
సచివాలయానికి కార్పొరేట్ లుక్
గూగుల్, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్డీఏకు సూచించారు.
వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా రూపొందించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు సమర్పించారు. వీటిపై కార్యదర్శులు, మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చిన సూచనలకు అనుగుణంగా తుది డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 13వ తేదీ నాటికి తుది డిజైన్లు ఇస్తామని ఫోస్టర్ బృందం ఈసందర్భంగా తెలిపింది.