయిలో వాలంటీర్లు చూపుతున్న చొరవ వల్ల మరో 10వేల మంది లబ్దిదారులు పెరుగుతారని భావిస్తున్నాం. అయినా భూములు తమపైన లేనివారు, భూమి యజమాని చనిపోయినా వాటిని తమ పేరు మీదకు మార్చుకోని కుటుంబాలవారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు తప్ప అత్యధికంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతు భరోసా స్కీములో లబ్దిదారులను గుర్తించడంలో ప్రకాశం ప్రథమ స్థానంలో ఉంది. ప్ర: సచివాలయ భవనాల పరిస్థితి కలెక్టర్: గ్రామ సచివాలయాలకు ప్రస్తుతం జిల్లాలో 1038 పంచాయతీలకుగాను 1038 పంచాయతీ కార్యదర్శులు అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న భవనంకు అదనంగా గదులు నిర్మించడం లేదా అంతస్తు నిర్మించడం కోసం దాదాపు 180 వరకు గుర్తించాం. వీటికి రు25లక్షలు కేటాయిస్తున్నాం. అయితే ప్రతి గ్రామ సచివాలయ భవనం 2వేల చదరపు అడుగులలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నూతనంగా నిర్మించేవాటికి మాత్రం రు40లక్షలు కేటాయిస్తున్నాం. ఇందుకు రూ.350కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్ర: వలంటీర్లను ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? కలెక్టర్: వలంటీర్లు పెద్ద ఎత్తున జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. వీరంతా చాలా మంచి నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వీరందరి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు సచివాలయ స్థాయిలో పంచాయతీ కార్యదర్శితో వీరికి సమన్వయం చేయబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కనెక్టివిటీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా పంచాయతీ నుంచి మండల స్థాయికి కూడా కనెక్టివిటీని తీసుకురావడం ద్వారా వేగవంతంగా ఫలితాన్ని పొందేందుకు, ప్రజలకు సేవలు అందించొచ్చు. ప్ర: ఇసుక సమస్య గురించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? కలెక్టర్: పాలేరు–బిట్రగుంటకు సంబంధించిన ఇసుకను ఒంగోలు, కందుకూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాలలో నాలుగు స్టాక్ యార్డులకు తరలించడం ద్వారా ఇసుక సమస్యకు పరిష్కారం చేయదలిచాం. అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు టీములను కూడా ఆదివారమే పంపిస్తున్నాం. వారు వారితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా ఇసుక సమస్యకు అతి త్వరలోనే ఫుల్స్టాప్ పడనుంది. గిద్దలూరుకు ఇసుక సమస్యను నివారించేందుకు ఏంచేయాలనే దానిపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పట్టా భూముల్లో ఇసుకను సైతం మైనింగ్శాఖ ద్వారా తవ్వకాలు జరిపి సంబంధిత సమీప ప్రాంతాల ప్రజలకు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్ర: ఒంగోలు వైద్యశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడతున్నారు కలెక్టర్: ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణలో అనధికారికంగా ఆక్రమించుకున్న షాపులను ఖాళీచేయించాం. వాటిని వేలం వేయడం ద్వారా ఆసుపత్రి అభివృద్ధి నిధిని పెంచుకుంటాం. అంతేకాకుండా దిగువ అంతస్తులో ఉన్న రక్షిత మంచినీటిని ప్రతి అంతస్తులోను పొందేందుకే వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. అంతే కాకుండా ఏరియా వైద్యశాలలకు సైతం ఎక్స్రే మిషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈమేరకు ఇటీవలే డీసీహెచ్ఎస్కు లేఖ కూడా పంపాం. -
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సంపూర్ణ మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం సాయం త్రం స్థానిక బాపూజీ కళా మందిరంలో వసతి గృహ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతి గృహాల్లోనూ మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాలు తయారు చేశామని, రూ.10 లక్షల లోపు విలువ కలిగిన అంచనాలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రతి వసతి గృహాని కి ఒక ఇంజినీర్కు బాధ్యతలు అప్పగించామ న్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రూ. 20 లక్షల సర్వశిక్ష అభియాన్ నిధులతో మరమ్మతులు చేపట్టామన్నారు. మరుగుదొడ్లు, ఇతర పనుల కోసం రూ.11 కోట్లతో అంచనాలు త యారు చేశామన్నారు. మొదటి దశలో దాదాపు రూ.6 కోట్లతో పనులను చేపడతామన్నారు. హౌస్ కీపింగ్కు అనుమతులు.. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా హౌస్ కీపింగ్కు అనుమతులు వచ్చాయని త్వరలోనే మంజూరు చేస్తామన్నా రు. వసతి గృహాల శుభ్రతపై సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, మరుగుదొడ్లలో విధిగా రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. మరుగు దొడ్ల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. దుస్తులు ఆరవేసేందుకు సదుపాయం కల్పించాలన్నారు. కొన్ని గురుకులాల్లో అన్నం, పప్పుచారుతో భోజనం పెడుతున్నారన్నారు. మెనూలో తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో టెండర్లను ఖరారు చేసి, ప్రతి వసతి గృహానికి స్టీమ్ కుక్కర్, గ్రయిండర్, మిక్సీలను సరఫరా చేస్తామన్నారు. ప్రతి వసతి గృహంలో నూ మెనూ బోర్డును ప్రదర్శించాలని, భోజనాల ఫొటోలను ప్రతి రోజూ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వారంలో ఒక రాత్రి నిద్రపోవాలి సంక్షేమాధికారులు వారంలో ఒక రాత్రి వసతి గృహంలో ని«ద్రపోవాలన్నారు. విద్యార్థుల్లో గుణాత్మకత విద్యా విలువలు వారిలో ప్రేరణ కల్పిస్తాయన్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, సమాజిక విలువలను వివరించాలన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన పోలాకి, రాజాం బీసీ వసతి గృహ అధికారులను అభినందించారు. వసతి గృహ సమస్యలపై మొబైల్ యాప్ను తయారు చేయడం జరిగిందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో వసతి గృహాల పరిశీలకులు పి.రజనీకాంతరావు, ఆర్అండ్బీ ఎస్ఈ కె.కాంతిమతి, బీసీ సంక్షేమాధికారి కె.కె.కృతిక, బీసీ కార్పొరేషన్ ఈడీ జి.రాజారావు, ఇంజినీరింగ్ అధికారులు సి.సుగుణాకరరావు, కె.భాస్కరరావు, గుప్త, రామం తదితరులు పాల్గొన్నారు. -
గురుకులం నిర్వహణపై కలెక్టర్ కన్నెర్ర
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టర్ జి.నివాస్ హఠాత్తుగా కంచిలిలోని ఏపీ బాలయోగి గురుకులంలో ప్రవేశించారు. నేరుగా భోజన శాల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పిల్లలకు ఏం వడ్డించారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన మెనూ అమలు కాలేదని గ్రహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సివుండగా.. వారు ఇళ్లకు వెళ్లినట్టు తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. గురుకులం ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకు వడ్డించలేదని ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ను ప్రశ్నించారు. కేవలం పప్పుచారుతోనే పిల్లలు ఎలా తింటారని నిలదీశారు. దీనికి గల కారణమేంటని ప్రశ్నించగా కూరలు తీసుకురావడం ఆలస్యమైందని ప్రిన్సిపాల్ చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సమయంలో ఉపాధ్యాయులు, మిగ తా సిబ్బంది హాజరును పరిశీలించగా, అప్పటికి నలుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. దీనిపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయకుండా ఇంటికి వెళ్లడం ఏమిటని నిలదీశారు. పిల్లలకు పప్పుచారుపెట్టి .. మీరు మాత్రం మాంసాహా రాలుతినడానికి ఇళ్లకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. నాలుగో వంతు పిల్లలు కూడా లేరు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో 400 మంది పిల్లలకు 70 నుంచి 80 మంది మాత్రమే హాజరు కావడం, వారు కూడా యూనిఫారాలు ధరించకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఇదేం క్రమశిక్షణ అని ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. కలెక్టర్ పర్యటనలో గురుకుల నిర్వహణ తీరు, విద్యార్థుల వసతి తదితర అంశాలను, రికార్డులను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆయన తనిఖీలు కొనసాగాయి. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. లోపాలకు గల కారణాలను గురుకుల సిబ్బందిని అడిగారు. వారి సమాధానాలకు కలెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన సిబ్బందిలో కన్పించింది. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ గురుకుల ప్రిన్సిపాల్ ఎన్.బాలాజీ నాయక్, ఉపాధ్యాయులు టి.వి.రమణ, పి.సురేష్, జి.జయరాం, పి.అమ్మాయమ్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ జి.నివాస్ ప్రకటించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్తోపాటు మండల ప్రత్యేకాధికారి ఆర్.వరప్రసాద్, తహసీల్దార్ కె.డిసెంబరరావు, ఎంపీడీఓ చల్లా శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్లకూ ఓ ఖజానా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా కలెక్టర్లకు అధికారం, దర్పం, హోదా ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంతంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు చిల్లిగవ్వ కూడా వారి ఖజానాలో లేని దుస్థితి. ఆసుపత్రి అభివృద్ధి నిధులనో, ఖనిజాభివృద్ధి నిధులనో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఓ ఖజానాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్కు ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు రూ.195 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగంలో రాజకీయ జోక్యానికి తావులేకుండా.. కలెక్టర్ల విచక్షణకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేయొచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఇప్పటికే రూ.6.5 కోట్ల మేర నిధుల వినియోగానికి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారానే అన్ని పనులు వాస్తవానికి గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను(ఎస్డీఎఫ్) కేటాయించింది. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించింది. కానీ, నిధుల వినియోగంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం రెయిన్గన్ల కొనుగోలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసింది. ఇందులో కొన్ని పనులను అప్పటి అధికార పార్టీ నేతలకు నామినేషన్పై అప్పగించారు. ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ పని అయినా టెండర్ ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో రూ.6.5 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఎక్కడా నామినేషన్ పద్ధతిని పాటించడం లేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్ను సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తాం. తద్వారా రానున్న రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజాదరణ పెరుగుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే రెండేళ్లలో పరిస్థితిలో మరింత సానుకూల మార్పు రావడం ఖాయం’’ అని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. -
ప్రతిభే కొలమానం
సాక్షి, విశాఖపట్నం: పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఇవి. అభ్యర్థి ప్రతిభ ఆధారంగానే ర్యాంకు నిర్ణయమవుతుంది. ఆ ర్యాంకు బట్టే ఉద్యోగం భర్తీ జరుగుతుంది. అంతేతప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు. ఇది పూర్తిగా పోటీ పరీక్ష. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. బయట అనవసర ప్రచారాలు నమ్మవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. పూర్తి పారదర్శకంగా పరీక్షలు.. ప్రతీ ప్రశ్నాపత్రం నాలుగు సెట్లుగా ఉంటుంది. ఎక్కడా కాపీయింగ్కు అవకాశం ఉండదు. ఇవి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇవి పోటీపరీక్షలు కాబట్టి అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైనదే. మాల్ప్రాక్టీస్ వంటి అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దు. అది నేరమవుతుంది. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అనవసరంగా భవిష్యత్తు పాడుచేసుకోవద్దు. చక్కగా చదువుకొని పరీక్షల్లో ప్రతిభ చూపించండి. అడిగిన ప్రశ్నకు జవాబు రాయండి. మైనస్ మార్కులు ఉన్నాయి గమనించండి. కేంద్రానికి ముందుగానే చేరుకోండి.. ఇది పోటీ పరీక్ష కాబట్టి అభ్యర్థులంతా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఉదయం 7.30 నుంచి 8 గంటలకల్లా చేరుకుంటే మంచిది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ 8 గంటల నుంచి పరీక్ష కేంద్రం గేటు తెరుస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు లోపలికి వెళ్లవచ్చు. ఏ హాల్లో ఏయే రోల్ నంబర్లు కేటాయించారో అక్కడ నోటీసు బోర్డులో వివరాలు ఉంటాయి. ముందుగానే చూసుకుంటే తనకు సంబంధించిన హాల్ ఎక్కడుందీ తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ లోపలకు అనుమతించరు. అందుకే సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి అభ్యర్థులంతా ప్రయత్నించాలి. అందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే అర్బన్ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల జాబితాను ఆటోడ్రైవర్ల అసోసియేషన్లకు ఇచ్చాం. అభ్యర్థులకు సహకరించాలని ఆటోడ్రైవర్లను కోరాం. బస్సు లేదా ఆటో ఏదైనా ఏదైనా సరే పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరండి. కొంతమంది ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం పరీక్ష రాసిన కేంద్రాన్నే రెండో పూట పరీక్షకూ కేటాయించాం. కానీ ఉదయం పూట కన్నా మధ్యాహ్నం అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి పరీక్ష హాల్, సీటింగ్ మారుతుంది. 12.30 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి. 2 గంటలకల్లా తమకు కేటాయించిన హాల్ ఎక్కడుందో చూసుకొని వెళ్లండి. -ఇతర జిల్లాల నుంచి కూడా పరీక్ష రాయడానికి వస్తున్నారు కాబట్టి పరీక్ష తేదీకి ముందురోజే ఒకసారి పరీక్ష కేంద్రానికి వెళ్లి సరిచూసుకుంటే ఇంకా మంచిది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు.. ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగేవన్నీ వోఎంఆర్ ఆధారిత పరీక్షలే. ప్రశ్నాపత్రంతో పాటు వోఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చదివి జవాబులను వోఎంఆర్ షీట్లో నింపాలి. ఆప్షన్లు నాలుగింటిలో సరైనదాన్ని బాల్పాయింట్ పెన్ (బ్లాక్/బ్లూ)తో మాత్రమే నింపాలి. జెల్ పెన్, ఇంక్ పెన్, పెన్సిల్ ఎట్టి పరిస్థితిలోనూ వాడవద్దు. పరీక్ష ప్రారంభించడానికి ముందు అందరూ కచ్చితంగా ప్రశ్నాపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్పై ఉన్న సూచనలను తప్పకుండా క్షుణ్నంగా చదవాలి. సాయంత్రానికల్లా ‘కీ’... పరీక్ష పూర్తయిన తర్వాత ఒరిజినల్ ఓఎంఆర్ ఇన్విజిలేటర్కు అప్పగించి నకలు (రెండో కాపీ) అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. ప్రశ్నాపత్రం తెచ్చుకోవచ్చు. ఏరోజు పరీక్షది ఆ రోజు సాయంత్రమే ప్రభుత్వం ‘కీ’ విడుదల చేస్తుం ది. అభ్యర్థులు దాన్ని గమనించి ఎన్ని మార్కులు వస్తాయో చూసుకోవచ్చు. పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయనడానికి ఇదే నిదర్శనం. మొబైల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వద్దు.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోను తేవద్దు. ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులేవీ పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఎవరైనా ఫోన్, మెటీరియల్, ఇతరత్రా పుస్తకాలు తెస్తే ఒక బ్యాగ్లో పెట్టి భద్రపరచుకోవడానికి పరీక్ష కేంద్రంలో ఒక గది ఉంటుంది. అయితే తమ వస్తువుల బాధ్యత అభ్యర్థులదే. అందుబాటులో వైద్యం శిబిరం.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం (మెడికల్ క్యాంప్) పెడుతున్నాం. ఇద్దరు ఏఎన్ఎంలు, ప్ర థమ చికిత్స కిట్, మందులు ఉంటాయి. 108 అంబులెన్స్లను అలెర్ట్ చేసి ఉంచాం. పరీక్ష కేం ద్రంలో మంచినీరు ఏర్పాటు చేశాం. టాయిలె ట్స్ సౌకర్యం ఉంటుంది. పరిశుభ్రంగా ఉంచేం దుకు పారిశుద్ధ్య కార్మికులను ఉంచుతున్నాం. గట్టి పోలీసు భద్రత.. పరీక్షలన్నీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను సిబ్బంది, అధికారులందరికీ ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే పూర్తి అయ్యింది. శనివారం జిల్లాలో కేటా యించిన పోలీసుస్టేషన్లకు మెటీరియల్ చేరుతుంది. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు గట్టిపోలీసు భద్రతతో పంపిస్తాం. ఎక్కడా ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. పరీక్షా నిర్వాహకుల జాబితాలు బయటకు వచ్చాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయనే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్విజిలేటర్లకు కూడా తమను ఏ సెంటర్లకు కేటాయించిందీ ముందు రోజు మధ్యాహ్నం అదీ రహస్యంగా తెలియజేస్తారు. ఏ హాల్ కేటాయిస్తున్నదీ పరీక్ష రోజు ఉదయం 7.30 గంటలకు మాత్రమే సమాచారం ఇస్తారు. అందుకు సంబంధించిన జాబితాలన్నీ సీల్డ్ కవర్లో భద్రంగా ఉన్నాయి. బయటకు ఎలాంటి లీకేజీ జరగలేదు. గుర్తింపు కార్డు ఉంటే మంచిది... హాల్టికెట్లో కొంతమంది పేరు తప్పుగా వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే హాల్టికెట్పై అభ్యర్థి ఫొటో ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఆ హాల్టికెట్పై ఫొటో ఆధారంగానే పరీక్షాహాల్లోకి అనుమతి ఇస్తారు. ఎందుకైనా మంచిది అభ్యర్థులు తమ వెంట ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డులు ఏవైనా వెంట తెచ్చుకుంటే మంచిది. హాల్టికెట్లో ఏమైనా తప్పులు దొర్లితే సరిచూసుకోవడానికి మాత్రమే ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయి. ఏదేమైనా హాల్టికెట్ మాత్రం వెంటతెచ్చుకోవడం మరచిపోవద్దు. అది లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతించరు. -
ఇక ప్రతివారం ‘కాఫీ టుగెదర్’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తద్వారా అధికారుల మధ్య సమన్వయం కుదిరి భూవివాదాల పరిష్కారానికి అవకాశముంటుందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన స్పందన రివ్యూ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలి. భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలి. గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలు కలిసి కూర్చోవాలి. భూవివాదాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలు చేసిన ఈ ప్రతిపాదనలు బాగున్నాయి. మిగతా అధికారులు ఇది పాటించాలి. మళ్లీ చెప్తున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు’ అన్నారు. సెప్టెంబర్లో ప్రారంభం.. వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో మొదటగా ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటిదాకా ప్రజలకు అందించే బియ్యంలో నాణ్యత లేక వారు తినడంలేదని చెప్పారు. ప్రజలు తినగలిగే బియ్యాన్నే ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్రావతిలో నీళ్లు నిలపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందుకోసం రూ.52 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్ అడిగితే వెంటనే ఇవ్వండని అధికారులకు చెప్పానని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్/సిద్ధిపేట/గజ్వేల్ : అడవులు విరివిగా ఎక్కడ పెరిగితే ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారు.. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, హరిత జిల్లాల ఏర్పాటుకు కలిసి కట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. కలెక్టర్లు, మంత్రులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయిపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను బుధవారం మం త్రులు, కలెక్టర్లకు ఆయన చూపించారు. సింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను, గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని గజ్వేల్ షరీఫ్లో 160 హెక్టార్లలో నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడి నుంచి 2016లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ నాటిన మొక్కలను కలెక్టర్లు, మంత్రులకు చూపించారు. మంకీస్ ఫుడ్ కోర్టులు... కొత్త రెవెన్యూ, పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన గురించి కలెక్టర్లతో కేసీఆర్ చర్చించారు. ‘పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలి. ఇందుకోసం 60 రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్నాం. ఈ చట్టంతో రైతులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు. అడవులు నశించడంతో పండ్లూఫలాలు లేక కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. కోతులు వాపస్ పోవాలంటే వాటికి అక్కడే ఆహారం లభించేలా చెట్లను పెంచాలి. ఫల, మేడి, మర్రీ లాంటి 27 రకాల పండ్ల మొక్కలు నాటితే కోతులకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అడవులు అంటే కోతులు, ఇతర జంతువులతో కళకళలాడుతూ ఉండాలి’అని చెప్పారు. గచ్చకాయ చెట్టు పరిచయం చేసింది నేనే.. ‘అడవులు, చెలకలకు గచ్చకాయ చెట్టు కంచెగా ఉంటుంది. జంతువులు, మనుషులు కూడా లోపలికి వెళ్లలేరు. అటవీ అధికారులకు దాన్ని పరిచయం చేసింది నేనే’అని చెప్పిన కేసీఆర్ ఇలా నాటిన గచ్చకాయ చెట్లను కలెక్టర్లకు చూపించారు. ఎడారిగా ఉన్న సిద్దిపేట అటవీ భూముల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పంచిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అటవీశాఖ అధికారుల పనితీరు భేష్ అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీంతో బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, గుంతకండ్ల జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి శుభాష్రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య సైతం పాల్గొన్నారు. పచ్చటి గజ్వేల్... ‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లు లేకుండా ఏడారిగా ఉండేవి. అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఆ ఫలితమే ఇప్పటి ఈ పచ్చటి గజ్వేల్. ఇక్కడ 27 రకాల పండ్ల మొక్కలను పెంచడంతో కోతులకు ఆహారం అందుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉంది. ఇది మన భూభాగంలో 23.4 శాతం. అడవుల పెంపకంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములు కావాలి. అడవుల్లో చెట్ల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి’అని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా కోమటిబండలో ప్రారంభించిన మిషన్ భగీరథ ప్లాంట్ను కలెక్టర్లకు చూపించారు. అక్కడే వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. -
‘సమస్యలపై ఫోన్ చేస్తే ఎప్పుడూ స్పందించరు’
సాక్షి, వికారాబాద్: ‘నేను చాలా సార్లు ఫోన్ చేశా, మీరు తీయడం లేదు, ఒక వేళ మీటింగ్లతో బిజీగా ఉంటే ఆ తర్వాతైనా ఫోన్ చేయొచ్చు కదా.. మీరు ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్కుమార్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. వివరాలిలా ఉన్నాయి.. రైతు సమస్యల పరిష్కారం డిమాండ్తో సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిదులంటే చిన్నచూపు ఎందుకని నిలదీశారు. మీతో మాకు వ్యక్తిగత అవసరలేవీ లేవని, ఈ ప్రాంతం గురించి మీకు గానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గానీ పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. అందుకోసమే కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేస్తే మీరు స్పందించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. తాము 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ తీయలేకపోతే తర్వాత చేసినా మార్యాద ఇచ్చిన వారవుతారన్నారు. పలు సమస్యలపై మాట్లాడేందుకు తాను చాలా సార్లు ఫోన్ చేసినా తీయలేదన్నారు. ఇది తమను అగౌరవపర్చినట్లేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సగం మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందలేదని, 50 శాతం రైతులకు రైతుబంధు అందలేదని తెలిపారు. జిల్లా అంటే మరుగుదొడ్లు నిర్మించడం, మొక్కలు నాటడమే కాదు, ప్రజల అవసరాలను తెలుసుకొని పాలన అందిస్తే మంచిదని ప్రసాద్కుమార్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, మండల అధికారులు ఎప్పుడు చూసినా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీ వీసీ అంటూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. అధికారుల పనితీరుతో ఎంతో మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.విశ్వేశ్వర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రధాన జనగణన అధికారులుగా కలెక్టర్లు
సాక్షి, అమరావతి: 2021 నుంచి చేపట్టనున్న జనాభా సేకరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లను ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ప్రీ టెస్ట్ సెన్సెస్ నిర్వహణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం, అనంతపురం జిల్లా ఆత్మకూరు, గుంటూరు జిల్లా నర్సరావుపేట సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా స్థానిక తహసిల్దార్లను నియామకం చేస్తూ సాధరణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
'ప్రభుత్వం సరికొత్త పాలన అందించబోతుంది'
సాక్షి, కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త గ్రామ సచివాలయ పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల పాలనకు శ్రీకారం చుట్టబోతోంది. స్వాతంత్య్ర వేడుకల అనంతరం గురువారం ఉదయం 11 .00 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిని ప్రారంభిస్తారు. తొలిరోజు వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం వలంటీర్లు వారి పరిధిలోని గృహాలకు వెళ్లి పరిచయ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ సచి వాలయ పాలనలో భాగస్వాములవుతారు. గ్రామ సచివా లయ పాలనను ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ పాలనను ముందుకు నడిపించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టింది. గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం నేపథ్యంలో వారి విధి విదానాలు, పాలన తీరుతెన్నులను కలెక్టర్ సీహెచ్ హరి కిరణ్ ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. గ్రామ వలంటీర్ల పాలనను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ తెలిపారు.అనంతరం సీఎం సందేశమిస్తారన్నారు. ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందో ఆయన తెలియజేస్తారన్నారు. వలంటీర్ల పనితీరు, వారి నడత, నడక ఎలా ఉండాలో స్పష్టత ఇస్తారని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా తీసుకెళ్లాలో ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు. సీఎం సందేశం అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఇందులో పాల్గొంటారన్నారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు వలంటీర్ల పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. వారికి కేటాయించిన 50 లేదా 60 గృహాలకు వెళ్లి వారు పరిచయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 23 నుంచి 30వ తేది వరకు గ్రామాల్లో అర్హులైçన వారికి నివాస స్థలాల కోసం సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు.వారం రోజుల్లో వలంటీర్లు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వలంటీర్లు బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించమని చెప్పారు. గాంధీజయంతి నుంచి గ్రామసచివాలయ వ్యవస్థ అక్టోబరులో గాంధీ జయంతి నాటి నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వస్తుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ప్రభుత్వం అక్కడి నుంచే అమలు చేస్తుందన్నారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేటగిరి–1 పరిధిలో జిల్లాలో 82 వేల మంది ఆన్లైన్లో, అన్ని కేటగిరీలకు కలిపి లక్షా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 400 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇంటి స్థలాల కోసం జమ్మలమడుగు డివిజన్ మినహా మిగిలిన డివిజన్ల పరిధిలో 2021 ఎకరాలు గుర్తించామన్నారు స్పం దన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. గ్రామ సచివా లయ వ్యవస్థ రాగానే అర్హులందరికీ పెన్షన్లు, రేషన్కార్డులు అందజేస్తామని వివరించారు. -
రైతు కూలీగా మారిన జిల్లా కలెక్టర్
సాక్షి, భూపాలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడు బిజీగా ఉండే అధికారి రైతు కూలీగా మారి పొలంలో వరినాట్లు వేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఆ అధికారి పేరు వాసం వెంకటేశ్వర్లు. ఈయన భూపాలపల్లి కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సమస్యలే ఎజెండాగా తీసుకొని వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. భూ పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపించారు. తాజాగా జిల్లాలోని ఘనపురం మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం వెళుతున్న క్రమంలో దారి మధ్యలో రైతు కూలీగా మారి పొలంలో నాట్లు వేశారు. ఒక జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎలాంటి బేషజాలకు పోకుండా మాతో కలిసి వరినాట్లు వేయడం తమకెంతో ఆనందం కలిగించదని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
సాక్షి, విజయవాడ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం విజయవాడలోని బిషప్ హాజరయ్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ బెండాజోల్ టాబ్లెట్లను అందజేశారు. ఈ టాబ్లెట్ ద్వారా నులి పురుగులను నివారించవచ్చని పేర్కొన్నారు. అపరిశుభ్ర వాతావరణం ఆరోగ్యానికి హానికరమని వెల్లడించారు. ఏడాది వయపు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు శరీరంలో నులిపురుగులు వస్తాయని, అందుకే పని చేసిన ప్రతీసారి చేతులను శుభ్రంగా కడుక్కుంటే నులిపురుగులు దరిచేరవని తెలిపారు. -
తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం
సాక్షి, డిచ్పల్లి : యూనివర్సిటీ సిబ్బంది అందరూ తనకు సమానమేనని, సమష్టి కృషితో తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడదామని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇన్చార్జి వీసీ వి.అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం తెయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పరిపాలనా భవనంలో వివిధ విభాగాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందిని విభాగాల వారీగా పరిచయం చేసుకున్నారు. విద్యా సంస్థలంటే తనకెంతో ఇష్టమని, తాను చదువుకునే సమయంలోనే ఉద్యోగం సాధించడానికి వివిధ పోటీ పరీక్షలను రాశానని గుర్తు చేసుకున్నారు. ఆచార్యుల ఆలోచనా విధానం, మార్గనిర్దేశనం ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి క్రమంగా వస్తూ ఉంటానని ప్రతి నెలలోనూ సిబ్బంది పనితీరుకు సంబం ధించి సమావేశం నిర్వహిస్తామన్నారు. అందరి సూచనలు, సలహాల ప్రకారం విద్యాపరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెయూ మూడోస్థానంలో ఉందని, మొదటి స్థానానికి రావడానికి మనందరం సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం ఉండాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి గోల్డెన్, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్, మూడో స్థానం పొందిన విద్యార్థికి కాపర్ బ్యాడ్జెస్ వంటి గుర్తింపు కార్డులను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. తద్వారా విద్యార్థులందరూ పోటీతత్వంతో మరింత బాగా చదివి మంచి ఫలితాలను సాధించడానికి చూస్తారని ఇన్చార్జి వీసీ తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు, సీవోఈ సంపత్కుమార్, ఏఈ వినోద్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు. -
కలెక్టర్ కట్టె పట్టినా అంతే!
జిల్లాలో మొత్తం రైతుల ఖాతాలకు గాను 2,121 ఖాతాలకు సంబంధించి భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కేవలం సాంకేతిక కారణాలతో డిజిటల్ సంతకాలు కాలేదు. రైతులకు సంబంధించి ఆధార్ కార్డు నంబర్లు లేవని చెప్పడంతో పాటు ఇతర కారణాలతో వీటిని పక్కన పెట్టారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్నా... జిల్లా కలెక్టర్ బరిగె పట్టుకున్నట్లుగా వెంటపడుతున్నా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలేమో! సాక్షి, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన(ఎల్ఆర్యూపీ) కార్యక్రమం జిల్లాలో ప్రహసనంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ప్రతీ శనివారం ఎల్ఆర్యూపీ సమస్యలపై డీఆర్వో నుంచి వీఆర్వో స్థాయి వరకు అధికారులతో నేరుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ వారంలో సాధించిన, ఇంకా సాధించాల్సిన ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణికి వచ్చిన భూసమస్యల విషయంలో అధికారులు తక్షణం స్పందించాలని, రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూలాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేసే ఉద్దేశం వారిలో కనిపించడంలేదు. అలా కాకపోతే ఉద్యోగులు ‘ఆశించిన ఫలితం’ దక్కడం లేదనే భావనతో కొన్ని పనులు పక్కన పడేస్తున్నారు. మరికొన్నిచోట్ల సర్వేల పేరుతో పెండింగ్లో పెడుతున్నారు. సర్వే పూర్తి చేసుకుని తమ భూమి రికార్డుల్లో నమోదు చేయమని వెళ్తే ఆ సర్వే నంబర్లో ఖాళీ లేదని చెబుతున్నారు. లేదంటే చుట్టుపక్కల ఉన్న అందరూ కలిపి సర్వే చేయించుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు వీఆర్వోలు, మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక అలిసిపోతున్నారు. చివరకు మళ్లీ కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్కు వస్తున్నారు. పైసలిస్తేనే పని... అర్బన్ జిల్లాలో మెజార్టీ మండలాల్లో భూములు విలువ ఎకరానికి రూ.కోట్లల్లో ఉంది. ఇలాంటి చోట రైతు బందు పథకంతో పాటు విలువైన భూమిని తమ పేరుతో భద్రంగా ఉంచుకోవాలని రైతులు ఆరాటపడటం సహజం. దీనిని అదనుగా తీసుకుని రెవెన్యూ సిబ్బంది తమకు అడినంత ఇస్తేనే పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిలాఖత్ అయి పక్కన భూములు ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భూమికి మార్కెట్లో ఉన్న ధరను బట్టి రెవెన్యూ సిబ్బంది తమ కమీషన్ డిమాండ్ చేన్నారు. రూ.కోట్లల్లో ధర ఉన్నచోట రూ.లక్షల్లో ఇవ్వాల్సిందే. రైతులకు సంబంధించి అన్ని రుజువులు ఉన్నా అడిగినంత ఇస్తేనే పనులు చేస్తున్నారు. 21 శాతం పార్ట్ బీలో... రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 1,31,210 ఖాతాలతో పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో 89,243 ఖాతాలు అంటే 68శాతం వ్యవసాయ భూములకు సంబంధించినవి ఉన్నాయి. మిగతా వాటిలో 14,430 అంటే 11శాతం వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ అసైన్డ్ లాండ్స్కు ఖాతాలు మంజూరు చేశారు. ఈ లెక్కన వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు మొత్తంగా 1,03,673 ఖాతాలతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. మిగతా 21 శాతం అంటే 27,537 ఖాతాలు పార్ట్ ‘బీ’ భూములకు సంబంధించినవి ఉన్నాయి. -
గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్
సాక్షి, ఝరాసంగం: గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆదర్శవంతంగా మారాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని నర్సాపూర్లో గ్రామ ఆరోగ్య వేదిక ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని శిథిల పాఠశాలతో పాటు ప్రధాన రహదారిలోని మురికి కాల్వలు, ఇంటి ఆవరణలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వైద్యశాఖ అధికారులు వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కళాకారులచే కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామం ఒక అంశంలో మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు తొలగించాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి నిల్వతో డెంగ్యూతో పాటు తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో స్థలం లేనందున ఎవరైనా 10 గుంటల స్థలం ఇప్పించేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాడి గ్రామాభివృద్దికి సహకరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్, తుప్రాన్లోని మల్కాపూర్ గ్రామాల మాదిరి ఆదర్శవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవదాసు, సర్పంచ్ శశిరేఖశ్రీనివాస్రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ జితిష్బీ.పాటిల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్, జిల్లా పశువైద్యాధికారి రామారావు రాథోడ్, ఇమ్యూనైజేషన్ అధికారిణి గాయత్రీదేవి, ఎంపీడీఓ సుజాత, మండల వైద్యాధికారి మజీద్ తదిరులు పాల్గొన్నారు. -
అందరూ సెలవులు పెడితే ఎలా?
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : ఆసుపత్రి పనివేళల్లో కనీసం 20 శాతం సిబ్బంది అయినా అందుబాటులో ఉండకపోతే ఎలా? రోగుల పరిస్థితి ఏంటని కలెక్టర్ జే నివాస్ వైద్యాధికారి ప్రదీప్కుమార్పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం వీరఘట్టం పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇక్కడ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించారు. తక్కువ మంది సిబ్బందిలో కొంద రు బదిలీల కౌన్సెలింగ్కు, ఇంకొంత మంది సెలవుపై వెళ్లారు. అయితే ఆసుపత్రిలో కనీస సిబ్బంది కూడా లేకపోవడంతో ఆసుపత్రి నిర్వహణ బాగులేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ వై యోగీశ్వరరరెడ్డి నాలుగు నెలల్లో 27 సెలవులు పెట్టినట్లు గుర్తించిన కలెక్టర్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగికి ఇన్ని సెలవులు ఎలా మంజూరు చేశారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే హెల్త్ ఎడ్యుకేటర్ను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఫోన్లో ఆదేశించారు. అంతకు ముం దు వార్డుల్లో రోగులను పలకరించి ఇక్కడ వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు. అందరూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈయన వెంట పాలకొండ ఆర్డీవో ఎల్ రఘుబాబు, మండల ప్రత్యేకాధికారి ఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. ప్రభుత్వ సంస్థల్లో వసతులు మెరుగుపడాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని కలెక్టర్ జే నివాస్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు విధిగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, తదితర సంస్థలను సందర్శించాలన్నారు. అక్కడ మౌలిక వసతుల కొరతను గుర్తించి వారంలోగా పరిష్కరించాలన్నారు. గురువారం సాయంత్రం మండల ప్రత్యేకాధికారులతో, మండల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలు మంచి సేవలకు నిలయాలుగా మారాలన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, వైద్యసేవలు పక్కాగా అం దాలని, వసతి గృహాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, తదితర మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై, సిబ్బందిపై చర్యలు చేపట్టాలన్నారు. స్పందన కార్యక్రమానికి రావడం వల్ల సమస్య పరిష్కరమైనట్లుగా ప్రజల్లో నమ్మకం కలగాలన్నారు. మండల వ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
పని చేయని వారిని పంపించేస్తా
సాక్షి, విజయనగరం : జిల్లా కేంద్రమైన విజయనగరం నగర పాలక సంస్థ ప్రక్షాళనకు కలెక్టర్, ప్రత్యేకాధికారి డా.ఎం.హరిజవహర్లాల్ శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల కిందట ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సోమవారం సంస్థ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. విభాగాల వారీగా వారు నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని రానున్న ఆరునెలల కాలానికి వారు చేయాల్సిన పనులపై స్పల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించారు. పనిచేయని వారిని పంపించేస్తానని హెచ్చరించారు. నగరపాలక సంస్థకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం, రెవిన్యూ వసూళ్లు తదితర అంశాలపై చర్చించారు. పట్టణంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. వీధులు, రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. పట్టణంలోని పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారి గాంధీకి సూచించారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలపై దష్టి సారించాలన్నారు. జలసంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల నమోదుకు ఒక రిజిష్టర్ నిర్వహించాలని ఆదేశించారు.పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆక్రమణలు తొలగించాలని సూచించారు. బుచ్చెన్న కోనేరుతోపాటు ఎన్సీఎస్ థియేటర్ వెనుక భాగంలోని చెరువు, ప్రేమసమాజం ఎదురుగా ఉన్న చెరువులను పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. నగరంలోని పలు కూడళ్లను ట్రాఫిక్ పరంగా అభివృద్ధిచేసి వాటిని సుందరీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వర్మ, సహాయ కమిషనర్ కనకమహాలక్ష్మి, వైద్యాధికారి డా.ప్రణీత తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో డీశాలినేషన్ ప్లాంట్
సాక్షి, నెల్లూరు : జిల్లాలో నీటి ఇబ్బందుల శాశ్వత పరిష్కారం కోసం తీరంలో డీశాలినేషన్ (లవణ నిర్మూలన) ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. చెన్నై నగరం సమీపంలో ఉన్న డీశాలినేషన్ ప్లాంట్ను ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. సోమవారం మొదటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ క్రమంలో సదస్సుకు రాష్ట్ర మంత్రివర్గంతోపాటు ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సమస్యలపై కలెక్టర్ సమగ్ర నివేదిక సిద్ధం చేసుకొని సమావేశానికి హాజరయ్యారు. తాగునీటి ఇబ్బందులు, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, అలాగే నూతన ప్రాజెక్ట్ అయిన డీశాలినేషన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, పశువుల దాణాకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేశారు. తీవ్రమవుతున్న తాగునీటి సమస్య జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ముఖ్యంగా ఈ వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని, రోజులు గడిచే కొద్దీ తాగునీటి సమస్య ఉన్న గ్రామాల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 940 గ్రామాలు ఉండగా వాటిలో 339 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, దీనికోసం ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెల్టా, మెట్ట ప్రాంతాలతో సంబంధం లేకుండా గడిచిన నాలుగేళ్లుగా వర్షాభావంతో జిల్లాలో ఇబ్బందులు పెరిగాయని వివరించారు. గత నెలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రతిపాదనల మేరకు రూ.6 కోట్ల బిల్లులు మంజూరు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో రూ.10 కోట్ల వరకు తాగునీటి సరఫరాకు కేటాయించాలని కలెక్టర్ ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చెన్నై నగరం సమీపంలోని మింజూరులో డీశాలినేషన్ ప్లాంట్లను సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని, నెల్లూరు జిల్లాలో 168 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, తీరం వెంబడి 12 మండలాలు ఉన్నాయని, జిల్లాలో అనువైన ప్రాంతంలో డీశాలినేషన్ ప్లాంటు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. అలాగే జిల్లాలో పశువుల దాణా కొరత అధికంగా ఉందని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మంగళవారం కూడా కాన్ఫరెన్స్ కొనసాగనుంది. మంగళవారం కలెక్టర్తోపాటు ఎస్పీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. -
ప్రజా సమస్యలే అజెండా
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగే తొలి సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి సిద్ధమయ్యారు. అజెండాలో పేర్కొన్న ప్రకారం జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖల నుంచి నోట్ రప్పించుకుని, నివేదిక తయారు చేశారు. కొత్త ప్రభుత్వం..కొత్త ముఖ్యమంత్రి..కొత్త కలెక్టర్..తొలి సమీక్షా సమావేశం..అంటే తప్పకుండా ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడమే తరువాయి సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు పెడుతున్నారు. నవరత్నాలను అమల్లోకి తెస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కాకముందే చాలా హామీలను అమలు చేశారు. ఒకవైపు సంక్షేమం చూస్తూనే మరోవైపు అభివృద్ధి, పాలనపై దృష్టిసారించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కలెక్టర్లతో తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అజెండా అంశాలను తెలిపారు. ఆరోగ్య శ్రీ, 108, 104, వ్యవసాయం, నవరత్నాల అమలు, తాగునీటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రాథమ్యాల ప్రకారం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మురళీధర్రెడ్డి ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ రెండు రోజుల పాటు పర్యటించి జనం కష్టాలను తెలుసుకున్నారు. వైద్యం, పోలవరం తదితర సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏజెన్సీకి ఏమి అవసరమో గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కూడా దాదాపు అవే కావడంతో అనుభవ పూర్వక నోట్ తయారు చేసుకున్నారు. ఎటపాక సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు విలీన మండలాల్లో వ్యవసాయ అధికారుల కొరత ఉంది. ప్రస్తుతం ముగ్గురు మండల వ్యవసాయాధికారులు మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్తగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక వ్యవసాయ అధికారి పోస్టులను మంజూరు చేయవల్సిందిగా సీఎంను కోరనున్నారు. మత్స్యకార సంక్షేమం వేట నిషేధ సమయంలో మత్స్యకా రులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున జిల్లాలో 23,190 మందికి రూ. 23.19 కోట్లు రావాల్సి ఉంది. నవరత్నాల్లో భాగంగా మత్స్యకారులకు భృతి మంజూ రు చేయవల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఉప్పాడ కొత్తపల్లి ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్కు మత్స్యశాఖ అధికారులు 2018 ఆగస్టు 16న రూ.280.40 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. వైద్య, ఆరోగ్యం జిల్లాలోని ఇంజరం, ఎర్రిపాక, లింగంపర్తి, జి.కొత్తపల్లి, మురమండ, నరేంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల అవసరం ఉంది. వాటిని మంజూరు చేయవల్సిందిగా కోరనున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాలో ఖాళీగా ఉన్న 64 ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేయాలని కోరనున్నారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో సీటీ స్కానర్స్ లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం, తుని, రామచంద్రపురం, అమలాపురం ఏరియా ఆసుపత్రులకు సీటీ స్కానర్స్ మంజూరు చేయవల్సిందిగా కోరనున్నారు. . రోగుల తాకిడి దృష్ట్యా పిఠాపురం, గోకవరం, రౌతులపూడి, ముమ్మిడివరం, తాళ్లరేవు, మండపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను 30 నుంచి 50 పడకలకు; కొత్తపేట, రాజోలు, పెద్దాసుపత్రి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను 50 నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేయాలని, రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం పీహెచ్సీని వందపడకల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేయాలని కోరనున్నారు. జిల్లాలో 108 వాహనాల కొరత ఉంది. తొమ్మిది వాహనాల అవసరం ఉంది. కూనవరం, కోరుకొండ, గొల్లప్రోలుకు ఒక్కొక్కటి చొప్పున, ఐటీడీఏ పరిధిలోని ప్రాంతాలకు ఆరు వాహనాలు మంజూరు చేయవల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. జిల్లాలోని కూనవరం, పిఠాపురం ప్రాంతాలకు 104 వాహనాల్లేవు. ఆ రెండు ప్రాంతాలకు రెండు 104 వాహనాలు మంజూరు చేయాలని కోరనున్నారు. గృహ నిర్మాణం ఏజెన్సీలో 2071 ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సకాలంలో చెల్లింపులు జరగకపోవడం, యూనిట్ ఖరీదు తక్కువగా ఉండటం, రవాణా, బిల్డింగ్ మెటీరియల్ వ్యయం పెరగడంతో నిర్మాణం మందకొడిగా సాగుతోంది. వీటిని వేగవంతం చేసేందుకు, యూనిట్ ఖరీదు పెంచేందుకు, సకాలంలో చెల్లింపులకు అవసరమైన రూ.15.53 కోట్లు సబ్ ప్లాన్ నిధుల నుంచి మంజూరు చేయాలని కోరనున్నారు. పీవీటీజీ (కొండరెడ్ల) లబ్ధిదారులకు అదనంగా రూ.లక్ష, మిగతా ఎస్టీలకు అదనంగా రూ.75వేలు మంజూరు చేస్తే నిర్మాణాలు వేగవంతం కానున్నాయని తెలపనున్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ హౌసింగ్లో భాగంగా నాన్ షెడ్యూల్డ్ లబ్ధిదారులకు రూ.3.55 లక్షలకు, షెడ్యూల్డ్ లబ్ధిదారులకు రూ.4.55 లక్షలకు యూనిట్ చేయాల్సిందిగా కోరనున్నారు. చేనేతని జౌళి శాఖ జిల్లాలోని 37 చేనేత సహకార సంఘాలకు ఆప్కో రూ.10.02 కోట్ల బకాయి పడింది. 2018 ఏప్రిల్ నుంచి చెల్లింపులు చేయలేదు. 2019 జనవరి నుంచి ఆప్కో కొనుగోలు చేయక సహకార సంఘాల వద్ద 2019 మే చివరి నాటికి రూ.9.06 కోట్ల విలువైన వస్త్రాలు నిల్వ ఉండిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరనున్నారు. -
అధికారులు పరువు తీస్తున్నారు!
కావలసినంత విద్యుత్ సరఫరా అవుతున్నా... వినియోగదారులకు కోతలు తప్పడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా... ఎక్కడ లోపం ఉన్నదో తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. మొత్తమ్మీద విద్యుత్ అధికారుల తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. చిన్నపాటి గాలివాన వస్తే చాలు గంటలకొద్దీ సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా జిల్లావాసులు పగలనకా... రాత్రనకా... అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. అసలే మండువేసవి... దానికి తోడు విద్యుత్సరఫరా నిలిచిపోవడంవల్ల ఎదురవుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సాక్షి, విజయనగరం : జిల్లాలో 6లక్షల 30వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 358 మంది క్షేత్ర స్థాయిలోనూ, 280 మంది కార్యాలయాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు నిర్ధిష్ట కోటాను నిర్ణయిస్తారు. అలా జిల్లాకు రోజుకు 6.35 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా ఉంది. అవసరాన్ని బట్టి కోటాను మించి కూడా ఇస్తుంటారు. అలా జిల్లాలో రోజుకు 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. అంటే కోటా కంటే 1.04 మిలియన్ యూనిట్లు అధికంగా జిల్లాకు వస్తోంది. రెండు రోజుల క్రితం అంటే ఆదివారం రాత్రి జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అందకుమించి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అది కూడా గంటో రెండు గంటలో కాదు. ఏకంగా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ. రాత్రంతా జిల్లా ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతూ నిద్రలేకుండానే గడిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 7.30 గంటలకు పోయిన కరెంట్ తెల్లవారుజాము 3గంటల వరకూ రాలేదు. ఆ రోజే కాదు ఏ రోజు ఏ చిన్న గాలివాన వచ్చినా ఇదే పరిస్థితి. ఇంత ఘోరంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే చాలా పెద్ద సమస్యే వచ్చి ఉంటుందనుకుంటాం. కానీ దీనికి అధికారులు చెప్పిన కారణం చూస్తే ఔరా అనిపించకమానదు. అదేమిటంటే విజయనగరం పట్టణంలోని ధర్మపురి వద్ద 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో పిన్ ఇన్సులేటర్ కాలిపోయిందట. విద్యుత్ సబ్స్టేషన్లలో గుండ్రని ఆకారంలో పింగాణీతో చేసినవి కొన్ని ట్రాన్స్ఫార్మర్లపైన, విద్యుత్ తీగల మధ్య కనిపిస్తూ ఉంటాయి. వాటినే పిన్ ఇన్సులేటర్లుగా పిలుస్తుంటారు. జిల్లాలో మరో రెండు చోట్ల కూడా ఇదే సమస్య ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి సమస్య వస్తే కాలిపోయిన పిన్ ఇన్సులేటర్ను మార్చడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే ఈ పని చేయడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనికి ఇంచుమించు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అంతకు మించి సమయం పట్టనవసరం లేదు. కానీ జిల్లాలో ఇదే సమస్యకు ఏడెనిమిది గంటలు పట్టడం విచిత్రం. దీనికి అధికారులు చెబుతున్న కారణమేమిటంటే అసలు ఎక్కడ పిన్ ఇన్సులేటర్కాలిపోయిందో, మరేదైనా సమస్య వచ్చిందో తెలియడం లేదట. సమస్య ఎక్కడో తెలుసుకోవడానికే సమయం పడుతోందట. అత్యధిక సాంకేతిక ప్రమాణాలు కలిగిన సంస్థగా దేశ స్థాయిలోనే గుర్తింపుతో పాటు అవార్డులు తీసుకున్న ఏపీఈపీడీసీఎల్లో ఉద్యోగుల అ« ద్వాన పనితీరుకు ఇదొక్కటే నిదర్శనం. చిన్న చిన్న సమస్యలకే ఇన్నేసి గంటలు విద్యుత్ కోత విధిస్తే నిజంగా పెద్ద సమస్య ఏదైనా వస్తే పరిస్థితిని ఊహించడానికే భయంగా ఉంది. ఇంత జరుగుతున్నా ఏపీఈపీడీసీఎల్ సీఎండీగానీ, జిల్లా కలెక్టర్గానీ దీని గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విద్యుత్ శాఖ అధికారులతో వీరిద్దరూ ఒక్క సమీక్ష కూడా చేయకపోవడంతో కింది స్థాయి సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
కలెక్టర్ల నుంచి క్లియరెన్స్ వచ్చాకే..
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈ సీ) ఆదేశించింది. పదవుల వేలం, నామినేషన్లు వేయ కుండా అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అభ్యర్థులపై ఒత్తిళ్లు తేవ డం వంటి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులు, పత్రిక లు, మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకు జిల్లాలో కలెక్టర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. చట్టంలోని అంశాల ప్రాతిపదికన కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డీసీపీలు విచారణ జరిపి, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పదవుల వేలం, నామినేషన్లు వేయకుం డా అభ్యర్థులను బెదిరించడం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ప్రాథమిక ఆధా రాలున్న సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సాధారణ పరిశీలకులు ఎస్ఈసీకి నివేదికలు పంపించాలని తెలపింది. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిగా సంతృప్తి చెందాకే ఏకగ్రీవాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. పదవుల వేలం, ఒత్తిళ్లు, బెదిరింపులు చోటుచేసుకున్న చోట తదుపరి ఆజ్ఞల కోసం ఎస్ఈసీకి నివేదిక పంపించాలని ఆదేశించింది. పరిషత్ నోటిఫికేషన్లో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఆదివారం (28న), రెండో విడతకు మే 2న, మూడో విడతకు మే 6న పోటీచేసే అభ్యర్థుల జాబితాలను సాయంత్రం 3 గంటల తర్వాత ప్రచురించాల్సిన నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్, ఇతర సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపించారు. -
సాకులు చెప్పొద్దు..
హన్మకొండ అర్బన్ : ‘ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది.. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి.. సాకులు చొప్పొద్దు’ అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు హాజరైన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అధికారులు ఎక్కువ మంది రామకపోవడంపై ఆరాతీసి హాజరు వివరాలను పరిశీలించారు. జెడ్పీ సమావేశం ఉండటంతో చాలా మంది అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలుపగా ఇకపై అధికారులు తప్పనిసరిగా గ్రీవెన్స్కు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలకు సంబంధించిన రాయితీ డబ్బులు నెల రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినా యూనిట్లు ఎందుకు గ్రౌండింగ్ చేయాలేదని అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మంగళవారం సాయంత్రం పత్య్రేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ రుణాల గ్రౌండింగ్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎంజీఎంలో సదరం క్యాంపుల నిర్వహణ, సర్టిఫికెట్ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖల అధికారులు సదరం సర్టిఫికెట్ ఇప్పించండి తనకు ఆరు నెలల క్రితం పక్షవాతం రావడంతో రెండు కాళ్లు పూర్తిగా పనిచేయడం లేదు. మంచానికి పరిమితమయ్యాను. సదరం సర్టిఫికెట్ మంజూరు చేసి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన సులువూరి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రం అందజేశారు. ఆలయ భూమిని కబ్జా చేస్తున్నారు హన్మకొండలోని వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయం సమీపాన 1145 సర్వే నంబర్లో ఉన్న కాకతీయుల కాలంనాటి బాలరాజరాజేశ్వర స్వామి దేవాలయం భూమిని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు. ఈవిషయంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకుని సుమారు 26 గుంటల భూమి కాపాడాలని కాయతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్ చీకటి రాజు గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. -
రైతుల బాధను అర్థం చేసుకోండి
మెదక్ రూరల్ : ప్రతీ రెవెన్యూ అధికారి రైతుల స్థానంలో ఉండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను తరచూ కార్యాలయాల చుట్టూ అధికారులు తిప్పుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఎంతో మంది రైతుల భూములను ఇతరుల పేర్ల మీదికి మారుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారుల పేర్ల మీద ఉన్న భూములను సైతం ఇతరుల పేర్ల మీదికి రాస్తే ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. రికార్డులపై అధికారులకు కనీస అవగాహన లేదన్నారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే అధికారుల కనీస బాధ్యత అనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారన్నారు. ప్రతీ అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో వీఆర్వోలపై తహసీల్దార్ల పర్యవేక్షణ కొరవడిందన్నారు. వీఆర్వోల పనితీరును ఎప్పటికప్పుడు తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రెండేళ్ల నుండి పౌతి కేసులు సైతం పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల పనితీరు జిల్లాలో సంతృప్తికరంగా లేదని, అధికారులు తమ పని తీరును మార్చుకొని ప్రజలకు నిస్వార్థమైన సేవలను అందించాలన్నారు. జిల్లాలో ఉన్న వీఆర్వోల్లో కొద్ది మంది మాత్రమే విజయవంతమయ్యారని తెలిపారు. ప్రతీ సమస్యను చిత్తశుద్ధితో అధ్యయనం చేసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. రైతుల భూములకు సంబంధించిన ప్రొసీడింగ్పై తహసీల్దార్లు సంతకం చేసేటప్పుడు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీ మండలంలో ఉన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన జాయింట్ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినా కొన్ని మండలాల్లో ఇంకా పూర్తి చేయలేదని, వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సాయిరాం, అరుణారెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్యతోపాటు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీర్వోలు, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సీడ్ హబ్గా మారనున్న రాష్ట్రం కౌడిపల్లి(నర్సాపూర్): మన రాష్ట్రం త్వరలో సీడ్ హబ్గా మారనుందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సాగులో మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి వద్ద ఉన్న డాక్టర్ డి రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ వ్యవసాయ కళాశాల 15వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఏడీఏ పరశురాంనాయక్, విజ్ఞానజ్యోతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్రం సీడ్ హబ్గా మారుతుందన్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలు చేస్తోందన్నారు. మన దేశంలో అన్ని రకాల నేలలు, వాతావరణం ఉన్నాయని తెలిపారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారంగా మారిందన్నారు. ఐటీఐ, పాల్టెక్నిక్ కన్నా వ్యవసాయ విద్యలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో రాణించాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి : డీఏఓ పరశురాంనాయక్ జిల్లాతోపాటు రాష్ట్రంలో వ్యవసాయానికి మంచి రోజులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వం ఉద్యోగం కంటే వ్యవసాయంలో మంచిగా రాణించాలని డీఏఓ పరశురాంనాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఇక్కడ చదివిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్గౌడ్ జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులు సాగు చేసిన పంటలకు వచ్చిన లాభాలను ఒక్కో విద్యార్థికి రూ. 635 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి ప్రతినిధులు డీఎన్రావు, రాజశేఖర్, అచ్యుతరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ల తీరుపై సీఈవో ద్వివేది ఆగ్రహం
-
లంచాలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: అవినీతికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు మరింత బాగా సేవలందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలన్నారు. కలెక్టర్/జిల్లా పరిపాలనాధికారి(ఐఏఎస్) నాయకత్వంలో అడిషనల్ కలెక్టర్/అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వంటి అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు (అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ బృందం ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చట్టం కఠినంగా ఉండాల్సిందే.. ‘ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా ప్రజా ప్రతి నిధులకు, అధికారులకు గొప్ప బాధ్యతలేవీ లేవు. ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రజలకు పనులు జరగాలి. రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలను తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకపోతేనే.. ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది. నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అని పిలవాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లేఔట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది’అని కేసీఆర్ సూచించారు. మౌలిక వసతులపై ఎక్కువ దృష్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దష్టి పెట్టాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం (శ్మశానం) నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి. తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతోంది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, వి.శ్రీనివాస్గౌడ్, లోక్సభ సభ్యులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, టి.భానుప్రసాద్రావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్రావు, సునీల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావు పాల్గొన్నారు. అడిషనల్ సీఎస్లను నియమించాలి : కేసీఆర్ జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సీఎస్లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఈ బృందం ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలి. -
అవినీతి పెరిగిపోయిందంటూ కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని సూచించారు. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలవబడే ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని పిలవబడే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు(అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ అధికారిక బృందం ఆధ్వర్యంలోనే జరగాలని వివరించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవు. ప్రజలకు ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావల్సిన పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పని కావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉంది’ అని ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ‘జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో సీనియర్ అధికారుల నాయకత్వంలో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను నెలకొల్పి రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశ పెట్టే అవకాశాలు పరిశీలించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సిఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సిఎస్ లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సిఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్ని అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కెటి రామారావు, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, సునిల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూ ప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 10, 11న సెలవు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 3417 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 530 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 32,18,106 ఓటర్లుండగా వారిలో పురుషులు15,81,496.. స్త్రీలు 16,36,610 ఉన్నారన్నారు. జిల్లాలో అత్యధికంగా చింతలపూడి నియోజకవర్గంలో 2,63,337 మంది ఓటర్లుండగా.. భీమవరం 2,46,342 ఓటర్లతో రెండో స్థానంలో ఉందని తెలిపారు. అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో 1,68,122 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారన్నారు. పోలింగ్ కోసం 25 వేల మంది సిబ్బందితో పాటు.. ఎన్నికల నిర్వహణకు 3441 ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించామని తెలిపారు. ‘మై ఓట్ క్యూ’ మొబైల్ యాప్ వాడకం ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కోసం 2900 మంది సివిల్ పోలీసులతో పాటు 12 కంపెనీల పారామిలటరీ బలగాలను, 4 కంపెనీల ఏపీఎస్పీ బలగాలను, 29 కంపెనీల గ్రే హౌండ్స్ బలగాలను వినియోగిస్తున్నామని తెలిపారు. 2651 పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 10, 11 తేదిలలో సెలవు ప్రకటించారని తెలిపారు. డీఎస్పీల నేతృత్వంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకి స్పెషల్ స్టైకింగ్ బృందాలను నియమించామని తెలిపారు. -
ఈ మూడు రోజులు కీలకం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఈ మూడు రోజులు అత్యంత కీలకం. ఎన్నికల విధుల్లో పొరపాట్లకు, విమర్శలకు చోటివ్వకండి. ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. ఓటరు స్లిప్లు బీఎల్ఓల ద్వారానే పంపిణీ జరగాలి. రాజకీయ పార్టీల ద్వారా జరిగితే కఠిన చర్యలు ఉంటాయి.’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.వీరపాండియన్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదివారం స్థానిక ఎస్ఎస్బీఎన్న్ డిగ్రీ కళాశాలలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్తో కలిసి ఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడు రోజులు చాలా కీలకం, ఎక్కడా పోరపాటు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. బీఎల్ఓలతో అండర్ టేకింగ్ తీసుకోండి ఓటరు స్లిప్పులు రాజకీయపార్టీల ద్వారా పంపిణీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటరు స్లిప్పులు అనధికార వ్యక్తులకు స్వాధీనం చేయలేదని బీఎల్ఓలతో అండర్ టేకింగ్ తీసుకోవాలని ఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితా మార్కింగ్ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. పొరపాట్లు జరగకూడదు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. అంధ ఓటర్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ బ్యాలెట్ పత్రం ఏరా>్పటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. చురుకుగా పనిచేయాలి ఈ మూడు రోజులూ ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఎంసీసీ, వీఎస్టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం అదనంగా రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. సివిజిల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన ఉద్యోగులకు మినహాయింపులు ఇవ్వరాదని ఆదేశించారు. పోలింగ్కు అవసరమైన సామగ్రి సక్రమంగా ఉన్నాయా లేదాని తనిఖీ చేసుకోవాలన్నారు. శిక్షణ నిర్వహించండి పోలింగ్ నిర్వహణపై నియోజకవర్గాలకు చెందిన పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలను సోమవారం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు సంబంధిత ఆర్ఓలకు సూచించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన విధులు, నివేదికలు గురించి ఆర్ఓలకు క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆరో ఎం.వి.సుబ్బారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. -
ఓటు హక్కు.. వంద నోటు కాదు
సాక్షి, ములుగు: ఓటు హక్కు అంటే వంద రూపాయాల నోటు, లిక్కర్ బాటిల్ కాదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. డీఆర్డీఏ తరఫున మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులం విద్యార్థులతో ఆదివారం ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకుడిని ఎంచుకునే అవాకాశం ఉంటుందని అన్నారు. కొంతమంది ఓటు వేసే రోజును ప్రభుత్వ సెలవుదినంగా అనుకుంటున్నారని, ఆ ఆలోచనను మరిచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వినియోగంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రలోభాల విషయంలో పౌరులు నేరుగా 1950 టోల్ ప్రీ నంబర్కి కానీ, ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం తరఫున గంటన్నర సమయంలో పరిష్కరిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటును వినియోగించే విధంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చేపట్టిన ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సంజీవరావు, డీపీఎం సతీష్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, సీఐ సార్ల రాజు, తహసీల్దార్ భూక్యా గన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
సాక్షి, పాలకొండ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన పాలకొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు కోసం 84వేల దరఖాస్తులు అందాయని, అందులో ఇంకా 24వేల దరఖాస్తులు పరిశీలించి ఓటరు కార్డులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. వీరందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో 2,674 ఓట్లు తొలగించామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పీవో, ఏపీవోలను నియమించామని వారికి 16వ తేదీన నియోజకవర్గాల్లో శిక్షణ అందిస్తామని వివరించారు. వచ్చేనెల 3వ తేదీన మరో మారు శిక్షణ అందించాల్సి ఉందని తెలిపారు. ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశామన్నారు. వారితో పాటు 50మందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెంచామని వివరించారు. ఉధ్యోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 470 పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేశామని, 62 కేంద్రాలకు మరుగుదొడ్లు, 71 కేంద్రాల్లో తాగునీటి బోర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మద్యం, ధనం, ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన డీఎస్పీ ప్రేమ్కాజల్తో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. ఈవీఎంలను భద్రపరచనున్న డిగ్రీ కళాశాలను సందర్శించి పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్తో పాటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎల్.రఘుబాబు, తహసీల్దార్ నరసింహ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
ఎన్నికల వ్యయ నిర్వహణ సెల్ ప్రారంభం
సంగారెడ్డి జోన్: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టరేట్లోని డీసీఓ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల వ్యయ నిర్వహణ సెల్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు తమ రోజువారి జమ, ఖర్చులు ఈ సెల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు రోజువారి ఖర్చులకు సంబంధించిన అకౌంట్స్ రిజిష్టర్లో రికార్డు చేయాలని స్పష్టం చేశారు. సీజర్స్ అమౌంట్, వస్తువులకు సంబంధించి ఆయా టీంలు ఎక్స్పెండిచర్ నోడల్ అధికారికి రిపోర్ట్ అందించాలని సూచించారు. సీజర్స్ మొత్తాలను రుజువులు తీసుకొని నోడల్ అధికారి రిలీజ్ చేస్తారని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యయనిర్వహణ నోడల్ అధికారిగా తుమ్మ ప్రసాద్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అధికారి అంజయ్య ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లకు 7 మంది ఏఈఓలు తమ నివేదికలను నోడల్ అధికారికి సమర్పిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ ప్రసాద్, పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అధికారి అంజయ్య, ఏఈఓ చిన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి సారించాలి
సాక్షి, కంకిపాడు: ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి పెట్టాలని విజయవాడ సబ్కలెక్టరు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిషా సింగ్ ఆదేశించారు. మంగళవారం ఆమె కంకిపాడులో పర్యటించారు. గోసాల సెంటరులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బస్టాండు సెంటరులో ప్రచారంలో ఉన్న వాహనాన్ని సిబ్బందితో తనిఖీ చేయించి అనుమతులు తీసుకున్నారో? లేరో? పరిశీలించారు. అనుమతులు లేని ఓ ప్రచార వాహనాన్ని మండల పరి షత్ కార్యాలయానికి తరలించారు. తహసీల్దార్ మమ్మీ, స్క్వాడ్ ప్రతినిధి లక్పతి, ఇతర సిబ్బందితో సబ్కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. నిబంధనలు పాటించకుండా ప్రచారం సాగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోగోలు తొలగించండి ఈడుపుగల్లు(కంకిపాడు):విద్యాశాఖ ద్వారా పంపిణీ చేయనున్న సైకిళ్లపై ప్రభుత్వ లోగోలను తొలగించాలని విజయవాడ సబ్ కలెక్టరు మిషాసింగ్ ఆదేశించారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సీఎం, మంత్రి ఉన్న ఫోటోలతో ఉన్న లోగోను సైకిళ్లపై అమర్చి విద్యార్థినులకు పంపిణీకి సన్నాహాలు చేయడంతో అధికా రులు నిలుపుదలచేయించిన విషయం తెలిసిందే. దీంతో ఈడుపుగల్లు జెడ్పీహైస్కూల్లో అందుబాటులో ఉంచిన సైకిళ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. విద్యాశాఖ ద్వారా పంపిణీ జరుగుతున్నందున ప్రభుత్వ లోగోలు తొల గించాలన్నారు. జిల్లా విద్యాశాఖ నుంచి పంపిణీ తేదీ తీసుకుని లబ్ధిదారులకు సైకిళ్లు అందించాలని, లోగోలను పోలీ సుస్టేషన్లో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. -
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
-
ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆ క్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఇటు ఎన్నికల నిర్వహణకు కూడా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడానికి అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈనెల 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న కౌటింగ్ ప్రక్రియ ఉంటుందని వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్లో మొత్తం 15,53,577 మంది ఓటర్లు ఉండగా, 8,14,689 మంది మహిళలు, 7,38,577 మంది పురుషులు, 35 మంది ఇతరులున్నట్లు తెలిపారు. అయితే పోటీ చేసే అభ్యర్థే కాకుండా వారి ప్రపోజల్స్ కూడా నామినేషన్ వేయవచ్చన్నారు. అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే నామినేషన్ వేయడానికి లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో అభ్యర్థులు, పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని పాటించాలని, కేవలం మూడు వాహనాలు మాత్రమే ఉపయోగించి వాటిని100 మీటర్ల పరిధిలోనే నిలిపివేయాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులకైతే రూ.12,500 డిపాజిట్ చేయాలన్నారు. అదే విధంగా పార్టీలు, అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం ‘సువిధ’ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం జిల్లా స్థాయిలో 1950 టోల్ఫ్రీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సంసిద్ధులుగా ఉన్నామని, నోడల్ అధికారులు, వివిధ రకాల బృందాలను ఏర్పాటు చేసి సన్నాహక సమావేశాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు ప్రాంతాల్లో, ఆస్తులపై ఉన్న పార్టీల, అభ్యర్థులకు చెందిన జెండాలు, ప్లెక్సీలు, గోడ రాతలు, ప్రభుత్వ పథకాల పోస్టర్లను తొలగిస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్,నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నిజామాబాద్ సెగ్మెంట్లో ఓటర్లు పురుషులు : 7,38,577 మహిళలు : 8,14,689 ఇతరులు : 35 మొత్తం ఓటర్లు :15,53,577 రాజకీయ పార్టీలతో సమీక్ష... పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కోరారు. ప్రగతిభవన్లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల నియామవళి తప్పనిసరిగా అందరూ అమలు చేయాలన్నా రు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సహకరించాలని కోరారు. నామినేషన్ వేసే అభ్యర్థులు పాటిం చాల్సిన నిబంధనలను ఈ సందర్భంగా కలెక్టర్ వారికి వివరించారు. -
ప్రలోభాలకు గురిచేస్తే కేసులే
ఒంగోలు అర్బన్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ వి.వినయ్చంద్ అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ప్రవర్తనా, నియమావళిపై సోమవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకుని సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనలు జారీ చేసే ముందు మీడియా మానెటరింగ్ సర్టిఫికెట్తో అనుమతి పొందాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థులు రూ. 70 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.28లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ధారించినట్లు తెలిపారు. మద్యం, నగదు పంపిణీ నివారణకు జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమాచారాన్ని తెలిపేందుకు కలెక్టరేట్లో మీడియా సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డీఆర్ఓ వెంకటసుబ్బయ్య, వైఎస్సార్ సీపీ ప్రతినిధులు శింగరాజు వెంకట్రావు, డీఎస్ క్రాంతికుమార్, టీడీపి ప్రతినిధి డి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీపతి ప్రకాశం, జనసేన సుంకర సాయిబాబా, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ముద్రణారంగం, మీడియా ఎన్నికల నియమావళిని పాటించాలి భారత ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనలకు లోబడి ముద్రణరంగం యజమానులు, మీడియా ముద్రణ, ప్రచారాలు చేపట్టాలని ప్రత్యేక కలెక్టర్ చంద్రమౌళి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ కళాపరిషత్లో ముద్రణా రంగం యజమానులు, కేబుల్ నెట్ వర్క్ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి డిక్లరేషన్ ఫారం లేకుండా కరపత్రాలు కానీ, గోడపత్రికలు కానీ ప్రచురించకూడదన్నారు. డిక్లరేషన్పై ఇద్దరు సాక్షులతో సంతకాలు ఉండాలన్నారు. ప్రింటింగ్ అనంతరం పబ్లిషర్ సంతకం చేసిన డిక్లరేషన్తో పాటు ప్రింటింగ్ చేసిన వాటిని సంబంధిత ఎలక్షన్ ఎక్స్పెండేచర్ మానిటరింగ్ కమిటీకి అందజేయాలన్నారు. ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లు ఎన్ని సంఖ్యలో చేసింది కూడా ముద్రించాలన్నారు. కేబుల్ నెట్ వర్క్ ద్వారా అభ్యర్థులకు అనుకూలంగా ప్రసారాలు చేయకూడదన్నారు. కులమతాలను రెచ్చగొట్టకుండా కార్యక్రమాలను ప్రసారం చేయాలన్నారు. వీటిపై వీడియో సర్వేలెన్స్ బృందాలు పర్యవేక్షిస్తుంటాయన్నారు. అభ్యర్థుల తరఫు చేపట్టే ప్రసారాలకు సంబంధించిన సీడీలను మానెటరింగ్ కమిటీ అనుమతితో ప్రసారం చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. దీనిలో సర్వశిక్ష అభియాన్ పీఓ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఈ విభాగం అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : జిల్లాలో సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతిఒక్కరూ నిబద్ధత, నిష్పక్షపాతంగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఆర్ఓలు, ఏఈఆర్ఓ, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు, పోలీసు తదితర 1,500 ఎన్నిక సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియామవళి, మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. ఇందుకు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని, అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నా రు. జిల్లాలో సాధారణ ఎన్నికల నిమిత్తం 20 నుంచి 25 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. జి ల్లాలో 30,57,922 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఏప్రిల్ 11న జరిగే పోలింగ్లో వినియోగించుకుంటారని ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఖర్చును నివేదించాలి పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షల వరకు ప్రచార, తదితర ఖర్చును పరిమితం చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. వారి ప్రచార కార్యక్రమాల ఖర్చు, పత్రికలకు ప్రకటన రూపంలో చేసే ఖర్చు తదితర వివరాలను ఎప్పటికప్పుడూ నివేదించాలని ఆదేశించారు. అనుమతిలేని ఫ్లెక్సీలు, గోడ రాతలను పూర్తి తొలగించాలని, ఎక్కడైనా ప్రైవేట్ భవనాలపై అటువంటివి రాసి ఉంటే సంబంధిత యజమాని సమ్మతి ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని సూచించారు. ఈ విడత ఎన్నికల సమయంలో కేంద్ర సాధారణ, వ్యయ పరిశీలకులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు క్షేత్రస్థాయిలో చేసే తనిఖీల సమయంలో వెల్లడించే సందేహాలను, వివరాలను స్పష్టంగా సంబంధిత అధికారులు తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. 1,057 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలో 3,411 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 1,057 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మ్డ్ పోలీసు విధులు నిర్వర్తిస్తారన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, జీలు గుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తనిఖీల సమయంలో రూ.10 లక్షలకు పైన ఉంటే ఆదాయశాఖ పన్నుశాఖకు, అంతలోపు పట్టుబడితే జిల్లా ఎన్నికల అధికారికి అప్పగిస్తామన్నారు. ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరని చెప్పారు. మైక్, లౌడ్స్పీక్టర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు మాత్రమే అనుమతితో వినియోగించుకోవాలన్నారు. జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఆర్ఓ ఎన్.సత్యనారాయణరెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఐటీడీఏ పీఓ హరీంద్రప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
ఓట్ల తొలగింపు కుదరదు
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకూ 30, 57, 922 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 15,08,403 మంది మహిళలు 15,49,155 మంది ఇతరులు 364 మంది ఉన్నారని వివరించారు. కాగా ఫారం–7 ద్వారా జిల్లాలో 38,145 బోగస్ దరఖాస్తులు దాఖలు కాగా, వాటిని పరిశీలించి ఇప్పటికే 32 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా ఇకపై ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటును కూడా తొలగించే అవకాశం లేదన్నారు. ఓటరగా నమోదుకు అర్హత కలిగిన వారంతా ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 3,411 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా 10 శాతం ఈవీఎంలు, వీవీపాట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 20 వేల మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనకై 334 బృందాలను నియమించామని చెప్పారు. అలాగే 334 సెక్టార్ అధికారులు, 55 మీడియా సర్వైలెన్స్ బృందాలు, 15 వీడియో పరిశీలన బృందాలు, 15 అక్కౌంట్ బృందాలు, 55 ఫ్లయింగ్ స్క్వాడ్లు, మరో 55 స్టాటిక్స్ సర్వైలైన్స్ బృందాలను నియమించామని వివరించారు. కాగా జిల్లాలో 1057 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే వివి«ధ విషయాలను సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అలాగే1950 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. జిల్లాలో 9 వేల ఓట్లు రెండు ప్రాంతాల్లో నమోదైనట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 1700 ఓట్లను తొలగించామని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల రథ సారధులు
సాక్షి, విశాఖపట్నం :ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.ప్రజలు తమ ఓటు హక్కు ద్వారాప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దే దించే రోజులు దగ్గర పడుతున్నాయి. అంతటి విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే దాని వెనుక అధికారుల కృషి ఎంతో ఉంటుంది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగానిర్వహించడంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎందరో అధికారుల శ్రమఉంటుంది. అధికారులు సమన్వయంతోపనిచేస్తే తప్ప ఎన్నికల ప్రక్రియ విజయంతంగా పూర్తి కాదు. నామినేషన్ల స్వీకరణ నుంచిఫలితాలు వెల్లడించే వరకు ప్రతి సందర్భాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి.ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్రఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాననిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ప్రధానఎన్నికల అధికారికి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతి జిల్లాకు ఒక ఎన్నికల అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తారు. రిటర్నింగ్ అధికారి శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికలసంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తులకేటాయింపుతో తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేసిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు,ఫలితాల ప్రకటన వంటివి అన్ని రకాల పనులుఈయన పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఆయానియోజకవర్గాల పరిధిలోని రెవెన్యూ డివిజనల్అధికారి లేదా జేసీ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎనిమిది నుంచి పది కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలువిజయవంతంగా నిర్వహించేందుకు,అవసరమైనచోట 144 సెక్షన్ విధించేఅధికారంసెక్టోరల్ ఆఫీసర్కు ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు,పోలింగ్ బూత్లు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటుకుసిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటాడు.ఈయన పోలింగ్కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్ బూత్కు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కు చేర్చే వరకు ప్రిసైడింగ్అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతనికి సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగేఅన్ని కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో నడుస్తాయి. ఓటర్ల నమోదు అధికారి ఓటర్ల జాబితా తయారు చేయడం ఈ అధికారిప్రధాన బాధ్యత. ఓటును నమోదు చేసుకునే వారు,జాబితాల్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారినిసంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు అధికారులు ఓటర్ల జాబితాలను రూపొందిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు మూడు, నాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంఉంటుంది. ఈ బృందం తమకు కేటాయించిన మండలాలపరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలునిర్వహించడం వీరి బాధ్యత. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిర్వహణ జరిగినతీరుపై నివేదిక రూపొందించి జిల్లా,రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపించడంలో ఈ మైక్రోఅబ్జర్వర్లు కీలకంగా వ్యవహ రిస్తారు. బీఎల్వోలు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి దరఖాస్తు ఫారాలు పంపిణీచేయడం, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం,పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం, ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్కేంద్రాల మార్పు తదితర అంశాల్లో బూత్ లెవల్ అధికారులుసేవలందిస్తారు. పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని నేరుగా పరిశీలించే అవకాశం ఉండనందున ప్రతిపోలింగ్ కేంద్రంలో తన పక్షాన ఒక ఏజెంట్ను నియమించుకోవచ్చు. ఈయనే పోలింగ్ ఏజెంట్. ఇతను ఓటువేసేందుకు వచ్చిన వారి వివరాలను ఓటర్లజాబితాలో సరి చూసుకుని అభ్యంతరాలు ఉంటేఅధికారులకు చెబుతారు. దీంతో దొంగ ఓట్లుపడకుండా చూడవచ్చు. పోలింగ్ ఏజెంట్సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. -
పశ్చిమగోదావరి.మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోండి
సాక్షి, పశ్చిమగోదావరి: నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటరు ఐడీ కార్డు ఎపిక్ నంబరు కానీ నమోదు చేస్తే... ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే సెర్చ్ యువర్ నేమ్ పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటు ఉందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబరు వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవా కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెక్ యువర్ ఓటు పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు ఈనెల 15 వరకూ అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, శ్రీకాకుళం : పార్లమెంట్, శాసససభ నియోజకవర్గాలకు జరిగే సాధారణ ఎన్నికల షెడ్యూల్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. ఆదివారం ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల హెడ్యూల్ ప్రకటిం చిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అమల్లోకి ఎన్నికల నియమావళి ఆదివారం రాత్రి నుంచి తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయని చెప్పారు. రాజకీయ పార్టీలతో తక్షణం సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుచేసే అధికారులు, సిబ్బందికి వెంటనే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా , సజావుగా నిర్వహించుటకు అన్నిచర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పలు కొత్త విధానాలు.. ఎన్నికల సంఘం ఈసారి పలు కొత్త విధానాలను తీసుకువచ్చిందని కలెక్టర్ తెలిపారు. నామినేషన్లు వేసేందుకు సువిధ యాప్ను వినియోగించుకోవచ్చని చెప్పారు. సింగిల్ విండో విధానంగా సువిధ యాప్ పనిచేస్తుందన్నారు. ప్రతి అనుమతికి సువిధ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ఈ నెల 15 వరకు కొత్త ఓటర్ల నమోదు.. ఎన్నికల నోఫికేషన్ ఈ నెల 18న విడుదల అవుతుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ నామినేషన్ల చివరి తేదీ వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే అవకా>శం ఉందన్నారు. షెడ్యూల్డ్ ప్రకటించిన అనంతరం ఓట్ల తొలగింపు జరగదని స్పష్టం చేశారు. మరణాల కేసులు పక్కాగా ఉంటేనే ఎన్నికల కమిషన్ అనుమతితోనే తొలగింపు చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అడ్డాల వెంకటరత్నం మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. 15,000 మంది సిబ్బందిని సిద్ధం చేశామని చెప్పారు. ఆయుధాలన్నింటినీ ఇప్పటికే డిపాజిట్ చేయించామన్నారు. వారెంట్ కలిగిన వాటిలో ఐదు మినహా మిగిలినవన్నీ పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఫారం–7 పై బూర్జలో 28 కేసులు, మిగిలిన మండలాల్లో 22 కేసులు, వెరసి 50 కేసులు నమోదయ్యాయని వివరించారు. దీనిపై సిట్ విచారణ చేపడుతోందన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేవీఎన్.చక్రధర్బాబు, ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు, డీఆర్వో కె.నరేద్రప్రసాద్, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి షెడ్యూల్డ్ను ప్రకటించినందున తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని ఆదేశించారు. ప్రతీ అంశాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. - అడ్డాల వెంకటరత్నం, ఎస్పీ -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎన్నికల నోడల్ అధికారులతో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఇతర అధికారుల ఫోన్ నంబర్లకు పలువురు ఫోన్ చేస్తున్నారని, ఓట్ల వివరాలు అధికారుల వద్ద తక్షణం అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1950 నంబరుకు డయల్ చేయడం, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా వివరాలు సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు కూడా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. పోలింగు కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు, త్రిచక్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్స్, వీడియో సర్వేలియన్స్ బృందాలు, ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, సెక్టార్ అధికారులు తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో షెడ్యూలు వచ్చిన వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి విధివిధానాలు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశాలకు, ప్రచారం చేసుకొనే వాహనాలకు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. సువిధ యాప్ ద్వారా రిటర్నింగు అధికారులకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టమైన సమాచారం అందించాలని రిటర్నింగు అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే విధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణకు వినియోగించే ఈవీఎంలను సైతం స్ట్రాంగ్రూమ్లలో పెట్టాలని సూచించారు. స్ట్రాంగ్రూమ్, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమైన సామగ్రి పూర్తి స్థాయిలో ప్రతి విభాగం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన అనంతరం అభ్యర్థులు, పార్టీల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, ఐవీఆర్ ఎస్ కాల్స్, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తదితర విధాలుగా వచ్చే సమాచారాన్ని పరిశీలించాలని ఆదేశించారు. స్థానికంగా రిటర్నింగు అధికారులు ప్రింటింగ్ ప్రెస్లు, కేబుల్ ఆపరేటర్లతో సమావవేశాలు నిర్వహించి విధివిధానాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు, ఏఎస్పీ టి.పనసారెడ్డి, రిటర్నింగు అధికారులు లోతేటి శివశంకర్, ఎం.వి.రమణ, గణపతి, మహాలక్ష్మి, భాస్కరరెడ్డి, దొర, పి. అప్పారావు, రఘురాం, జయదేవి, ఎస్డీ అనిత, నోడల్ అధికారులు టి.కైలాష్ గిరీశ్వర్, ఎ.కళ్యాణ చక్రవర్తి, హెచ్.కూర్మారావు, ఎల్.రమేష్, ఎం.మోహనరావు, వి.వి.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ లిస్టులో పేరుందా? మీరూ చెక్ చెసుకోండి
-నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. -1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. -జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ 9491602905 -జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. -మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. -గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. -సాధారణంగా ఎన్నికల నామినేషన్కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
కృష్ణా.. మీ ఓటు తెలుసుకొండి ఇలా..
సాక్షి, కృష్ణా : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్ కాల్ సెంటర్ ఇన్చార్జి : స్వామినాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్: 9849903988 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
చిత్తూరు...మీ ఓటు ఉందో లేదో చూసుకొండి
సాక్షి, చిత్తూరు : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inవెబ్సైట్ ఓపెన్ చేస్తేsearch your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాస్థాయిలో ఫిర్యాదు విభాగం అధికారి పేరు : గోపాలయ్య (ఎన్నికల విభాగం సూపరింటెండెంట్) సెల్ నంబర్: 94910 77009 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఇన్నర్ రింగ్రోడ్డుకు ప్రభుత్వం ఆమోదం
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరానికి మరో మణిహారం.. ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు 47 ఏళ్ల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఐదు దశాబ్దాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి. 1972 సంవత్సరంలో వరంగల్ మాస్టర్ ప్లాన్లో రెండొందల అడుగుల ఇన్నర్ రింగ్రోడ్డును ప్రతిపాదించారు. దీనికి రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు రూ.50 కోట్లతో అంచనాలు రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇక భూసేకరణ చేస్తూ, మరో వైపు రోడ్డు నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను అదేశించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దయానంద్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవికిరణ్, ఆర్అండ్బీ, కుడా, సర్వే ల్యాండ్ రికార్డు తదితర విభాగల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి దిశానిర్దేశం చేశారు. ట్రైసిటీస్ ప్రజలు చిరకాల వాంఛ.. రెండొందల అడుగుల ఇన్నర్ రింగ్రోడ్డు ట్రైసిటీస్ ప్రజలు చిరకాల వాంఛ. సరైన బైపాస్ రోడ్డు లేక భారీ వాహనాలు నగరం నుంచి రాకపోకలు సాగుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం, ట్రాఫిక్ సమస్య, తరచూ ప్రమాదాలతో బాటసారులు, వాహనదారులు వణికిపోతున్నారు. దీంతో నగర శివారులోని ఔటర్ రింగ్రోడ్డుతో పాటు ఇన్నర్ రింగ్రోడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగిందని గుర్తించిన ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించారు. ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ పంపు నుంచి వసంతపూర్, స్తంభంపల్లి, ఖిలా వరంగల్ కోట, జానీపీరీలు, కీర్తినగర్, కోటిలింగాల దేవాలయం, ఎనుమాముల మార్కెట్, పైడిపల్లి శివారు, ఆరేపల్లి జంక్షన్ వరకు రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. 2012 సంవత్సరంలోనే రూ.20కోట్లు భూసేకరణ కోసం కేటాయించారు. భూసేకరణ కోసం రెండొందల అడుగుల రోడ్డుకు ఇరువైపులా కందకాలు తీశారు. కానీ ‘కుడా’కు నిధుల లేమి తదితర సమస్యలతో మరుగునపడింది. స్వరాష్ట్రంలో తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్కు 2016 నుంచి వరుసగా మూడు సంవత్సరాలుగా రూ.900 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయి. మహా నగర ఔటర్ రింగ్రోడ్డును ఎన్హెచ్ 163లో 29 కిలోమీటర్లు, ఎన్హెచ్ 563లో 22 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డును చేపడుతున్నారు. మిగిలిన 18 కిలోమీటర్ల రోడ్డును రాష్ట్ర ఫ్రభుత్వం ఆర్అండ్బీ ద్వారా నిర్మించేందుకు పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్కు ఇన్నర్ రింగ్రోడ్డు రవాణా మార్గం ఎంతగానో దోహదపడనుంది. తొలిదఫా నాయుడు పెట్రోల్పంపు నుంచి మార్కెట్ వరకు.. ఇన్నర్ రింగ్రోడ్డును తొలిదఫాగా నాయుడు పెట్రోల్పంపు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు అభివృద్ధి చేయనున్నారు. జానీపీరిల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతం మినహా ఆరు కిలోమీటర్ల వరకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అందుకోసం ఆర్అండ్బీ రూ.50కోట్లతో రూపొందించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. భూసేకరణకు రూ.110కోట్లు ఇన్నర్ రింగ్రోడ్డు భూసేకరణ అత్యంత కీలకంగా మారింది. మాస్టార్ ప్లాన్లో రూపొందించిన రహదారిలో వ్యవసాయ ఆధారిత భూములు, ఇళ్ల స్థలాల ప్లాట్లు ఉన్నాయి. భూసేకరణ కోసం రూ.110 కోట్ల వ్యయం అవుతుందని రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులు అంచనా వేశారు. పనులు వేగవంతం చేయండి.. ఇన్నర్ రింగ్రోడ్డుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాలను నివృత్తి చేయాలన్నారు. ఏమైనా క్లిష్టమైన ఫిర్యాదుల వస్తే తన దృష్టికి తీసుకొస్తే స్వయంగా పరిశీలించి పరిష్కారిస్తానని అన్నారు. రోడ్డు అభివృద్ధి పనులకు సాంకేతిక అనుమతులు తీసుకొని టెండర్లు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ ఎల్.రాజం, డీఈ రాజు, సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ ప్రభాకర్, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా పవిత్ర గ్రంథం
‘‘ఈనెల 8న ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒత్తిళ్లకు భయపడకూడదు. దరఖాస్తుల విచారణ మందకొడిగా సాగుతోంది. ఎవరైనా ఒత్తిళ్లకు లొంగినట్లు తెలిస్తే జైలుకు పంపడం ఖాయం. నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది’’ అంటూ కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్ : ఓటరు జాబితా పవిత్ర గ్రంథమని, దానిపట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటా యని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు, చేర్పుల కోసం అత్యధికంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఫారం–7ను సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తులు చేశారన్నారు. వాటిని బీఎల్వోలు నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. కరెక్ట్గా ఉంటే ఆమోదించాలని చెప్పారు. తప్పుగా ఉంటే తిరస్కరించాలన్నారు. రాజకీ య ఒత్తిళ్లకు బీఎల్వో, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తలొగ్గకూడదన్నారు. ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా భయపడకూడదన్నారు. ఎవరైనా ఒత్తిళ్లకు లొంగినట్లు తెలిస్తే జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి జిల్లా యంత్రాం గం అండగా ఉంటుందన్నారు. 8న ఎన్నికలకోడ్ ....? ఈనెల 8న ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. 7న జిల్లాలోని 66 మండలాల్లో నియమించిన మానిటరింగ్ టీమ్లు, ఎంసీసీ, ఫ్లైయింగ్ స్క్వాడ్లు సమన్వయంతో ముం దుకెళ్లాలన్నారు. వారందరూ గురువారం నుంచి క్షేత్రస్థాయి విధుల్లో ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఓటరు జాబితా సిద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. ఆ లోపు ప్రస్తుతం చేస్తున్న ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. చేర్పులు, మార్పులు, ఆక్షేపణలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విచారణ చేయడానికి ఏడు రోజుల సమయంతో సంబంధం లేదన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట నే విచారణ చేపట్టవచ్చునన్నారు. జిల్లాలో 1,12,000 దరఖాస్తులు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను ఆదేశించారు. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే దరఖాస్తుల విచారణ చిత్తూరు జిల్లాలో పనులు మందకొడిగా జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో ఉందన్నారు. దరఖాస్తుల విచారణలో ఏదో సమస్య ఉందని, అందుకే కావట్లేదన్న అనుమానం తనలో రేకెత్తిస్తోందన్నారు. 12 మందికి షోకాజ్ నోటీసులు అనుమతి లేకుండా ఒక ఓటును తొలగించినందుకు తంబళ్లపల్లె ఈఆర్వో ఈశ్వరయ్యపై కలెక్టర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అనుమతి లేనిదే ఓటును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ‘‘తమాషాలు చేస్తున్నావా.. నేను అనుకుంటే ఇప్పుడే నీ ఉద్యోగం పోతుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల ఈఆర్వోలతో రోజువారి పనితీరు నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ఫారం–6,7 లలో క్షేత్రస్థాయి విచారణ, తిరస్కరణల్లో వెనుకబడి ఉన్న శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు, పలమనేరు, నగరి, తంబళ్లపల్లె నియోజకవర్గాల ఆరు ఈఆర్వోలకు, అదే మండలాల ఏఈఆర్వోలు ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జా యింట్ కలెక్టర్ గిరీషను ఆదేశించారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు కనబడకూడదు జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పథకాల ప్రచార బ్యానర్లు గురువారం నుంచి తొలగించే కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు. 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం, 15న వినియోగదారుల అవగాహన దినోత్సవం కార్యక్రమాలను అధి కారికంగా నిర్వహించాలన్నారు. నాయకులను ఆహ్వానించకూడదని చెప్పారు. -
నకిలీ అర్జీలపై సీరియస్
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటరుకు తెలియకుండా వారి ఓటు తొలగించాలని ఆ వ్యక్తి పేరుతో ఆన్లైన్లో ఫారం–7 ద్వారా నమోదు చేసిన వ్యక్తులపై ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చాంబర్లో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట, పెనమలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, మైలవరం, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించాలని చీటింగ్దారులు కొంత మంది సుమారు 30 వేల వరకు ఆన్లైన్లో నమోదు చేశారన్నారు. ఇవి గత నెల 26, 27 తేదీల్లో ఎక్కువగా నమోదయ్యాయని తాము గుర్తించామన్నారు. అనంతరం మార్చి 1వ తేదీన తాను జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్బూత్లలో పరిశీలించి ఈ విధంగా ఓట్లు తొలగింపు దరఖాస్తులు చేసుకునే వాటిని పరిశీలించామన్నారు. పరిశీలన అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లకు ఆన్లైన్లో పొందుపరిచిన దరఖాస్తులు, ఎవరి పేరుతో నమోదై ఉన్నాయో వారి వివరాలను ఆయా గ్రామాలకు వెళ్లి తనిఖీ చేసి వారిని ప్రశ్నించామన్నారు. ఓటరుకు తెలిసే దరఖాస్తు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఓట్లను తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తు చేశార అన్న వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఇలా నమోదైన వాటిలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు సంబంధించి ఆయా పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశామన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల, అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో ఇటువంటి దరఖాస్తులు కావటంతో సంబంధిత పోలీస్స్టేషన్లో వీటిపై కేసులు నమోదయ్యాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని చిలకలపూడి, తాలుకా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. మైలవరం నియోజకవర్గంలో మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో పడమట పోలీస్స్టేషన్లో చీటింగ్, ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేయటం, తదితర సెక్షన్లతో ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదైన దరఖాస్తులకు సంబంధించి 15 కేసులు నమోదు చేశామన్నారు. వీటిని పూర్తిస్థాయిలో పోలీస్ అధికారులు విచారణ చేపట్టి వ్యక్తులను గుర్తించటం, ఎన్ని ఓట్లు తొలగించేందుకు దరఖాస్తు చేశారో కూడా పరిశీలించిన అనంతరం అవసరమైతే ఆ వ్యక్తిని జిల్లా బహిష్కరణ చేసేందుకూ వెనుకాడబోమన్నారు. -
ఆ అధికారం కలెక్టర్దే!
సాక్షి, హైదరాబాద్: కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం తహసీల్దార్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్కే ఆ అధికారం ఉం టుందని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో తప్పు డు కుల ధ్రువీకరణ పత్రం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన వ్యక్తిపై చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. అయితే ఆ వ్యక్తి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ రద్దు చేశాకే అతనిపై చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఎస్.అజయ్ చందర్ తాను బీసీ–బీ (గాండ్ల) కులానికి చెందిన వ్యక్తినంటూ 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. దీనికి సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించారు. అయితే అజయ్ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కాదని, అతను తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారంటూ స్పెషల్ బెటాలియన్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ అధికారులు అజయ్ చందర్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం అసలైందో.. కాదో.. తేల్చాలని నిర్మల్ మండల తహసీల్దార్ను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు విచారణ జరిపిన తహసీల్దార్, అజయ్ చందర్ గాండ్ల కులస్తుడు కాదని, అతను రెడ్డి గాండ్లకు చెందిన వ్యక్తిని తేల్చారు. రెడ్డి గాండ్ల కులం బీసీ–బీ కిందకు రాదని స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులకు తహసీల్దార్ ఈ జనవరి 9న నివేదిక సమర్పించారు. ఈ నివేదికను సవాల్ చేస్తూ అజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనల ప్రకా రం కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కే ఉందన్నారు. పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ రద్దు చేయలేదని, అందువల్ల అతనిపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోజాలరన్నారు. ప్రభుత్వ న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసే అధికారం కలెక్టర్కే ఉందన్న విషయాన్ని అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తహసీల్దార్ ఇచ్చిన నివేదిక చెల్లదంటూ రద్దు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ చట్ట ప్రకారం వ్యవహరించి, కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తే, తర్వాత పిటిషనర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అయ్యో..సర్వ శిక్ష అభియాన్
సాక్షి,కడప: పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత గురించి మనం వినే ఉంటాం. అలాగే ఉంది సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు కార్యాలయ దుస్థితి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల అభివృద్ధితో పాటు మౌలిక వసతులకు నిధులిచ్చే కార్యాలయ ఇది. అలాంటి కార్యాలయంలో కనీస మౌలిక వసతులు లేవు. సిబ్బందికి సరిపడా గదులు లేవు. ఫైల్స్, ఫర్నిచర్కు అదనపు గదుల సౌకర్యం లేదు. దీంతో విలువైన ఫైల్స్ను కూడా బీరువాలపైన ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకుంది. పాఠశాలకు ఏవైన పుస్తకాలు వచ్చినా వాటిని కూడా భద్రపరిచేందుకు గదులు లేకపోవడంతో వాటిని కూడా వరండాల్లో ఉంచుతున్నారు. దీంతో విలువైన పుస్తకాలు కూడా పాడైపోతున్నాయి. ఆరుబయట కుప్పలుగా పోసిన పుస్తకాలు ఇందంతా ఒక ఎత్తు అయితే పాఠశాలల సమస్యలు, అభివృద్ధిపై ఆయా పాఠశాలల హెచ్ఎంలు, స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలంటే నగరంలోని ఎమ్మార్సీ దగ్గరకో లేక స్కూల్స్ దగ్గరకో పరిగెత్తి సమీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకుంది. ఇన్ని సమస్యలున్నా కనీసం కార్యాలయ సిబ్బంది ప్రశాంతంగా కూర్చొని విధులను నిర్వహించుకుందా మంటే అది కూడా కుదరని పరిస్థితి. కారణం కూర్చునే కుర్చీకి అటు పక్క ఇటు పక్క ఫైల్సే. సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అదనపు గదులను నిర్మాణానికి అనుమతులిచ్చి ఇరుకిరుకు గదులలో విధుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వెంటాడుతాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పలుచోట్ల ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో ఇష్టానుసారం దరఖాస్తులు చేస్తున్నారని, ఆ నేరస్తులను పట్టుకోవడానికి వెంటాడుతామని, వదిలేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 11న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తరువాత ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో అధికంగా దరఖాస్తు చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్య మొదట్లో చంద్రగిరి నియోజకవర్గంలో వచ్చిన వెంటనే స్పందించి మొదటి పది మంది దరఖాస్తుల ఐపీ అడ్రస్సులు కావాలని సైబర్ క్రైమ్కు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. రెండు మూడు రోజులుగా ఫారం–7 దరఖాస్తులు ఎక్కువ అయినట్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల ఆర్వోలకు ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా సైబర్ క్రైమ్లో కేసు పెట్టాలని ఆర్వోలకు సూచించామని చెప్పారు. విచారణ లేకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించబోమని స్పష్టం చేశారు. మరణించిన వారి ఓట్లను మరణ ధ్రువీకరణపత్రం ద్వారా తొలగిస్తున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన వారి ఓట్లు ఇంటి పక్కన ఉన్న వారి సంతకం తీసుకుని తనిఖీ చేశాకే తొలగిస్తారని తెలిపారు. తొలగించిన ఓట్లను ప్రతి గ్రామంలో పేర్లతో సహా వెల్లడిస్తామని చెప్పారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్ఏలను నియమించి నివేదికలివ్వాలన కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా ఐదారు అంశాలపై దృష్టి పెడతారని చెప్పారు. మార్చి 1,2 తేదీల్లో తిరుపతిలో ఆర్వో, ఈఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లచే ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇటీవల పోలీస్ శిక్షణ మైదానం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేశారని, అదే సమయంలో ధర్నా చేసిన టీడీపీ నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించగా, ఎస్పీకి చెప్పాను... ఈ విషయంపై ఆరా తీస్తామంటూ కలెక్టర్ సమాధానాన్ని దాటవేశారు. -
ఓట్ల తొలగింపునకు పాల్పడితే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో మరొకరి పేర్ల మీదుగా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ సహకారంతో విచారణ మొదలైందన్నారు. జనవరి 11న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ఇప్పటివరకు వచ్చిన క్లైమ్లు, ఆక్షేపణలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. 1.05 లక్షల క్లైమ్లను పరిశీలించిన తరువాతనే ఆన్లైన్ ప్రక్రియకు పూనుకుంటారన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు అందే దరఖాస్తులను పరిశీలించి తాను, ఈసీఐ ఆమోదించిన తరువాతే పేర్లను తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. ఈసీఐ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్లో రెండుసార్లు వెరిఫికేషన్ చేశారన్నారు. ప్రజల ఓటును ఓటరు జాబితాలో ఉంచే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనని చెప్పారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో 99 శాతం అన్ని వసతులు కల్పించామన్నారు. 118 పోలింగ్ కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత యాజమాన్యాలు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. పేర్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారి గురించి విచారణ మొదలైందని, వారెవరో పేర్లు బట్టబయలైనప్పుడు చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉంటుందన్నారు. ఓటు తొలగించారని ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ పరిధిలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించా లన్నారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు వీవీ ప్యాట్లు, ఈవీఎంలపై అవగాహన కల్పించామని, మూడో విడత అవగాహన మొదలు పెట్టామన్నా రు. ఈసీ ఆదేశాలతో వీడియోల రూపంలో అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నా రు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, టీవీలలో పెయిడ్ న్యూస్లు వస్తే సంబంధిత అభ్యర్థి ఖాతా కింద వాటిని పరిగణిస్తామన్నారు. ఫేక్ న్యూస్ను కనిపెట్టడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. అనంతరం ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఓటు చిత్తూరు ఓటు పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
కనికరం లేని కలెక్టర్!
సాక్షి, విశాఖపట్నం / పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆభాగ్యులెవరైనా ఆపదలో ఉంటే పట్టించుకోవలసిన బాధ్యత ఆయనది. క్షతగాత్రులు, బాధితులకు తక్షణమే ఆదుకోవలసిన కర్తవ్యం ఆయనది. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయానికి కృషి చేయాల్సిన విధి కూడా కలెక్టర్పైనే ఉంటుంది. మరి అవేమీ పట్టించుకోకుండా, బాధిత కుటుంబాల గోడు గాలికొదిలేస్తే ఆ కలెక్టర్ను ఏమనుకోవాలి? కనికరం లేని కలెక్టర్ అని అనుకోవాలి. ఇప్పుడు మన విశాఖ కలెక్టర్ కాటమనేని భాస్కర్ను పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్లో విష రసాయనాన్ని తాగి అశువులు బాసిన గిరిజన బాధిత కుటుం బ సభ్యులు అలాగే అనుకుంటున్నారు. మానవ త లేకుండా వ్యవహరించారని ఆక్రోశిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? స్వతంత్రనగర్ ఎస్టీకాలనీలో రసాయనాన్ని తా గి ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కలెక్టర్ను కలిసి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరడానికి సీపీఎం నాయకులను వెంటబెట్టుకుని వెళ్లారు. తనను కలవకుండా అరగంట సేపు బయటనే కూర్చోబెట్టారు. విషణ్ణవదనాలతో వీరంతా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 11 గంటలకు చాంబర్ నుంచి బయటకు వచ్చారు. గడియారం వైపు చూపిస్తూ ‘ఇప్పుడే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. పరిహారం గురించి అడక్కండి. నేనేమీ చేయలేను. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి.. ఇక్కడ్నుంచి వెళ్లిపోండి.. ఎలక్షన్ అయ్యాక వస్తే న్యాయం చేస్తాను..’ అంటూ వెళ్లిపోబోయారు. కోడ్కు మానవత్వంతో కూడిన పరిహారానికి సంబంధం లేదని బాధిత కుటుంబీకులు, సీపీఎం నాయకులు ఆయనను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ మనసు కరగలేదు. తాము 10.30 గంటలకే ఆయన్ను కలిసినప్పుడే తమ వినతిని స్వీకరించి ఉంటే ఆయన చెప్పినట్టుగా కోడ్ అడ్డంకి ఉండేది కాదని, ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ అమానవీయంగా వ్యవహరించారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగినప్పుడు ఇలాగే తప్పించుకుంటారా? అంటూ సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, గంగారావు తదితరులు ప్రశ్నించారు. అనంతరం వెనుతిరిగి కేజీహెచ్ మార్చురీ వద్ద తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల కోడ్ అడ్డమన్నారు కలెక్టరేట్కు ఉదయం 10.30 గంటలకే చేరుకున్నాం. మమల్ని కలెక్టర్ చాంబర్లోకి వెళ్లనివ్వకపోవడంతో వరండాలో వేచి ఉన్నాం. 11 గంటల సమయంలో ఆయన గది నుంచి వెలుపలకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రకటించినందున బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం కుదరదని, ఎన్నికలు పూర్తయిన తరువాత మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. – వాడపిల్లి అప్పన్న,13 జిల్లాల గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
కొత్త కలెక్టర్ నివాస్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కలెక్టర్ మళ్లీ మారారు.ఈ నెల9నే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.రామారావు రెండు వారాలు కూడా గడవక ముందే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడమున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న జె.నివా స్ను నియమించారు. రామారావును విజయవాడకు బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం 409 జీఓను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. నివాస్ డైరెక్ట్ ఐఏఎస్ కేడర్కు చెందిన ఉద్యోగి. ఆయన గతంలో జేసీగాను, ఇతర హోదాల్లో పనిచేశారు. అయి తే రామారావు బదిలీ జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. ఎన్నికల సమయంలో ఇప్పటికప్పుడు ఇద్దరి కలెక్టర్లను మార్చడం రాష్ట్ర ప్రభుత్వం అస్థిరత్వానికి నిదర్శనమనే వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. అయితే రామారావు చు రుగ్గా లేరని, ఎన్నికల సమయంలో ఆయన తర్వాత కేడర్లో ఉన్న ఉద్యోగులు రామారా వును డామినేట్ చేస్తారని, అందుకే ఆయనను బదిలీ చేశారనే ప్రచారమూ ఉంది. ఇటీవల జి ల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు కూ డా బదిలీపై ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. -
ఈవీఎంలపై అవగాహన
మెదక్ అర్బన్ : శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడత ఈవీఎంల తనిఖీలు పూర్తయినట్లు వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసే విధానం, సీల్ చేసే విధానాన్ని జాయింట్ కలెక్టర్, ఆయా రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వివరించినట్లు తెలిపారు. ప్రతి ఈవీఎంను తనిఖీ చేసి, శుభ్రం చేసిన తర్వాత అది సరిగ్గా పని చేస్తున్నట్లయితేనే వాటిని వినియోగిస్తామన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభ«ద్రుల ఓట్ల తుది విడత రూపొందించడం జరిగిందన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు పట్టభద్రులు 7,473 మంది, ఉపాధ్యాయులు 1,120 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి మండల కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారని... ఈవీఎంలో అన్ని సరిగ్గా పని చేస్తున్నాయనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈవీఎంలలో డిజిటల్ క్లాక్ ద్వారా ఏ ఓటు ఎన్ని గంటల సమయంలో పోలైన విషయం కూడా స్పష్టంగా తెలుస్తుందని కలెక్టర్ వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసిన సమయంలో సరిగ్గా పని చేయని 22 కంట్రోల్ యూనిట్లు, 3 బ్యాలెట్ యూనిట్లు, 50 వీవీ ప్యాట్లను తిరిగి వెనక్కి పంపడం జరుగుతుందన్నారు. ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానం గూర్చి జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. 1950 నంబర్లో తెలుసుకోవచ్చు.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారని.. నామినేషన్ల ప్రక్రియ తదితరాలు కలెక్టరేట్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమం నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని ఇందులో 21 వేలకు పైగా నూతనంగా ఓటర్లుగా నమోదు జరిగిందన్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గంలో 11,391, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,090 నూతనంగా ఓటర్లు నమోదు ప్రక్రియ జరిగిందని కలెక్టర్ వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మూడు వేల పైచిలుకు, నర్సాపూర్ నియోజకవర్గంలో 1,200 ఓట్లు తొలగింపులు, మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు. ఈనెల 22న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అలాగే ఓటరు జాబితాను ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద అతికించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాలకు బతుకుదెరువు నిమిత్తం వలసవెళ్ళిన వారు, ఉద్యోగ రీత్యా వెళ్ళిన వారు తమ పేరు ఓటరు జాబితాలో ఉందా ? లేదా అనే విషయాన్ని 1950 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీకి పది రోజుల ముందు వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పాఠశాల (చునావ్ పాఠశాల) అని ఏర్పాటు చేసిందని... దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికలపై అవగాహన, జరిగే తీరు, ఓటరు పాత్రపై అందరికి అవగాహన కల్పించడం అని తెలిపారు. ఈ పాఠశాలలను ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీనికి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) కో–ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల మొదటి శనివారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని వివరాలను తెలియజేస్తారని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, సీల్ చేసిన విధానం, ఓట్ల లెక్కింపు చేసే ప్రక్రియను కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎన్నికల సిబ్బంది నజీర్ అహ్మద్, రవికుమార్, అధికారులు రాజిరెడ్డి, శైలేశ్వర్రెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్లో కలెక్టర్ను కలిసిన రైతులు
-
చిత్తూరు ఓటు
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ‘చిత్తూరు ఓటు’అనే నినాదాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న వినూత్నంగా ప్రారంభించారు. ఆ నినాదానికి సంబంధించి ప్రత్యేక లోగోను తయారుచేశారు. జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా చర్యలు చేపడుతామన్నారు. ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్లను నూతనంగా అమలుచేయబోతున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశామని తెలుసుకోవచ్చన్నారు. చిత్తూరు కలెక్టరేట్ : నిజాయితీగా, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి ఆయన మొదటి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ పలు సూచనలు, సలహాలు ఇచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియపై సమీక్ష నిర్వహించిందన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించి దేశంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికలు మొదటి స్థా నంలో నిలిచేలా చర్యలు చేపడుతామన్నారు. తుది ఎన్నికల జాబితా ప్రకారం జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో పురుషులు 15,03,477 మంది, మహిళలు 15,21,401 మంది ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 3,800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వీవీప్యాట్లను నూతనంగా అమలుచేయబోతున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశామని తెలుసుకోవచ్చన్నారు. జిల్లాకు 12,160 ఈవీఎంలు, 10,260 వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు 9,120 వచ్చాయని చెప్పారు. వాటన్నింటిని మొదటి విడత తనిఖీ చేసి భద్రపరిచామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్పై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా విభిన్న ప్రతిభావంతులు ఓట్లు వేసేవిధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులను కూడా విభిన్న ప్రతిభావంతులనే నియమించబోతున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ అమలులోకి రాగానే సీ–విజిల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు సీ–విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయవచ్చని చెప్పారు. రాబోయే ఎన్నికలకు కేంద్ర బలగాలు ఎక్కువగా కావాలని ఈసీకి నివేదికలు పంపినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడానికి తనిఖీలను శరవేగంగా చేస్తున్నామన్నారు. వినూత్నంగా చిత్తూరు ఓటు నినాదం రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కలెక్టర్ ప్రద్యుమ్న చిత్తూరు ఓటు అనే నినాదాన్ని వినూత్నంగా ప్రారంభించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ నినాదంతోనే ముందుకెళతామని స్పష్టంచేశారు. ఆ నినాదానికి సంబంధించి ప్రత్యేక లోగోను తయారుచేశారు. జిల్లా కేంద్రంలో ఒక కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై జిల్లాలోని అన్ని కూడళ్లల్లో, కళాశాలలు, బస్టాండ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో 78.94 శాతం ఓటింగ్ శాతం నమోదైందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో 90 శాతానికి పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
సేంద్రియ పంటలకు అధిక ధర
చెన్నారావుపేట: నాణ్యమైన పంటలు పం డించినపుడే అధిక రాబడి లభిస్తుందని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన పథకం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూడిల్లీ వారి ఆధ్వర్యంలో మూడు రోజు ల శిక్షణ తరగతులు మంగళవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంటల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోని ఉండాలన్నారు. పండించిన వాటిని విక్రయించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్కెటింగ్, గ్రేడింగ్, నాణ్యత పాటించినపుడే పండించిన పంటకు అధిక ధర లభిస్తుందని తెలిపారు. మూడురోజుల కాలంలో సందేహాలను నివృత్తి చేసుకొని ఇతర రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నాణ్యమైన పం ట పండించినప్పుడు మార్కెటింగ్ వారు స్వయంగా రైతు వద్దకే వచ్చి ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా పంటలు వేసుకోవాలన్నారు. నర్సంపేటలో మార్చి, పసుపు స్పైసెస్ ఇండస్ట్రీస్.. నర్సంపేటలో పుడ్ ప్రాసెసింగ్లో భాగంగా డీఆర్డీఓ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మిర్చి, పసుపుతో పాటు వరి, మొక్కజొన్న స్పైసెస్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరుతున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన పంట పండిస్తే అక్కడనే పండించిన పంటను స్పైసెస్ చేసి అధిక ధరకు విక్రయించవచ్చాన్నారు. స్పైసెస్ బోర్డు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లింగప్ప మాట్లాడారు. వరంగల్ వరంగల్ చపట్టా మిర్చికి అధిక డిమాండ్ ఉందన్నారు. 150 దేశాలకు ఎగుమతి చేయడానికి 137 మంది ఎగుమతి దారులు ఉన్నారని అన్నారు. రైతులు పంట పండించిన తర్వాత ప్యాకింగ్, గ్రేడింగ్, మార్కెటింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలా చేసినప్పుడు సుమారుగా రూ. 8 వేలు ఉన్న మిర్చికి రూ.10 వేల ధర వస్తుందన్నారు. రైతులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు.. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, అసిస్టెంట్ కలెక్టర్ మను చౌదరి, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్, డీపీఆర్వో బండి పల్లవి, ఆర్డీఓ రవి, నర్సంపేట ఉద్యానశాఖ అధికారిని జ్యోతి, వ్యవసాయ అధికారి అనిల్, అసిస్టెంట్ మార్కెటింగ్ స్సైసెస్ బోర్డు డైరెక్టర్ స్వప్న థాయర్, వివేక్నాథ్, జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ చందర్, ఏపీఓ అరుణ, ఎస్సై కూచిపూడి జగదీష్, సాయి స్వచ్ఛంద సంస్థ సీఈఓ వెంకన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు పెంతల స్వప్న, కో ఆర్డినేటర్ సుధాకర్, స్వామి, శిరీష, తదితరులు ఉన్నారు. వననర్సరీ సందర్శన మండలంలోని మగ్దుంపురం వన నర్సరిని కలెక్టర్ హరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోజుకు ఎన్ని బ్యాగులు నింపుతున్నారు.. ఎన్ని స్టంప్స్ పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి ప్రభాకర్, ఆర్డీవో రవి, ఎంపీడీవో చందర్, ఏపీవో అరుణ, ఎఫ్ఏ సతీష్,తదితరులు ఉన్నారు. -
వికారాబాద్ కలెక్టర్పై సస్పెన్షన్ వేటు..
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్పై సస్పెన్షన్ వేటు పడింది. వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన ఈవీఎంలను భద్రపరిచిన గది(స్ట్రాంగ్ రూం)ని నిబంధనలను అతిక్రమించి తెరిచిన సంఘ టనలో ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ వికారాబాద్ కలెక్టర్ జలీల్తో భేటీ అయి స్ట్రాంగ్రూం, ఈవీఎంలను పరిశీలించి వెళ్లిన మరుసటిరోజే ఆయనపై చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్కుమార్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఓట్ల లెక్కింపుపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఈపీ(ఎలక్షన్ పిటిషన్)గా ఈ కేసును స్వీకరించింది. న్యాయస్థానంలో ఎన్నికల కేసు దాఖలైన నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచిన గదులను తెరవకూడదనేది నిబంధన. అయితే, కలెక్టర్ ఈ నిబంధనను ఉల్లంఘించి ఈ నెల 1వ తేదీన స్ట్రాంగ్రూం తెరిచి వికారాబాద్ సెగ్మెంట్కు చెందిన 100కుపైగా ఈవీఎంల సీళ్లను సాంకేతిక నిపుణులతో కలసి పరిశీలించారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకుగాను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలనే వినియోగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని గత నెల 31న రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది. అయితే, న్యాయస్థానంలో దాఖలైన కేసులకు సంబంధించిన నియోజకవర్గాల ఈవీఎంలను పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్ గమనించలేదు. ఆ సమాచారం ఆయన వరకు చేరలేదు. దీంతో ఆయన వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల సీళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు మర్రి శశిధర్రెడ్డి తదితర నేతలు జిల్లా కలెక్టర్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్కు ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్కుమార్ లేఖ రాశారు. కలెక్టర్కు నోటీసులు జారీ చేశారు. అయితే, ‘వికారాబాద్ నియోజకవర్గ ఈవీఎంలపై హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలైన విషయం నా దృష్టికి రాలేదు, అందువల్లే స్ట్రాంగ్రూం తెరిచి ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ చేపట్టాన’ని ఎన్నికల సంఘానికి కలెక్టర్ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. సస్పెన్షన్ సమయంలో కేంద్ర బృందంతో కలెక్టర్... సస్పెండ్ చేసిన సమయంలో కలెక్టర్ జలీల్ కేంద్ర అధికారుల బృందంతో కలసి మోమిన్పేట మండలంలో పర్యటిస్తున్నారు. సస్పెన్షన్ విషయమై టీవీ చానళ్లలో బ్రేక్.. ఫ్లాష్న్యూస్లు రావడంతో పలువురు ఆయనకు సమాచారం అందించారు. కాగా, అప్పటికే కలెక్టర్కు ఈ విషయం తెలిసింది. 13 నెలలపాటు సేవలు... వికారాబాద్ జిల్లా ఆవిర్భావం తర్వాత దానికి మొదటి కలెక్టర్గా దివ్యదేవరాజన్ను ప్రభుత్వం 2016, అక్టోబర్ 11న నియమించింది. 2017 డిసెంబర్లో ఆమె ఆదిలాబాద్ కలెక్టర్గా బదిలీ కావడంతో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావును ఇన్చార్జి కలెక్టర్గా నియమించింది. 2018 జనవరి 2న ప్రభుత్వం రెగ్యులర్ కలెక్టర్గా ఉమర్ జలీల్ను నియమించడంతో జనవరి 6న ఆయన బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన, కలుపుగోలుగా ఉండి అందరి మన్ననలు పొందిన ఆయన అనూహ్యంగా సస్పెషన్కు గురయ్యారు. -
వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్
-
ఈసీ సంచలన నిర్ణయం
సాక్షి, వికారాబాద్ : నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుతో కలెక్టర్పై ఈసీ వేటు వేసింది. ఈవీఎంలను నిబంధనలకు విరుద్దంగా తెరిచారంటూ కలెక్టర్పై గతంలోనే ఫిర్యాదులు రాగా.. ఆయన్ని సస్పెండ్ చేయాలని ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కేసు కోర్టులో ఉండగా.. ఈవీఎంలను ఎలా తెరుస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే...వికారాబాద్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కలెక్టర్ సుమారు వంద ఈవీఎంలు సీల్ తీశారంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఈసీ... కలెక్టర్పై వేటు వేసింది. -
నాణ్యమైన భోజనం ఇవ్వాలి
మెదక్ అర్బన్: ప్రతి పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించేలా ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన పోషకాలను అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిందేనని అన్నారు. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అన్నంతో పాటు విధిగా కూరగాయలు, పప్పులు, ఆకుకూరలతో పాటు గుడ్లను సైతం అందించిప్పుడే విద్యార్థి ఎదుగుదలకు సరిపడా పోషకాలు అందుతాయన్నారు. అమలులో నిర్లక్ష్యం వహించే నిర్వాహకులకు నోటీసులు అందించాలన్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేనట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే బియ్యం దిగుమతి చేసుకోవాలన్నారు. పాఠశాలలకు వచ్చే బియ్యం తూకంలో తక్కువ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి ప్రతి పాఠశాలలో కిచెన్షెడ్ల నిర్మాణానికి పాఠశాల యాజమాన్య కమిటీలో చర్చించాలని అన్నారు. పాపన్నపేట మండలంలోని కస్తూర్బా పాఠశాల, ఉన్నత పాఠశాలకు భగీరథ కనెక్షన్లు అందించాలని ఆదేశించి మూడు నెలలు దాటినా ఇప్పటికీ నీరందించకపోవడంపై ఈఈ కమలాకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఇళ్లు ఉన్న ఆవాసాలకు సైతం మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నీటి కనెక్షన్లు అందిస్తున్నామని... అలాంటిది 350 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మూడు నెలల కిందట నీటి కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఇప్పటికీ ఆ పాఠశాలలో నీటి సరఫరా కావడం లేదన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. అలాగే ప్రతి పాఠశాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలను ప్రధానోపాధ్యాయులు తమ సొంత ఆస్తిలా భావించాలని, ప్రభుత్వం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే భవనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ రవికాంతరావు, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీటీడబ్ల్యూఓ వసంతరావు, జ్యోతిపద్మ, డీపీఆర్వో శైలేశ్వర్రెడ్డి, ఏడీలు భాస్కర్, భాస్కర్రావు, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్తో పాటుఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జాతరను విజయవంతం చేద్దాం
పాపన్నపేట(మెదక్):మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల్లో జరిగే మహాజాతరను అధికారులంతా సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాతరపై ఏడుపాయల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతరన్నారు. ఈ ఏడాది మాఘ అమావాస్య పుణ్య స్నానాలకు వెల్లువలా తరలివచ్చిన భక్తజనాలను చూస్తే.. శివరాత్రి జాతరకు సుమారు 10లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అదే స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ఏడుపాయల జాతరలో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. ఈసారి మంజీరా నదిలో నీరు లేనందున ఘనపురం ప్రాజెక్ట్ మడుగుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి చెక్డ్యాం నింపాలన్నారు. అమ్మవారి ఆలయం ముందు వరకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల స్నానాల కోసం షవర్ బాత్ల సంఖ్య పెంచాలన్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు అనువుగా వసతులు కల్పించాలన్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ట్యాంకర్లను వినియోగించాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యకనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టి రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు. 750 మంది పంచాయతీ సిబ్బందితో నిరంతరం సేవలు అందించాలని ఆదేశించారు. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా 24గంటల పారిశుధ్య సేవలు అందించాలన్నారు. మంజీరానదిలో ఎక్కడి పడితే అక్కడ భక్తులు స్నానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్టాండ్ను విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి పోతంశెట్టిపల్లి వైపు నుంచి కూడా జాతరకు వాహనాలను అనుమతిస్తామన్నారు. ఎడ్లబండ్లకు పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయించాలన్నారు. అమ్మవారి ఆలయాన్ని, రాజగోపుర, పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. 24గంటలపాటు నిరంతర విద్యుత్ అందించాలని సూచించారు. వైద్య సౌకర్యాలు 24గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను జాతరలో ప్రచారం చేయాలని సూచించారు. ఈ పనులన్నీ 25వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తిరిగి 26న సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పుడు పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జాతర నిర్వహణ విఫలమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జాతరకు 1,150 మంది పోలీసులను బందోబస్తుకోసం నియమిస్తున్నట్లు అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. కాలినడనక కలెక్టర్ ఏడుపాయల్లో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కలెక్టర్, జేసీ నగేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్రెడ్డి, అదనపు ఎస్పీ నాగరాజు, ఆర్డీఓలు ఇతర అధికారులతో కలిసి ఘనపురం ఆనకట్టపై నుంచి కాలినడకన జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ఏడుపాయల్లోని చెక్డ్యాం, అమ్మవారి ఆలయం, ఘనపురం ఆనకట్ట, అంతర్గత రోడ్లు, బస్టాండ్ ప్రదేశం, విద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడ చేసే ఏర్పాట్లను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు. వారి వెంట ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఈఓ మోహన్రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్శాఖ, ఫారెస్ట్శాఖ అధికారులతోపాటు తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకావ్, డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు, పాలకవర్గ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుతోనే రైతు బాగు
మెదక్జోన్: అన్ని రకాల పంటలతోనే రైతుకు ఆదాయం సమకూరుతోందని ప్రతిరైతు (ఇంటిగ్రేటెడ్) వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఆదివారం హవేళిఘణాపూర్ మండల పరిధిలోని కూచన్పల్లి గ్రామంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి, శేరి నారాయణరెడ్డి సాగు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో సాగుచేసిన పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంలో భాగంగా నారాయణరెడ్డి, సుభాష్రెడ్డిలు ఆర్గానిక్తో సాగుచేసిన అరటితోట, జామతోట, చేపల చెరువు, ఆలుగడ్డ సాగు, కోళ్లు, పశువులు, గొర్రెల పెంపకం, మల్బార్చెట్లు , పలురకాల కూరగాయల సాగును డ్రిప్ ద్వార సాగుచేస్తూ తక్కువ నీటితో అధికంగా సాగుచేయటం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సాగువిధానాన్ని ప్రతి రైతు అలవర్చుకోవలని ఆయన సూచించారు. సేంద్రియసాగుతో పండించిన పంటలను తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. డ్రిప్తో పంటలను సాగుచేస్తే తక్కువ నీటివినియోగంతో అధిక మొత్తంలో పంటలను సాగుచేయవచ్చన్నారు. ఆయా పంటలను తిలకించిన వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు ఈ విషయాన్ని జిల్లాలోని రైతులకు వివరించి సేంద్రియ వ్యవసాయ పెంపుకోసం కృషి చేయాలని సూచించారు. శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ ఆలుగడ్డ మన ప్రాంతంలో పండదనే అపోహ రైతులకు ఉండేదని, ప్రస్తుతం తన వ్యవసాయక్షేత్రంలో బంగాళదుంప ను పుష్కలంగా పండుతుందని చెప్పారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తే మూడు సంవత్సరాల పాటు దిగుబడి కాస్త తక్కువగా వచ్చినా అనంతరం మంచి దిగుబడులు వస్తాయన్నారు. తక్కువనీటితో అధికంగా సాగుచేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం తాము ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేయటంతో ఎప్పుడూ ఏదోరకమైన పంట చేతికందుతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన వారిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం, హార్టికల్చరల్ అధికారి నర్సయ్య, వెటర్నరీశాఖ అధికారి అశోక్కుమార్తో పాటు అధికారులు రెబల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
వెదర్ రిపోర్ట్ ఇక ఈజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జోనల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్డీపీఎస్) ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయనుంది. శనివారం ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఎల్ఈడీ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా జిల్లాల అధికారులు ప్రజలకు సూచనలు చేస్తారన్నారు. ఈ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులతో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కాకుండా వచ్చే 3 రోజుల ముందస్తు వాతావరణ పరిస్థితులను సైతం తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 924 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి, టీఎస్డీపీఎస్ అధికార వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. -
వైరల్ : టిక్టాక్లో కలెక్టర్
చెన్నై , టీ.నగర్: టిక్టాక్లో సేలం జిల్లా కలెక్టర్ ఫొటో చోటుచేసుకోవడం సోమవారం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్టాక్ యాప్లో నమోదు చేశారు. కలెక్టర్ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్ మ్యూజిక్, ట్విట్టర్లలో పోస్టు చేశారు. వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్టాక్ మ్యూజిక్ను నిషేధించే పనిలో సైబర్క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదివరకే అనేక మంది రాజకీయ ప్రముఖులు టిక్టాక్ యాప్ను రద్దు చేయాలని కోరుతున్న స్థితిలో ప్రస్తుతం కలెక్టర్ ఫొటోను టిక్టాక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం సంచలనం కలిగించింది. -
పాలన పడక!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పరిపాలనా యంత్రాంగానికి మళ్లీ కష్టకాలం వచ్చింది. ‘ముఖ్య’ అధికారి విషయంలో ఈ జిల్లాకు తరచు ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఎక్కువ కాలం ముఖ్య అధికార విభాగం ఇన్చార్జిలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కలెక్టర్ రఘునందన్రావు స్టడీ టూర్ కోసం విదేశాలకు వెళ్లడంతో ప్రస్తుత జాయింట్ కలెక్టర్ రవి తాత్కాలికంగా ఇన్చార్జి కలెక్టర్గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో)గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారి కూడా సెలవుపై వెళ్లడంతో జిల్లా భూ పరిరక్షణ అధికారి వెంకటేశ్వరరావు ఇన్చార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు. దీంతో పలు కీలకమైన నిర్ణయాలు, ఫైళ్లు ఎక్కడక్కడే పెండింగ్లో ఉండిపోతున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు కలెక్టర్లు ఇలా వచ్చి...అలా వెళ్లిపోయారు. నాలుగు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఎలాంటి ఫైళ్లు, ఇతర పనులు ముందుకు సాగక పోగా, తాజాగా ఇన్చార్జిల పాలనతో అదే తీరు ఇంకా కొనసాగుతోంది. డివిజన్, మండల రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికి పనితీరు మాత్రం అంటీముట్టనట్లుగా తయారైంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ దరిమిలా జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులందరూ ఇతర జిల్లాలకు బదిలీ కాగా, ఇతర జిల్లాకు చెందిన అధికారులకు ఇక్కడ పోస్టింగ్ లభించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో తిరిగి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేకండా పోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల గడువు సైతం ముంచుకోస్తోంది. ప్రస్తుత డివిజన్, మండల బాధ్యులు నామమాత్రపు అంశాలు మినహా కీలకమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. ఆర్థిక చేయూతకు గ్రహణం జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆర్ధిక చేయూతకు గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల నామమాత్రపు పనితీరు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ పూర్తయి లబ్ధిదారుల ఎంపిక జరిగినా చెక్కుల పంపిణీ మాత్రం జరగడం లేదు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ విడుదలైనా...బ్యాంకులు సవాలక్ష కొర్రీల కారణంగా లక్ష్యం మాత్రం చేరడం లేదు. నిరుద్యోగ యువత కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ధూల్పేట్లో గుడుంబా తయారీ నుంచి బయటకు వచ్చిన యువతకు పునరావాసం కల్పించేందుకు కొన్ని యూనిట్ల కేటాయింపులు కాగితాలకు పరిమితమయ్యాయి. ఇలా చాల పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ఇన్చార్జి అధికారుల పద్ధతికి స్వస్తి పలికి..అన్ని ముఖ్యవిభాగాలకు రెగ్యులర్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. -
సీఎం ప్రాధాన్యతలే అమలు చేస్తా..
సాక్షి, విశాఖపట్నం: నాకంటూ ప్రత్యేకంగా ప్రాధాన్యతలు ఏమీ లేవు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యతలే నా ప్రాధాన్యతలు.. ఆయన చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయడమే నా పని‘ అని విశాఖ జిల్లా నూతన కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగుణంగా పనిచేయడమే నా బాధ్యతన్నారు. జిల్లాలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం పరుస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో ప్రజలు సంక్షేమ ఫలాలు అందే విధంగా పాటుపడతానన్నారు. సుదీర్ఘకాలం పాటు విశాఖ కలెక్టర్గా పనిచేసి పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్కుమార్ నుంచి కలెక్టర్ చాంబర్లో సోమవారం ఉదయం 10 గంటలకు నూతన కలెక్టర్గా కాటమనేని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత ఎక్కువ మంది అర్హులకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే తన లక్ష్యమన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై తనకు ఎలాంటి అవగాహన లేదని, పూర్తి స్థాయిలో అధ్వయనం చేయాల్సి ఉందనన్నారు. సమస్యలపై స్టడీ చేసిన తర్వాత పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఒక్క రోజులో సమస్యలన్నీ పరిష్కరించలేం.. ప్రజలు తమ సమస్యలు నేరుగా చెప్పుకునే మీ కోసం, ప్రజావాణి (గ్రీవెన్స్సెల్) కార్యక్రమాలకు తాను అధిక ప్రాధాన్యత నిస్తానని కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఒక్క రోజులో సమస్యలన్నింటిని పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. ప్రతి అర్జీని నిశితంగా, క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఆర్థికంగా, ఆర్థికేతర, సామాజిక కోణాల్లో సమస్యలను విభజించి సత్వర పరిష్కారానికి నోచుకునేలా కృషి చేస్తామన్నారు. జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం కోసమేనని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో అలక్ష్యం, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. భూ వివాదాలు, వ్యక్తిగత ఫిర్యాదులు, కోర్టు వివాదాలు కలెక్టర్ వరకు ఎందుకు వస్తున్నాయనే దానిపై ఆయా శాఖాధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు. మండల స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారం కావాల్సిందేనన్నారు.ఈ ఆఫీసింగ్పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. సాగునీటి పథకాలపై అవగాహనలేదు జిల్లాలో సాగునీటి పథకాలపై తనకు ఎలాంటి అవగాహన లేదని, తెలియని విషయాలు తెలిసినట్టుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కలెక్టర్ భాస్కర్ అన్నారు. జిల్లాలో అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న తర్వాతే మాట్లాడతానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతో వేగంగా జరిగేలా కృషి చేశామని, అయితే ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సంబంధిత శాఖాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో సి.చంద్రశేఖరరెడ్డి, ఆర్డీవో తేజ్భరత్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కలెక్టర్ వచ్చేశారు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కొత్త కలెక్టర్ కాటమనేని భాస్కర్ జిల్లాకు వచ్చేశారు. వచ్చిరాగానే ఒక్క క్షణం ఆలస్యంగా చేయకుండా పనిలో దిగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం సర్క్యూట్ హౌస్కు చేరుకున్న కొత్త కలెక్టర్ భాస్కర్ను పాడేరు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా గురించి వివరించారు. సోమవారం ఉదయం 10 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన జిల్లాలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్కే ప్రాధాన్యం సాక్షి, విశాఖపట్నం: గ్రీవెన్స్సెల్ ఎక్కడ నిర్వహిస్తారు? ప్రతి వారం ఎంతమంది అర్జీదారులు వస్తుంటారు? ఆ వచ్చే అర్జీలను ఏ మేరకు పరిష్కరిస్తారంటూ కలెక్టర్ భాస్కర్ ఆరా తీశారు. తనకు టాప్ ప్రయార్టీ గ్రీవెన్స్ సెల్లేనని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ పరిష్కారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. జిల్లా అధికారులందరూ(హెచ్వోడీలు) గ్రీవెన్స్కు విధిగా వస్తుంటారా? లేదా అని ఆరా తీశారు. గ్రీవెన్స్కు హెచ్వోడీలందరూ వస్తారని డీఆర్వో చంద్రశేఖరరెడ్డి చెప్పగా.. ఏ ఒక్కరు మిస్కాకుండా చూడాలని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులోనే గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తుంటామని, వచ్చే అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గ్రీవెన్స్ సెల్ ఎలా ఉంటుందో తాను చూస్తానని చెప్పారు. కలెక్టరేట్ సందర్శన: అనంతరం సబ్కలెక్టర్, డీఆర్వో, ఏవోలతో కలిసి కలెక్టరేట్కు చేరుకుని గ్రీవెన్స్ సెల్ నిర్వహించే మీటింగ్ హాలును పరిశీలించారు.హెచ్వోడీలు, ఇతర సిబ్బంది కూర్చునే సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. -
కలెక్టర్ వీడ్కోలుకు అయ్యన్న దూరం
సాక్షి, విశాఖపట్నం: బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ వీడ్కోలు సభకు జిల్లా సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ జిల్లా కలెక్టర్ అయినా బదిలీపై వెళ్తుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలకడం ఆనవాయితీ. అలాంటిది ఏకంగా ఆరేళ్ల పాటు జిల్లాలో పనిచేసిన కలెక్టర్ వీడ్కోలు సభకు మంత్రి అయ్యన్న హాజరు కాలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగున్నరేళ్లపాటు ఆయన జిల్లాలోనే వివిధ హోదాల్లో సేవలందించారు. జేసీగా, జీవీఎంసీ కమిషనర్గా, గడిచిన రెండున్నరేళ్లుగా కలెక్టర్గా పనిచేసి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగలిగారు. కానీ ఆది నుంచి ప్రవీణ్కుమార్పై మంత్రి గంటాకు అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడింది. దీంతో గంటాను విబేధించే అయ్యన్నపాత్రుడు సహజంగానే ప్రవీణ్ కుమార్ను అడపాదడపా విమర్శిస్తుండే వారు. ముఖ్యంగా విశాఖ ఉత్సవాలు, సంబరాల పేరిట కో ట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబా రా చేస్తున్నారంటూ మండిపడేవారు. ఆ కారణంగానే గడిచిన నాలుగేళ్లుగా జరిగిన విశాఖ ఉత్సవాల్లో ఏ నాడూ అయ్యన్న పా ల్గొన్న దాఖలాలు లే వు. అంతేకాదు ము ఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ మంత్రులు వచ్చినప్పుడు తప్ప జిల్లా సమీక్షలకు కూడా అయ్యన్న దూరంగానే ఉండేవారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జేసీగా ప్రవీణ్కుమార్ను జిల్లాకు గంటాయే తీసుకొచ్చారు. ఆ తర్వాత గంటా ఒత్తిడితోనే జీవీఎంసీ కమిషనర్గా, ఆ తర్వాత కలెక్టర్గా ప్రభుత్వం నియమించిందన్న వాదనలున్నాయి. దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్కుమార్కు జిల్లా స్థాయిలో వీడ్కోలు సభ శుక్రవారం సాయంత్రం దసపల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం మంత్రి గంటాయే దగ్గరుండి నడిపించారు. కలెక్టర్గా ప్రవీణ్ సేవలను మంత్రి గంటాతో సహా సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. కానీ ఈ సభకు మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మరోమంత్రి కిడారి శ్రావణ్కుమార్, అయ్యన్న అనుంగ అనుచరుడు వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అంతేనా... అంతేనా!
జాయింట్ కలెక్టర్గా రెండేళ్లు.. మహా విశాఖనగరపాలకసంస్థ కమిషనర్గా దాదాపు రెండేళ్లు.. కలెక్టర్గా సుమారు మూడేళ్లు.. సీనియర్ ఐఏఎస్ అధికారి(సెలక్షన్ గ్రేడ్ ఆఫీసర్)గా ఇక్కడి నుంచే గుర్తింపు.. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రవీణ్కుమార్ కచ్చితంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలెక్టర్గా గానీ, లేదంటే సచివాలయంలో ఏదైన కీలక ప్రభుత్వ శాఖకు కార్యదర్శిగా గానీవెళ్తారని అందరూ భావించారు. ఆయనా అదే ఆశించారు..కానీ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గాపంపడంతో అందరూ షాక్ అయ్యారు.జేసీగా, కమిషనర్గా ఎంతో మంచిపేరు పొందిన ప్రవీణ్.. కలెక్టర్ అయిన తర్వాత పచ్చ నేతల చేతిలో పావుగా మారిపోయారన్నవిమర్శలు మూటగట్టుకున్నారు. లక్షల కోట్ల భూకుంభకోణాల్లోసూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలిసినా.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళ్లిన ప్రవీణ్పై కూడా ఎన్వోసీల జారీవిషయంలో ఆరోపణలున్నాయి. ఎన్ని విమర్శలు, ఎంత అపప్రద మూటగట్టుకున్నా సీఎం చంద్రబాబు గుడ్లుక్స్లో ఉంటే చాలు.. మంత్రి లోకేష్ బాబుతో సన్నిహితంగా ఉంటే చాలు.. మంత్రులతో చెట్టాపట్టాల్ వేసుకుంటే చాలు..అన్నట్లు భావించి.. వారి పనులన్నీ చక్కబెట్టిన ప్రవీణ్కు చివరికి దక్కిందేమిటి?!తాను ఆశించిన పోస్టులు పక్కనపెడితే.. తనకంటే జూనియర్లు పనిచేసిన జిల్లాకు, మహావిశాఖ ‘నగరం’ నుంచి చిన్న పట్టణమైన ‘ఏలూరు’కు వెళ్లాల్సి వస్తోంది. ఐఏఎస్, రెవెన్యూ అధికారవర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కలెక్టర్ ప్రవీణ్కుమార్ బదిలీ వ్యవహారం ఐఏఎస్ వర్గాల్లోనే కాదు.. రెవెన్యూ వర్గాల్లోనూ చర్చకు తెరలేపింది. ఆరేళ్లకుపైగా విశాఖలోనే పాతుకుపోయిన ప్రవీణ్కుమార్ను బదిలీ చేసే క్రమంలో టీడీపీ ప్రభుత్వం మంచి పోస్టు కట్టబెడుతుందన్న వాదనలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గ నేపథ్యమూ బలంగానే కనిపించింది. 2012లో కాంగ్రెస్ హయాంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా వచ్చిన ప్రవీణ్కుమార్ తొందర్లోనే సమర్ధుడైన అధికారిగా పేరు సంపాదించారు. ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మహావిశాఖ నగర పాలకసంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. అక్కడా తనదైన ముద్ర చూపించారు. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్స్లో విశాఖను ముందువరుసలో నిలబెట్టారు. ఇక హుద్హుద్ తుఫాను సమయంలో కూడా ఆయన పనితీరు ప్రశంసలు పొందింది. ఆ తర్వాత 2016లో జిల్లా కలెక్టర్గా ఓరకంగా పదోన్నతి పొందిన ప్రవీణ్ వ్యవహారశైలిలో క్రమంగా మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు కలెక్టర్లు హడావుడి చేయడం సర్వసాధారణమే. కానీ మంత్రి లోకేష్ వచ్చినప్పుడు కూడా ప్రవీణ్ అంటిపెట్టుకునే ఉండటం, జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులతో సైతం ప్రవీణ్ ఒదిగిఒదిగి ఉండటం చూసి.. ప్రవీణ్ ‘అయ్యా ఎస్’ జాబితాలోకి వెళ్ళిపోయారన్న వాదనలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఏడాదిన్నర క్రితం బయటపడిన లక్షల కోట్ల భూ కుంభకోణాల వ్యవహారంలో ఆయన పావుగా మారిపోయారన్న వాదనలున్నాయి. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు రికార్డులు తారుమారు చేసి కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేసేస్తే.. తెలిసి కూడా ఆయన అడ్డుకోలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఇక జిల్లాలో భూ రికార్డులు తారుమారు కావడం, తప్పుడు ఎన్వోసీలు జారీచేయడం, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం వంటి వ్యవహారాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కొద్దిమంది ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ప్రవీణ్కుమార్ పేరు ఉండటం అప్పట్లో కలకలం రేపింది. పచ్చ నేతలకు ఎంత చేసినా...! ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, మంత్రుల ఒత్తిళ్ల వల్లే ప్రవీణ్ ఆ వ్యవహారాల్లో ఇరుకున్నారన్న వాదనలు సహ ఐఏఎస్ అధికారుల నుంచి, రెవెన్యూ అధికారవర్గాల నుంచి కూడా వినిపించాయి. ఇలా పచ్చనేతలకు మేలు చేసి ఎన్నో ఆరోపణలను మూటకట్టుకున్న ప్రవీణ్కు టీడీపీ ప్రభుత్వం మంచి లిఫ్ట్ ఇస్తుందన్న ప్రచారం బాగా వినిపించింది. ఆ మేరకు రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన కృష్ణా, గుంటూరుల్లో ఏదో జిల్లాకు కలెక్టర్గా నియమిస్తారని, లేదా సచివాలయంలోని కీలక విభాగంలో కార్యదర్శి హోదా ఇస్తారన్న ప్రచారం బాగా జరిగింది. ఆమేరకు సెలక్షన్ గ్రేడ్ కలెక్టర్గా పదోన్నతి రావడంతో కచ్చితంగా ఇక్కడి నుంచి మంచి పోస్టులోకే వెళ్తారన్న ప్రచారం సాగింది. కానీ ఎవరూ ఊహించని విధంగా పరస్పర బదిలీల్లా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా నియమించడం చర్చకు తెరలేపింది. పోనీ పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ జిల్లాకు సీనియర్ అధికారిగా నియమించారని అనుకున్నా.. వాస్తవానికి పోలవరం క్రెడిట్ ఇప్పటికే అక్కడి కలెక్టర్ కాటమనేని భాస్కర్కు సర్కారు కట్టబెట్టేసింది. గత నాలుగేళ్లుగా అక్కడే కలెక్టర్గా ఉన్న కాటమనేనికి పోలవరం క్రెడిట్ కట్టబెట్టిన తర్వాతే పదోన్నతిగా మహావిశాఖకు సర్కారు బదిలీ చేసింది. మరి విశాఖలో ఇంతా చేసిన ప్రవీణ్కు దక్కిందేమిటి?.. పచ్చనేతల చేతిలో పావుగా మారిన ప్రవీణ్కు మరో జిల్లా కలెక్టర్గా బదిలీ తప్ప ఒరిగిందేమిటి.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రవీణ్నూ వెంటాడుతున్నాయి. -
తల్లేమో కలెక్టర్.. కూతురేమో అంగన్వాడిలో
చెన్నై : చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవారు.. ఆఖరికి కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ టీచర్ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపుతారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే అయ్యవార్లకే తమ పనితనం మీద నమ్మకం లేనప్పుడు ఇక సాధరణ జనాలను మాత్రం అనుకోని ఏం లాభం. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి పాఠశాలలో చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వివరాలు.. శిల్పా ప్రభాకర్ సతీష్ 2009 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్ ప్లే స్కూల్కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్వాడి కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. ‘నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను. ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను. ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను’ అన్నారు. ఇక రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల గురించి మాట్లాడుతూ.. ‘తిరునల్వేలిలో వేల కొద్ది అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ మంచి అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. ఈ అంగన్వాడి సెంటర్లన్నింటిలో మంచి పరికరాలు.. ఆటవస్తువులతో పాటు పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని కూడా అందిస్తున్నారు. దాంతో నా కుమార్తెను అంగన్వాడి సెంటర్కు పంపించాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడులోని ప్రతి అంగన్వాడి టీచర్కు ఓ స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. దీనిలో ఉన్న ప్రత్యేకమైన యాప్లో అంగన్వాడి కేంద్రంలోని ప్రతి చిన్నారి ఎత్తు, బరువును నమోదు చేసి ప్రభుత్వానికి అందచేస్తారు. జాతీయ పోషకాహార కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ఫలితంగా పిల్లల ఆరోగ్యం గురించి తెలియడమే కాక మరింత మెరుగైన కార్యక్రమాల రూపకల్పన గురించి కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. -
డబుల్ వేగం పెంచాలి
పాపన్నపేట(మెదక్): మండలంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం, రాంతీర్థం, బాచారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్బెడ్రూం నిర్మాణం ప్రారంభించి నెలలు కావస్తున్న ఇంకా బేస్మెంట్ స్థాయికి కూడా చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాచారంలో నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలను అడుగగా అక్కడ నీటి సమస్య ఉండటం వల్ల నిర్మాణ పనులు కొనసాగడం లేదని ఎంపీపీ పవిత్రదుర్గయ్య తెలిపారు. పండగలను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ కార్మికులు పనిలోకి రాకుండా, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను అధిగమించి పట్టుదలతో డబుల్బెడ్రూంల నిర్మాణం పూర్తి చేయాలని అదేశించారు. అధికారులు నిరంతరం పనులు పర్యవేక్షిస్తూ.. వెంట వెంటనే తనకు రిపోర్ట్ పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గాజులగూడెంలో గొల్లకుర్మలు కలెక్టర్ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బాలాగౌడ్, శ్రీనివాస్, దుర్గయ్య, బాబాగౌడ్, ఆంటోని, సాయిరెడ్డి, పీఆర్ఈఈ వెరాంతీర్థంలో నిర్మాణ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి -
గ్రామాలను దత్తత తీసుకోండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): స్వచ్ఛ భారత్లో భాగంగా జిల్లాలో అన్ని మండలాలు, గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగాలంటే అధికారులు దత్తత తీసుకోవాలని కలెక్టర్ రోనాల్డ్రోస్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో స్వచ్ఛభారత్, హరితహారం, ఆసరా పింఛన్లు తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఎంలతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఏపీఎం, ఈసీలు పది గ్రామాల చొప్పన దత్తత తీసుకువాలని సూచించారు. యాబై శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిన గ్రామాల్లో జనవరి 31వ తేదీ వరకు, 50 శాతం కన్నా తక్కువ పూర్తయిన గ్రామాలు మార్చి 31 వరకు ఓడీఎఫ్గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతీ పాఠశాలలను కూడా సంక్రాంతి పండుగ వరకు స్వచ్ఛ విద్యాలయంగా ప్రకటించాలన్నారు. బిల్లులు చెల్లించకపోవడంపై... గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంపై ఎంపీడీఓలపై కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరి గోడలు, ఇంకుడు గుంతల నిర్మాణ వివరాలపై ఆరా తీసిన ఆయన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఈసీలు అందరూ కలిసి ప్రణాళికలు రూపొందించి çసమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనుల పురోగతిపై ప్రతీరోజూ నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి.. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి నివేదికలు అందాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థులతో మాట్లాడి మరుగుదొడ్లు లేని వారి ఇళ్లను గుర్తిస్తే నిర్మాణం సులువుగా చేపట్టవచ్చని తెలిపారు. ఇక ఈనెల 8, 9, 10వ తేదీల్లో స్వచ్ఛ గ్రహీ వర్క్షాపు నిర్వహించాలని, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే మేస్త్రీలకు శిక్షణ ఇప్పించడంతో పాటు ప్రతీ మండలం నుంచి ఐదుగురు మహిళలను గుర్తించి అవగాహన కల్పించేందుకు నియమించాలని సూచించారు. మండలాలకు సామగ్రి రెండో విడత పంచాయతీ ఎన్నికల జరిగే మండలాలకు సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయిందని చెప్పారు.అలాగే, గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ క్రాంతి, డీఎఫ్ఓ గంగారెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సోమిరెడ్డి, డీడబ్ల్యూఓ శంకరాచారితో పాటు బోజప్ప, శృతి, పవన్, రాణి తదితరులు పాల్గొన్నారు. -
‘దివ్య’మైన ఆలోచన
ఆదిలాబాద్అర్బన్: కలెక్టర్ దివ్యదేవరాజన్ పరిపాలన తీరే సెపరేటు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏ పనిలో పాలు పంచుకున్నా.. అందులోని ప్రాధాన్యతను గుర్తించి గుర్తుండి పోయేలా ముద్ర వేయడం ఆమె ప్రత్యేకత. దొరికిన ఏ కొంత సమయాన్నైనా ప్రజలకు ఉపయోగపడేలా మలచడం కలెక్టర్కు ఉన్న అలవాటు. అందులో భాగంగానే 2019లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని కలెక్టర్ కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ప్రారంభించారని చెప్పవచ్చు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వీట్లతో వచ్చి పూలబొకేలు కలెక్టర్కు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం సహజం. దీంతో అధిక ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పూలబొకేలు కొన్ని రోజులకు చెడిపోయి ఎక్కడో పడేయాల్సి వస్తోంది. బొకేల వల్ల ఉపయోగం లేక పోవడంతో ఈసారి వినూత్నంగా ఆలోచించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే ఎవరైనా సరే బొకేలకు బదులు దుప్పట్లు, బ్లాంకెట్లు, శాలువాలు, రగ్గులు తీసుకురావాలన్నారు. పేదలకు అవి పంపిణీ చేసేందుకు ఉపయోగపడుతాయనేది కలెక్టర్ ఉద్దేశం. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివ్యదేవరాజన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు శాలువాలు, రగ్గులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాటిని వెనుకబడిన ప్రాంతాల్లోని పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
‘భగీరథ’ ఎందాకా..?!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులపై ఒత్తిడి పెరిగింది. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకుండా ఓట్లడగమని చెప్పినా.. ముందస్తు ఎన్నికలతో ఆ గడువు కాస్తా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి అన్ని అవాసాల్లోని ఇంటింటికి నల్లాల ద్వారా నీరివ్వాలనేది తాజా లక్ష్యం. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం వచ్చే జనవరి 5 వరకే ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ పథకం ప్రగతిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె తక్షణమే పనులు పూర్తి చేయాలని ఆదేశించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లోని 494 హాబిటేషన్లకు చెందిన సుమారు 8.50లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పనులను చేపట్టారు. 2017 డిసెంబర్ నాటికి జిల్లా వాసులకు ఇంటింటికి నల్లానీరు అందివ్వాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి కె.తారకరామారావు మిషన్ భగీరథ పనులకు జిల్లాలో అంకురార్పణ చేశారు. లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) నుంచి మిషన్ భగీరథలో తాగునీటికి వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికి మొత్తంగా చూసుకుంటే 84 శాతం పనులు పూర్తయినట్లు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. మిషన్ భగీరథ పనులు గతేడాది డిసెంబర్ వరకు పూర్తి కావాల్సి ఉన్నా.. పెంచిన గడువు ప్రకారం గడిచిన మార్చిలో ఇంటింటికి నల్లానీరు ఇవ్వాల్సి ఉంది. అది కూడా సాధ్యం కాకపోవడంతో ఇటీవలే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పనులు వచ్చే జనవరి నాటికి పూర్తయి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు వేగిరపడుతున్నా.. ఆ స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 494 హాబిటేషన్లకు బల్క్ వాటర్ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసినా... 385 హాబిటేషన్లకే ప్రస్తుతం సరఫరా అవుతోంది. ఇంటింటికి నల్లా కనెక్షన్లు 74.49 శాతంగా పేర్కొన్న అధికారులు 95.24 శాతం పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం 1750.22 కిలోమీటర్లకు గాను 1666.93 కిలోమీటర్లు వేశారు. 1,74,657 ఇండ్లకు నల్లా కనెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా, పూర్తి స్థాయిలో 1,73,752 గృహాలకు ఇచ్చినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. అయితే ఓవర్హెడ్ వాటర్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్)ల నిర్మాణమే అసలు సమస్యగా కనిపిస్తోంది. మొత్తం 380 ఓహెచ్ఎస్ఆర్లకు 257 మాత్రమే పూర్తయ్యాయి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (డబ్ల్యూటీపీ), రా వాటర్ పైపులైన్లు, జీఎల్బీఆర్, సంపులు, కెమికల్ హౌజ్, ఫిల్టర్ హౌజ్, క్లోరినేషన్ హౌజ్, రా వాటర్ ఛానల్లు పూర్తిస్థాయిలో వాడకంలోకి తేవాల్సి ఉంది. వీటన్నింటిని చేసేందుకు అధికారులు కాంట్రాక్టు సంస్థలను తొందరపెడుతున్నా... ఆశించిన మేరకు వేగం అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 5 నాటికి అన్ని ఇండ్లకు నల్లానీరు సాధ్యమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేగవంతంగా పూర్తి చేయాలి – స్మితా సభర్వాల్ మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లంపల్లి, వరదకాలువ పనుల భూసేకరణ, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్షించారు. మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 2019 జనవరి 5వ తేదీ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లో మిషన్ భగీరథ పనులపై కలెక్టర్లు దృష్టి సారించాలని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని సూచించారు. ఇరిగేషన్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ పనులు నిలిచిపోవడం వల్ల మున్సిపల్కు నీరందంచిలేక పోతున్నారని, ఫిల్టర్ బెడ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్, వరద కాలువ పనులపై దృష్టిసారించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ శ్రీకాంత్రావు, మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, వరదకాలువ సీఈ అనిల్కుమార్, ఇరిగేషన్ శాఖల ఇంజనీర్లు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు రుణాలు
మెదక్ అర్బన్: బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమావేశంలో నిర్దేశించిన రుణాలను మంజూరు చేయాలని సూచిస్తున్నా బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బ్యాంకు నెలలో కనీసం ఐదుగురు లబ్ధిదారులకు ముద్ర రుణాలను తప్పకుండా మంజూరు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు బ్యాంకు ఆ దిశగా మంజూరు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేసినా ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు గ్రౌండింగ్ చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. గ్రౌండింగ్ అయిన వాటి రుణాలకు సంబంధించి త్వరగా యూసీలను అందజేయాలన్నారు. పెండింగ్లో ఉన్న రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల వారీగా పెండింగ్లో ఉన్న ముద్ర, స్టాండప్, పీఎంఈజీపీతో పాటు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామిక రంగంలో ఆసక్తి ఉన్న వారికి టీ ప్రైడ్, స్టాండప్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసేందుకు బ్యాంకర్ల సహకారం తప్పనిసరి అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తులు అందిన వెంటనే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. నా బార్డు ద్వారా ప్రత్యేక రుణాలు.. 2019–20 సంవత్సరానికి గాను నాబార్డు ద్వారా రూ.2,091.94 కోట్లతో రూపొందించిన రుణ ప్రణాళికను కలెక్టర్ «ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాల కల్పన కింద డెయిరీ, మేకలు, గొర్రెలు, గేదెలు, వ్యవసాయ పనిముట్లు, భూమిని అభివృద్ధి చేసుకునేందుకు, గోడౌన్ల నిర్మాణాలకు రుణ సదుపాయాలను కల్పించనున్నట్లు నాబార్డు అధికారి తిమోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీతారామరావు, ఎల్డీఎం నాగరాజు, జీఎం డీఐసీ రత్నాకర్, కార్పొరేషన్ అధికారులు దేవయ్య, సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పని చేయకపోతే సెలవుపై వెళ్లండి!
శ్రీకాకుళం పాతబస్టాండ్:కాలం గడుస్తున్నా ప్రగతి కనిపించడం లేదు.. సమావేశాలకు సైతం ఆలస్యంగా వస్తున్నారు.. పని చేయాలని ఇష్టంలేకపోతే సెలవుపై వెళ్లిపోండి.. కొత్తగా వచ్చేవారైనా పనులను పూర్తి చేస్తారని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి పలు శాఖల అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. జిల్లాలోని పలు విభాగాల్లో పనుల ప్రగతి లేదని, గత నెలకు ఈ నెలకు ఏమాత్రం మెరుగుదల కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ప్రగతిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో కథలు చెప్పవద్దని, ఇప్పటికే పలుమార్లు కథలు వింటూ వస్తున్నానని.. ఇక నుంచి వినేది లేదన్నారు. ప్రధానంగా పీఆర్ ఇంజినీరింగ్, డీఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, ఐటీడీఎస్, విద్యాశాఖ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈనెల 29న అమరావతిలో కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని శాఖల వారీగా ప్రగతిపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం బుధవారం తన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి కొంతమంది అధికారులు ఆలస్యంగా రావడాన్ని గమనించిన కలెక్టర్ సమావేశానికి బొట్టుపెట్టి పిలవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్నంవెనుకబడి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి.. పగలు కష్టపడి, పనులకు కావాల్సిన అనుమతులు ఇస్తుంటే ఎందుకు పని చేయడంలేదని అధికారులను ప్రశ్నించారు. చాల శాఖలకు పనులు సజావుగా జరిగేందుకు వీలుగా అడ్వాన్సు కూడా ఇచ్చామని, అయినా పనులు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అధికారులు సమావేశాలకు సమాచారం లేకండా వస్తున్నారని, ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిత్లీ తుపానుకు సంబంధించిన బిల్లులు సైతం కొంతమంది అధికారులు దొంగ బిల్లులు కొన్ని మండలాల్లో పెడుతున్నారన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో ఏడాదిగా జిల్లా వెనుకబడి ఉందని, ప్రతి నెలా వెనుకబాటు తనానికి కారణమేమిటని ఆయన డీఆర్డీఏ పీడీని ప్రశ్నించారు. ఇక నుంచి సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభా గం ఇంజినీరు తీరుపై మండి పడ్డారు. రన్నింగ్ వాటర్ సప్లై, మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి నెలరోజులుగా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదన్నారు. అడ్వాన్సులు ఇచ్చినా పనులు చేయడం లేదన్నారు. పాఠశాలలకు, అంగన్వాడీ భవనాలకు ఇంతవరకు ఎందుకు రన్నింగ్వాటర్ను సరఫరా చేయలేదని సంబంధితశాఖ ఈఈని కలెక్టర్ నిలదీశారు. అంగన్వాడీ భవనాల్లో సమస్యలుంటే తనకు ఎందుకు చెప్పడం లేదని, పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదని ఐటీడీఎస్ అధికారులను ప్రశ్నించారు. అన్ని శాఖల్లోనూ ఇంజినీరింగ్ విభాగాలు అధ్వానంగా ఉన్నాయని, ప్రగతి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. తీరు మారాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఒకే పనిని పదేపదే చెప్పించుకోవడం సరికాదన్నారు. ఆదరణ పథకానికి సంబంధించిన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని, మండలాభివృద్ధి అధికారులు, ప్రత్యేకాధికారుల దగ్గర జాప్యం జరుగుతోందన్నార. మీ లాగెన్లో ఎందుకు అన్ని రోజులు ఉంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఎప్పు డు వచ్చిన దరఖాస్తులను అప్పుడే పంపించాలన్నారు. మేదరి, రజక, కల్లుగీత తదితర వర్గాలకు నేరుగా రూ. పది వేలు వంతున చెక్కులు చెల్లించాల్సి ఉండగా.. ఇందులో ఎంపీడీవోల జాప్యం ఉందన్నారు. ఉపాధి హమీ నిధులతో సంబంధం ఉన్న వివిధ శాఖల పనులు వేగవంతం చేయాలని, నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే నష్టం జరుగుతోందని కలెక్టర్ ధనంజయరె డ్డి అన్నారు. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, జేసీ–2 పి రజనీకాంతరావు, డీఆర్డీఏ పీడీ జి.సి.కిశోర్కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగేంద్ర ప్రసాద్, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, జెడ్పీ సీఈవో బి. నగేష్, ఆర్డీవోలు ఎం.వి.రమణ, ఎస్.వెంకటేశ్వర్లు, ఆర్. గున్నయ్య పాల్గొన్నారు. -
జోరుగా ఇసుక దందా
ఆదిలాబాద్రూరల్: జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. జీవనదుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో తరలివెళ్తోంది. గత రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగడంతో ఆయా వాగుల్లో ఇసుక వచ్చి చేరింది. దీంతో పలు వాగుల నుంచి అక్రమార్కులు ఇసుకను తవ్వి తీసుకెళ్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని లాండసాంగ్వి, అర్లి (బి), శివారు ప్రాంతాంలోని సాత్నాల వాగు, చాందా (టి), భీంసరితో పాటు జైనథ్ మండలంలోని తరోడ, పూసాయి, బేల మండలంలోని పెన్గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో కేవలం వర్షాకాలంలో మాత్రమే వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తుండడంతో క్రమేపీ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంటోంది. గత కొన్నేళ్లుగా నాన్స్టాఫ్గా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగు నీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుక తోడేస్తున్నారు. అలాగే దాడుల సమయంలో ఉదాహరణకు పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంత మాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక రవాణా సాగుతున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. గుంతలమయంగా మారుతున్న రోడ్లు ఆయా ప్రాంతాల నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుండడంతో ట్రాక్టర్లతో రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయకూడదని వాగుల సమీపంలోని పొలాలు ఉన్న రైతులు చెబుతున్న వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొంత మందైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయల్టీ రూపంలో ఒక్కొ ట్రాక్టర్కు రూ. 400 నుంచి రూ.500 వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కొంత మంది ఇసుక వ్యాపారులు లక్షలాది రూపాయలకు టెండర్లను దక్కించుకొని మరో రూపంలో రాయల్టీలు వసూలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వ పనుల పేరుతో.. ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది వ్యాపారులు ప్రైవేట్ వారికి ఇసుకను అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా దీంతో వ్యాపారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా శాఖల అధికారుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉం డడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. నీరుగారుతున్న వాల్టా చట్టం భూగర్భ జల వనరుల సంరక్షణకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలు నీరుగారుతోంది. వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం మినహా మరే ఇతర చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగుతున్న పట్టించుకుంటున్న పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు వేలు అన్న చందంగా సాగుతోంది. కేసులు నమోదు చేయాలని ఆదేశించాం జిల్లాలో ఆయా ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చాం. అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. – సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్, ఆదిలాబాద్ -
కలెక్టర్ వాహనం జప్తునకు కోర్టు ఆదేశం
ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా పాతికేళ్లుగా పరిహారం కోసం బాధితులు పోరాడుతు న్నారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి తగిన పరిహారం ఇవ్వాలంటూ ఏళ్లుగా వేడుకుం టున్నారు. పరిహారం కోసం తొలుత కార్యాలయాల చుట్టూ తిరిగిన చాలా మంది కాలం చేశారు. కానీ ఇప్పటికీ ఆ కుటుంబాలకు పరిహారం అందనే లేదు. రెవెన్యూ విభాగంలో అంతులేని నిర్లక్ష్యంపై కోర్టు పలుమార్లు మెట్టికాయలు వేసింది. అయినా స్పందన రావడం లేదు. చివరికి కలెక్టర్ వాహనం జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోగా వాహనాన్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సాక్షి, పెద్దపల్లి: రామగుండం మండలం జనగామ శివారులో 1994లో వాటర్ట్యాంక్ నిర్మించారు. సర్వేనంబర్ 599లో ఎకరా పది గుంటల భూమిని వాటర్ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం నిర్ణయించింది. అయితే ఆ పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదంటూ గౌసియా బేగం తదితర కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. ఇందుకు స్పందించిన కోర్టు ఎకరాకు రూ.3.50లక్షల చొప్పున చెల్లించాలంటూ 2012 జూలై 31న తీర్పునిచ్చింది. అన్ని లెక్కలు కలిపి మొత్తం రూ.31లక్షల 24వేల 968 పరిహారం కింద చెల్లించాలని పెద్దపల్లి కోర్టు తేల్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎ లాంటి చెల్లింపులు జరపలేదు. సంవత్సరాలు గడుస్తున్నా సమస్య కొలిక్కిరాలేదు. తమకు రావాల్సిన పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశం పరిహారం కోసం పోరాటం చేస్తున్న బాధిత కుటుంబాలకు కోర్టు బాసటగా నిలిచింది. మొ త్తం రూ.31,24,968 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంపై రెవెన్యూ అధికారులు అదే రీతిన నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లా కలెక్టర్ వాహనం జప్తు చేయాలంటూ పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. వరుస సెలవులు రావడంతో ఈనెల 28లోగా కలెక్టర్ వాహ నం జప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఆ లోగా నే డబ్బులు చెల్లించి, వ్యవహారం కలెక్టర్ వాహ నం జప్తు కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం లోని సామగ్రిని జప్తు చేయాలని కోర్టు 2016లో ఆదేశించింది. దీంతో కార్యాలయంలోని కంప్యూటర్, బీరువాలు, టేబుళ్లను బాధితులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేలం వేయాల్సి ఉండగా, రూ.84,500 చెల్లించి ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేసింది. సామగ్రి విలువ ప్రకారం చెల్లించి న, పరిహారం మాత్రం పూర్తిగా దక్కలేదు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఏకంగా కలెక్టర్ వాహనాన్ని పరిహారం కింద జప్తు చేయాలని కో ర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. కాగా పాతికేళ్లుగా పరిహారం ఇవ్వకుండా తమను మా నసికంగా వేధిస్తున్నారని, ఇప్పటికైన పూర్తి పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకొంటున్నారు. జప్తు కానివ్వం కలెక్టర్ వాహనం జప్తు కావట్లేదు. మేమున్నంత వరకు జప్తు కానివ్వం. ప్రజా ఆరోగ్యశాఖ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మున్సిపల్ (ప్రజా ఆరోగ్యశాఖ) నుంచి రూ.10 లక్షల చెక్ను కోర్టుకు పంపిస్తున్నాం. ఏ వాహనం కూడా జప్తు కాదు.–పుప్పాల హన్మంతరావు, తహసీల్దార్, రామగుండం -
మార్చిలో అందుబాటులోకి!
తుక్కుగూడ: కలెక్టరేట్ భవనంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పరిపాలన భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం మూడంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తుండగా అందులో మూడింటికీ స్లాబ్ పనులు పూర్తయ్యాయి. కలెక్టరేట్లో అంతర్భాగంగా ఉండే వివిధ శాఖల భవనాల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించి 14 నెలలు అయింది. ఇంకా గోడల నిర్మాణాలు, ఫ్లోరింగ్, టైల్స్, విద్యుత్, డ్రైనేజీ తదితర పనులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చిలోపు భవనం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. భవనం పూర్తి కాగానే ఇక్కడి నుంచే జిల్లా పరిపాలన సాగనుంది. తీరనున్న కష్టాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్ లక్డీకపూల్లోని కలెక్టరేట్ నుంచి పరిపాలన కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ఈక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కొంగరకలాన్లో కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం ఎంపిక చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కలెక్టరేట్కు ప్రభుత్వం కేటాయించిన భూములకు అధికారులు ఇప్పటికే రక్షణ వలయాలను ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ నుంచి కలెక్టరేట్కు చేరుకునేందుకు నాలుగు లేన్ల (100) ఫీట్ల బీటీ రోడ్డును ఆర్ఆండ్బీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రోడ్డుకు మధ్యలో డివైడర్లను నిర్మించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరు వైపులా హరితహారంలో భాగంగా వివిధ రకాల మొక్కులను కూడా పెంచుతున్నారు. -
తుపానుపై భయాందోళన వద్దు
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: తుపానుకు సంబంధించి అవసరమైన అన్ని ముం దస్తు చర్యలూ తీసుకున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో ఏ ర్పాటు చేసిన కాకినాడ, అమలాపురం తుపాను కంట్రోల్ విభాగంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ♦ కోస్తా ప్రాంతంలోని 17 మండలాల్లో 295 గ్రామాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉంది. ♦ తుపాను సమయంలో నష్టపోయే 77 రోడ్లు గుర్తించాం. వీటిలో కోస్తాలో 44, సమీప ప్రాంతాల్లో 33 ఉన్నాయి. ఈ రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించాం. ఎక్కడైనా చెట్లు నేలకొరిగితే వాటిని తొలగించి రహదారిని క్లియర్ చేసేందుకు వీలుగా జేసీబీలను, కూలీలను సిద్ధం చేశాం. ఇందుకోసం ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అధికారుల బృందాన్ని నియమించాం. ♦ తుపాను సహాయక చర్యల కోసం 14 మంది డీఈలు, 33 మంది ఏఈలు, 96 మంది అగ్నిమాపక సిబ్బంది, ఏడు జేసీబీలు, 10 వేల లీటర్ల డీజల్ సిద్ధం చేశాం. ♦ కోస్తా ప్రాంతంలోని 57 మంచినీటి పథకాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేశాం. ♦ 26 విద్యుత్ సబ్ స్టేషన్ల (33/11 కేవీ) వద్ద సిబ్బందిని, జేసీబీలను సిద్ధంగా ఉంచాం. ♦ కాకినాడ – తుని మధ్య అత్యవసర పనుల కోసం 4 వేల విద్యుత్తు స్తంభాలు సిద్ధం చేశాం. ♦ జిల్లాలోని 500 సెల్ టవర్ల పనితీరుకు ఆటంకం లేకుండా అవసరమైన జనరేటర్లు, ఇంధనం, సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ♦ 283 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. 61 తుపాను షెల్టర్లు సిద్ధం చేశాం. సహాయ శిబిరాల్లో బాధితులకు అందించడానికి 3 వేల దుప్పట్లు, 770 రెయిన్ కోట్లు సమకూర్చాం. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీకి 1664 మంది వంట సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ♦ సహాయ శిబిరాల కోసం 60 వాహనాలు, రోడ్లపై ఆటంకాలను తొలగించడానికి 200 తుపాను పవర్ బ్లేడులు సిద్ధం చేశాం. ♦ సముద్రంలో వేటకు వెళ్లిన రెండు మత్స్యకార పడవల్లో ఏడుగురితో కూడిన ఒక పడవను సమీపంలోని ఓఎన్జీసీ రిగ్ వద్దకు తరలించాం. కొత్తపాలేనికి చెందిన పడవను ఓడలరేవులో గుర్తించాం. ♦ అమలాపురం, కాకినాడల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాం. -
ప్రద్యుమ్ను..డు
చిత్తూరు కలెక్టరేట్: చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తారు... విధుల్లో అలసత్వం వహిస్తే సహించరు.. ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు..సొంతంగా ఆలోచించడం.. పట్టుదలగా పూర్తి చేయడం నైజం. ఆయనే కలెక్టర్ పాలేగార్ శ్రీనివాస్ ప్రద్యుమ్న. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామంలో డాక్టర్ శ్రీనివాస్, సుజాత దంపతుల పెద్ద కుమారుడు. డాక్టర్ కుటుంబంలో పుట్టిన ఆయన పీజీ తర్వాత సివిల్స్ పూర్తి చేశారు. తండ్రి డాక్టర్ శ్రీనివాస్ కల నెరవేర్చేందుకు ఐఏఎస్ అయ్యారు. 2011లో చిత్తూరు జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కలెక్టర్గా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్) దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా ఓ భారీ క్రతువు నిర్వహించారు. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, అది ఓ బాధ్యత అని అంటున్న కలెక్టర్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్య.. సాక్షి :మీ కుటుంబ నేపథ్యం..? కలెక్టర్ :మాది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని గొప్పెనహల్లి చిన్నపల్లె గ్రామం. నా తండ్రి డాక్టర్ శ్రీనివాస్, తల్లి సుజాత గృహిణి. మేము ఇద్దరం. నేను ఇంటికి పెద్ద కుమారుడిని. తమ్ముడు అనూ మ. నా తండ్రి మైసూర్, బెంగళూరులలో డీఎంఅండ్హెచ్ఓ, జాయింట్ డైరెక్టర్గా పనిచేసి రిటైరయ్యారు. 2007లో వివాహం చేసుకున్నాను. భార్య శిల్ప, కూతురు అవ్యక్త, కుమారుడు విక్రమాదిత్య. సాక్షి : ఐఏఎస్ వైపు అడుగులు ఎలా పడ్డాయి....? కలెక్టర్ : నాన్న నన్ను సివిల్స్ సాధించాలని చిన్నతనం నుంచి చెప్పేవారు. నేను 5వ తరగతి చదివేటప్పుడే ఐఏఎస్పై గురిపెట్టించారు. పీజీ అవ్వగానే సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మెయిన్స్కు ఢిల్లీలో కేవలం రెండు నెలలు మాత్రమే శిక్షణ తీసుకున్నా. మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. అంతటితో నా ఆశయాన్ని వదులుకోకుండా మళ్లీ సివిల్స్ రాశాను. ఆ తర్వాత ఐఏఎస్కు ఎంపికై నా కలను నెరవేర్చుకున్నాను. సాక్షి :జిల్లాలో మీ అనుభవాలు, విజయాలు, లక్ష్యాలు...? కలెక్టర్ :నేను చిత్తూరులో జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పుడే పూర్తిగా అవగాహన ఉంది. జిల్లాలో ఎక్కువగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాను. ఎవ్వరూ చేయలేని విధంగా నేషనల్ హైవేలు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం, ఓడీఎఫ్, ప్రకృతి వ్యవసాయం లాంటి కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయి. సాక్షి :కరువును అధిగమించడానికి చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలు..? కలెక్టర్ : జిల్లాలో కరువు ఉన్న మాట వాస్తవమే. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కరువు ఏర్పడింది. ఇప్పటికే అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటించాం. సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు ఉలవలు ఉచితంగా పంపిణీ చేశాం. తలసరి ఆదాయం తగ్గకుండా చర్యలు చేపడుతున్నాం. సాక్షి : ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.. కారణం..? కలెక్టర్ :ప్రస్తుతం ఏ అలవాటూ లేని వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. కారణం నాణ్య మైన ఆహారం తీసుకోకపోవడమే. అందుకోసం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాం. ప్రకృతి వ్యవసాయంలో చిత్తూరు 1.30 లక్షల హెక్టార్లలో సాగుచేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి : కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు చేరడం లేదు... అందుకు మీరు తీసుకుంటున్న చర్యలు..? కలెక్టర్ :కార్పొరేషన్ రుణాలు గతంలో సరిగా మంజూరు చేయకపోవడం వల్ల సమస్యలు ఉండేవి. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులందరికీ రుణాలు అందేలా తరచూ బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నాం. సహకరించని బ్యాంకులపై చర్యలకూ సిద్ధమవుతున్నాం. సాక్షి :అమృత్ పథకం నిధులు మురిగిపోతున్నాయని తెలిసింది.. ఎందువల్ల....? కలెక్టర్ :అమృత్ పథకంలో ఎంపికైన మున్సిపాలిటీలకు నిధులు వచ్చాయి. ఆ నిధులను ఎక్కువగా తాగునీటి సమస్య పరిష్కారానికి వాడుతున్నాం. చిత్తూరు కార్పొరేషన్కు మంజూరైన రూ.250 కోట్లు తాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయి. సాక్షి : త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.. మీరు అమలు చేస్తున్న ప్రణాళిక...? కలెక్టర్ : పేదరికం నుంచి బయటపడాలంటే విద్య వల్లే సాధ్యపడుతుంది. కాపీకొట్టి మార్కులు సాధిస్తే ఫలితం ఉండదు. అందుకోసం ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇప్పటికే తిరుపతి పరిధిలో పదో తరగతి విద్యార్థులకు సూపర్ 60 కార్యక్రమాన్ని ప్రారంభించాం. సాక్షి : పెద్ద పరిశ్రమల స్థాపన అనుకున్న స్థాయిలో జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఏమంటారు? కలెక్టర్ : పెద్ద పరిశ్రమల స్థాపనకు సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎంవోయూలు ఇచ్చాం. త్వరలో స్మాల్గ్రూప్ బిజినెస్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. గృహిణులకు స్మాల్గ్రూప్ బిజినెస్ ద్వారా రుణాలు అందజేసి, ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళుతున్నాం. సాక్షి : ఓడీఎఫ్లో జిల్లాను దేశస్థాయిలో నిలిపేందు కు మీరు చేసిన కృషి...? కలెక్టర్ : మరుగుదొడ్ల నిర్మాణంలో నెలకొల్పిన రికార్డును ఎవరూ అధిగమించలేరు. ఓడీఎఫ్లో చిత్తూరును దేశంలో ప్రథమస్థానంలో నిలపడానికి జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు. ఆత్మగౌరవం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు. సాక్షి :అభివృద్ధిని వేగవంతం చేయడానికి మీరు తీసుకున్న చర్యలు...? కలెక్టర్ :మొదట్లో జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించాం. ఇంజినీర్లు కష్టమని చెప్పినా ప్రస్తుతం 800 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఇది రికార్డే. పెద్ద జిల్లా కావడంతో పనులు చేయడానికి అవకాశముంది. వేరే జిల్లాలో ఈ స్థాయిలో పనులు చేయాలనుకుంటే కుదరదు. సాక్షి :మీ సతీమణి అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీని వెనుక మీ కృషి ఏమైనా ఉందా...? కలెక్టర్ : సమాజ సేవంటే మక్కువ కావడంతో ఆమె అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుంది. సొంత డబ్బు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది ఇటీవల నన్ను› కలిశారు. అంగన్వాడీల అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. 2019 మార్చి నాటికి పౌష్టికాహార లోపం లేని జిల్లాగా తయా రు చేసేలా ఆశయం పెట్టుకున్నాం. -
ఓటరు జాబితా సిద్ధం చేయాలి
జగిత్యాల: గ్రామపంచాయతీల్లో ఓటరు జాబి తాను తయారు చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్స్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని జాబితాలో లేని వారి పేర్లను సిద్ధం చేసుకొని ఇంటింటికీ వెళ్లి సరిచూసుకోవాలని సూచించారు. నేషనల్ రివ్యూ కమిటీ వస్తుందని.. బీసీ ఓటరు లిస్ట్ను తయారుచేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్లో భాగంగా ని ర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలన్నా రు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయి ంచాలని సూచించారు. గ్రామపంచాయతీ సెక్రటరీ, ఏపీడీ, ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు పరిశీలించి అర్హులకే అందజేయాలన్నారు. గ్రామపంచాయతీలకు ఎల్ఈడీ లైట్లు, తడి, పొడి చెత్త డబ్బాలు వస్తాయని, సరిపోకపోతే మళ్లీ పంపిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ, అటవీ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలి గొర్రెలు, పాడిపశువుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. తన కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీపై సమీక్షించారు. పాడి పశువులు 15,412కు ఇప్పటి వరకు 1333 పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్, విజయ డెయిరీల లబ్ధిదారుల వాటాను డీడీల రూపంలో త్వరగా చెల్లించాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ లక్ష్యం 10,510 యూనిట్లు కాగా ఇప్పటి వరకు 4629 యూనిట్లు సరఫరా చేసినట్లు తెలిపారు. చనిపోయిన గొర్రెలకు సంబ ంధించి 3,209 గొర్రెలకు ఇన్సూరెన్స్ మంజూరుకాగా 1,745 గొర్రెల లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా పశువైద్యాధికారి అశోక్రాజు, సహాయ సంచాలకులు శ్రీధర్ పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తీర్ణతశాతం పెరగాలి జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. విద్యాశాఖ అధికారుల సమీక్షలో భాగంగా మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ పోస్టులలో విద్యావలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ప్రతీ సబ్జెక్ట్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇచ్చేందుకు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.100 తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు గ్రామస్థాయిలో ఓ గ్రూప్, వాడస్థాయిలో మరో గ్రూప్ పెట్టాలని సూచించారు. సబ్జెక్ట్లవారీగా ఉపాధ్యాయులు నోట్స్ తయారుచేసి పిల్లలకు అందివ్వాలన్నారు. డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
ముంచుకొస్తోంది
నెల్లూరు(పొగతోట): జిల్లాకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి చెన్నైకు ఆగ్నేయంగా 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలో మీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. తీవ్ర వాయుగుండం మరింత బలపడి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తుపాను క్రమంగా బలపడి నెల్లూరు–చెన్నైల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడు రోజుల తర్వాత తుపాను చెన్నైకు సమీపించే అవకాశాలుఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను కోస్తా జిల్లాలోపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం తుపానుగా మారిన తర్వాత 100 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది. తుపాను ప్రభావంతో ఈ నెల 14వ తేదీ రాత్రి నుంచి 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో తుపాను పరిస్థితిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం వల్ల ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, కావలి డివిజన్లపై తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు వెంటనే ఏర్పాటు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. తీరప్రాంత మండలాలు, లోతట్టు ప్రాంతాల మండలాలకు ప్రత్యేక అధికారులు, బృందాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో పర్యటించాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చెట్లు నేల కూలితే వాటిని తొలగించే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జనరేటర్లు, పడవలు, జేసీబీలు, అవసరమైన వాటితో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, మంచి నీరు, పాలు, కూరగాయలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎటువంటి విపత్తు సంభవించిన సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ కె.వెట్రిసెల్వి, గూడూరు, కావలి సబ్ కలెక్టర్లు ఓ. ఆనంద్, శ్రీధర్, డీఆర్ఓ ఎస్వీ నాగేశ్వరరావు, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ సదా భార్గవి, నెల్లూరు, ఆత్మకూరు, నాయుడుపేట ఆర్డీఓలు చిన్నికృష్ణ, సువర్ణమ్మ, శ్రీదేవి, ఏఎస్పీ పరమేశ్వర్రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, డ్వామా పీడీ బాపిరెడ్డి, డీఎస్ఓ చిట్టిబాబు, డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వరసుందరం, ఇరిగేషన్ ఎస్ఈ ప్రసాద్రావు, డీటీసీ శివరామ్ప్రసాద్, విద్యుత్ శాఖ సీఈ విజయ్కుమార్రెడ్డి, పీఆర్ ఎస్ఈ నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
పేదవాడి ఆకలే.. నాతో క్యాంటీన్ పెట్టించింది
విజయనగరం కొత్తవలసరూరల్: గ్రీవెన్స్సెల్లో భాగంగా ఓ సోమవారం అర్జీలు స్వీకరించి బయటకు వస్తున్న నాకు కొమరాడకు చెందిన ఓ పెద్దాయన మెట్లముందు కూర్చుని ఆలోచించడం గమనించాను..ఉదయం అర్జీ ఇచ్చి ఇప్పటివరకు ఎందుకు ఇక్కడ ఉన్నావని అడగ్గా భోజనం చేస్తే ఇంటికి వెళ్లడానికి డబ్బులు చాలవని వృద్ధుడు చెప్పడంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇకపై గ్రీవెన్స్సెల్కు వచ్చిన వారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే క్యాంటీన్ పెట్టించానని కలెక్టర్ హరి జవహర్లాల్ ఆనాటి సంఘటనకు సంబంధించి మంగళపాలెం గురుదేవా చారిటబుల్ ట్రస్టులో దివ్యాంగులతో తన మనోభావాలు పంచుకున్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను ఆదివారం ఆయన సందర్శించి దివ్యాంగులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ నిర్వహణకు ఓ అధికారి రూ. 20 వేలు ఇచ్చారని తెలిపారు. అలాగే అధికారులు, స్నేహితులు కూడా విరాళాలు ఇస్తుండడంతో క్యాంటీన్ నిర్వహణ కొనసాగుతోందని చెప్పారు. తన బంగ్లాలో పండిన కూరగాయలనే క్యాంటీన్ యజమానికి ఇవ్వడంతో తక్కువ ధరకే భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని మంగళపాలెం మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సేవలు విలువకట్టలేం.. ఫలితం ఆశించకుండా దివ్యాంగులకు చేసే సేవలకు విలువ కట్టలేమని కలెక్టర్ హరి జవహర్లాల్ అన్నారు. గురుదేవా చారిటబుల్ ట్రస్ట్లో పలువురు దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు టీటీడీ శ్వేత ప్రాజెక్ట్ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ ఎన్. ముక్తేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ట్రస్టు వ్యవస్థాపకుడు రాపర్తి జగదీష్బాబు అవయవ తయారీలో ఉన్న ఇబ్బందులు, పంపిణీ, తదితర అంశాలను వివరించారు. 13 జిల్లాల్లో ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కృత్రిమ అవయవాల తయారీకీ భారీగా ఖర్చు అవుతున్నప్పటికీ ప్రముఖ కంపెనీలు, అధికారులు ఆర్థిక సహాయంతో ఉచితంగా అవయవాలు పంపిణీచేస్తున్నట్లు జగదీష్బాబు తెలిపారు. అనంతరం సభాద్యక్షుడు శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో కలెక్టర్ హరి జవహర్లాల్ మాట్లాడుతూ, గతంలో తాను అనంతపురం కలెక్టర్గా పనిచేసినపుడు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేదని, ఆయా కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనేవాడినని చెప్పారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు తెలుసుకునే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. శ్వేత ప్రాజెక్ట్ డైరెక్టర్ ముక్తేశ్వర్ మాట్లాడుతూ, దయాగుణం.. సేవాగుణం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ఇంతమందికి కృత్రిమ అవయవాలు పంపిణీ చేసి దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగదీష్బాబును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శంకరనారాయణ, తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
కొణిజర్ల: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 11వ తేదీన ఉంటుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ తెలిపారు. కొణిజర్ల మండలం తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను, కౌంటింగ్ కేంద్రానికి పాలేరు, మధిర నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు రావడంతో వాటిని భద్రపరిచే విధానాన్ని, కౌంటింగ్ చేపట్టే గదులను పరిశీలించారు. ఇంకా మిగిలిపోయిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 86 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పాలేరు, ఖమ్మం, వైరా, మధి ర, సత్తుపల్లి నియోజకవర్గాల లెక్కింపును విజయ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడం చెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. మొదట సెంట్రల్ రిజర్వ్ పోలీసు లు బయట పహారా కాస్తున్నట్లు తెలిపారు. మధ్య లో ఏఆర్ పోలీసులు, చివరగా స్థానిక పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు. వ్యవస్థ అంతా పారదర్శకంగా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి.. నిఘా కట్టు దిట్టం చేశామన్నారు. ఆది, సోమవారాల్లో వివిధ పార్టీల నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన టీవీ తెరలపై స్ట్రాంగ్ రూమ్ల విధానం, కౌంటింగ్ హాల్ను పరిశీలించవచ్చన్నా రు. ఉదయం 8 నుంచి సాయం త్రం 6 గంటల వరకు అభ్యర్థులు అక్కడే ఉండి.. పరిశీలించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల ప్రత్యేక పరిశీలకులు నిత్యం లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఈనెల 11న ఉద యం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపు మొదలుపెడతారని ఆయన వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ, వైరా ఏసీపీ డి.ప్రసన్నకుమార్, సీఐ ఏ.రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలు: తకలెక్టర్ రామ్మోహన్ రావు
సాక్షి, (నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్లు, ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ బాలుర, బాలికల కళాశాలలో, ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచారు. బాలుర కళాశాలలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాలికల కళాశాలలో బోధన్, బాన్సువాడ, ఇండోర్ స్టేడియం భవనంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్ వేశారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సాధారణ ఎన్నికల పరిశీలకులు ధీరజ్ కుమార్, సౌరబ్రాజ్, దేవేశ్ దేవల్, పోలీస్ కమిషనర్ కా ర్తికేయ, రిటర్నింగ్ అధికారి వీటిని శనివారం పర్యవేక్షించారు. ఇదే భవనాల్లో అన్ని నియోజక వర్గాలకు ఈ నెల 11న కౌటింగ్ నిర్వహించనున్నారు. మీడియా కేంద్రాన్ని పరిశీలించిన అధికా రులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమాచా ర శాఖ డీడీ మూర్తుజాను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో అంజయ్య, రిటర్నింగ్ అధికారు లు జాన్ సాంసన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పోలింగ్ నివేదికలను సకాలంలో అందజేయాలి
సాక్షి, హన్మకొండ అర్బన్: చట్టబద్ధమైన నివేదికలు సకాలంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్ ఆదేవించారు. కలెక్టరేట్లో ఎన్నికల సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ నివేదికలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపేముందు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్ఓలు వ్యక్తిగతంగా పరిశీలించి, ధ్రువీకరించకున్న తర్వాతనే నివేదికలు పంపించాలన్నారు. ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. కమిషన్కు పంపిన ప్రతి నివేదిక వారికి అందినట్లు ధ్రువీకరించుకోవాలన్నారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 7 గంటలకు, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నివేదికలు పంపాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల దారిలో రెండు వైపులా 100మీటర్ల దూరంలో లైన్లు మార్కింగ్ చేయాలన్నారు. బూత్లెవల్ అధికారులతో ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మాక్ పోలింగ్కు ముందు వీవీ ప్యాట్లు ముట్టుకోవద్దన్నారు. పోలింగ్ పార్టీలు, వెబ్కాస్టింగ్ విద్యార్థులు, మైక్రో అబ్జర్వర్లకు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు నిబంధనల ప్రకారం రెమ్యూనరేషన్ చెల్లించేందుకు నిధులు ముందుగా డ్రా చేసుకోవాలని అధికారులకు సూచించారు. నిఘా బృందాలకు కౌంటింగ్ అనంతరం చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. వెబ్కాస్టింగ్ విద్యార్థులు, ఎన్స్ఎస్ వలంటీర్లు ఓటుహక్కు కల్గి ఉన్నట్లయితే వారికి పోస్టల్ బ్యాలెట్లు అందజేయాలన్నారు. జేసీ దయానంద్, ఆర్ఓలు గౌతం, వెంకారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఓటేయాలి : కలెక్టర్ ఈ నెల ఏడో తేదీన పోలింగ్ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఓటరు ఎలాంటి ప్ర లోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు. రాష్ట్ర భవిష్యత్ను నిర్ధారించేందుకు పాలనా వ్యవస్థ ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉం టుందని..అందరూ వినియోగించుకోవాలని సూ చించారు. పోటీలో ఉన్నవారిలో నచ్చినవారికి ఓటువేయొచ్చని.. లేదంటే నోటాకు వేటు వేయొచ్చని పేర్కొన్నారు. -
సిరిసిల్ల: ప్రలోభాల పర్వం
జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మనీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడికక్కడ ఓటు లెక్కన ముట్టజెప్పడానికి అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటిసాయంత్రం నుంచి పోలింగ్ రోజువరకు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. దీంతో ముందస్తు వ్యూహంతో భారీ స్థాయిలో మద్యం నిల్వలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం, డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఉంచినా.. యంత్రాంగం కళ్లుగప్పి తమపని తాము చేసుకుపోవడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నట్లు సమాచారం. సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో అభ్యర్థుల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత మైకులు, ప్రచారాలు, ప్రసంగాలు ఉండరాదని, ప్రచారం కోసం వచ్చిన బయటి వ్యక్తులు సైతం సాయంత్రానికల్లా నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ప్రచారపర్వం తర్వాత, పోలింగ్ సమయానికి ముందున్న 48 గంటల పాటు జిల్లాలో ప్రలోభాల పర్వం జోరుగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరెండు రోజుల్లో చీకటిమాటున పెద్దఎత్తున ఓటర్లను డబ్బు, మద్యంతో ఎరవేసి ప్రలోభపర్చుకోవడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘా కళ్లు గప్పి.. జిల్లాలోని కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్తపడి ముందస్తుగానే తమ నియోజవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండలస్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లకు ఎర.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జనసమీకరణలో మహిళలనే భారీసంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబ ట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదర్యాన్ని ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గు ప్పిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘా ల గ్రూపులకు ఒక్కో బృందానికి రూ.30 వేల చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
రేపటి నుంచి హన్మకొండలో 144 సెక్షన్
సాక్షి, హన్మకొండ అర్బన్: ఈ నెల ఐదో తేదీన సాయంత్రం 5గంటల నుంచి 144 సెక్షన్ విధించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో స్థానికేతర వ్యక్తులను గుర్తించి బయటకు పంపించనున్నట్లు తెలిపారు. 5న సాయంత్రం 5గంటల తర్వాత కల్యాణ మండపాలు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సురేంద్రసింగ్, టి.ఆనంద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ టి.రవీందర్లతో కలిసి నిఘా కమిటీలు, పోలిస్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున నిఘాను పెంచాలన్నారు. 7న పోలింగ్ సందర్బంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు. బ్రాడ్బాండ్ 133 పోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాల ద్వారా 250 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 307 పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్లైన్ ద్వారా వెబ్ కాస్టింగ్ చేయించనున్నట్లు తెలిపారు. -
కలెక్టర్ భాస్కర్కు జైలుశిక్ష, జరిమానా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది. ఏడాది కాలంగా ఎస్సీ కార్పొరేషన్లో ఆరుగురు ఉద్యోగుల జీతాల విషయంలో వివాదం నెలకొనడం, గత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆరుగురు ఉద్యోగులపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత ఉద్యోగులు న్యాయపోరాటం చేశారు. ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కోర్టు ధిక్కారం కింద జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఎస్.వి.శేషగిరిరావు మరో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ వచ్చింది. ఆ మేరకు వారు వేతనాలు అందుకుంటున్నారు. అయితే వీరిని నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ చేశారని, అక్రమంగా పదోన్నతులు ఇచ్చారని నిర్ధారిస్తూ వారి వేతనాలు నిలిపివేశారు. దీనిపై తమ జీతాల విడుదలకు 2015లో హైకో ర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లకు జీతాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో శేషగిరిరావు తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్పై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సుప్రీంకోర్టు తమ ఆదేశాలపై స్టే ఇవ్వనందున, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని భావిస్తూ జిల్లా ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్ కాటంనేని భాస్కర్కు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. అప్పీల్ నిమిత్తం తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు. జిల్లా కలెక్టర్కు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్: కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ఓ యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. అదే సమయంలో కలెక్టర్ వీరపాండియన్ రావడంతో బాధితురాలిని కార్యాలయంలోకి పిలిపించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... నగరంలో నవోదయకాలనీలో నివాసముంటున్న గాయత్రి అనే యువతి శింగనమల మండలం కొరివిపల్లికి చెందిన రాజు అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి సదరు యువకుడు నిరాకరిస్తూ వస్తుండటంతో మనస్తాపం చెందిన గాయత్రి బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. సమస్యను విన్న కలెక్టర్ యువతికి న్యాయం చేయాలని వన్టౌన్ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతి నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి మహిళా,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలలో నడుస్తున్న సర్వీసు హోంలో ఆమెకు ఆశ్రయం కల్పించారు. యువకున్ని స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తామని వన్టౌన్ సీఐ విజయభాస్కర్గౌడ్ తెలిపారు. -
ప్రచారం చేయొద్దు...
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళా సంఘాలకు ప్రాతినిథ్యం వహించే ఆర్పీల ఎన్నికల ప్రచారంపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ జీవో జారీ చేశారు. దీంతో ఆర్పీలను రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలా..వద్దా... అనే వివాదానికి తెరపడింది. సాక్షి, పెద్దపల్లి: ఆర్పీలను ఎన్నికల ప్రచారంలో వాడుకొనే వ్యవహారంలో రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న వివాదం, ఈ స్పష్టతకు దారితీసింది. ఈ నెల 2న రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేనతో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఆర్పీల విషయంపై వాదనకు దిగారు. నిబంధనల పేరిట తన ప్రచారానికి అధికారులు అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రచారానికి ఆర్పీలను వాడుకోవడంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఆర్పీల విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని, రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి వచ్చిన వివరణ మేరకే స్పందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మెప్మా విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ ఏ రాజకీయ పార్టీకి కాని, అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ప్రకటించారు. ఈ నెల 3న ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి కలెక్టర్ నివేదిక పంపించారు. స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్కుమార్ ఈనెల 9న వివరణ ఇచ్చారు. రీసోర్స్ పర్సన్స్ ఎవరికి అనుకూలంగా కూడా ప్రచా రం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఊపిరి పీల్చుకున్న ఆర్పీలు గంపగుత్త ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రభావితం చేయడం అభ్యర్థులకు ఎన్నికల్లో కొత్త కాదు. ఎన్నికల ప్రచారంలో, ఓట్లల్లో మహిళా సంఘాలు కీలకం కావడంతో నేతలంతా గ్రూప్లపైనే దృష్టి పెడుతారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్పీలపై కొంతమంది అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తమ ద్వారానే ఉద్యోగాలు పొందారని, తమకు ప్రచారం చేయకపోతే మీ సంగతి తేల్చుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఆర్పీల ఎన్నికల ప్రచారంపైనా స్పష్టత ఇచ్చింది. -
సమాచారమా...కష్టం!
వక్కంటి జనార్దన్ అనే వ్యక్తి హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఓ సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెలరోజులు దాటినా అతనికి సమాచారం రాలేదు. దీంతో అతను సమాచార కమిషన్ను ఆశ్రయించాడు.అక్కడికి సంబంధిత అధికారి కూడా విచారణకు హాజరయ్యారు. ఆ వ్యక్తి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిషనర్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ అతనికి సమాచారం లభించలేదు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమాచార హక్కు చట్టంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమాచారం అడిగినా స్పందించడంలేదు. చూస్తున్నాం.. పరిశీలిస్తున్నాం అంటూ సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. దరఖాస్తుదారుడు కమిషన్ను ఆశ్రయించినపుడు కావలసిన సమాచారం ఇస్తామని కమిషనర్ ఎదుట హామీ ఇస్తోన్న అధికారులు తరువాత ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. జరిమానాలు విధించకపోవడం వల్లేనా? దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సమాచార కమిషనర్ నోటీసులు ఇచ్చినా అధికారులు çపట్టించుకోకపోవడంతో చట్టం సరిగా అమలు కావడం లేదు. ఒకవేళ సదరు అధికారి పదోన్నతి, లేదా బదిలీల కారణంగా సీటు మారితే ఇక అంతే సంగతులు. ఆ సమాచారం ఫైలు అటకెక్కుతుంది. సమాచారం ఇవ్వడంలో కావాలని జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్కు ఉంటుంది. రోజుకు రూ.250 చొప్పున రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అధికారులకు జరిమానాలు విధించకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు పరిష్కారమవుతాయో! సమాచార హక్కు కింద దరఖాస్తులు కొంతకాలంగా వేల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. వీటిలో అధికారులు కావాలని జాప్యం చేసేవే అధికం కావడం గమనార్హం. గతంలో జాప్యం చేసిన అధికారులపై కమిషన్ చర్యలు తీసుకునేది. ఈ ఏడాది అక్టోబర్ వరకు దాదాపు 14 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కేవలం ఆరు వేల ఫైళ్లు మాత్రమే క్లియర్ అయ్యాయని, ఇంకా 9 వేలకుపైగా ఫైళ్లు పెండింగ్లోనే ఉన్నాయని సమాచారం. ఆశించిన సమాచారం లభించకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం దరఖాస్తుల్లో తెలంగాణలో కేవలం 30 శాతం మాత్రమే పరిష్కారమవడం ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. చాలామందికి ఏడాది అవుతున్నా సరైన సమాచారం రావడం లేదని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమాచార హక్కు చట్టం కోరలు లేని పులిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం: బుద్ధామురళి, ఆర్టీఐ కమిషనర్ సమాచారం ఇవ్వని అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయి. కమిషన్ నోటీసులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని దరఖాస్తుదారులు మా దృష్టికి తీసుకురావాలి. అప్పుడు తప్పకుండా విచారించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నాం. -
ఎన్నికల మార్గదర్శకాలను వివరించిన కలెక్టర్
సాక్షి, యాదాద్రి : మండల అభివృద్ధి అధికారులు తమ మండలాల పరిధిలో ఎన్నికల మోడల్ కోడ్ కచ్చితంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీ సుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అని తారామచంద్రన్ కోరారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో మండల అభివృద్ధి అధి కారులతో సమావేశమై ఎన్నికల మార్గదర్శకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. మండలంలోని ఆశవర్కర్లు, ఉపాధి హామీ ప థకంలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది, ఇతర పొరుగు సేవల ఉద్యోగులు ఎవరూ కూడా ఎన్నికల్లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా కాని పాల్గొనకుండా అన్నిచర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ల ప్రచారాల్లో పాల్గొనకుండా అవగాహన కలిగిం చాలన్నారు. స్వయం సహాయక సంఘాలు డబ్బు ల పంపిణీ ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం ఉపేక్షించరాదని, అదే విధంగా రేషన్డీలర్లకు కూ డా ఈవిషయంలో అవగాహన కలిగించాలని సూ చించారు. కొత్తగా సీసీరోడ్లు వేయడం, బోర్లు వే యడం, కొత్తగా పనుల మంజూరు ప్రారంభించ డం అన్ని కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయ ని వాటిని గ్రహించాలన్నారు. ఉద్యోగులు ప్రభు త్వ వేతనం పొందుతూ ఎన్నికల ప్రచారాల్లో పా ల్గొని ఉద్యోగాలు కోల్పోవడం, ప్రమోషన్లు, రిటైర్మెంట్ సమయంలో బెనిఫిట్లు కోల్పోరాదన్నా రు. ఈవిషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులు తమ ఓటు హక్కు సద్వినియోగపర్చుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం, వీల్చైర్స్ ఏర్పాటుతో పాటుగా వారిని ఆటోలో తీసుకువచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు అన్ని చర్యలు చేపడుతున్నందున పనులు పర్యవేక్షించాలన్నారు. అర్హులైన వారు ఓటరుగా నమోదుకు 9వ తేదీచివరి గడువు అయినందున బీఎల్ఓల ద్వారా ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేయించాలన్నారు. దివ్యాంగులకు తోడ్పాటు నందించేందుకు అంగన్వాడీలను వలంటీర్గా పెట్టి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓలు కలిసి మండల స్థాయి పార్టీ అధ్యక్షులతో సమావేశాలు పెట్టి మోడల్ కోడ్పై అవగాహన పర్చాల న్నారు. చెల్లింపు వార్తలు, ప్రీసర్టిఫికేషన్ పొందడం ప్రకటనలు జారీ తదితర విషయాలపై ఎంపీడీఓలకు అవగాహన కలిగించారు. సీవిజిల్ నోడల్ అధికారి ప్రియాంక మాట్లాడుతూ మోడల్ కోడ్ ఉల్లంఘించిన సంఘటనలపై ఫొటో, వీడియో క్లిప్పింగ్ ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు సీవిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహనపర్చాలన్నారు. అదే విధంగా సువిధ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందడంపై వివరించారు. ఈ సమావేశంలో ఆలేరు ఆర్ఓ ఉపేందర్రెడ్డి, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
బైక్పై వెళ్లి.. పుట్టిలో తిరిగొచ్చి..
గద్వాల రూరల్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కృష్ణా నది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శశాంక ఆదివారం పరిశీలించారు. గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జాతీయ రహదారి నుంచి బైక్పై ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేయించాలని తహసీల్దార్ జ్యోతిని ఆదేశించారు. తిరుగు ప్రయాణంలో ఆయన గుర్రంగడ్డ నుంచి పుట్టీలో బీరెల్లి మీదుగా ప్రయాణించి తర్వాత గద్వాలకు చేరుకున్నారు. -
తెలుగు అమలుపై నిర్లక్ష్యమేల?
చిత్తూరు కలెక్టరేట్ : నగరాల్లోని దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండేలా అమలుచేయాలని మాతృభాషా దినోత్సవం రోజున ఆదేశిస్తే ఇప్పటివరకు ఎందుకు ఆచరించలేదని మునిసిపల్ కమిషనర్లపై కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో మునిసిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ నగరాల్లో తెలుగులో దుకాణాల బోర్డులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మునిసిపాలిటీ పోస్టర్ ఫ్రీ (పోస్టర్లు ఉండని) సిటీగా తయారయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వీధి విక్రయదారులను గుర్తించి వారికి గుర్తింపుకార్డులను అందజేసి సంఘాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 20న వీధి విక్రయదారులకు రుణమేళా నిర్వహించి రూ.5కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వైన్ఫ్లూ నివారణకు రెండు రోజుల్లోగా ఇంటింటికీ హోమియో మం దులు పంపి ణీ చేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించండి నగరాల్లో మాఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేలా కమిషనర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఖాళీ స్థలాల్లో కూరగాయల తోటలు పెంచుకునే విధంగా నగర ప్రజల ను ప్రోత్సహించాలన్నారు. ఇంటికూరగాయల్లో 70 శాతం పోషకాలుంటాయనే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మలనాడు గిద్దలు సంప్రదాయ ఆవులని, అవి కర్ణాటక లోని షిమోగా ప్రాంతానివని చెప్పారు. ఆవు ధర రూ.18 వేలని, పాలు రోజుకు 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయని తెలిపారు. ఈ పాలు చాలా ఆరోగ్యవంతమైనవని, రోగనిరోధకమని చె ప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతిలో పేదల కోసం నిర్మించిన గృహాలకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపికచేయాలన్నా రు. జిల్లాలో రాత్రి బస గృహాలు మదనపల్లెలో ఈ నెల 20కి, శ్రీకాళహస్తిలో ఈ నెల 12న, నగరి, చిత్తూరులో ఈనెలాఖరుకు పనులు పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. జేసీ–2 చంద్రమౌళి, చిత్తూ రు నగర కమిషనర్ ఓబులేసు, తిరుపతి నగర పాల క డెప్యూటీ కమిషనర్ పణిరామ్, శ్రీకాళహస్తి, పుంగనూరు మునిపల్ కమిషనర్లు రమేష్బాబు, వర్మ, మెప్మా పీడీ జ్యోతి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్లు గోపి, మధుసూదన్రెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు. -
తిత్లీ బాధితులకు తగిన న్యాయం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాను తిత్లీ తుపాను అతలాకుతలం చేసేసి దాదాపు 23 రోజులు గడిచిపోయింది. పంటలు, పాడి, తోటలు, ఇళ్లు, పాకలు ఇదీ అదీ అని కాదు ఆ బీభత్సానికి ప్రజలు సర్వం కోల్పోయారు. జీవనాధారం కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో జిల్లా అధికార యంత్రాంగంపై బాధ్యతలు రెట్టింపు అవుతాయి. కుటుంబాలకు సైతం దూరమై రేయింబవళ్లు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతున్న వారిలో జిల్లా కలెక్టరుగా కె.ధనంజయరెడ్డి ముందున్నారు. తుపాను, వరద బాధిత ప్రాంతాల్లో చేపట్టిన, చేస్తున్న, చేయబోయే పనుల గురించి శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి:తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, ఇతర వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారు. వారికి ఉపాధి కూడా కరువైంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? కలెక్టరు: తిత్లీ వంటి తుపానైనా, వరదలైనా, లేదంటే కరువైనా రైతులు, కూలీలు పంట నష్టపోవడమే కాదు ఉపాధి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద వంద రోజుల పనిదినాలు ఇప్పటికే కల్పిస్తున్నాం. తిత్లీ తుపాను బాధితులకు తక్షణమే ఉపాధి చూపించే ఉద్దేశంతోనే అదనంగా మరో యాభై పనిదినాలు కల్పిస్తున్నాం. వాస్తవానికి ఈ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో కరువు మండలాలు లేవు. తుపాను వల్ల జిల్లా నష్టపోయింది. ఇది కూడా ప్రకృతి విపత్తే కాబట్టి 25 మండలాల్లో ఈ పనిదినాల పెంపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. సాక్షి: జిల్లాలో ఏయే మండలాలను తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు? కలెక్టరు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి, జలుమూరు, ఎల్ఎన్ పేట, సరుబుజ్జిలి, నరసన్నపేట, పోలాకి, గార, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, సారవకోట, భామిని, మెళియాపుట్టి, వీరఘట్టం, సీతంపేట, పలాస మండలాలను తిత్లీ తుపాను, భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం 16వ నంబరు జీవోను విడుదల చేసింది. సాక్షి: తుపానుతో ప్రజలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ ‘ఉపాధి’ సరిపోతుందా? కలెక్టరు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టడానికి తుపాను బాధిత ప్రాంతంలో అనేక పనులు ఉన్నాయి. ఒక్క టెక్కలి రెవెన్యూ డివిజన్లోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 98.8 కోట్లు విలువగల పనులు జరిగాయి. మెటీరియల్ కాంపోనెంట్ పనులు రూ. 32.82 కోట్లు వరకూ చేశారు. ఈ డివిజన్లో ఎక్కువ మంది నరేగా పనులపై ఆధారపడినవారు ఉన్నారు. 11,194 శ్రమశక్తి (ఎస్ఎస్ఎస్) సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,56,904 మంది వేతనదారులు ఉన్నారు. వారిలో ప్రతి రోజూ ఉపాధి పనులకు వెళ్లేవారు 1,10,760 మంది ఉన్నారు. ఇప్పుడు అదనంగా 50 పనిదినాలు వచ్చాయి. ఇప్పటివరకు వంద రోజుల పాటు పనిదినాలు చేయని కుటుంబాలు కూడా వచ్చే ఏడాది మార్చిలోగా 150 పనిదినాలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. తుపాను వల్ల పాడైపోయిన పొలాలు, గట్లు బాగు చేసుకోవడం వంటి పనులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. సాక్షి: తిత్లీ తుపానుతో నేలకొరిగిన చెట్లను తొలగించుకోవడానికి రైతులకు ఏవిధమైన సహాయం అందిస్తారు? కలెక్టరు: కూలిపోయిన అన్ని రకాల చెట్లను తొలగించే బాధ్యత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు తీసుకుంటున్నాయి. అందుకుకావాల్సిన డీజిల్ ఆధారిత రంపాలను సమకూర్చాం. అలాగే ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి తొలగించుకోవడానికి రైతులకు మెటీరియల్ కాంపొనెంట్ కింద జీడిమామిడి చెట్టుకు రూ.300, కొబ్బరి చెట్టుకు రూ.240 చొప్పున చెల్లిస్తాం. ఇప్పటికే 60 వేల చెట్లను తొలగించారు. ఇలా రెండు వేల ఎకరాల్లో తొలగింపు పూర్తయ్యింది. సాక్షి: ఇంకా చాలామంది బాధితులు తమ పేర్లు లేవని, నష్టం నమోదు ప్రక్రియ సరిగా చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరు: నష్టాల గణన సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం వల్ల అక్కడక్కడా తప్పులు దొర్లిన మాట వాస్తవమే. బాధితులు ఎవ్వరైనా సరే ఈ విషయంలో దరఖాస్తు చేయవచ్చు. వాస్తవానికి నష్టాల నమోదు ప్రక్రియ శనివారంతో పూర్తయ్యింది. కానీ రానున్న మూడు నాలుగు రోజుల వరకూ వచ్చే ఫిర్యాదులను, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. నిజమైన బాధితులను గుర్తించి న్యాయం చేస్తాం. రెండో దఫా జాబితాలో వారికి నష్టపరిహారం చెల్లిస్తాం. సాక్షి: బాధితులు కోలుకునేందుకు మీరు చేపట్టనున్న దీర్ఘకాలిక చర్యలు ఏమిటి? కలెక్టరు: సర్వం కోల్పోయిన బాధితులను సాంఘికంగా, ఆర్థికంగా, ప్రాథమిక వసతులపరంగా దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ‘తిత్లీ ఉద్ధానం పునరుద్ధరణ కార్యక్రమం’ (టీయూఆర్పీ– తూర్పు) చేపట్టనున్నాం. ఇళ్లు మంజూరు, మొక్కల అందజేత, రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా, కావాల్సినవారందరికీ జలసిరి బోర్ల మంజూరు, మూడేళ్ల పాటు మొక్కల నిర్వహణకు నిధులు హెక్టారుకు రూ.40 వేల చొప్పున విడుదల వంటి ప్రతిపాదనలు చేస్తున్నాం. అంతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. అలాగే భవిష్యత్తులో విపత్తులను తప్పించలేం. కానీ తుఫానుల సమయంలో పక్కాఇళ్లు ఉంటే నష్టాన్ని తగ్గించవచ్చు. రేకుల ఇళ్లు, పూరిళ్లు కోల్పోయినవారికి 25వేల పక్కాఇళ్లను ఇవ్వాలని గుర్తించాం. తుపాను బాధితులకు మెరుగైన జీవనోపాధి కల్పించి వారు ఎక్కడికీ వలస పోవాల్సిన పరిస్థితి తలెత్తకుండా చేయాలనేది లక్ష్యం. సాక్షి: పంటనష్టం నమోదులో అవకతవకల నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టరు: మా దృష్టికి వచ్చిన అవకతవకలను మండలస్థాయిలోనే గుర్తించి సరిచేస్తున్నాం. కొన్నిచోట్ల తక్కువ విస్తీర్ణంలో నష్టం జరిగితే ఎక్కువగా రాయించడం, భూములు లేకపోయినా ఉందని నమోదు చేయడం వంటి అక్రమాలన్నీ చాలావరకూ నిరోధించగలిగాం. పొరపాట్లను గుర్తించాం. ఇద్దరు ముగ్గురు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నాం. అందుకే ప్రాథమిక జాబితాకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. వరి పంటనష్టం 93వేల హెక్టార్ల నుంచి ఇప్పుడు 76 వేల హెక్టార్లకు తగ్గింది. నష్టపోయిన కొబ్బరి చెట్లు సంఖ్య 14 లక్షల నుంచి దాదాపు 10 లక్షలకు తగ్గిపోయింది. ఏదిఏమైనా బాధితులను ఆదుకోవడానికి అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసింది. అంతా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎంతో ఒత్తిడి ఉన్నా ప్రజల కోసం కాబట్టి భరించక తప్పదు. సాక్షి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? కలెక్టరు: పునరావాస కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాల విషయంలో సాధారణ పరిస్థితి వచ్చింది. ఇక నష్టపరిహారాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. పంటలు, తోటలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తి నష్టాలకు సంబంధించి గణన జరుగుతోంది. నాలుగు లక్షలకు పైగా బాధితులకు ఈనెల 5వ తేదీ నుంచి పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవి వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. దాదాపు రూ.450 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘలపై 11 ఫిర్యాదులు అందగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. రెండు కేసులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించామని చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు 12 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 14 స్మాటిక్స్ సర్వేలెన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు టీంల ద్వారా రూ.1.03 కోట్ల నగదు, 2,215 గ్రాముల బంగారం పట్టుకున్నట్లు వివరించారు. 1,151 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 9 వరకు ఓటరు నమోదుకు ఫారం 6 దరఖాస్తులు సమ ర్పిస్తే జాబితాలో నమోదు చేస్తామని తెలిపారు. కరీంనగర్సిటీ టవర్సర్కిల్: నేటి పొదుపే రేపటి మదుపు అని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రతిఒక్కరూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ ప్రధాన తపాలా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తికి పొదుపు గురించి వివరించి, పొదుపు చేసేలా చూడాలని ఏజెంట్లను కోరారు. కుటుంబంలోని గృహిణులు పొదుపు చేయడం చేస్తారని, వాటిని డబ్బాల్లో దాచిపెట్టకుండా పోస్టాఫీసులో జమచేయడం వల్ల వడ్డీ పొందవచ్చన్నారు. పొదుపు చేసిన చిన్న మొత్తాలే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతాయని తెలిపారు. జిల్లాలో సుమారు 400 మంది పొదుపు ఏజెంట్లు పని చేస్తుండడం అభినందనీయమన్నారు. వారు చేయించే కోటి, అరకోటి రూపాయల బిజనెస్పై గతంలో అందించే ప్రోత్సాహకాలను మళ్లీ అందించే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం కరీంనగర్ ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో అత్యధిక మొత్తంలో పొదుపు చేయించిన ఏజెంట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కరీంనగర్ డివిజన్ తపాల కార్యాలయాల సూపరింటెండెంట్ బి.సురేశ్కుమార్ మాట్లాడుతూ 1924 అక్టోబర్ 30న ఇటలీలో పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారని తెలిపారు. తపాలా శాఖలో పొదుపు చేయడానికి కిసాన్ వికాస పత్రాలు, మంత్లీ ఇన్కం స్కీం, జీపీఎఫ్లతోపాటు పలు పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పొదుపు చేసిన సొమ్ము ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువుల కోసం, అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చులకు, పిల్లల వివాహాల ఖర్చుకోసం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమొత్తాల పొదుపు ఏజెంట్ల సంఘం రాష్ట్ర అద్యక్షుడు రావికంటి కృష్ణకిషోర్, పోస్ట్మాస్టర్ నర్సింహస్వామి, చిన్నమొత్తాల పొదుపు ఏజెంట్లు, తపాలాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
13 కమిటీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ కమిటీలకు అప్పగించింది. మొత్తం 13 కమిటీలను నియమించగా, ఒక్కో కమిటీకి ఒ క్కో జిల్లా స్థాయి అధికారికి పర్యవేక్షణ బా ధ్యతలను కలెక్టర్ రామ్మోహన్రావు అప్పగించారు. ఈ మేరకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలిం గ్ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బంది నియామకం బాధ్యతలను జిల్లా రెవె న్యూ అధికారి ఆర్.అంజయ్యకు అప్పగించా రు. అలాగే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అవసరమైన సిబ్బంది కేటాయింపులు, సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) వంటి అంశాలను డీఆర్వో పర్యవేక్షించనున్నారు. ట్రాన్స్పోర్టు కమిటీ నోడల్ అధికారిగా డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వర్రెడ్డిని నియమితులయ్యారు. ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు వంటి బాధ్యతలను డీటీసీకి అప్పగించారు. అలాగే పోలింగ్ నిర్వహణ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలింపు వంటి అంశాలను వెంకటేశ్వర్రెడ్డి పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు, అవగాహన వంటి వాటి కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. బోర్గాం(పి) జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్రా రామారావుకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్కు అవసరమైన సామగ్రి ఏర్పాట్ల బాధ్యతలు కార్మిక శాఖ ఉప కమిషనర్ చతుర్వేదికి అప్పగించారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షించే కమిటీకి జిల్లా సహకార శాఖాధికారి సింహాచలం నోడల్ అధికారిగా నియమితులయ్యారు. అభ్యర్థుల ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా ఉండటం వంటి విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందిని డీసీవో పర్యవేక్షించనున్నారు. ఎన్నికల తీరును పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక పరిశీలకులుగా జిల్లాకు రానున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ పరిశీలకులు జిల్లాకు చేరుకుని ఎన్నికల నిర్వహణ తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. వీటిని సమన్వయం చేసుకునేందుకు నోడల్ అధికారిగా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణను నియమించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును పర్యవేక్షించే బాధ్యతలు సీపీ కార్తికేయకు అప్పగించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం ప్రత్యేకంగా మీడియా సెల్ను ఏర్పాటు చేశారు. పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ ముర్తుజా నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. అదనపు పీఆర్వో రామ్మోహన్రావుకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఎన్ఐసీ సమాచార అధికారి రాజ్గోపాల్ను నోడల్ అధికారిగా నియమించారు. స్వీప్ నోడల్ అధికారులుగా డీసీవో సింహాచలం, బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ నియమితులయ్యారు. హెల్ప్లైన్, ఫిర్యాదుల పరిష్కారం, ఎస్ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్ నోడల్ అధికారిగా కార్తిక్, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక నోడల్ అధికారి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.స్రవంతికి బాధ్యతలు అప్పగించారు. ఆయా కమిటీలకు కేటాయించిన విధులను సంబంధిత నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా అందజేసినట్లు కలెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్చే ఆమోదింపబడిన జాబితాను పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేస్తుందని పేర్కొన్నారు. కంట్రోల్ రూంకు 18004256644 లేదా 08462–224001కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మోడల్ కండక్ట్ కోడ్ నోడల్ అధికారి డీసీవో సింహాచలం (91001 15747)కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఈ కలెక్టర్ మాకొద్దు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఎన్నికల వేళ జిల్లా కలెక్టర్కు రెవెన్యూ విభాగంలోని అధికారులకు, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన అగాథం వివాదాస్పదంగా మారింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేసే క్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి వ్యవహరిస్తున్న తీరు జిల్లా రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి వీఆర్ఓల వరకు ఎవరికీ రుచించడం లేదు. గ్రామాలు, మండలాల్లో భూములు, ఇతర రెవెన్యూ సంబంధమైన పనుల్లో నెలరోజుల క్రితం వరకు బిజీగా ఉన్న వీఆర్ఏలు, వీఆర్ఓలు, డీటీలు, తహసీల్దార్లతో పాటు మండల కార్యాలయాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల వరకు ఈసీ ఆదేశాలతో ఓటర్ల నమోదు, సవరణ పనుల్లో పడిపోయారు. ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొద్దిరోజులుగా రెవెన్యూ ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించారనడంలో అతిశయోక్తి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్ట్ పనులు, సాయంత్రం నుంచి రాత్రి వరకు మండల కార్యాలయాలు, కలెక్టరేట్లో సమావేశాలతో అధికారులు, ఉద్యోగులకు ఒత్తిడి పెరిగింది. అయినా ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆశించిన ప్రగతి లేదు. మంచిర్యాల జిల్లాలో గత ఎన్నికల నాటికి గత నెలలో ప్రచురితమైన ఓటర్ల జాబితాకు మధ్య 72వేల ఓట్లు గల్లంతయినట్లు తేలింది. అనంతరం కొత్త ఓటర్ల నమోదులో భాగంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా ఆన్లైన్లో ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను తహసీల్దార్ల ద్వారా ఆయా గ్రామాల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలు పరిశీలించి ఆఫ్లైన్లో పేర్లను జాబితాలో ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియలో జిల్లాలోని అనేక మండలాల్లో తేడా వస్తున్నట్లు కలెక్టర్ గుర్తించారు. శుక్రవారం నాటికల్లా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉండగా, రెవెన్యూ అధికారుల వ్యవహారంపై ఆమె పలుమార్లు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రెవెన్యూ సంఘాల నాయకులు కలెక్టర్ను కలిసి తమ నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కథ అడ్డం తిరిగింది.. కలెక్టర్ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేసేందుకు జిల్లా తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు ఎం.మల్లేష్, టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు డి.శ్రీని వాస్రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీహరి, వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఓంకార్ల నేతృత్వంలో సుమారు 150 మంది వరకు తహసీల్దార్లు, ఉద్యోగులు గురువారం కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టరేట్ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. తమ ఆవేదన చెప్పుకుందామని కలెక్టర్ అపాయింట్మెంట్ కోరితే కొందరు సంఘం నాయకులకు అనుమతిచ్చారు. కలెక్టర్ భారతి వద్దకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల కలెక్టర్ సీరియస్ అయ్యారని సమాచారం. ‘పనిచేయాలంటే కష్టంగా ఉందా..? నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను... రాత్రి వరకు పని చేస్తున్నామంటున్నారు... ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసులకు వస్తున్నారో తెలియదా..? నేను ఎవరి ముందు తెలంగాణ ఉద్యోగులు పనిచేయలేరని అన్నానో తీసుకురండి... నా వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయమని చెప్ప డం లేదు... ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా 12న ప్రచురించాల్సిందే కదా...? ఆన్లైన్ దరఖాస్తులకు, ఆఫ్లైన్లో ఎంట్రీలకు తేడా ఎంతుందో మీరే చూడండి...’ అంటూ పలు అంశాలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులను దూషిస్తున్నారని, ఆత్మస్థైయిర్యాన్ని దెబ్బ తీస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయగా... ఎవరిని ధూషించానో, ఎవరి పట్ల అవమానకరంగా మా ట్లాడానో తీసుకురండి... అనడంతో నాయకులు వెనుదిరిగారు. తన విధానం ఇలాగే ఉం టుందని, పనిచేయడం వీలుకాకపోతే వెళ్లిపోం డనీ అన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పారు. ఎన్నికల సంఘానికి, సీఎస్కు లేఖ కలెక్టరేట్ నుంచి వచ్చిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఐబీ గెస్ట్హౌస్లో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. శుక్రవారం ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఓ లేఖ రాశారు. రెవెన్యూ ఉద్యోగులను కించపరిచేలా వ్యవహరిస్తూ, అవమానిస్తున్న కలెక్టర్ను మార్చాలని కోరారు. తాము వేదనకు గురవుతున్న తీరును పేర్కొన్నారు. కలెక్టర్ కింద పనిచేయలేమని, ఆమెను మార్చకుంటే మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్తామని అల్టిమేటం ఇచ్చారు. ఎన్నికల వేళ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ‘పనిచేయాలంటే కష్టంగా ఉందా...? నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను... రాత్రి వరకు పని చేస్తున్నామంటున్నారు... ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసులకు వస్తున్నారో తెలియదా...? నేను ఎవరి ముందు తెలంగాణ ఉద్యోగులు పనిచేయలేరని అన్నానో తీసుకురండి... నా వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయమని చెప్పడం లేదు... ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా 12వ తేదీన ప్రచురించాల్సిందే కదా...? ఆన్లైన్ దరఖాస్తులకు, ఆఫ్లైన్లో ఎంట్రీలకు తేడా ఎంతుందో మీరే చూడండి...’ – కలెక్టర్ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వీఆర్వోల నుంచి ఉన్నతాధికారుల స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ భారతి హోళికేరి అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ప్రవర్తన వల్ల మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతింటున్నాం. వెంటనే ఆమెను మార్చండి. – ఉద్యోగులు ∙జిల్లా తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.మల్లేష్, టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు డి.శ్రీనివాస్రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీహరి, వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఓంకార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే.జోషి, ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్కు పంపిన లేఖ సారాంశమిది.. -
‘విశాఖపై తుఫాను ప్రభావం ఉండకపోవచ్చు!’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో టిట్లీ తుఫాను ప్రభావం అంతగా ఉండకపోవచ్చని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. టిట్లీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆయన ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్లో కమాండింగ్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 000023 అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. వర్ష ప్రభావం లేకపోయినా రాత్రిపూట గంటకు 140 నుంచి 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. గాలుల ప్రభారం వల్ల పక్కా ఇళ్లకు నష్టం వాటిళ్లవచ్చని, విద్యుత్కు అంతరాయం కలగవచ్చని అభిప్రాయపడ్డారు. చెట్లు పడిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు రాత్రిపూట బయటకు రావద్దని హెచ్చరించారు. విశాఖలోని ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్టీంలు సిద్ధంగా ఉంచామన్నారు. 11మండలాల్లోని అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. మండల, రెవెన్యూ స్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సెలవుల్లో ఉన్నవాళ్లు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. -
కలెక్టర్ భాస్కర్ బదిలీ ?
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): కలెక్టర్గా సుదీర్ఘకాలం విధులు నిర్వహించి తనదైన శైలిలో జిల్లా ప్రజల్లో, అధికారుల్లో ముద్రవేసిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ బదిలీ కానున్నట్లు తెలిసింది. నాలుగుసంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి కలెక్టర్ పాలన ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో కలెక్టర్ బదిలీ కానున్నారని ప్రచారం సాగినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కలెక్టర్ భాస్కర్కు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని.. ఒకటి రెండు రోజుల్లో ఆయన బదిలీ అవుతారని విశ్వసనీయంగా తెలిసింది. ఆయన స్థానంలో పశ్చిమ కలెక్టర్గా ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్కుమార్ను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.