అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో 13 మంది క్రికెట్ బెట్టింగ్వీరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కదిరి పట్టణంలోని ఓ ఇంట్లోని వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి.... వారిని అదుపులోకి తీసుకున్నారు.