CRDA
-
ఆలీ ‘బాబు’.. అసైన్డ్ దొంగలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ పెద్దలు మరో భారీ భూదోపిడీకి తెగబడ్డారు. భూసమీకరణ కింద ఇచ్చిన అసైన్డ్ భూములకు గాను ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఆర్డీఏ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఈ దందాను దర్జాగా నడిపిస్తున్నారు. బడుగు రైతుల ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా కొల్లగొట్టిన 1,300 ఎకరాల అసైన్డ్ భూములకుగాను రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్లాట్లు కబ్జా చేసేందుకు బరితెగించిన ప్రభుత్వ పెద్దలు... తాజాగా పేద రైతుల రిటర్నబుల్ ప్లాట్లను సైతం స్వాహా చేస్తుండటంపై రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఇదీ అసైన్డ్ గూడుపుఠాణి... రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ కింద తమ అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస ప్లాట్ల్లను సీఆర్డీఏ కేటాయించాలి. ఆ మేరకు అసైన్డ్ రైతుల పేర్లతో సీఆర్డీఏ వద్ద పెద్ద జాబితా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొన్ని భవన నిర్మాణాలకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తున్నందున టీడీపీ పెద్దల కన్ను ఆ ప్లాట్లపై పడింది. కానీ, రిటర్నబుల్ ప్లాట్లను నేరుగా టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి తమ బెదిరింపులకు తలొగ్గి.. ప్లాట్లు తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని సమ్మతించిన అసైన్డ్ రైతులకే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే ఈ భూదోపిడీ పర్వం సాగుతోంది. భూ దోపిడీ పర్వం ఇలా... ముందుగా రాజధాని పరిధిలోని అసైన్డ్ రైతులను తుళ్లూరు డీఎస్పీ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ ప్లాట్లను తాము సూచించిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ రాజధానిలో తమ ప్లాట్లను తామే అట్టిపెట్టుకుంటామని చెప్పిన రైతులను బెదిరిస్తున్నారు. ‘ప్లాట్లు పెట్టుకుని ఏం చేస్తారు.. వాటిలో మీరు ఏదైనా నిర్మాణం చేయాలంటే అనుమతులు ఇవ్వరు. తర్వాత మరొకరికి అమ్ముకోవాలన్నా రిజి్రస్టేషన్ చేయరు. పైగా లీగల్ లిటిగేషన్లు పెట్టి మీ ప్లాటుల మీకు ఎప్పటికీ దక్కకుండా చేస్తారు...’ అని హెచ్చరిస్తున్నారు. మేం చెప్పినవారికి వెంటనే అమ్మేస్తామని అంగీకరిస్తే ఇప్పుడు మీ ప్లాట్లు మీ పేరిట సీఆర్డీఏ ద్వారా రిజి్రస్టేషన్ చేయిస్తాం. లేకపోతే సీఆర్డీఏ మీ పేరిట అసలు ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయదు. ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉంచుతుంది’ అని బెదిరిస్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పోలీసు అధికారులు, దళారులు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ తాము చెప్పినట్టు చేయకపోతే మొత్తానికే మోసం వస్తుందని భయపెడుతున్నారు. దీంతో పలువురు ఎస్సీ, ఎస్సీ, బీసీ, పేద రైతులు హడలిపోతున్నారు. పోలీసు బెదిరింపులకు లొంగి తమ ప్లాట్లను టీడీపీ పెద్దలు, బినామీలు చెప్పిన నామమాత్రపు రేటుకే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సమ్మతిస్తున్నారు. సీఎంవో పచ్చజెండా ఊపితేనే.. సీఎం చంద్రబాబు కార్యదర్శి ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. తమ ప్లాట్లు ఇచ్చేందుకు సమ్మతించిన రైతుల పేర్లను పోలీసు అధికారులు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిసింది. వచి్చన జాబితాను పరిశీలించి అంతా తాము అనుకున్నట్టుగా సాగుతోందో లేదో అన్నది పోలీసు అధికారులతో సీఎం కార్యదర్శి మాట్లాడి నిర్ధారించుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాతే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన జాబితాను సీఆర్డీఏకు పంపుతున్నారు. ఈ చేత్తో ఇచ్చి... ఆ చేత్తో గుంజుకుంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసిన జాబితాలోని అసైన్డ్ రైతులకే రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ రిజి్రస్టేషన్ చేస్తోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే అసైన్డ్ రైతుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం పోలీసు, సీఆర్డీఏ అధికారులు చెప్పినట్టుగా... అసైన్డ్ రైతులు ఆ ప్లాట్లను టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చదరపు గజం భూమి మార్కెట్ ధర రూ.లక్షకు మించి పలుకుతోంది. కానీ సీఎంవో, సీఆర్డీఏ, పోలీసు అధికారులతో బెదిరించి అతి తక్కువ ధరకు కొల్లగొడుతున్నారు. అసైన్డ్ రైతుల నుంచి గజం కేవలం రూ.30వేల నుంచి రూ.40వేల చొప్పునే టీడీపీ పెద్దల బినామీలు, బంధువులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. అంటే ఈ చేత్తో అసైన్డ్ రైతులకు ఫ్లాట్లు ఇచ్చి... ఆ చేత్తో వెంటనే గుంజేసుకుంటున్నారు. 2014–19 మధ్య కాలంలో అమరావతిలో భూదోపిడీ సాగించిన చంద్రబాబు, నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులు, బంధువులు, బినామీల పేరిటే ఈ అసైన్డ్ భూముల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఈ విధంగా రాజధాని అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్లాట్లు లేకుండా చేసి మొత్తం రాజధాని తమ సన్నిహితులు, బినామీల గుప్పిట్లోనే ఉండాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. బెదిరించి ప్లాట్లు తీసుకుంటున్నారు అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్లాట్లు ఉండకూడదని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అసైన్డ్ రైతులకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్లపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. సీఆర్డీఏ కేటాయించే ఫ్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుల పేరిట రిజి్రస్టేషన్ చేయాలని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. అందుకు అంగీకరిస్తేనే వారి పేరిట సీఆర్డీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఆ వెంటనే ఆ ప్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, బినామీల పేరిట అతి తక్కువ ధరకే రిజి్రస్టేషన్ చేసేసుకుంటున్నారు. సీఎంవో, సీఆర్డీఏ, పోలీసు పెద్దల పర్యవేక్షణలోనే ఇదంతా సాగుతోంది. దాంతో అసైన్డ్ రైతులు భయపడి వారు చెప్పినట్టుగా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. – సందీప్, అసైన్డ్ రైతు, అమరావతి -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!
అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..! కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూములు రిటర్న్బుల్ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్ భూములను కొనడమే పెద్ద తప్పు.. ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్ డీడ్ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!రికార్డుల గల్లంతు మాయాజాలం1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్లో అసైన్డ్ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కాఅసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగుతుండగా.. మరోపక్క అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీకరణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్ భూములకు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.ప్లాట్ల రిజిస్ట్రేషన్ను అడ్డుకోండి..టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూడదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్గా ఉన్న కాంతిలాల్ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. -
చదరపు అడుగు రూ.10,042
సాక్షి, అమరావతి: అప్పు చేసి పప్పు కూడు తినకూడదంటారు పెద్దలు! ఎందుకంటే అది అప్పు కాబట్టి.. అసలు, వడ్డీతో తీర్చాలి కాబట్టి..! వృథా చేస్తే భారం అవుతుంది కాబట్టి..! పెద్దలే కాదు.. ఎవరైనా సరే చేసిన అప్పులో ఒక్క పైసా కూడా వృథా చేయడానికి ఇష్టపడరు. కానీ.. కూటమి ప్రభుత్వం ముఖ్యనేతలు మాత్రం తద్భిన్నం. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తెచ్చిన అప్పులు.. హడ్కో లాంటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తేనున్న రుణాలతో చేపట్టే పనుల అంచనా వ్యయాన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున పెంచేసి దోచుకోవడానికి ప్రణాళిక రచించారు. రాజధానిలో మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 71 బంగ్లాల నిర్మాణానికి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ దీనికి మరో తార్కాణం. బిడ్లు దాఖలుకు 3వతేదీ తుది గడువు..రాజధాని ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు నిర్మిస్తున్నారు. మరో 24.13 ఎకరాల్లో ఒకొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణాన్ని చేపట్టారు. వీటికోసం మొత్తం రూ.401,37,22,221 కాంట్రాక్టు విలువతో సీఆర్డీఏ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, మురుగునీటి వ్యవస్థ, హోమ్ ఆటోమేషన్ లాంటి అధునాతన సదుపాయాలతో ఈ బంగ్లాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని.. మరో రెండేళ్లు వాటిని నిర్వహించాలని షరతు విధించారు. టెండర్లో పాల్గొని బిడ్లు దాఖలు చేసేందుకు మార్చి 3వ తేదీ తుది గడువు కాగా అదే రోజు టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. మార్చి 7న ఆర్థిక బిడ్ తెరిచి తక్కువ ధర (ఎల్–1)కు కోట్ చేసిన కాంట్రాక్టర్కు పనులు అప్పగించనున్నారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాలలో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులు అని టెండర్లో పేర్కొన్నారు. కానీ.. టెండర్లో పేర్కొన్న ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. ఇక సీనరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో రూ.76.59 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే 71 బంగ్లాల నిర్మాణ వ్యయం రూ.477.96 కోట్లు కానుంది. అంటే.. సగటున చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.10,042.86 అవుతోంది.భూమితో కలిపి రూ.4 కోట్లకే అత్యంత అధునాతన విల్లాలు..నిజానికి రాజధాని ప్రాంతంతో పోల్చితే విజయవాడ, గుంటూరు పరిసరాలు.. విజయవాడ–గుంటూరు హైవే సమీపంలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం సీఆర్డీఏ నిర్మించ తలపెట్టిన బంగ్లాల తరహాలోనే.. అత్యంత అధునాతనంగా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భూమి విలువతో కలిపి విజయవాడ, గుంటూరు, విజయవాడ–గుంటూరు హైవే ప్రాంతాల్లో రూ.నాలుగు కోట్ల లోపే విల్లాలు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు, బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ నిర్మిస్తున్న బంగ్లాలకు భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే నిర్మాణ వ్యయం ఒక్కో బంగ్లాకు ఏకంగా రూ.6.73 కోట్లుగా నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బంగ్లాల ముసుగులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నాయని పేర్కొంటున్నారు.కాంట్రాక్టు విలువపై సర్వత్రా విస్మయం..రాజధాని ప్రాంతంలో రహదారులు, ముంపు ముప్పు నివారణ పనుల నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల వరకూ అంచనా వ్యయాన్ని వాస్తవ ధరల కంటే రెండింతలు పెంచేసి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తుండటంపై ఇంజనీర్లు, బిల్డర్లు, రియల్టర్లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లోనూ అదే ఆనవాయితీని కొనసాగించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఈ బంగ్లాల పునాది పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రూ.76.59 కోట్ల మేర రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చి.. రూ.401.37 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారమే కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో ఇసుక ఉచితంగా, విస్తారంగా లభిస్తోందని గుర్తు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా సిమెంటు, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి ధరలలో పెద్దగా మార్పులేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడాన్ని బట్టి చూస్తుంటే... ముఖ్యనేతలు అడిగినంత కమీషన్ చెల్లించే కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టేందుకేనని స్పష్టమవుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. అందులో తిరిగి ఎనిమిది శాతం కమీషన్గా వసూలు చేసుకుని.. నీకింత నాకింత అనే ధోరణిలో పంచుకుతింటున్నారని చెబుతున్నారు. -
అవినీతి నిర్మాణానికి రెట్టింపు ‘అడుగు’
సాక్షి, అమరావతి: రాజధానిలో భవనాల నిర్మాణ పనుల టెండర్లలో అడుగు అడుగుకు కమీషన్లు దండుకోవడానికి ముఖ్య నేతలు ప్రణాళికాయుతంగా పావులు కదుపుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల పనుల టెండర్లలోనైతే మరీ బరితెగించారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులపై ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచేసేలా చక్రం తిప్పారు. ఆ కాంట్రాక్టు సంస్థ బ్రోచర్నే నిబంధనలుగా పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టాక.. అందులో పది శాతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. దాన్నే తొలి విడత కమీషన్గా వసూలు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత చేసిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు మిగతా కమీషన్ వసూలుకు ప్రణాళిక రచించారు. వివరాల్లోకి వెళితే..రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్తో లోపల, బయట విద్యుదీకరణ, ఐటీ పనులు.. లోపల, బయటి ప్రాంతాల్లో ప్లంబింగ్తో బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలను నిర్మించాలని టెండర్లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్లో పాల్గొంటూ బిడ్లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3వరకు గడువు ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తారు. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మార్చి 7న తెరిచి, తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించనున్నారు.వ్యయంపై నోరెళ్లబెడుతున్న బిల్డర్లు, ఇంజినీర్లుఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1లో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1లో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు.. ఇందులో రూ.2,500 వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టవచ్చని బిల్డర్లు, ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ రూ.132.02 కోట్లే అవుతుంది. బంగ్లాల నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లకు మించి కాదని స్పష్టం చేస్తున్నారు. అంటే.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.232.02 కోట్లకు మించదు. మౌలిక సదుపాయాలను కూడా కలుపుకొంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి రూ.4,393.48కు మించదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ మాత్రం ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.498.16 కోట్లకు నిర్ణయించింది. దీనిప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,433.06 అవుతోంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.5,040.12కు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా భారీగా పెంచేయడంపై బిల్డర్లు, ఇంజినీర్లు అవాక్కవుతున్నారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి దోచుకోవడానికి ముఖ్య నేతలు సీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అంచనా వ్యయాన్ని పెంచేలా చక్రం తిప్పారని చెబుతున్నారు.తన రికార్డు తానే బద్దలురాజధాని ప్రాంతంలో జీ+12 పద్ధతిలో (14 టవర్లలో 1440 ఫ్లాట్లు) గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1806.29. రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.75. అంతస్తులు పెరిగే కొద్దీ భవన నిర్మాణ వ్యయం తగ్గుతుంది. బహుళ అంతస్తులతో అత్యంత విలాసవంతంగా నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని అప్పట్లో బిల్డర్లు, ఇంజినీర్లు స్పష్టం చేశారు. కానీ.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించిన ముఖ్య నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లలో కూడా సీఆర్డీఏ, ఏడీసీఎల్ తమ రికార్డులను తామే బద్ధలు కొడుతూ అంచనా వ్యయాన్ని పెంచేశాయనే చర్చ బిల్డర్లు, ఇంజినీర్లలో జోరుగా సాగుతోంది. -
స్కామ్ల పరం.. అమరావతి పురం!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో అమరావతిని కూటమి ప్రభుత్వం కుంభకోణాల మయంగా మార్చేస్తోంది. అడుగడుగునా కమీషన్ల దందాతో ఖజానాకు చిల్లు పెడుతూ అమరావతిని అక్రమాల పురంగా తీర్చిదిద్దుతోంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచేసిన ప్రభుత్వం ఆ భారాన్ని ఇప్పటికే అడ్వాన్సు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిపై మోపితే వ్యతిరేకత వస్తుందని పసిగట్టి దాన్ని రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేస్తోంది. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి, వాటినే కమీషన్లు రూపంలో వసూలు చేసుకునేందుకు ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తి చేపట్టిన హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు టెండర్లలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలను గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు బహిర్గతం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రెండింటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే అయినా హ్యాపీ నెస్ట్ నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,500కిపైగా అదనంగా ఉండటమే అక్రమాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.షెడ్యూళ్లకు 8వ తేదీ తుది గడువుఅమరావతిలో 2018లో నాటి టీడీపీ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తుల్లో 1,200 ప్లాట్లతో హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నారైలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అడ్వాన్సులు సేకరించింది. హ్యాపీ నెస్ట్ పనులను అప్పట్లో రూ.658 కోట్లకు సీఆర్డీఏ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. అయితే అది ముందుకు కదల్లేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టింది. గత టెండర్ను రద్దు చేసింది. తాజాగా రూ.818.03 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. మూడేళ్ల పాటు నిర్వహించాలనే నిబంధనతో ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో టెండర్లు పిలిచింది. టెండర్ల షెడ్యూళ్ల దాఖలుకు ఈనెల 8వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్లను పదో తేదిన తెరిచి తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది. జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు రూ.153.05 కోట్లు రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొంది. షీర్ వాల్ టెక్నాలజీతో అల్యూమినియం ప్రేమ్వర్క్, పోడియం, ఆర్కిటెక్చరల్ ఫినిషెస్.. బయట, లోపల విద్యుదీకరణ, ఎల్పీజీ లాంటి సౌకర్యాలతో హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లను నిర్మించాలని టెండర్లలో పేర్కొంది. తగ్గిన ధరలు.. అంచనాల్లో వంచనహ్యాపి నెస్ట్ ప్రాజెక్టుకు 2018లో తెరతీసిన ప్రభుత్వం.. అప్పట్లో పనులను కాంట్రాక్టర్కు రూ.658 కోట్లకు అప్పగించింది. కానీ.. ఆ ప్రాజెక్టు అప్పట్లో ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. భవన నిర్మాణాల్లో వినియోగించే స్టీల్, సిమెంట్, కంకర తదితరాలతోపాటు విద్యుత్, శానిటరీ ఉపకరణాల దగ్గర నుంచి లిఫ్ట్ల వరకూ గతంతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. నిజానికి 2018తో పోలిస్తే కొన్నిటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. ఇక ఇసుక పూర్తి ఉచితమని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి ఆస్కారమే ఉండదని ప్రముఖ బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. అలాంటిది హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.818.03 కోట్లుగా నిర్ణయించి తాజాగా సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, రూ.153.05 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొనడంపై బిల్డర్లు విస్తుపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.971.08 కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టులో మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చ.అ. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి రూ.4,511.76 చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన డిజైన్ కంటే మరిన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టినా చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపినా రూ.1,800 నుంచి రూ.2వేల లోపే నిర్మాణ వ్యయం అవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనాల్లో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు.అక్రమాలు ఇలా బహిర్గతం..హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ రీతిలోనే.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో గెజిటెడ్ ఆఫీసర్లకు టైప్–1, టైప్–2 విధానంలో జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు మొత్తం నిర్మిత ప్రాంతం 27,24,080 చ.అ. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 అవుతుంది. ఇక సీనరేజీ, ఎన్ఏసీ, జీఎస్టీ పన్నుల రూపంలో రూ.93.2 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. ఇవన్నీ కలిపినా గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,148.45 దాటదు. దీన్ని బట్టి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు సీఆర్డీఏ పిలిచిన టెండర్ల సాక్షిగా బట్టబయలైందని బిల్డర్లు చెబుతున్నారు.సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో అక్రమాలు⇒ రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 మాత్రమే. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ మాత్రం నిర్మాణ వ్యయం ఏకంగా చ.అ.కు రూ.4,511.76 చొప్పున నిర్దేశించారు. నిజానికి అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గాల్సింది పోయి ఇక్కడ అమాంతం పెరిగిపోయింది. హ్యాపీ నెస్ట్.. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు.. ఇవి రెండూ షీర్ వాల్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేపడతారు. వాటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే. కానీ నిర్మాణ వ్యయం మాత్రం వేర్వేరు.⇒ అధునాతన సదుపాయాలు, నాణ్యమైన నిర్మాణ సామగ్రి వినియోగించి కట్టే బహుళ అంతస్తుల భవనాల్లోనూ (టవర్స్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని (జీఎస్టీ, సీనరేజీ లాంటి అన్ని పన్నులతో కలిపి) విజయవాడ–గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పేరు మోసిన బిల్డర్లు చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రాజధాని అమరావతిలో చేపట్టిన హ్యాపి నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులో మాత్రం చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4,511.76 ఉంది. దీన్ని బట్టి ఒక్కో చ.అడుగుకు రూ.2,500కిపైగా అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు.⇒ రెండు మూడు సంస్థలు జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పడి షెడ్యూలు దాఖలు చేయడానికి వీల్లేదని హ్యాపీనెస్ట్ టెండర్ నోటిఫికేషన్లో సీఆర్డీఏ నిబంధన విధించింది. కానీ ఆ ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 25 శాతం పనులను సబ్ కాంట్రాక్టు కింద అప్పగించే వెసులుబాటు కల్పించింది. దీన్ని బట్టి ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్టు సంస్థకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును అధిక ధరలకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వ్యూహంతో ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు వెల్లడవుతోంది. -
అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్..!
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.ధరలు పెద్దగా పెరగకపోయినా..గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం. -
సీఆర్డీఏలో మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు, విదేశీ సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టడమనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గత పాలనంతా కన్సల్టెంట్ల మయం. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)లోనూ కన్సల్టెంట్ల రాజ్యానికి గేట్లు తెరుచుకున్నాయి. అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కు, అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇలా రెండు రకాల కన్సల్టెంట్ల కోసం సీఆర్డీఏ వేర్వేరుగా రెండు ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ కన్సల్టెంట్లకు రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించింది.ఇందులో అభివృద్ధి పనుల ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద 63 మందికి రెండేళ్లలో రూ.62.36 కోట్లు చెల్లిస్తారు. అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం భాగసామ్యాన్ని ప్రోత్సహించేందుకు నియమితులయ్యే ఐదుగురు కన్సల్టెంట్లకు మూడేళ్లలో రూ.8.28 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఒక్కో కన్సల్టెంట్కు నెలకు రూ. 2 అక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్డీఏ తెలిపింది. పనుల్లో నాణ్యత, సాంకేతికతకు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు సహకారం అందిస్తారు.పనుల కాల వ్యవధిని ఏకీకృతం చేయడం, సమయానికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించడం, గడువులోగా బడ్జెట్ విడుదల ప్రణాళికను వీరు రూపొందిస్తారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అమలు చేసే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పురోగతి నివేదికలను సమర్పించాలి. పనులకు అవసరమైన మెటీరియల్ సేకరణ కోసం ఐటీ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలి. పర్యావరణ, సామాజిక పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం వీరి విధులని సీఆర్డీఏ తెలిపింది.ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం కోసంఅమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం, ప్రపంచంలో అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా రాజధానిని బ్రాండింగ్, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్, ఔట్రీచ్ వ్యూహం అమలు వీరి విధి. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక వనరుల వినియోగంతోపాటు, ప్రైవేటు రంగాన్ని ప్రభావితం చేయడానికి పీపీపీ విధానంలో వినూత్న ఆర్థిక విధానాలతో పెట్టుబడులను తేవాలి. పారిశ్రామిక రంగంలో పోటీతత్వ పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించాలి. ఆర్థిక అభివృద్ధి వ్యూహం ఆధారంగా రోడ్ మ్యాప్ను రూపొందించాలి. ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాల కోసం అవసరమైన నిధులు, పద్ధతులను గుర్తించి, వీటి అమలుకు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ ఆ పత్రంలో పేర్కొంది. -
రాజధానిలో దళితులపై ‘సీఆర్డీయే’ దాష్టీకం!
తాడికొండ: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాజధానిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, దళిత రైతులను మాత్రమే టార్గెట్గా చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న సీఆర్డీయే అధికారులు.. టీడీపీకి చెందిన రైతులకు మాత్రం వత్తాసు పలుకుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తాజాగా శాఖమూరు గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రశాంత్ అనే దళిత రైతు సీఆర్డీయే అధికారుల ఆదేశాల మేరకు మినుము పైరును రోటోవేటర్తో దున్ని అప్పగించిన తరువాత కూడా అక్రమ కేసు నమోదు చేయడం పట్ల పలువురు విస్తుపోతున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే టీడీపీకి చెందిన నాయకులు భారీగా సాగు చేసుకుంటూ, కౌలుకు ఇచ్చుకుంటున్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతున్నది . తుళ్లూరు మండల పరిధిలో పూలింగ్కు ఇచ్చి రిటర్న్బుల్ ప్లాట్లు పొంది వార్షిక కౌలు తీసుకుంటున్న రైతులు పొలాలను దున్ని సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎకరా రూ.30 వేలకు కౌలుకు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇలా.. సాగు చేసుకుంటున్న వారిలో కేవలం దళిత రైతులపై సీఆర్డీయే అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. మిగిలిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకుల చేతుల్లో వందలాది ఎకరాలు బందీగా మారినప్పటికీ అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం వారాంతపు గ్రీవెన్స్లో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, గద్దర్ చెన్నకేశవ తదితరులు సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ను కలిసి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న పంట పొలాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వారు తెలిపారు. పనుల్లేక పస్తులుండలేక ఖాళీగా ఉన్న భూముల్లో పేదలు ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు సాగు చేసుకుంటే కేసులు నమోదు చేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకుల చేతిలో ఉన్న భూములను కూడా దున్నడంతో పాటు కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
సీఆర్డీఏలో భూ కేటాయింపులపై మంత్రులతో బృందం
సాక్షి, అమరావతి: సీఆర్డీఏలో పలు సంస్థల భూ కేటాయింపుల సమస్యలను పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మంత్రుల బృందంలో పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ కన్వీనర్గా వ్యవహరిస్తూ ఈ బృందం ప్రొసీడింగ్స్ను సమన్వయం చేస్తారు. బృందంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్థిక, ప్రణాళిక, ఉన్నత విద్యా, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, యువజన సర్వీసు శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. మంత్రుల కమిటీ అప్పగించిన బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. మంత్రులు బృందం ఎప్పటికప్పుడు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ బృందం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవేంటంటే..» సీఆర్డీఏలో గతంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులను సమీక్షించి ఇప్పటికే ఉన్న వాటి కేటాయింపులను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవాలి. ఇందివరకే కేటాయించిన భూమి వినియోగం లేదా ఇతర అంశాలను అంచనా వేయడంతోపాటు అవసరమైన మార్పులను పరిశీలన చేయాలి.» భూ కేటాయింపుల కోసం కొత్త అభ్యర్థనలను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలి. పలు రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థలను గుర్తించి వాటిని అమరావతిలో తమ కార్యాకలాపాలను నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలి. సీఆర్డీఏ ప్రాంతంలో పలు సంస్థలకు మొత్తం భూముల కేటాయింపుల పురోగతిని పర్యవేక్షించాలి. 17 నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా సన్నాహక కార్యక్రమం ఈ నెల14న ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు.తక్కువ బడ్జెట్తో నాణ్యమైన రోడ్లు నిర్మించాలి తక్కువ వ్యయంతో ఎక్కువకాలం మన్నేల రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బి అధికారులను సీఎస్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో వెలగలపూడిలోని సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. -
హైవేతో అమరావతి అనుసంధానం
సాక్షి, అమరావతి: రాజధాని(అమరావతి) ప్రాంతాన్ని చెన్నై–కోల్కతా జాతీయ రహదారి(ఎన్హెచ్–16)తో కలిపేందుకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడి గ్రామాల మీదుగా ఆరు లేన్లతో నాలుగు ప్రధాన రహదారులను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరు లేన్ల రోడ్ల పనులకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సైతం సిద్ధం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబుతో సమావేశమై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లాలని సీఆర్డీఏ యోచిస్తోంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గతంలోనే ఈ రోడ్లకు అలైన్మెంట్ కూడా చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే వీటిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ–1 నుంచి ఈ–16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్–1 నుంచి ఎన్–18 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ–5, ఈ–11, ఈ–13, ఈ–15 రోడ్లు నిర్మించి.. పడమర వైపు ఉన్న ఎన్హెచ్–16తో అనుసంధానం చేస్తారు. కాగా, రాజధాని నుంచి గ్రామాల మీదుగా వెళ్తున్న ఈ రహదారుల నిర్మాణానికి పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–5 రహదారి ఈ రోడ్డు నిర్మాణం ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఉండవల్లి, మందడం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం మీదుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. మొత్తం 18 కి.మీలు మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ మార్గం.. గ్రామాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–11 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కి.మీ మేర.. జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మరో 4.50 కి.మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డును నీరుకొండ, కురగల్లు, నవులూరు మీదుగా మంగళగిరిలోని ఎయిమ్స్ ముందు నుంచి ఎన్హెచ్–16తో అనుసంధానం చేస్తారు. ఈ–13 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. అనంతరం మంగళగిరి వద్ద ఎన్హెచ్–16తో అనుసంధానించేందుకు మరో 2.5 కి.మీ మేర రోడ్డును విస్తరించి ఎయిమ్స్ వెనుక నుంచి జాతీయ రహదారితో కలుపుతారు. ఈ రోడ్డు నీరుకొండ డౌన్ నుంచి నిడమర్రు, ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి మీదుగా వెళుతుంది. ఈ–15 రహదారి నిడమర్రు నుంచి జగనన్న లేఅవుట్, నవులూరు, క్రికెట్ స్టేడియం మీదుగా ఎయిమ్స్ వద్ద ఉన్న పాత హైవేకు అనుసంధానం చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు(ఈ–3)ను.. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 21 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టారు. అయితే, దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర రోడ్డు పూర్తయ్యాక అనేక వివాదాలతో పనులు నిలిచిపోయాయి. రెండో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. మరో 4 కి.మీ మేర మార్గంలోని రైతులను ఒప్పించి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని సీఆర్డీఏ భావిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఈ నెలలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
మళ్లీ సింగపూర్ కంపెనీలకే అమరావతి!
సాక్షి, విజయవాడ: అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. అమరావతి విషయంలో సీఆర్డీఏ తొలి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సింగపూర్తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవినీతి మోడల్గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒప్పందం చేసుకున్నారు. .. ఈశ్వరన్ దోపిడీపై ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకి పంపింది. భూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి అన్నట్లు ఉండేది. ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్. 58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే ఉంది. 1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ డెవలపర్గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. .. స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే ప్రభుత్వం కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీఐ చట్టానికి విరుద్ధమని ఐవైఆర్ అభ్యంతరం తెలిపారు. రూ. 66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు చేశారు. అదే సింగపూర్ మోడల్కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
8,352 చ.కి.మీ.లలో సీఆర్డీఏ పరిధి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) 8,352 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం.. అప్పట్లో గుర్తించిన విస్తీర్ణం మేరకు సీఆర్డీఏ పరిధిని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ సమావేశాన్ని నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికే భూమి కేటాయించాలన్నారు. గతంలో భూములు పొందిన వ్యక్తులు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి.. అనే అంశంపైనా చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. దేశంలో టాప్ 10 కళాశాలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన పలు గ్రామాలను తిరిగి రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తాం : మంత్రి నారాయణ రాష్ట్రంలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘సీడ్ క్యాపిటల్ను చెన్నై–కలకత్తా హైవేకు అనుసంధానిస్తాం. ఇందుకు ప్రస్తుతం నిర్మిస్తున్న సీడ్ యాకిŠస్స్ రోడ్డుతో పాటు మరో నాలుగు రోడ్లను అభివృద్ధి చేస్తాం. గతంలో రాజధాని మాస్టర్ ప్లాన్లో అనుకున్న విధంగా హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి నవ నగరాలు నిర్మిస్తాం’ అని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును సెంట్రల్ డివైడర్ ఉండేలా నాలుగు లేన్లతో నిర్మించేలా వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా మరో నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు వస్తాయన్నారు. 2019కు ముందు రాజధానిలో పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించామని.. ఆయా సంస్థలు వీలైనంత త్వరగా సంస్థలను నెలక్పొలేలా చర్చిస్తామని తెలిపారు.సీఆర్డీయే పరిధిలోకి బాపట్ల, పల్నాడు జిల్లాలురాజధాని ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన కట్టడాల పరిశీలనకు ఐఐటీ హైదరాబాద్ బృందం అమరావతిలో పర్యటించిందని, శనివారం ఐఐటీ మద్రాస్ నిపుణులు ఐకానిక్ భవనాల కట్టడాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. వచ్చే వారంలో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడతామని చెప్పారు. అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా తిరిగి ప్రారంభించేలా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఆర్5 జోన్ అంశం న్యాయస్థానంలో ఉండటంతో న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పుడున్న వారితో పాటు మరో 32 మంది కన్సల్టెంట్స్ను నియమిస్తామని వెల్లడించారు. సీఆర్డీయే పరిధిలోకి కొత్తగా పల్నాడు, బాపట్ల జిల్లాలు కూడా వస్తున్నట్టు మంత్రి వివరించారు. పథకాలు.. ఫలితాలుప్రజలకు కేవలం పథకాలు అందించడమే కాదని, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమం, విద్యుత్ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్యతో చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని మహిళా హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ అందాలి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగు పరచడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తితోపాటు సరఫరా మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్తుకు ప్రాధాన్యత క ల్పించే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పరిస్థితిని వివరించారు. ఇంధన శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఏపీ జెన్కో ఎండీ చక్ర«దర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి తదితరులు పాల్గొన్నారు. ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలిరాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణను అస్తవ్యస్తంగా మార్చిందని ఆరోపించారు. ధాన్యం సొమ్మును చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేశారని, ఇకపై ఎలాంటి అవరోధాల్లేకుండా ధాన్యం సేకరణ చేయాలని సూచించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోప భూయిష్టంగా సాగిందని ఆరోపించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సిద్ధార్థ్జైన్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త మద్యం విధానం సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని, గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీల ఫైళ్లను సీజ్ చేయాలని ఆదేశించారు. -
CRDA అధికారులపై రైతుల ఆగ్రహం
-
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'
సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్ యార్డు వద్ద సర్వే నంబర్ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్డీఏ కమిషనర్కు వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్ప్రసాద్.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్తో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్కు భూ సంతర్పణ అలైన్మెంట్ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్కు ఐఆర్ఆర్ అలైన్మెంట్కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
వార్షిక కౌలు జీవో అమలును నిలిపేయండి
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు. వాస్తవానికి సీఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పింఛను కానుక పంపిణీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయం(శుక్రవారం) నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల పింఛన్ను మార్చి ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లు ప్రారంభించారు ఈ మేరకు పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,958.52 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పింఛను అందజేసే సమయంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్, ముఖ ప్రమాణీకరణ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛను అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఐదు రోజుల్లో పింఛన్లను నూరు శాతం పంపిణీ చేయాలని వలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది.. -
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు
సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది. అందుకు అనుగుణంగానే పూలింగ్కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య సురక్ష: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యసురక్షపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని విడుదల చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష తర్వాత.. సీఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారుల సమీక్షలో సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలి. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలి. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్ రోజు నాడు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలా జల్లెడ పట్టిన ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరకి ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో సూచిస్తాం. ఒకవైపు తనిఖీలు చేస్తూనే.. మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలి’’ అని సీఎం చెప్పారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పనిచేయడంతో పాటు వారిని చేయిపట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలతో పాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం -
నోటీసుల దశలో అప్పీల్ ఏంటి?
సాక్షి, అమరావతి: తమకు వార్షిక కౌలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ముందు అమరావతి రాజధాని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే తమ ముందు ఆ సంఘాలు అప్పీల్ దాఖలు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోరిన విధంగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదన్న కారణంతో అప్పీల్ దాఖలు చేయడం ఎంత వరకు సబబని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్న కారణంతో అప్పీళ్ల దాఖలుకు అనుమతినిస్తే, ఇకపై అలా దాఖలయ్యే అప్పీళ్లకు అంతూ పొంతూ ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నోటీసు దశలో దాఖలయ్యే అప్పీళ్లు ప్రస్తుతం హైకోర్టు కొనసాగిస్తున్న సంప్రదాయ విధి విధానాలకు భంగం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అప్పీల్ దాఖలు చేసి అత్యవసరంగా విచారించాల్సినంత అవసరం ఇందులో ఏముందని, ఇదేమీ ఇళ్ల కూల్చివేత వ్యవహరం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి సైతం ఈ అప్పీల్ను వ్యతిరేకించారు. ఈ అప్పీల్కే కాక, సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్కు సైతం విచారణార్హత లేదన్నారు. వార్షిక కౌలు చెల్లించాల్సింది రైతులకే తప్ప, రైతు సంఘాలకు కాదని ఆయన వివరించారు. సీఆర్డీఏ ఒప్పందాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ, నోటీసు దశలో అప్పీల్ దాఖలు చేయవచ్చునన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులున్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కౌలు చెల్లించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఆర్డీఏలను ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశాయి. సీఆర్డీఏ అధికారులు అభ్యర్థించిన విధంగా వార్షిక కౌలు చెల్లింపుల మొత్తాలను ఆమోదించేలా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరాయి. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్డీఏకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తాము కోరిన విధంగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో, రైతు సంఘాలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్ గురించి ఉన్నం మురళీధరరావు గత వారమే సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సీజే సైతం నోటీసుల దశలో అప్పీల్ దాఖలుపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
సంపద సృష్టి అనే మాటను తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఏపీలో ఒక నాయకుడు తనకే సంపద సృష్టించడం తెలుసు అని ఏదేదో చెబుతుంటారు. కానీ, మరో నాయకుడు సంపద సృష్టించి చూపించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే పేదలను ధనికులను చేస్తానని పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతుంటే, ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు లక్షల విలువైన ఆస్తి సమకూర్చి ‘ఇదీ.. పేదలను ఆదుకోవడం’’ అని రుజువు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఇరవైఐదు లే అవుట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం చూస్తే కొన్ని స్పష్టమైన నినాదాలు, విధానాలతో ఆయన ముందుకు వెళుతున్నట్లు అర్ధం అవుతుంది. తొలుత ఒక లబ్దిదారు మాట్లాడుతూ తనకు కేటాయించిన సెంటు భూమి విలువ ఇప్పుడు పది లక్షలకు పైనే ఉంటుందని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దానికి తోడు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరో మూడు లక్షలు, అక్కడ మౌలిక వసతులకు ఖర్చు పెట్టబోయే నిదులను లెక్క వేసుకుంటే మొత్తం పదిహేను లక్షల వరకు ఆమెకు సమకూరినట్లవుతుంది. నిజంగానే సంపదను సృష్టించడం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ✍️ గతంలో అమరావతి గ్రామాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజధాని అని ప్రకటించినప్పుడు భూములు కలిగిన ఆసాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు లబ్ది పొందితే.. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఆ ప్రాంతంలో లబ్ది పొందడం గమనించదగిన అంశమే అవుతుంది. అందుకే ఆయన పెత్తందారులే అక్కడ పాగ వేయాలని అనుకున్నారని, కాని తాము పేదలకు అవకాశం ఇచ్చామని, దీనిని సామాజిక అమరావతిగా. మనందరి అమరావతిగా మార్చామని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ఉపన్యాసం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం జరగకుండా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు. ✍️ అయినప్పటికీ మీ బిడ్డ మీ తరపున మూడేళ్లపాటు న్యాయపోరాటం చేసి, పేదలకు ఇళ్లు కట్టించడం వరకు తెచ్చామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్లు కట్టవద్దంటూ ఏపీలోనే ప్రతిపక్షం అడ్డుపడిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేసి అడ్డుకునే యత్నంచేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చేయాలని, నిధులు రాకుండా అడ్డుపడాలని చూశారని ఆయన తెలిపారు. ఊరుపేరులేని సంఘాలను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ✍️ ఒకప్పుడు అమరావతి రాజధానిలోకి జగన్ రాకూడదని కొందరు పసుపు నీళ్లు చల్లి అవమానించే యత్నం చేస్తే.. ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్ యాభై నాలుగువేల మందికి ఇళ్లు కట్టిస్తుండడం విశేషం. చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన , అలాగే ఈనాడు తదితర ఎల్లో మీడియా పేదలకు ఎలా వ్యతిరేకంగా ఉన్నారో ఆయన ఆధారసహితంగా వివరించడం ద్వారా రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ పంపించారు. తాను పేదల ప్రతినిధినని.. చంద్రబాబు, పవన్ లు పెత్తందార్ల ప్రతినిధులని, పేదల కోసం తాను పలు స్కీములు అమలు చేస్తుంటే, చంద్రబాబు తదితరులు వాటిని అడ్డుకుంటున్నారని.. తాను చేస్తున్న వాదనకు ఆయా ఉదాహరణలను కూడా జగన్ ఇచ్చారు. ప్రత్యేకించి పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్నారని ఆయన గుర్తు చేశారు.అదే టైమ్ లో ఆ పెత్తందార్లంతా తమ పిల్లలను ఇంగ్లీష్ బడులలో చదివిస్తున్నారని ఎద్దేవ చేశారు. ✍️ పేదవారికి తాను మేలు చేస్తుంటే వీరు ఓర్వలేకపోతున్నారని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాకపోతే వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఆయన మాట్లాడలేదు. మొత్తం స్పీచ్ లో పెత్తందార్లు, పేదల మధ్య పోరాటం గురించే ఆయన చెప్పే యత్నం చేశారు కాని, ఇతరత్రా రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. ✍️ అమరావతి ప్రాంతంలో గజం విలువపదిహేను వేల వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావించి , ఆ స్థలాలతో పాటు,రోడ్లు, నీరు, పార్కులు, తదితర సదుపాయాలు సమకూర్చుతున్న సంగతిని ఆయన వివరించి 12 లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల మేర ఆస్తిని సమకూర్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పేదలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేకపోయారు. సంపద సృష్టి అంటే ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చూస్తారన్న భావన ఉంది. అదికూడా బాగా డబ్బున్నవారికే అదనంగా వచ్చే ఆదాయవనరుగా మార్చడం మినహాయించి పేదల పక్షాన ఆయన ఉండేవారు కాదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అమరావతిని ఒక వర్గం రాజధానిగా, ధనికుల రాజధానిగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసనకు గురయ్యారు. అందుకే అమరావతిని జగన్ పేదలు కూడా నివసించే రాజధానిగా మార్చినట్లయింది. ఇక్కడ కొందరు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు. ✍️ జగన్ ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమేకాని, ఇతరత్రా అభివృద్ది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన జవాబు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఏ పని చేద్దామన్నా కేసులు వేసి అడ్డుకుంటున్నవారే ఈ ప్రశ్నలు వేస్తున్నారని , తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, కేసుల గొడవ లేకపోతే అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన అన్నారు. రాజధాని గ్రామాలలో కొంతమంది తెలుగుదేశం, తదితర కొన్ని రాజకీయ పక్షాల ట్రాప్ లో పడి , అక్కడ అభివృద్ది కన్నా, ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. అది వాస్తవం. ✍️ చంద్రబాబు నాయుడు పరాజయం చెందినా, ఆయన మాట ప్రకారమే నడుచుకుని వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి కాగానే అనవసర నిరసనలకు పోకుండా, వారంతా ఒక కమిటీగా ఏర్పడి, జగన్ ను కలిసి తమకు కావల్సిన అభివృద్ది పనులను చేయించుకుని ఉంటే బాగుండేది!. పైగా ఒకేసారి 55 వేల ఎకరాల భూమిని అభివృద్ది చేయడం ఎవరి వల్లా కాదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం అలివికాని పనిని భుజాన వేసుకుని చతికిలపడ్డారు. పైగా ఆయన టైమ్ లో రాజధాని ప్రాంతంలో పేదలకు ప్రాతినిధ్యమే లేదన్నట్లుగా వ్యవహారాలు సాగాయి. చివరికి అస్సైన్డ్ భూములను కూడా తమ అధీనం చేసుకున్నారు. దానికి ఆనాటి ప్రభుత్వం సహకరించి అప్రతిష్టపాలైంది. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త టౌన్ షిప్ లు నిర్మించడం కూడా అభివృద్దిలో భాగమే అవుతుంది. ఇదే మాదిరి ఇతరత్రా అభివృద్ది పనులు కూడా జరిగేలా అందరు సహకరిస్తే మంచిది. లేకుంటే ఎప్పటిమాదిరి పెత్తందారి పోకడలతోనే,కుట్రలలోనే భాగస్వాములవుతామని ప్రతిపక్షం అనుకుంటే అది వారికే నష్టం అని వారు తెలుసుకోవాలి. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అమరావతి అందరిదీ
పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా.. నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో ‘సామాజిక అమరావతి’కి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని రాక్షస బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లాడారు. తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వెంకటపాలెంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు.. సీఆర్డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్లç స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు సృష్టించిన ఊరుపేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ – 5 అడ్డు తగిలాయి. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుడు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రీ, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇంతమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇలా పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజయం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడా వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సొంతింటి కలల సాకారానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడలేదు అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు. నయా జమీందార్ల మొసలి కన్నీరు పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీందార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు. పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచనకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ పేదవాడు, అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే అది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు ఏ సమాజమైనా, కుటుంబమైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ల నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుటు్టపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనాడులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా? జగనన్నను టచ్ కూడా చేయలేరు ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పేదలను పీక్కుతిన్నాడు. పవన్కళ్యాణ్ ఎన్నో పార్టీలు మార్చాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం.. ఇలా ఎన్ని పార్టీలైనా మార్చగలడు. మా జగనన్నను ఓడిస్తారా.. ఎంతమంది వచ్చినా ఆయన్ను టచ్ కూడా చేయలేరు.ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత? పెత్తందార్ల కోటలను బద్దలుకొట్టి, పేదల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించి జగన్ చరిత్రను తిరగరాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరొచ్చాకే బడుగు వర్గాలకు ధైర్యం వచ్చింది మీరు పాదయాత్ర చేస్తే రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన వ్యక్తులను ఇక్కడ చూశాం. మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ధైర్యం, భరోసా వచ్చింది. జగన్ పేదల పక్కనుంటే చంద్రబాబు పెత్తందార్ల తరఫున యుద్ధం చేస్తున్నాడు. కోర్టులలో సైతం జగన్ గెలిచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీవితకాలం పేద వాడి గుండెల్లో మీ పేరు నిలిచిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలను లక్షాధికారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. – బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాలకుడంటే ప్రజల కన్నీటిని తుడిచేవాడు.. పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త అర్థం చెప్పారు. మేం మీకు రుణపడి ఉంటాం. మీరే మా ధైర్యం అన్నా. మీకు పక్కనే ఉన్న వెంకన్న స్వామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మేం అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం. నగదు రూపంలో మొత్తం రూ.1,89,250, స్థిరాస్తి రూపంలో రూ.పది లక్షల నుంచి రూ. పదిహేను లక్షలు వరకు లబ్దిపొందాను. – రోజా, లబ్ధిదారు, మంగళగిరి వలంటీర్లపై బురద జల్లుతున్నారు నేను సొంత ఇల్లులేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ, మీరు రాగానే మంజూరైంది, మా పేదల తరఫున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం. అన్నా.. నేను నాలుగేళ్లుగా వలంటీర్గా సేవలు అందిస్తున్నాను, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ మాపై బురద జల్లుతున్నారు. మీరు మాకు ధైర్యం ఇచ్చారు, థాంక్యూ అన్నా. – స్వప్న, లబ్దిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం -
ఇంత దుర్మార్గులను ఇక్కడే చూస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డుతగిలిన ప్రబుద్ధులు ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు.. వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు-పేరు లేని సంఘాలు. వీళ్లంతా పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశాం. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. పట్టాలు అందించి.. మోడల్ హౌజ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారాయన. అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. పేదలందరికీ ఈరోజు మరిచిపోలేనిది. పేదల శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇది. ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారు. పేదవాడికి ఇల్లు రాకూడదని.. అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికోసం సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితి మరెక్కడా రాకూడదు’’.. ఇవాళ పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారు. ఇందుకోసం ఎక్కడని గడపంటూ లేదు. మూడేళ్ల తరపున మీ కోసం పోరాటం చేశాం. అందుకే.. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయం. రాక్షస బుద్ధితో ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ పెత్తందారులు.. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని సీఎం జగన్ నిలదీశారు. పేద పిల్లలు బాగుపడడం వాళ్లకు ఇష్టం లేదు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉందో గమనించండి అంటూ ఏపీ ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఇక సామాజిక అమరావతి.. మనందరిది పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా?. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మన అందరిది. ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నాం. పేదల విజయంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. మహిళా సాధికారకతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం. గత ప్రభుత్వం చేయని మంచి చేశాం. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అని ఆయన ప్రజలను కోరారు. పేదవాడి సొంతటి కల సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 1,829. 57 కోట్ల వ్యయంతో.. 50 వేల మందికి పైగా పేదలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 1,402.58 ఎకరాల్లో.. 50, 793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పంపిణీ చేయనుంది జగనన్న ప్రభుత్వం. -
పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్ జీవితాంతం రుణపడి ఉంటా లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. :::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రజాప్రభుత్వ ఆవిష్కరణలో మరో మైలురాయి
-
అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. సీఎం సంకల్పానికి తార్కాణం
మంగళగిరి/సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. అమరావతి రాజధానిలో అది మరొక ఎత్తని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పానికి ఇది తార్కాణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని జగనన్న లేఅవుట్లో ‘నవరత్నాలు–పేదలందరికే ఇళ్లు’ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని ఆదివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధి అమరావతి రాజధానిలో పేద, బడుగు, బలహీనవర్గాలు ఉండటానికి వీల్లేదని.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు, ఆయన సామాజికవర్గం మాత్రమే ఇక్కడ నివసించాలని కుట్రతో కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా.. ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాక అక్కడ ఇళ్లను సైతం నిర్మించి ఇచ్చేందుకు చేస్తున్న కృషి ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనమని మంత్రులు కొనియాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరగదని, పేదలకు ఇళ్లు రావని టీడీపీతో పాటు ఆయన తోక పారీ్టలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతున్నామన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రక ఘట్టమని, రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపుమంటతో రగలిపోతున్నాడన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు.. ఇక అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజతో పాటు సామాజిక మౌలిక వసతులకు సంబంధించి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, డిజిటల్ లైబ్రరీ, ఈ–హెల్త్ సెంటర్ల భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. గ్రీన్ సోషల్ ఫారెస్ట్లో భాగంగా లేఅవుట్లో అభివృద్ధి చేసిన చెరువు వద్ద, ఇతర ప్రాంతాల్లో 30వేల మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. సీఆర్డీఏ పరిధిలోని 25 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను అతి త్వరలోనే పూర్తిచేసేందుకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్లను శరవేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. సీఆర్డీఏ పరిధిలో దాదాపు 35వేల ఇళ్లను ఈ టెక్నాలజీతో నిర్మిస్తారని వారు చెప్పారు. ఇక్కడ ప్రతి ఇంటికీ నీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు పూర్తిస్థాయిలో రహదారులు, డ్రైనేజి వ్యవస్థలను ఏర్పాటుచేసి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లుగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఆర్డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎల్లో ముఠా కుట్రపూరితంగా సృష్టించిన అడ్డంకులను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. అలాగే.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఒకొక్కరికి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల ఆస్తి.. ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా.. నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళలు తమంతట తాము నిలదొక్కుకునేలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట స్థలాలు, ఇళ్లు అందిస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువైన భూములను పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో 17వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నారు. పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. రూ.లక్షల కోట్ల సంపద సృష్టి మరోవైపు.. ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం, ఇల్లు సమకూర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాక.. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తోంది. అంతేకాక.. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తోంది. మోడల్ హౌస్ చాలా బాగా వచ్చింది లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం -
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్కు చేరుకుంటారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌస్ను పరిశీలిస్తారు. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీకోసం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. -
అక్కడ పేదలకు ఇళ్లిస్తే..మా భూముల ధరలు పడిపోతాయి
సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే తమ భూముల ధరలు అమాంతం పడిపోతాయని అమరావతి కోసం భూములిచ్చిన వ్యక్తుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూములిస్తూ చట్టం చేసేందుకు తాము గతంలో ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రికి పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతంలో కాకుండా కడపలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి ఆదాయాన్ని సమకూర్చే ఎల్రక్టానిక్ సిటీ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే చుట్టుపక్కల తమ భూముల ధరలు దారుణంగా పడిపోతాయన్నారు. రాజధాని వెలుపల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని పునరుద్ఘాటించారు. రాజధాని భూముల విషయంలో సీఆర్డీఏ, రైతులకు మధ్య ఉన్నది వ్యాపార ఒప్పందమన్నారు. రైతుల అనుమతి లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... పట్టాల మంజూరు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అందువల్ల పట్టాల మంజూరు వ్యవహారం తేలకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోందని, గృహ నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. రాజధాని భూములపై సీఆర్డీఏకు పూర్తిస్థాయి యాజమాన్యపు హక్కులు లేవని, కేవలం షరతులతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములను ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాతే రాజధాని భూములపై సీఆర్డీఏకు హక్కులు వస్తాయని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. మా నినాదమే.. పేదలందరికీ ఇళ్లు ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, కాసా జగన్మోహన్రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ తోసిపుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఇళ్లను నిరి్మంచుకోవడానికేనన్నారు. ఇళ్లు నిర్మాణం లేనప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రయోజనం ఏముంటుందన్నారు. ప్రభుత్వ నినాదమే ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్లు నిర్మించవద్దని చెప్పలేదన్నారు. ఈ విషయంలో స్పష్టత కావాలనుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి మరో చోట భూమి కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం భూమిలో 5 శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం చెబుతోందన్నారు. చట్ట నిబంధనలకు లోబడి చేసే పనిని ఏ కోర్టు కూడా తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 వేల ఎకరాలను ఇచ్చిందని రెవిన్యూ శాఖ తరఫు న్యాయవాది సుభాష్ తెలిపారు. అందులో 1,400 ఎకరాలు పేదలకిస్తే పిటిషనర్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురి చేత టీడీపీ పిటిషన్లను దాఖలు చేయించిన విషయం తెలిసిందే. -
అమరావతిలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన: అజయ్జైన్
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం జగన్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి. ఇప్పటికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. ఎల్లుండి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగనుంది. తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు -
అమరావతిలో ఆప్షన్ 3 ఆవాసాలే!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 22,125 మంది లబ్దిదారులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 22,976 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. మొత్తం లబ్దిదారుల్లో 88.79 శాతం మంది ఆప్షన్–3కి మొగ్గు చూపారు. వైఎస్సార్ జయంతి రోజు శంకుస్థాపన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే 26వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా శంకుస్థాపన తేదీని కూడా సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం జోరందుకోనుంది. ఉచితంగా ఇసుక.. రాయితీపై 14 రకాల సామగ్రి విలువైన ఇళ్ల స్థలాలను ఉచితంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కూడా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్కు బిల్లుల రూపంలో రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణంగా సమకూరుస్తూ రూ.2.15 లక్షలు చొప్పున అందిస్తోంది. దీనికి అదనంగా ఉచితంగా ఇసుకతోపాటు సబ్సిడీపై స్టీల్, సిమెంట్ లాంటి 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వీటి విలువ రూ.54,518 వరకు ఉంటుంది. ఇదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అండగా నిలవనుంది. అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల (సాధారణ ఇళ్లు 18.63 లక్షలు + టిడ్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సాధారణ ఇళ్లలో సుమారు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇళ్ల పథకం ద్వారా ఒక్కో పేదింటి మహిళకు సగటున రూ.15 లక్షల స్థిరాస్తిని సమకూర్చడం ద్వారా మొత్తం రూ. 3 వేల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. కొనసాగుతున్న లబ్దిదారుల ట్యాగింగ్.. సీఆర్డీఏ పరిధిలో మెజారిటీ లబ్దిదారులు ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి ట్యాగ్ చేసే పనులు రెండు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) అనుమతులు వచ్చాయి. మిగిలిన ఇళ్లకు కూడా అనుమతులు వస్తాయి. గృహ నిర్మాణాలకు జూలై 8న శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – అజయ్జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
AP: ఎట్టకేలకు సీఆర్డీఏలో పేదలకు ఇళ్లు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో పోరాటం చేసి సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఆ ఇళ్లు మంజూరు చేయవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు టీడీపీ నేతలు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృషితో సీఆర్డీఏ పరిధిలో పేదలకు 47 వేలకుపైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ (సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ) సోమవారం సమావేశమై సీఆర్డీఏ పరిధిలో 47 వేలకుపైగా పేదల గృహాలను మంజురు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. న్యాయస్థానాల్లో కేసులున్నాయని, సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు మంజూరు చేయవద్దని ఓ పార్టీ ఎంపీలు కొందరు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖకు లేఖలు రాశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశ అజెండాలో ఈ ఇళ్ల మంజూరు ఉంటుందా ఉండదా? అనే అనుమానాలు కూడా కలిగాయన్నారు. కొంతమంది ఎంపీలు చేసిన వాదనల్లో వాస్తవం లేదని, ఎటువంటి కోర్టు కేసులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా కృషిచేసిందని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో సీఆర్డీఏ పరిధిలోని 47 వేలకుపైగా పేదల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇంకా మూడువేల ఇళ్లకు కేంద్రం నుంచి మంజూరు రావాలని, వాటికి కూడా త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. తొలినుంచి సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేసి అడ్డుపడుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ పేదల కోసం చట్టసవరణ కూడా చేసి, న్యాయస్థానాల్లో పోరాటం చేసి న్యాయస్థానాల అనుమతితోనే సీఆర్డీఏ పరిధిలోని పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేసింది. గత నెల 26న 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ న్యాయస్థానాల్లో పోరాటం అనంతరం గత నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏ పరిధిలోని 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇదే అమరావతి ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందని, ఇకపై మనందరి అమరావతి అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి ఈ పట్టాలు పంపిణీ చేశారు. ఇదీ చదవండి: చర్యలు తీసుకుంటే వేధింపులేనా రామోజీ? -
ఉధృతంగా ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని, పనులపై కలెక్టర్లు పర్యవేక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకూ సుమారు 3.9 లక్షల ఇళ్లు పూర్తి కాగా రూఫ్ లెవల్, ఆపై దశల్లో ఉన్న 5.27 లక్షల నివాసాలను కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండో దశ సమగ్ర భూ సర్వేలో భాగంగా మరో 2 వేల గ్రామాల్లో సెప్టెంబర్ 30 నాటికి భూపత్రాలు అందించాలని, అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కావాలని నిర్దేశించారు. స్పందనలో భాగంగా సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి పనులు, గృహ నిర్మాణం, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు–భూరక్ష, విద్యా కానుక కిట్ల పంపిణీపై అధికార యంత్రాంగానికి సీఎం మార్గ నిర్దేశం చేశారు. ప్రతి జిల్లాలో రోజూ 75 వేల పనిదినాలు ఉపాధిహామీ పనులపై కలెక్టర్ల పర్యవేక్షణ అవసరం. ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. అందులో 60 శాతం అంటే 14.4 కోట్ల పనిదినాలు ఈ నెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతి రోజూ ప్రతి జిల్లాలో కనీసం 75 వేల పనిదినాలు కల్పించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పనిచేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, తాగునీరు, ఫస్ట్ఎయిడ్ కిట్లు సమకూర్చాలి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎలాంటి పనులు చేపట్టవద్దు. ఈ విషయాలన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. రోజుకు కనీసం రూ.272 వేతనం వచ్చేలా చూడాలి. డిసెంబర్కు డిజిటల్ లైబ్రరీలు.. ఉపాధిహామీకి సంబంధించిన బిల్లులన్నీ పూర్తిగా చెల్లించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వేగంగా పూర్తి చేయాలి. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కోసం అవి చాలా ఉపయోగపడతాయి. గ్రామంలో చదువుకున్న ఏ వ్యక్తి అయినా అక్కడకు వెళ్లి కంప్యూటర్లో పని చేసుకోవచ్చు. మంచి బ్యాండ్విడ్త్ అందించడం చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ అన్నీ సెప్టెంబరు కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలు డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇళ్ల నిర్మాణాలకు రూ.1,475 కోట్లు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. వీటిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వేగం పెరగాలి. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.1,475 కోట్లు ఇచ్చాం. ప్రతి శనివారం హౌసింగ్డేగా నిర్వహించాలి. అధికారులు తప్పనిసరిగా లే అవుట్లలో పర్యటించాలి. సీఆర్డీఏలో 8 నుంచి పనులు సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణం వెంటనే మొదలు కావాలి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈమేరకు చర్యలు తీసుకోవాలి. జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల నిర్మాణాల్లో వాడే సామగ్రి నాణ్యతతో ఉండాలి. క్రమం తప్పకుండా క్వాలిటీ పరీక్షలు చేయాలి. వేగంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 1,43,600 ఇళ్లను ఉచితంగా పేదలకు ఇస్తున్నాం. ఇప్పటికే 61 వేల ఇళ్లను అందించాం. మరో 89,216 ఇళ్లను ఆగస్టులోగా అందచేస్తాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి. మిగిలిన కేటగిరీ ఇళ్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చింది. ఆ కేటగిరీ లబ్ధిదారులకు బ్యాంకులతో అనుసంధానించాలి. ఇప్పటికే రూ.1,962.15 కోట్లు బ్యాంకుల ద్వారా అందించాం. మిగిలిన వారికి కూడా రుణాలు టైఅప్ చేసేలా చర్యలు తీసుకోవాలి. విత్తనాలు, ఎరువులు, మందులకు కొరత రాకూడదు ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 19 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల ప్రారంభమైంది. మిగిలిన 29 మేజర్ ప్రాజెక్టుల పరిధిలో జూన్ 15 నుంచి జూలై 20 వరకు నీటి విడుదల షెడ్యూల్ ఖరారైంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలి. నాణ్యత చాలా ముఖ్యం. నకిలీల కారణంగా రైతులు ఎక్కడా నష్టపోయిన సందర్భాలు కనిపించకూడదు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ఖరీఫ్ 2023 సంబంధించి జూలై 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. సోషల్ ఆడిట్ చేపట్టి సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి. సీసీఆర్సీ కార్డులు కేవలం 11 నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగదనే విషయాన్ని వివరించాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలి. రైతులు అక్కడకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు 17 వేల రెవెన్యూ గ్రామాలకుగాను మొదటి ఫేజ్లో 2 వేల గ్రామాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు సహా జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం పూర్తైంది. 7.86 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశాం. 25.7 లక్షల సరిహద్దు రాళ్లు పాతాం. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఆయా గ్రామ సచివాలయాల్లో కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ద్వారా ఏవైనా సమస్యలుంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. జూలై 1 నాటికి ఇది పూర్తి కావాలి. ఆ గ్రామాల నుంచి రైతులు ఎవరూ తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. సబ్డివిజన్, మ్యుటేషన్, ల్యాండ్ కన్వర్షన్ తదితరాలన్నీ గ్రామ సచివాలయాల్లోనే జరగాలి. రెండో దశ కింద మరో 2 వేల గ్రామాల్లో తుది ఆర్వోఆర్ ఆగస్టు 31 కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. సెప్టెంబర్ 30 కల్లా రాళ్లు పాతడం పూర్తి చేసి భూ పత్రాలు అందించాలి. అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. విద్యాకానుక కిట్ల పంపిణీని కలెక్టర్లు సమీక్షించాలి జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువులు బాగా లేకున్నా వెంటనే సమాచారం తెప్పించుకోవాలి. హెచ్ఎంల నుంచి సమాచారాన్ని సేకరించి వెంటనే చర్యలు చేపట్టాలి. నాణ్యత విషయంలో ఎక్కడా సమస్య ఉన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. నాడు– నేడు తొలిదశ పనులు పూర్తైన 15,750 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 30,249 తరగతి గదుల్లో జూలై 12 కల్లా ఐఎఫ్పీ ప్యానెళ్లు ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. మానిటర్లను వినియోగించుకుంటూ పిల్లలకు చక్కటి బోధన అందించాలి. ఆమేరకు టీచర్ల సామర్థ్యాన్ని పెంచాలి. -
అవి ప్రణాళికాబద్ధంగా నిర్మించే ఊళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా, అమరావతి రైతుల ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ వచ్చేది కాలనీలు కావని.. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తూ లబ్దిదారుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకోవడం చూశాం. పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చంద్రబాబు అండ్ కో వాదించారు. చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకేసి.. ఒక సెంట్ స్థలం సమాధులకు సరిపోతుందని వ్యాఖ్యానించడం.. దానిపై పేదలు, సామాజికవేత్తలు భగ్గుమనడంతో ఇప్పుడు తాజాగా ఆయన వర్గం మురికివాడలు అంటూ ప్రచారం ప్రారంభించింది. పక్కా ప్లానింగ్తో నిర్మాణం ప్రభుత్వం 25 లే అవుట్లలో 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ప్రతి లే అవుట్ను కూడా సీఆర్డీఏ, టౌన్ ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లే అవుట్లో 38 శాతం మాత్రమే ప్లాట్ల కోసం, మిగిలిన స్థలాన్ని మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఉదాహరణకు కృష్ణాయపాలెం లే అవుట్ 58.15 ఎకరాల్లో వేశారు. ఇందులో 2,234 మంది లబ్దిదారులకు స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్ ఆరు మీటర్ల వెడల్పు, 6.80 మీటర్ల పొడవు ఉండేలా ఏర్పాటు చేశారు. మొత్తం స్థలంలో 38.72 శాతం మాత్రమే ఇళ్ల స్థలాలకు కేటాయించారు. 36.52 శాతం రోడ్లకు, 10.28 శాతం భూమిని ఓపెన్ స్పేస్గా, ఇతర అవసరాల కోసం 8.79 శాతం, పార్కింగ్ కోసం 5.69 శాతం కేటాయించారు. ప్రతి లేఅవుట్లో ప్రధాన రహదారులు 40 అడుగులు, అంతర్గత రహదారులు 30 అడుగులు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతి కాలనీలో అంగన్న్వాడీ కేంద్రం, విలేజి క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద లేఅవుట్లలో ప్రైమరీ స్కూల్ కూడా మంజూరు చేస్తారు. నవులూరు, కృష్ణాయపాలెంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. ఇన్ని మౌలిక సదుపాయాలతో వచ్చే కాలనీలు మురికివాడలు ఎలా అవుతాయో తెలుగుదేశం నాయకులే చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఆధిపత్యం తగ్గిపోతుందని టీడీపీ భయం పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో కూడా సామాజిక న్యాయం చేకూర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించి 50,793 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అందులో సగానికి పైగా బీసీలకు దక్కాయి. రెండు జిల్లాల్లో 26,869 మంది బీసీలకు, 8,495 మంది ఎస్సీలకు, 1579 మంది ఎస్టీలకు, మిగిలిన 13,850 మంది ఇతరులకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. వీరందరూ వస్తే తమ ఆధిపత్యం తగ్గి పోతుందనే భయం తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. -
ఇది గొప్ప సంకల్పం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్న గొప్ప సంకల్పంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి చెప్పారు. శుక్రవారం వెంకటపాలెంలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన గుంటూరు జిల్లాలో ఇప్పటికే లక్షా 17,108 మందికి ఇళ్ల పట్టాలు అందచేసినట్టు వివరించారు. దీనికోసం 276 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రూ.1,452 కోట్ల రూపాయలు వెచ్చించి 2,512 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించామని వెల్లడించారు. మొత్తం 2,789 ఎకరాలలో 284 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని, ఆ భూములు చదునుచేసి సరిహద్దురాళ్లు, గ్రావెల్ రోడ్ల కోసం 81.56 కోట్ల రూపాయలు, తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం రూ. 47.57 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మొదటి దశలో 209 కాలనీలలో 66,125 ఇళ్లు ప్రారంభమై వేగవంతంగా జరుగుతున్నాయని, జిల్లాలో 18,448 టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని వివరించారు. మంగళగిరి, తెనాలి, పొన్నూరులో అన్ని మౌలిక వసతులతో ప్రారంభోత్సవాలు కూడా చేశామని, అమరావతిలో ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలోని పది గ్రామాలలో 5,024 ఇళ్లు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు 23,762 మంది లబ్ధిదారులకు 10 లేఅవుట్లలో 1402.58 ఎకరాల భూమిలో పట్టాలు ఇస్తున్నామని వివరించారు. -
మనసున్న నాయకుడు.. పిలిచి మరీ ఇంటి పట్టా ఇచ్చారు..
సాక్షి, వెంకటపాలెం:ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. దీనిలో భాగంగా లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా ఇల్లు లేక కష్టాలు పడ్డామన్నా నాకు పెళ్లయినప్పటి నుంచి 23 ఏళ్లుగా రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నామన్నా. మాతోపాటు అక్కడ 750 కుటుంబాలదీ అదే పరిస్థితి. ఎన్నోసార్లు రైల్వే వారు నోటీసులిచ్చారు. ఇల్లు అద్దెకు తీసుకునే శక్తి లేదు. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి పోవాలో తెలియదు. ఎండకు ఎండాం, వానకు తడిచాం. గజం స్థలం కూడా కొనలేని నాకు జంటనగరాల మధ్య పిలిచి మరీ మీరు ఇంటి స్థలం ఇచ్చారు. రాజకీయ కుట్రలు పన్ని అడ్డుకోవాలని చూసినా, మీరు ఆడపడుచులను ఆస్తి పరులు చేశారన్నా. మీ సాయాన్ని జీవితంలో మరిచిపోలేను. ఈ రోజు నాలాంటి వారికి పెద్ద పండగ. అన్నా.. నా గృహ ప్రవేశానికి మీరు రావాలి. – గొట్టుముక్కల హైమావతి, తాడేపల్లి అద్దె పెంచినప్పుడల్లా ఇల్లు మారే పరిస్థితి అన్నా.. నాకు ముగ్గురు పిల్లలు. భర్త హోటల్లో పని చేస్తారు. 25 ఏళ్లుగా చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. చాలీచాలని ఆదాయం. ఇంటి అద్దె పెంచినప్పుడల్లా పిల్లి తన పిల్లల్ని తిప్పినట్టు ఇల్లు మారేదాన్ని. ఓసారి అత్తగారి అమ్మ చనిపోతే శవాన్ని కూడా ఇంటికి తీసుకురానీయలేదు. ఆ క్షణంలో ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. సొంతిల్లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనిపించింది. నాలాంటి మహిళకు సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నా. కానీ మీరు పెట్టిన వలంటీర్ మా ఇంటికి వచ్చి.. జగనన్న ఉచితంగా ఇల్లు ఇస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎంతగా అడ్డుపడినా మీరు శ్రీరాముడిలా వారిని జయించి మాకు యాగ ఫలాన్ని అందించారన్నా. – లక్ష్మి, గుణదల, విజయవాడ గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? పేదలకు సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తుంటే.. హడావుడి చేస్తున్న వ్యక్తులు, గత ప్రభుత్వంలో భూములు లాక్కుని కనీసం పరిహారం చెల్లించని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? రైతులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారే తప్ప ఎటువంటి అన్యాయం చేయటం లేదు. కావాలనే పేదలకు మేలు జరగకుండా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సీఎం జగన్కు మంచి పేరు వస్తుందని కుళ్లు బుద్ధితో కోర్టుకు వెళుతున్నారు. ఇక్కడి అభివృద్ధిపై రైతులు నిలదీయాల్సింది చంద్రబాబును. – పి.గంగా భవాని, విజయవాడ మంచి మనసున్న నాయకుడు మాకు ఇల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సీఎంగా జగన్ పరిపాలన ప్రారంభించాక పేదలకు మంచి జరగటం మొదలైంది. మాకు ఇంటి స్థలం కేటాయించారు. కచ్చితంగా ఇల్లు కట్టించి అందజేసే మంచి మనసున్న నాయకుడు సీఎం జగన్. పేదలకు అండగా నేనున్నానే భరోసా కల్పించారు. – షేక్ మస్తాన్బీ, మెల్లెంపూడి, గుంటూరు జిల్లా ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్లో తలదాచుకుంటున్నాం. సీఎం జగన్ ఇంటి స్థలాలు ఇవ్వటం ద్వారా అందరికీ జాగా వచ్చింది. పేదలకు మంచి చేసేందుకు ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. పేదోళ్ల కష్టం తెలుసు కాబట్టే.. స్థలాలు అందజేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – జాలాది రత్నకుమారి, ఆత్మకూరు, గుంటూరు జిల్లా జగనన్న భరోసా కల్పించారు మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు వచ్చిన స్థలం భవిష్యత్లో మా బిడ్డలకు అండగా ఉంటుంది. కరోనా సమయంలో నాకు పనిలేదు. అప్పుడు ప్రభుత్వ పథకాలు మమ్మల్ని ఆదుకుని నిలబెట్టాయి. అన్నీ చెప్పిన సమయంలోనే చేస్తున్నారు. భగవంతుని చల్లని చూపు ఈ ప్రభుత్వానికి ఉంటుంది. – అబ్దుల్ వసీమ్, రేష్మా, మంగళగిరి, గుంటూరు జిల్లా మా కోసం యుద్ధమే చేశారు మా పొట్టకొట్టేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మా అందరి కోసం యుద్ధం చేసి విజయం సాధించారు. తాను గెలిచి మమ్మల్ని గెలిపించిన తీరు ఆధ్యంతం స్ఫూర్తిదాయకం. జగనన్న దయవల్ల మాకు ప్లాట్ వచ్చింది. అది తీసుకునేందుకు వచ్చాం. – ఎ.భారతి, విజయవాడ సమానత్వానికి నాంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రాజధానిలో సామాజిక సమానత్వానికి నాంది పలికినట్లయింది. పేదలు రాజధానిలో నివాసముంటే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనేది తప్పు అని దీని ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటి వరకు కొందరిదిగా ఉన్న అమరావతి ఇప్పుడు అందరిదైంది. ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం అంటే మామూలు విషయం కాదు. తద్వారా లబ్ధిదారులకు వ్యక్తిగత లాభంతో పాటు ఇక్కడ ఏర్పడే ఇళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాజధాని ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. పాలకులకు ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి నిర్ణయాలు సాధ్యం కావు. – కె మధుబాబు, సీడీసీ డీన్, ఏఎన్యూ ఈ అవకాశం ఎవరికీ రాలేదేమో.. 35 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై సంతకం పెట్టే అవకాశం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదేమో. ఆ అవకాశం నాకు మాత్రమే దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో అత్యంత సంతోషకరమైన రోజు ఇది. ఈ అవకాశం రాష్ట్రంలో, దేశంలో ఏ అధికారికీ లభించి ఉండకపోవచ్చు. – రామ్ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి, గుంటూరు జిల్లా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో అల్పాదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రమపడి పేదల కల సాకారం చేసింది. గతంలో ఎప్పడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ అంశంలో అందరూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. – కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల -
మారీచులపై నిరుపేదల విజయమిది
మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 1,402 ఎకరాల్లో 25 లే అవుట్లలో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం వారం పాటు పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ప్రతి అక్కచెల్లెమ్మను లే అవుట్ వద్దకు తీసుకెళ్లి, అక్కడే ఇంటి పత్రాలు అంద జేస్తారు. ఆ స్థలంలో ఫొటో తీసుకుని, జియో ట్యాగింగ్ కూడా పూర్తయ్యాక ఇళ్లు కట్టించే కార్యక్రమానికి బీజం పడుతుంది. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూశామని.. రాష్ట్రంలో మాత్రం పేదలకు వాటిని ఇవ్వొద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాను చూస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంటే తట్టుకోలేక గజ దొంగల ముఠా అడ్డు పడుతోందని చెప్పారు. ఈ మారీచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. న్యాయ పోరాటం చేసిమరీ పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తున్నామని తెలిపారు. ఇది మారీచులపై నిరుపేదల విజయమని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి పోరాటాలు వందలు, వేలు చూశామన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే మారీచు, సుభాహులు అడ్డు పడుతున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా తన పయనం ధర్మం వైపే ఉంటుందని, ప్రభుత్వం నిరుపేదల పక్షానే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు మంజూరు చేసి.. జూలై 8.. నాన్నగారి (దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి) జయంతి రోజున ఇళ్ల నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారని, దాదాపు 232 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ ఇళ్ల పట్టాలు.. సామాజిక న్యాయ పత్రాలు ♦ ఇక్కడ ఈ రోజు జరుగుతున్న సభకు, ఈ సందర్భానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న ప్రభుత్వ తాపత్రయం ఒకవైపు.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని అడ్డుపడుతున్న పరిస్థితులు ఇంకోవైపు.. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. ♦ ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. ♦మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఎంతుంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో జరిగిన వేలంలో గజం రూ.17 వేలకు అమ్ముడుపోయిందని.. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుందన్నారు. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు.. వారికిస్తున్న సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఇకపై ఇదే అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుంది. మనందరి అమరావతి అవుతుంది. అక్కచెల్లెమ్మల చేతిలో రూ.3 లక్షల కోట్లు ♦ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం. మొదటి ఆప్షన్లో సొంతంగా తామే కట్టుకుంటామంటే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.1.80 లక్షలు వేస్తాం. రెండో ఆప్షన్గా వారి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణ కూలి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్న వాళ్లకు మూడో ఆప్షన్గా ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు. ♦ ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తున్నట్టే.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తాం. సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ మార్కెట్ రేట్ల కంటే తక్కువకే ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యత విషయలో రాజీ పడేది లేదు. దీంతో పాటు రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. దీనివల్ల ఇళ్లు కట్టే కార్యక్రమం వేగవంతం అవుతుంది. ♦ మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వీరిలో 21 లక్షల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు చెపుతున్నా.. 30.75 లక్షల ఇంటి స్థలాల్లో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు విలువ చేసే ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ♦ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు.. మీ అన్నగా, మీ బిడ్డగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నా. గత ప్రభుత్వంలో పాలకులు ఇలాంటి ఆలోచన చేసే సాహసమైనా చేశారా? గతానికీ, ఇప్పటికీ మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి టిడ్కో ఇళ్లు ♦ఈ 50,793 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సీఆర్డీఏ పరిధిలో 8 చోట్ల జగనన్న కాలనీల్లో పీఎంఏవై కింద జీ ప్లస్ 3 విధానంలో నిర్మించిన 5,024 మందికి టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం. వారం రోజుల్లో వారితో కూడా గృహ ప్రవేశాలు చేయించి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందిస్తాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం విలువ రూ.443 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్పై రూ.1.50 లక్షలు చొప్పున సబ్సిడీగా రూ.75 కోట్లు ఇస్తే.. మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5024 ప్లాట్ల మీద మన ప్రభుత్వం మరో రూ.251 కోట్లు ఖర్చు చేసింది. ♦ టిడ్కో ఇళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి. అయ్యా మీరు టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్కు నాలుగేళ్లు ఎందుకు పడుతుంది? అని చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను. 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే విలువ అడుగుకి రూ.2 వేలు వేసుకుంటే.. దాదాపు రూ.5.75 లక్షలు అవుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష అవుతుంది. ♦ అంటే రూ.6.65 లక్షలు ఖర్చయ్యే ప్లాట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3 లక్షలు సబ్సిడీ ఇస్తే మిగిలిన రూ.3 లక్షల డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున కట్టాలి. 20 ఏళ్లలో పేదవాడి మీద పడే అప్పు వడ్డీతో తడిసి మోపెడై మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలి. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? కానీ మీ బిడ్డ ఈ ఫ్లాట్ను అక్కచెల్లెమల పేరుపై రూ.1కే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు, వారి గజ దొంగల ముఠా, ఎల్లో మీడియా వక్రభాష్యాలు చెబుతూనే ఉంది. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ ♦ రెండేళ్లు కోవిడ్ కష్టాలు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా మాకున్న కష్టం కన్నా మీ కష్టమే ఎక్కువ అని భావించి మీ బిడ్డ పరుగెత్తాడు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. ♦మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. మేనిఫెస్టోలో 98 శాతం వాగ్దానాలను అమలు చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీలో మరో రెండడుగులు ముందుకు వేసి ఇళ్ల నిర్మాణాలను దశల వారీగా చేపడుతూ పరిగెత్తిస్తున్నాం. ♦ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి, లంచం, వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.2.11 లక్షల కోట్లు జమ చేశాం. మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయింది. ఒక్కో ఇంటి స్థలం రూ.2.50 లక్షలు చొప్పున 30 లక్షల ఇళ్ల విలువ రూ.75 వేల కోట్లు అవుతుంది. మిగిలిన గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటివి కలిపి అక్షరాలా రూ.3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చేర్చాం. మంచి జరుగుతుంటే తట్టుకోలేక.. ♦ ఇంత మంచి జరుగుతుంటే తట్టుకోలేని దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా.. అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ తోడు దత్తపుత్రుడు కలిసి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం చూశాం. అప్పుడూ.. ఇప్పుడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. అప్పుల పెరుగుదల కూడా ఇప్పుడే తక్కువ. ♦లంచాలు, వివక్ష లేకుండా మరి ఇన్ని లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇప్పుడు ఎలా వెళ్లింది? చంద్రబాబు హయాంలో అలా ఎందుకు జరగలేదని ఆలోచించండి. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు. వారి తపన, తాపత్రయం అంతా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి అధికారంలోకి రావడం మాత్రమే. వారి దారుణాలను ఎవరూ రాయరు, చూపరు. ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ♦ చంద్రబాబు తన పాలనలో 2014–2019 మధ్య ఏ ఒక్క పేదవాడికీ సెంటు భూమి, కనీసం ఒక ఇంటి పట్టా ఇచ్చిన పాపానపోలేదు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి.. రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలు సమీపిస్తుంటే కొత్త మోసాలతో ముందుకొస్తారు జాగ్రత్త. రాష్ట్రంలో క్లాస్ వార్ ♦ ఇప్పుడు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతోంది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందార్లు ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకుంటున్నారు. ♦ ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందార్లు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు. అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా ఓడిపోయినా ఇప్పటికీ ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదో ఒక రూపేణా అడ్డుకుంటూనే ఉన్నారు. ♦ పేదవాడు చదవాలి, ఎదగాలి అని మనం తాపత్రయపడుతుంటే గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉండడానికే వీల్లేదని అడ్డుకుంటున్నారు. మనం వేసే ప్రతి మంచి అడుగులోనూ పేదవాడికి అన్యాయం చేస్తున్నారు. కానీ మీ జగన్ మాత్రం మీ వెంటే ఉన్నాడు. అమ్మఒడి, ఆసరా, చేయూతతో నా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. వాళ్ల పిల్లలను గొప్పగా చదివించగలుగుతున్నారు. ♦ జగన్ మాదిరిగా పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తారు. వాళ్ల టీవీల్లో డిబేట్లు పెడతారు. రాబోయో రోజుల్లో పేదలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ♦ మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. జూలై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు, 25 కాలనీల్లో ప్రతి కాలనీలోనూ అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా వస్తాయి. ఇక్కడే నవులూరిలో లేక్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పెద్దమనిషి చంద్రబాబు మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు. మోసం చేసేవాడిని ఎప్పుడూ నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చేమో గాని, నారా చంద్రబాబునాయుడిని మాత్రం నమ్మొద్దు. – సీఎం వైఎస్ జగన్ -
51,392 మంది పేదలకు ‘పట్టా’భిషేకం రేపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకటీ రెండూ కాదు.. వందా ఐదు వందలూ అసలే కాదు.. అక్షరాలా 51,392 నిరుపేదల కుటుంబాలు.. ప్రభుత్వం చొరవతో సొంతింటికి హక్కుదారులు అవుతున్నాయి. శుక్రవారం ఉదయం తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం.. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో ‘నవరత్నాలు – పేదలంరికీ ఇళ్లు’ పథకంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారుకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 1402.58 ఎకరాల్లో ఒకొక్కరికి సెంటు చొప్పున 25 లేఅవుట్లలో 51,392 కుటుంబాలకు ప్లాట్లు సిద్ధం చేసింది. అయితే, అమరావతి ప్రాంతం పెద్దలదని, అక్కడ పేదలకు చోటులేదని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, మరికొందరు రైతుల ముసుగులో అనేక అడ్డంకులు సృష్టించారు. కోర్టులకు కూడా వెళ్లారు. దేశంలోనే అతి ఖరీదైన న్యాయవాదులను పెట్టుకుని వ్యాజ్యాలు వేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పి కోర్టులను అడ్డుపెట్టుకుని చోటు లేకుండా చేయాలకున్నారు. ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కోర్టులు కూడా సమర్ధించాయి. దీంతో ఉద్యమం పేరుతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వీటన్నింటినీ అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది. 1,402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇస్తున్న 1402.58 ఎకరాల్లో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751.93 ఎకరాల్లో 14 లేఅవుట్లను వేసి 27,532 మందికి ప్లాట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650.65 ఎకరాల్లో 11 లేఅవుట్లలో 23,860 ప్లాట్లు వేశారు. ఈ లేఅవుట్లలో 67,700 హద్దు రాళ్లు వేసి ప్లాట్లకు పొజిషన్ ఇచ్చారు. ఇళ్ల స్థలాల మార్కింగ్, నంబరింగ్ పూర్తి చేశారు. 76.28 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు నిర్మించారు. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. తక్కువ సమయంలోనే పూర్తి సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సిద్ధం చేశాం. అన్ని ప్లాట్లకు నంబర్లు కేటాయించి మార్కింగ్ కూడా పూర్తిచేశాం. శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తారు. అందుకోసం వెంకటాయపాలెంలో వేదికను సిద్ధం చేస్తున్నాం. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో తక్కువ సమయంలోనే అన్ని పనులు పూర్తి చేశాం. ఇక్కడి నుంచే టిడ్కో లబిద్ధదారులకు కూడా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తాం. – వివేక్ యాదవ్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ పేదలకు పట్టాలివ్వకుండా ఎన్నెన్నో కుట్రలు సీఆర్డీయే పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా తెలుగుదేశం పార్టీ, కొందరు వ్యక్తులు రైతుల ముసుగులో అనేక కుట్రలు పన్నారు. రైతుల పేరుతో ఆ ప్రాంతంలో నిరసనలకు దిగారు. జగనన్న లేఅవుట్లలో పనులు జరగకుండా అడ్డుకొన్నారు. కొందరు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. పోలీసులపైనా దాడులకు దిగారు. కొందరు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టుల్లోనూ సమర్ధంగా వాదనలు వినిపించింది. కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంతో ఇప్పుడు సీఆర్డీఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత పేదలకు ఇళ్ళ స్థలాలే వద్దన్న బాబు అండ్ కో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆర్ 5 జోన్లో కాకుండా ఆర్–3 జోన్లో ఇస్తే ఇబ్బంది లేదని, సెంటు కాకుండా ఐదు సెంట్లు ఇవ్వాలంటూ మరో రాగం అందుకున్నారు. సెంటు భూమి సమాధులు కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదంటూ చంద్రబాబు పేదలను అవహేళన చేసేలా మాట్లాడారు. తాజాగా దళిత జేఏసీ పేరుతో జడ శ్రావణ్కుమార్ తదితరులు తుళ్లూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్నా లెక్కచేయకుండా బుధవారం అక్కడ అశాంతిని సృష్టించే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకొనేందుకు దీక్ష పేరుతో ఆయన తుళ్లూరు దీక్షా శిబిరానికి దొడ్డిదారిలో చేరుకున్నారు. వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, విజయవాడకు తరలించారు. -
త్వరితగతిన సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా పక్కా ఇళ్లను సమకూరిస్తే వారి జీవితాలు అంత త్వరగా బాగు పడతాయన్నారు. సీఆర్డీఏ పరిదిలో పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల్లో వేగంగా పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గత 45 రోజుల్లో రూ.1,085 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 3.69 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రూఫ్ లెవల్, ఆపై దశలో ఉన్న ఇళ్ల త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మరో 8.64 లక్షల ఇళ్లు బేస్మెంట్ ఆపై దశల్లో ఉన్నాయన్నారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలను అమలు చేశామని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ స్పెషల్ ఆఫీసర్లను కూడా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నియమించి, ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని వివరించారు. బ్యాంకుల నుంచి త్వరితగతిన రుణాలు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇలా ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణాలిప్పించామని.. రూ.3,886.76 కోట్ల మేర రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఆర్డీఏలో ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భూమి చదును చేసే పనులు చేశామన్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, విజయానంద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇది పేదల విజయం
పేదలు మరింత నిరుపేదలుగా మారాలి.. పెత్తందార్లకు జీ హుజూర్ అంటూ బతకాలి.. పేదల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవరాదు.. ఇంగ్లిష్ చదువులు అసలే చదవకూడదు.. కనీసం వారికి నిలువ నీడ కూడా లేకుండా ఉంటేనే తమ ఆటలు సాగుతాయన్నది చంద్రబాబు అండ్ కో మానసిక పరిస్థితి. అమరావతి ప్రాంతంలో వారికి ప్రభుత్వం సెంటు భూమి ఇస్తామంటే ఇదే పచ్చ గ్యాంగ్, ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెట్టింది. బాబు 3డి గ్రాఫిక్స్ రాజధానిలోని సింగపూర్, మలేషియా, జపాన్లు మురికి కూపాలైపోతాయని ఆందోళనలు, చర్చోపచర్చలతో ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేసింది. నిస్సిగ్గుగా కోర్టులకూ ఎక్కింది. ‘రాజధాని అయినంత మాత్రాన అక్కడ పేదలు ఉండకూడదంటే ఎలా?’ అని హైకోర్టు తలంటినప్పటికీ ఈ పచ్చ గ్యాంగ్కు బుద్ధి రాలేదు. రైతుల పేరుతో సుప్రీంకోర్టులోనూ వంకర బుద్ధి చూపించబోయింది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏ విధంగా అన్యాయం? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేం’ అని తాజాగా గడ్డి పెట్టింది. అయినా వీళ్లలో మార్పు వస్తుందని ఆశించలేం. ఈ పెత్తందార్ల యుద్ధాన్ని ఎదిరిస్తూ.. వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతూ సీఎం వైఎస్ జగన్ గట్టిగా నిలవడం వల్లే పేదలకు న్యాయం జరిగింది. ఇది పేదల కోసం నిలబడ్డ ప్రభుత్వ ఘన విజయం. సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు స్థానమే లేకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలు, కుతంత్రాలను సుప్రీంకోర్టు పటాపంచలు చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూమి కేటాయించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీలు పెద్దలు చేసిన యత్నాలను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేసేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలను వెదజల్లినా టీడీపీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పేదలకు వ్యతిరేకంగా రైతుల ముసుగులో పిటిషన్లు దాఖలు చేయించి, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. చట్ట ప్రకారం రాజధాని ప్రాంతంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిరోధించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు రాజధాని ప్రధాన కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోండి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి వాటిని కొట్టేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపించారు. ఈ విచారణకు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కూడా హాజరయ్యారు. ఎలా చూసినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్లకు ఎలాంటి విచారణ అర్హత లేదన్నారు. వేలాది మంది రైతుల్లో కనీసం పది మంది కూడా కోర్టుకు రాలేదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం కూడా ఐదు శాతం భూమి ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) వర్గాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రధాన కేసులో అనుకూలంగా తుది తీర్పు రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ అలా జరిగినా ప్రస్తుతం పేదలకు చేస్తున్న కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎందుకంటే సీఆర్డీఏ చట్టమే పేదలకు ఐదు శాతం భూమి ఇవ్వాలని చెబుతోందని తెలిపారు. కాని ఇప్పుడు పేదలకు ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 3.1 శాతం భూమి మాత్రమేనన్నారు. 34 వేల ఎకరాల్లో సుమారు 1,200 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 53 డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఎలక్ట్రానిక్ సిటీ (ఈ–సిటీ)కి వచ్చిన ఇబ్బందేంటో తెలియడం లేదన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని తుది విచారణ జరగాల్సి ఉందన్నారు. కోర్టులో దాఖలు అవుతున్నవన్నీ వ్యక్తిగత పిటిషన్లేనని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాదని వివరించారు. ఈ పది మంది వెనుక ఎవరున్నారో పరిశీలించండి వేల మంది భూములిచ్చిన రైతులుండగా, కేవలం పది మందే కోర్టుకు ఎందుకొచ్చారో, దీని వెనుక ఎవరున్నారో పరిశీలించాలన్నారు. ప్రస్తుతం పేదలకు కేటాయించిన స్థలాల వల్ల పిటిషనర్లకు చెందిన రిటర్నబుల్ ప్లాట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సింఘ్వి తెలిపారు. పేదలకు ప్రస్తుతం కేటాయించిన స్థలాలు ఈ–సిటీ దగ్గర్లో ఉన్నాయని, 6,500 ఎకరాల ఈ–సిటీలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలం చాలా తక్కువని చెప్పారు. అసలు ఆర్–5 జోన్లోనే ఎందుకు.. మరెక్కడైనా ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించినా సమాధానం చెప్పగలమన్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లలో జోన్–1ను ప్రస్తుతం ఉన్న గ్రామాల కారణంగా ముట్టుకునే పరిస్థితి లేదని, జోన్–2 స్పెషల్ ఏరియా అని.. ఢిల్లీలో లుటియన్స్ ఢిల్లీ మాదిరి అని తెలిపారు. జోన్–3 భూములిచ్చిన వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న ప్రాంతమని, జోన్–4 హై డెన్సిటీ ప్రాంతం అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే పేదల కోసం ఆర్–5 జోన్ను సృష్టించామని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లు ఒక చోట, ఈ–సిటీ మరో చోట అని తెలిపారు. ఒకవేళ పిటిషనర్లు హైకోర్టులో గెలిచినా కూడా సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు ఐదు శాతం భూమి కేటాయించాల్సిందేన్నారు. రాజధాని ప్రధాన వ్యాజ్యాలు జూలైలో విచారణకు రానున్నాయని, ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని, అప్పుడు కూడా ఐదు శాతం ఈడబ్ల్యూఎస్కు కేటాయించాల్సి ఉంటుందని వివరించారు. మాస్టర్ ప్లాన్ను మార్చలేదు సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. కేటాయించిన స్థలాల్లో నివాసాలు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. చట్ట ప్రకారం పేదలకు ఐదు శాతం స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. భూసేకరణ అనేది ప్రభుత్వం ప్రజల కోసమే చేస్తుందని, దాన్ని ఇతరత్రా ప్రజా ప్రయోజనాల కోసం కూడా వినియోగిస్తుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు స్థలాల కేటాయింపు ప్రజా ప్రయోజనం కాదని అనడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. 29 గ్రామాలకు చెందిన 33 వేల మంది రైతులు భూ సమీకరణ కింద ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చారన్నారు. అమరావతిలో మీడియా సిటీ, నాలెడ్జి సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇలా తొమ్మిది రకాల సిటీలు అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్లో ఉందన్నారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్లో 5 శాతం పేదలకు ఇళ్ల స్థలాలను తొమ్మిది సిటీలకు విస్తరించాలన్నారు. మాస్టర్ ప్లాన్లో 17 వేల ఎకరాలు రెసిడెన్షియల్ జోన్లకు కేటాయించారని పేర్కొన్నారు. జూలైలో తుది తీర్పు రానుందని, అంతకు ముందుగానే పట్టాలు కేటాయించడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. -
ఆత్మ గౌరవంతో ‘లక్ష’ణంగా..!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలు ఆత్మ గౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి విడతగా ఇప్పటికే 48,416 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండో దఫాలో మరో 40 వేలకు పైగా యూనిట్లను పట్టణ పేదలకు అందచేసేందుకు సిద్ధమైంది. జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో గృహాలకు యజమానులుగా మారుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కావలి నుంచి మొదలయ్యే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్ చివరి వరకు కొనసాగనుంది. కావలి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేసిన 2,112 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 29వతేదీన శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిడ్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో పొన్నూరు, గుంటూరు యూఎల్బీలోని వెంగళాయపాలెం, అడవి తక్కెళ్లపాడుతోపాటు ఆళ్లగడ్డ, డోన్, విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, పిఠాపురం, యలమంచిలి, కందుకూరు యూఎల్బీల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. అనకాపల్లి యూఎల్బీలో.. అనకాపల్లి యూఎల్బీలో జూన్ మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురం(అనకాపల్లి)లో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పుంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందచేస్తారు. రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగానే.. మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు అనువుగా జీ+3 అంతస్తుల్లో 300, 365, 430 చ.అడుగుల్లో టిడ్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈమేరకు నివాస ప్రాంగణాల్లో అన్ని వసతులు కల్పించిన అనంతరం లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కు పత్రాలు, ఇంటి తాళాలను అధికారులు అందజేస్తున్నారు. ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యూఎల్బీల్లో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో నూరు శాతం ఇళ్ల పంపిణీ పూర్తైంది. కావలి, పాత్రునివలస (శ్రీకాకుళం)లో కూడా శుక్ర, శనివారాల్లో నూరు శాతం పంపిణీ పూర్తవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా హౌసింగ్ విధానాలపై ఇటీవల కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో అంధ్రప్రదేశ్లోని టిడ్కో హౌసింగ్కు అరుదైన గౌరవం దక్కింది. ఇది సీఎం జగన్ చొరవ వల్లే సాధ్యమైంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు జూన్ నాటికి లక్ష టిడ్కో ఇళ్లు ఇస్తాం. శుక్రవారం నుంచి మలి విడతగా 40,728 ఇళ్లు పంపిణీ చేయనున్నాం. – జమ్మాన ప్రసన్న కుమార్, టిడ్కో చైర్మన్ -
సామాజిక న్యాయమే పరమావధి
సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని కంటే కూడా పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. తమది సామాజిక న్యాయమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా, గత ప్రభుత్వం మాత్రం ధనికుల కోసం ని ర్మిస్తున్న రాజధానిలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమలు చేయలేదని తెలిపింది. కేవలం 44 ఎకరాలను మాత్రమే పేదల కోసం కేటాయించిందని, అలాంటి తప్పిదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఆర్డీఏ చట్టాన్ని సవరించి.. మాస్టర్ ప్లాన్లో ఆర్ 5 జోన్ను సృష్టించామని చెప్పింది. ‘ఈ జోన్లో పేదలకు 1,134 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ భూమిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచాలని నిర్ణయించాం. ఇది ఓర్వలేని గత ప్రభుత్వ పెద్దలు హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపమన్నట్లు ప్రభుత్వ తీరును అమరావతి రైతుల పేరుతో తప్పు పడుతున్నారు. సీఆర్డీఏ నుంచి ఈ 1,134 ఎకరాలను రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల సీఆర్డీఏకు రూ.1,100 కోట్లపైగా మొత్తం సమకూరుతుంది. సీఆర్డీఏకు డబ్బు వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలివ్వొద్దు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 45 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు రకరకాల ఎత్తుగడలతో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ అనుబంధ వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పేదలకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమీ లేదు.. పిటిషనర్ల తరఫున తొలుత దేవ్దత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. పేదలకు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మిన్ను విరిగి మీద పడదన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ వద్ద ల్యాండ్ బ్యాంక్ ఉందని, అందులో నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ, మాస్టర్ ప్లాన్లో చాలా మార్పులు చేశారన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉండగా, క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. సీఆర్డీఏ ప్రతిపాదనలను రైతులు గ్రామ సభల్లో తిరస్కరించారని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అనుమోలు జ్యోతిరత్న వివరించారు. అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాండవుల కోసం శ్రీకృష్ణుడు ఉన్నట్లు పేదల కోసం జగన్ ఉన్నారన్నారు. పేదల నివాసానికి కనీసం 5 శాతం భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉండగా, మాస్టర్ ప్లాన్లో మాత్రం దానికి స్థానం కల్పించలేదన్నారు. ఈ తప్పును సరిదిద్ది చట్ట ప్రకారం పేదల నివాసం కోసం 5 శాతం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్ధిష్టంగా ఫలానా చోటే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేక హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు, మళ్లీ హైకోర్టు.. అడ్డుకునేందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకెళ్లగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందంటూ రైతులను నిలదీసిందని, దీంతో వాళ్లు అక్కడ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిందని, అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి చేయకుంటే చేయలేదంటున్నారని, చేస్తుంటే ఎలా చేస్తారంటూ కోర్టులకెక్కుతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. నవ్వుల పువ్వులు హైకోర్టులో న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు లేవని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఓ పెద్ద మనిషి తనపై క్రిమినల్ కేసు నమోదు కాగానే భయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి మార్చారని తెలిపారు. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వదులుకుని అందరూ హడావుడిగా అమరావతికి వచ్చారన్నారు. దాని పర్యవసానమే సౌకర్యాల కొరత అని వివరించారు. ‘ఆ కోట్ల రూపాయల కోసమే అందరూ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళుతున్నారా? అంటూ ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. -
రాజధాని అందరిదీ.. అందులో అందరూ ఉండాలి: ఏపీ హైకోర్టు
అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. రాజధాని అందరిదీ అని, అందులో అందరూ ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కౌంటర్ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నా ప్రధాన న్యాయమూర్తి.. తదుపరిఇ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కాగా, సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. -
పేదలకిచ్చే స్థలాలపై అమరావతి రైతుల పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని, మంగళవారం విచారణకు అదనపు ఏజీ అందుబాటులో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అదనపు ఏజీ కార్యాలయం సైతం త్రిసభ్య ధర్మాసనం ముందు ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున, తాజా వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి కార్యాలయం రాతపూర్వకంగా కోర్టు ముందు మెమో దాఖలు చేసింది. తాజా వ్యాజ్యాలను ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జత చేయాలని అదనపు ఏజీ ఆ మెమోలో కోర్టును కోరారు. ద్విసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలిచ్చిన సీజే అటు ఏజీ వాదనలను, ఇటు ఏఏజీ మెమోను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాయ్ సైతం ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనమే విచారించడం మేలని అభిప్రాయపడ్డారు. అయితే, తమ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోరడంతో.. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు కేసు ఫైళ్లను (సీజే) ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాలను సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా ముందుంచింది. వీటిని పరిశీలించిన సీజే మంగళవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు వేయాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
అమరావతిలో పేదల ఇళ్లకుసీఆర్డీఏ ఆమోదం
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో 48,218 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ 33వ సమావేశంలో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు. 20 లేఅవుట్లు.. అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లేఅవుట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 41(3), (4) ప్రకారం ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి భూములను ఆ పరిధిలోకి తెచ్చింది. గత ఏడాది అక్టోబరులో అభ్యంతరాలు, సలహాలను స్వీకరించి సీఆర్డీఏ బహిరంగ విచారణ నిర్వహించింది. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం సన్నద్ధమైంది. సీఎం సమీక్షలో పురపాలక శాఖ మంత్రి సురేష్, సీఎస్ జవహర్రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు. చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్ను ఏర్పాటుచేశామని సుధాకర్రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
మా భూమి.. మాకే కౌలు
సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలు తమను మభ్యపెట్టి కాజేసిన అసైన్డ్ భూములను తిరిగి దక్కించుకునేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గతంలోనే పలువురు అసైన్డ్ రైతులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా మంగళవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు అక్రమంగా దక్కించుకున్న తమ అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలని కోరారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం తీసుకుంటుందని బెదిరించి తమ వద్ద నుంచి కాజేశారని సీఆర్డీఏ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ భూములను కారుచౌకగా తీసుకున్న తరువాత టీడీపీ సర్కారు వాటికి ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తుచేశారు. టీడీపీ నేతలు వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు చూపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసైన్డ్ భూములకు సీఆర్డీఏ ఇస్తున్న కౌలును తమకే చెల్లించాలని వినతిపత్రం అందించారు. భూసమీకరణ కింద అసైన్డ్ రైతులకు అందిస్తున్న ప్యాకేజీ తమకే ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా న్యాయం చేయాలి ‘టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. న్యాయం చేయాలని గతంలో అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సీఆర్డీయే అధికారులకు వినతి పత్రం సమరి్పంచాం. ప్రభుత్వం స్పందించి మా భూముల కౌలు మాకే ఇప్పించాలని కోరుతున్నాం. – టి.బాబూరావు, అసైన్డ్ రైతు, రాయపూడి బెదిరించి తీసుకున్నారు.. అసైన్డ్ భూమికి పరిహారం ఇవ్వరని టీడీపీ సర్కారు ప్రచారం చేసి మమ్మల్ని మోసం చేసింది. దీంతో భయపడి టీడీపీ నేతలకు అమ్మేందుకు ఒప్పుకున్నాం. కానీ తరువాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇప్పటికీ ఆ భూములు మాపేరునే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. సీఆర్డీయే రికార్డుల్లో కూడా వాటిని మా పేరిట మార్చాలని కోరాం. – ఆర్.పున్నారావు, అసైన్డ్ రైతు, రాయపూడి మా భూములిస్తే సాగు చేసుకుంటాం ‘అసైన్డ్ భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వదని టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశారు. ఎకరం రూ.కోటి పలికే భూమికి మాకు కేవలం రూ.6 లక్షలే ఇచ్చారు. మేం సంతకాలు చేసిన తరువాత టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రే షన్ కాలేదు కాబట్టి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – రేమర్ల కోటేశ్వరరావు, అసైన్డ్ రైతు, వెంకటపాలెం ప్యాకేజీ, కౌలు ఇప్పించండి ‘మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్లో ఉంది. సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి’ – వి.నరసింహారావు, అసైన్డ్ రైతు, రాయపూడి -
ఆ వ్యాజ్యాలనూ మేమే విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న ఆ వ్యాజ్యాలను సైతం తామే విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ఆ వ్యాజ్యాలను తమ ముందుంచాలని సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు, మరికొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలపై విచారణను కూడా ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తాము ఇప్పుడు విచారణ జరపడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజధాని అభివృద్ధి విషయంలో హైకోర్టు నిర్ధేశించిన కాల పరిమితులపై స్టే విధించిందన్నారు. ఈ నెల 31న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపనున్న దృష్ట్యా విచారణను ఫిబ్రవరికి వాయిదా వేయడం మేలన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, ఆ మేరకు మెమో కూడా దాఖలు చేశామన్నారు. ఈ మెమోకు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించిందని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాక, ప్రధాన అభ్యర్థనను సవరిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అంతేకాక చట్ట సవరణను సవాల్ చేస్తూ పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాలను జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో జత చేయాలని వారు త్రిసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను తమ ముందుంచాలంటూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయం మాకెందుకు చెప్పలేదు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సాయిసంజయ్ సూరనేని వాదనలు వినిపిస్తూ.. చట్ట సవరణపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. విచారణ ముగిసేంత వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయబోమంటూ ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని గతంలో దాఖలైన వ్యాజ్యాలకు సైతం వర్తింప చేయాలని కోరారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇదే అంశంపై ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉందని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయాన్ని ద్విసభ్య ధర్మాసనానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను కూడా తామే విచారిస్తామని స్పష్టం చేసింది. -
ఎంఐజీ ప్లాట్ల బుకింగ్కు గడువు పెంపు
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’లో ప్లాట్ల కొనుగోలు కోసం ఆన్లైన్లో బుకింగ్కు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు శనివారంతో ముగిసిందని, అయితే, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినట్లు వివరించారు. ఇక్కడి ఎంఐజీ లే అవుట్–2లో 200 చ.గ. ప్లాట్లు 68, 240 చ.గ. ప్లాట్లు 199, మొత్తం 267 ఉన్నాయని తెలిపారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించామని, కొనుగోలుదారులకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 10% ప్లాట్లు రిజర్వు చేయడంతోపాటు 20% రాయితీ ఇస్తున్నామని, స్థానిక విశ్రాంత ఉద్యోగులకు 5% ప్లాట్లను రిజర్వు చేసినట్లు తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్లు పొందినవారు సులభ వాయిదాల్లో డబ్బులు చెల్లించే సౌకర్యం కూడా ఉందన్నారు. ఆన్లైన్ బుకింగ్ అనంతరం ఈ–వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోందని, ప్లాట్ నికర అమ్మకపు ధరలో 60% మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతం మీద మినహాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు https://migapdtcp.ap.gov.in, https://crda. ap. gov. in వెబ్సైట్, లేదా 0866– 2527124 నంబర్లో గానీ సంప్రదించవచ్చు. -
సీఆర్డీఏ చట్టసవరణపై విచారణ 9కి వాయిదా
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరించడంపై రాజధాని రైతుపరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఇదే అంశంపై దాఖలైన మరో వ్యాజ్యాన్ని ప్రస్తుత వ్యాజ్యానికి జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. తాజా సవరణ చట్టం ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. ఇదే అంశంపై మరో వ్యాజ్యం దాఖలైందని తెలిపారు. దాన్ని కూడా ప్రస్తుత వ్యాజ్యంతో జతచేయాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇన్సూరెన్స్ రంగంలో ‘బీమా సుగమ్’ గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: బీమా సుగమ్ అన్నది బీమా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు. బీమా పాలసీల విక్రయం, కొనుగోలు, రెన్యువల్ (పునరుద్ధరణ), క్లెయిమ్ల పరిష్కారం సహా అన్ని రకాల సేవలను అందించే ఏకీకృత ప్లాట్ఫామ్గా ఉంటుందన్నారు. దేశంలో బీమా వ్యాప్తి విస్తరణకు ఈ టెక్నాలజీ పోర్టల్ సాయంగా నిలుస్తుందన్నారు. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు. యూపీఐ విప్లవం వంటిది... బీమా రంగానికి బీమా సుగమ్ అన్నది యూపీఐ విప్లవం వంటిదని వ్యాఖ్యానించారు. బీమా కంపెనీలు ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. బీమా ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు సహా అన్ని రకాల మధ్యవర్తులకూ ఈ పోర్టల్ యాక్సెస్ ఉంటుందని చెప్పారు. పాలసీదారులు ఈ పోర్టల్ నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. బీమాకు సంబంధించి దీన్నొక షాపింగ్ మాల్గా పాండా అభివర్ణించారు. -
అమరావతిలో అందరికీ ఆవాసం
సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్–5 జోన్గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి. చట్ట ప్రకారమే 5 శాతం సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్ పూలింగ్ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్–5 జోన్ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్లో పొందుపరిచింది. పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’ నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. సీఎం జగన్ పేదల పక్షపాతి పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే. – రేటూరి కిషోర్, సీనియర్ న్యాయవాది (మంగళగిరి) సామాజిక న్యాయం అంటే ఇదీ.. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ. – మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి అన్ని వర్గాలుండాలి ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్–5 జోన్ ఏర్పాటు మంచి నిర్ణయం. – వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) గొప్ప విషయం.. అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. – రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం సముచిత నిర్ణయం పేదల కోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. – ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ పేదల పక్షపాతి అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్(రాయదుర్గం) హర్షిస్తున్నాం.. అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. – చింతా కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది, ధర్మవరం తప్పిదాన్ని సరిదిద్దారు.. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. – మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు) సామాజిక సమత్యులత సాకారం అమరావతిలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సీఎం జగన్ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. –– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు అణగారిన వర్గాలకు పెద్దపీట.. అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి. ––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది) -
పచ్చ గద్దల భూ దందాపై ‘అసైన్డ్’ తిరుగుబాటు
సాక్షి, అమరావతి: పచ్చ గద్దల భూ దందాపై అసైన్డ్ రైతులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అమరావతిలో టీడీపీ పెద్దలు కాజేసిన తమ అసైన్డ్ భూములు తిరిగి దక్కించుకునేందుకు ఉద్యుక్తులమవుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయని ఆ భూముల ప్యాకేజీ తమకే దక్కాలని, వాటిని వెనక్కి ఇస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 964 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీపై ‘సాక్షి’కథనాలతో చైతన్యమైన అసైన్డ్ రైతులు రెవెన్యూ కార్యాలయాల తలుపుతడుతున్నారు. అమరావతిలో పలు గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇది 29 గ్రామాలకూ విస్తరిస్తుండటంతో టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పుడు రికార్డులు సవరించాలి అమరావతి గ్రామాల్లో అసైన్డ్ రైతులు సంఘటితమవుతున్నారు. చిన్న పాయగా మొదలైన ఈ ఉద్యమం ఊపందుకుంటోంది. నవులూరు, కురగల్లు, ఎరబాలెం తదితర గ్రామాలకు చెందిన అసైన్డ్ రైతులు రెండు రోజులుగా మంగళగిరి తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు తమవేనని, వాటిని ఎవరికీ విక్రయించలేదని పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పోలీసులతో బెదిరించి రాత్రికి రాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించి బలవంతంగా సంతకాలు చేయించారని వెల్లడించారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు చట్టం సమ్మతించకపోవడం తమకు కాస్త ఊరట నిచ్చిందన్నారు. ఆ భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వాటిని టీడీపీ నేతలు భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు తప్పుగా చూపటాన్ని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూసమీకరణ కింద అసైన్డ్ భూములకు చెల్లించిన ప్యాకేజీ తమకే ఇవ్వాలని, అందుకు సమ్మతించకుంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రూ.కోటి భూమికి రూ.6 లక్షలే మాకు కురగల్లులో 3.36 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేసి ఎకరం రూ.కోటి పలికే భూమిని రూ.6 లక్షలకే కాజేశారు. మేం సంతకాలు చేశాక టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. మమ్మల్ని టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వాటి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – మార్కంపూడి అశోక్, అసైన్డ్ రైతు, కురగల్లు అసైన్డ్ ఖాతాలో పట్టా భూమి మా కుటుంబానికి ఐదెకరాల పట్టా భూమి ఉంది. రాజధాని ప్రకటించిన తరువాత అది అసైన్డ్ భూమి అని బెదిరించడంతో భయపడి టీడీపీ నేతలకు విక్రయించేందుకు ఒప్పుకున్నాం. తరువాత నిర్ణయం మార్చుకోవడంతో పోలీస్ స్టేషన్కు పిలిచి బెదిరించారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – దావు బిచ్చారావు, రైతు, ఎర్రబాలెం న్యాయం చేయాలి.. మాకు 1.10 ఎకరాల భూమి ఉంది. టీడీపీ నేతలు, పోలీసులు మమ్మల్ని బెదిరించి తక్కువ ధరకు విక్రయించేలా ఒప్పించారు. బలవంతంగా అర్థరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించి సంతకాలు తీసుకున్నారు. మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్లో ఉంది. సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి. – నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఎర్రబాలెం -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు. అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్లైన్లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. -
3 రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ తన రాజధానిని నిర్ణయించుకునే స్వతఃసిద్ధ అధికారం ఉంటుందని తెలిపింది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించిన తరువాత రాజధాని వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, అయినప్పటికీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వెలువరించిందని ప్రభుత్వం తన పిటిషన్లో నివేదించింది. రాజ్యాంగంలోని అధికరణలు 3, 4లను అనుసరించి కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం లౌకిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 258 ద్వారా కేంద్రం బదలాయించిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం తెచ్చిందని హైకోర్టు తన తీర్పులో చెప్పిందని, వాస్తవానికి రాజ్యాంగంలోని లిస్ట్ రెండు 5వ ఎంట్రీలోని అధికారాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చిందని ప్రభుత్వం వివరించింది. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదని నివేదించింది. పైపెచ్చు రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదంటూ కేంద్రమే లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో గుర్తు చేసింది. ► అధికరణ 258 కింద ఉన్న కార్యనిర్వాహక, పాలన అధికారాలను మాత్రమే బదలాయించడం జరుగుతుంది కానీ శాసనాధికారాన్ని కాదని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సీఆర్డీఏ చట్టాన్ని కేంద్రం బదలాయించిన అధికారం ద్వారానే చేశామని అనుకుంటే, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన కమిటీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని భావించాల్సి ఉంటుందని వివరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఇది ఓ ప్రధాన కారణమని నివేదించింది. కేంద్రం ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కేంద్ర చట్టానికి విరుద్ధమైనప్పుడు దాన్ని హైకోర్టు సమర్థించగలదా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న అని తెలిపింది. ► ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తించలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. ల్యాండ్ పూలింగ్ స్కీం అమలుకు నిర్దేశించిన కాల పరిమితిని 2024 వరకు సీఆర్డీఏ ఇప్పటికే పొడిగించిందని, అందువల్ల ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపాల్సిన ఎంత మాత్రం లేదని నివేదించింది. ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్డీఏ, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రశ్నించింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 58, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించటాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లో సవాల్ చేసింది. సమగ్ర బిల్లుతో మళ్లీ ముందుకు వస్తాం ► శాసనసభకు చట్టం చేసే హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి గుడివాడ ► తన రియల్ఎస్టేట్ బినామీల కోసం విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసమే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని దీన్ని ద్వారా సుప్రీంకు తెలియజేశామన్నారు. శాసనసభకు చట్టంచేసే హక్కు లేదనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. మూడు రాజధానులపై మళ్లీ అసెంబ్లీలో సమగ్ర బిల్లుతో ముందుకు వెళతామని ప్రకటించారు. శనివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ► హైకోర్టు తీర్పుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామని, శాసనసభకు రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసేవిధంగా ఉంది. ఆర్టికల్–3, 4 ప్రకారం రాజధాని ఎంపిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని గతంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ► శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతుంది. ► రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే, 29 గ్రామాల కోసం, తన రియల్ ఎస్టేట్ బినామీల కోసం చంద్రబాబు చిచ్చు, విద్వేషాలను రేకెతిస్తున్నారు. ► అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. -
మరిన్నిచోట్ల జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను అందించే జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసి ఎంఐజీ లేఅవుట్లను సిద్ధం చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. సీఆర్డీఏ పరిధిలోని ఆరు జిల్లాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో 80.46 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజీ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 614 ప్లాట్లు వేశారు. ఇటీవల మొదటి విడతగా 119 ప్లాట్లను ఈ–లాటరీ ద్వారా కొనుగోలుదారులకు కేటాయించారు. ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండడంతో అధికారులు మిగిలిన 495 ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 27 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా నారాకోడూరులో 97 ఎకరాల సేకరణకు ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్లు మంజూరు చేసింది. గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలను గుర్తించి దస్త్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలనకు పంపారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాల్లో 776.8 ఎకరాలను గుర్తించారు. గుంటూరు జిల్లాలోని నారాకోడూరు, అంకిరెడ్డిపాలెం, నేలపాడు, జొన్నలగడ్డ, నిడుబ్రోలు సమీపంలో మొత్తం 474.7 ఎకరాలు గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను, మూడింట్లో భూమిని గుర్తించాల్సి ఉంది. బాపట్లలోని రేపల్లె వద్ద 243.86 ఎకరాలను గుర్తించి జిల్లా కలెక్టర్కు నివేదించారు. ఏలూరు నియోజకవర్గంలో నూజివీడు వద్ద 40.78 ఎకరాలకు నివేదికను సిద్ధం చేస్తున్నారు. మధ్య తరగతికి మేలు చేసేలా.. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలు పట్టణానికి సమీపంలో ఇంటి స్థలం కొనాలని అనుకుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు రియల్టర్లు పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వెంచర్లకు అనుమతులు లేకున్నా.. ఉన్నట్టు నమ్మించి అంటగడుతున్నారు. ఈ వెంచర్లలో మాస్టర్ ప్లాన్తో సంబంధం లేనివి, రెరా అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయి. వీటికి అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవడం ప్లాట్లు కొన్నవారికి తలకు మించిన భారమే. కొన్నిసార్లు ఈ తరహా ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులు మంజూరుకావు. మధ్య తరగతి ప్రజలు ఇటువంటి మోసాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులతో, మార్కెట్ ధరకంటే తక్కువలో ఎంఐజీ ప్లాట్లను జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతోఅందుబాటులోకి తెస్తోంది. క్లియర్ టైటిల్ డీడ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం అనుమతితో పాటు అన్ని వసతులతో వీటిని అందిస్తోంది. -
సీఆర్డీఏ ప్లాట్ల వేలం గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాల వంటి వివిధ వాణిజ్య అవసరాలు, నివాసాల నిర్మాణానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కేటాయించిన ప్లాట్ల వేలం గడువును ఆగస్టు 1న వరకు పొడిగించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 5 లాట్లలో ఉన్న 100 ప్లాట్లను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. తొలుత ఈ నెల 28న ఈ–వేలం నిర్వహించాలని నిర్ణయించగా..ఎక్కువ మంది వేలంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వరకు పొడిగించింది. వేలం వేసే ప్లాట్ల వివరాలివీ.. ► తెనాలి నగరం చెంచుపేటలో లాట్–1లో 250 నుంచి 5,372 చ.గ విస్తీర్ణంలో మొత్తం 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో సినిమా థియేటర్, హెల్త్ సెంటర్, ప్రాథమిక పాఠశాల కోసం మూడు ప్లాట్లు, మిగిలినవి వాణిజ్య సముదాయాల కోసం కేటాయించారు. ఇక్కడ చ.గ. ధర రూ.35,200గా నిర్ణయించారు. ► తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు వద్ద ఉన్న లాట్–2లోని అమరావతి టౌన్షిప్లో 500 నుంచి 4,065 చ.గ. విస్తీర్ణం వరకు మొత్తం 18 ప్లాట్లను అభివృద్ధి చేశారు. వీటిలో 14 వాణిజ్య ప్లాట్లకు చ.గ. రూ.17,600 గాను.. ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాలలకు కేటాయించిన ప్లాట్లలో చ.గ. రూ.16 వేలుగాను ధర నిర్ణయించారు. ► విజయవాడ పాయకాపురం టౌన్షిప్లోని లాట్–3లో 550 చ.గ. నుంచి 3 వేల చ.గ. వరకు మొత్తం 10 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం, స్థానిక షాపింగ్ కోసం కేటాయించారు. ఇదే ప్రాంతంలోని లాట్–4లో 100 నుంచి 744 చ.గ. వరకు 29 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు, నివాస అవసరాలకు కేటాయించారు. ఈ రెండు ప్రాంతాల్లోను చ.గ. ధర రూ.25 వేల నుంచి రూ.27,500 వరకు ఉంది. ► ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లోని లాట్–5లో 150 నుంచి 1000 చ.గ. వరకు ఉన్న మొత్తం 28 ప్లాట్లు ఉన్నాయి. వీటిని దుకాణాలు, కార్యాలయాలు, నివాసానికి కేటాయించారు. వీటిలో మూడు ప్లాట్లకు చ.గ. ధర రూ.11 వేలుగా, మిగిలిన ప్లాట్లలో చ.గ. రూ. 10 వేలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https:// konugolu.ap.gov.in/,https://crda.ap.gov.in/లో పొందవచ్చు. ఫోన్ ఓటీపీతో రిజిస్ట్రేషన్ పైన పేర్కొన్న ప్లాట్ల కొనుగోలుకు ఫోన్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈ–వేలం సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. కొనుగోలుదారులెవరూ అమ్మకందారును కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా, ఇంటివద్దే ఫోన్ సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. తమ సందేహాల నివృత్తి కోసం 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ) కోరుకునే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను పూర్తి ప్రభుత్వ హామీతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్ టౌన్షిప్ల అభివృద్ధి మార్గదర్శకాలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు శనివారం సీఆర్డీఏ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, డెవెలప్మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ ఎం.వెంకటసుబ్బయ్య, క్రెడాయ్ అధ్యక్షుడు కె.రాజేంద్ర, సభ్యులు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) సభ్యులు, వాటి పరిధిలోని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ డెవలపర్స్ సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్మార్ట్ టౌన్షిప్లను చేపట్టనున్నామని, ప్రాజెక్టు అమలుకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) నేతృత్వం వహిస్తుందని వివరిచారు. ప్రాజెక్టుకు 20 ఎకరాలు తప్పనిసరి డెవలపర్ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్గా అభివృద్ధి చేయాలని, యజమాని పేరుతోనే భూమి ఉండాలని కమిషనర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని వివరించారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, డెవలపర్ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డెవలపర్స్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డెవలప్స్ అడిగిన సందేహాలను వివేక్ యాదవ్తో పాటు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్కు చెందిన డొమైన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ నివృత్తి చేశారు. అలాగే సీఆర్డీఏ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, మంగళగిరి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ ప్రాంతాల్లో ప్లాట్లను ఈ–వేలం ద్వారా అమ్మకానికి ఉంచామని, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తోడ్పాటునందించాలని కోరారు. ఎంఐజీ నిబంధనలు ఇవీ.. ► రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 88లోని నిబంధనలకు అనుగుణంగా ఎంఐజీ లే అవుట్లు ఉండాలి ► లే అవుట్లో పట్టణాభివృద్ధి సంస్థ (యూడిఏ) వాటాగా 40 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంఐజీ దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ముందుకొస్తే దాన్ని తిరస్కరణ లేదా అంగీకరించే అధికారం జిల్లాస్థాయి కమిటీకి ఉంటుంది ► దరఖాస్తుదారులకు అనువైన ప్రాంతంలో ఎలాంటి వ్యాజ్యాలు, తాకట్టులు లేని కనీసం 20 ఎకరాల భూమిలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి ► ఎంఐజీ ప్లాట్ల అనుమతులు, మార్కెట్ విలువ, అమ్మకం ధర వంటి అంశాలు ఎలా ఉండాలో జిల్లా కమిటీ సూచిస్తుంది. ► ప్రాజెక్టు ఏర్పాటు చేసే ఒక ప్రాంతం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి సంస్థలను జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది ► ఎంఐజీ ప్లాట్ల అమ్మకపు ధర ఎప్పుడూ మార్కెట్ ధర కంటే కనీసం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉండేలా కమిటీ చూడాలి ► లే అవుట్లలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు, ఫుట్పాత్ తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి ► ఎంఐజీలో ప్లాట్లు కావాలనుకునేవారు దరఖాస్తుతో పాటు ప్లాట్ ధరలో 10 శాతం, ఒప్పదం చేసుకునే సమయంలో మరో 10 శాతం, ప్రాజెక్టు పూర్తయ్యాక ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన 80 శాతం మొత్తాన్ని చెల్లించాలి. -
అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం
సాక్షి, అమరావతి: ల్యాండ్ పూలింగ్ కింద అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చర్యలు చేపట్టింది. రైతులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతులకు కేటాయించిన ప్లాట్లను 12 జోన్లుగా విభజించగా, వాటిలో జోన్–4లోని పిచ్చుకలపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో ఉన్న ప్లాట్లలో పనులు ప్రారంభించారు. సోమవారం పిచ్చుకలపాలెం వద్ద రహదారి నిర్మాణాన్ని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్పీఎస్ ప్లాట్లను పూర్తి కమర్షియల్ విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జోన్–4లో మొత్తం 1358.42 ఎకరాల్లో 4,551 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.192.52 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లను తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ షేక్ అలీంబాషా, చీఫ్ ఇంజినీర్లు టి.ఆంజనేయులు, సీహెచ్ ధనుంజయ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అమరావతిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన కృష్ణా నది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో విస్తరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టామని వివేక్ యాదవ్ తెలిపారు. నిబంధనలకు లోబడి అమరావతి ప్రాంతంలో టౌన్షిప్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. రైతులకు కౌలు డబ్బును కూడా సకాలంలో చెల్లిస్తున్నట్టు వివరించారు. -
మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ ర్యాండమ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. చదవండి: ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ -
రాజధాని నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ
సాక్షి, అమరావతి: అభివృద్ధి చెందిన నగరాలు, రాజధానులు అన్నిరకాలుగా అభివృద్ధి సాధించి ఆ స్థాయికి రావడానికి కనీసం 40–50 సంవత్సరాలు పట్టిందని, రాజధాని నగర నిర్మాణం అన్నది ఎంతో సమయం తీసుకునే సుదీర్ఘ ప్రక్రియ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను తగిన మౌలిక వ సతులు కల్పించి అప్పగించడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వివరించింది. అందువల్ల రాజధాని నగర నిర్మాణం విషయంలో నిర్దేశించిన కాల పరిమితులన్నింటినీ తొలగించడమో లేదా తీర్పులో విధించిన గడువు పెంచడమో చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. అంతేకాక రాజధాని నగరానికి మాత్రమే పరిమితమవుతూ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి, ఏపీ సీఆర్డీఏకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును మరోసారి కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధాని వ్యవహారంలో ఇటీవల హైకోర్టు తీర్పునిస్తూ.. రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీ ఆర్డీఏను ఆదేశించిన విషయం తెలిసిందే. రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆ దేశించింది. ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన య జమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాస యోగ్యమైన రీతిలో మూడు నెలల్లో అప్పగించాలని కూడా ఆదేశించింది. రాజధాని అభివృద్ధికి సంబంధించిన పురోగతితో ఎప్పటికప్పుడు అఫిడవిట్లు వేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. అందులో ఇంకా ఏ విషయాలు పొందుపరిచారంటే.. దశల వారీగా ప్లాట్లు అప్పగిస్తాం ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు 63,452 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 21,567 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు 41,885 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాం. భూసేకరణ వివా దం వల్ల 3,289 ప్లాట్లను కేటాయించడం గానీ, రిజి స్టర్ చేయడం గానీ చేయలేదు. 1.4.2022 నాటికి 17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్కు అర్హమైనవి. ఇందులో 709 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశాం. మిలిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం రైతులకు నోటీసులిచ్చాం. మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా ప్లాట్లను దశలవారీగా రైతులకు అప్పగిస్తాం. పనులను వేగవంతం చేసేందుకు సీఆర్డీఏ ఎప్పటికప్పుడు సంబంధిత సంస్థలు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటివరకు మూడు సమావేశాలు నిర్వహించాం. నిధుల సమీకరణ నిమిత్తం బ్యాంకర్లతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాజధాని అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు అవసరం కాబట్టి, అంత పెద్ద మొత్తాన్ని ఒక బ్యాంక్ ఇవ్వడం సాధ్యం కాదని, బ్యాంకుల కన్సార్టియం ఏర్పాటు అవసరం ఉందని బ్యాంకర్లు చెప్పారు. సవరించిన మోడల్తో రూ.3,500 కోట్లకు తాజాగా ప్రతిపాదనలు పంపాలని బ్యాంకర్లు కోరారు. తగిన సమయంలో బ్యాంకర్లతో తదుపరి సమావేశం ఉంటుంది నిర్మాణాల గడువును పొడిగించాం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ కోసం భూములను, ప్లాట్లను వేలం వేయడానికి సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. ఎస్టేట్ విభాగం ఖాళీ స్థలాలను గుర్తించే పనిలో ఉంది. నవులూరు అమరావతి టౌన్షిప్లో 331 ప్లాట్లను వేలం వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్లాట్ల వేలం ద్వారా రూ.330 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నాం. రూ.33.51 కోట్లతో హైకోర్టు అదనపు భవనం నిర్మాణం జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు ఎన్సీసీ సంస్థకు 30.11.2022 వరకు గడువును పొడిగించాం. 18 టవర్లలోని 432 అపార్ట్మెంట్ యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. రాజధాని నగర నిర్మాణంలో భాగంగా దొండపాడు సమీపంలోని 14.5 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్ నిర్మాణ పనులను ఎన్సీసీ మొదలు పెట్టింది. ఇప్పటివరకు రూ.175.87 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. మిగిలిన పనులు డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న కరకట్ట సింగిల్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నాం. -
సీఆర్డీఏ నోటీసులు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవాలంటూ సీఆర్డీఏ కమిషనర్ జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమంటూ భూ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం విచారణ జరిపారు. సీఆర్డీఏ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేశారు. విజయవాడకు చెందిన కొండేటి గిరిధర్, ఆయన కుమారుడు అఖిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్బాబు వాదనలు వినిపిస్తూ, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. ప్లాట్ బదలాయింపు హక్కుతో సహా భూ సమీకరణ యాజమాన్య ధృవీకరణ పత్రాలను భూ యజమానులకు ఇవ్వాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందన్నారు. ఈ బాధ్యతలేవీ సీఆర్డీఏ నిర్వర్తించడంలేదని తెలిపారు. -
ఏపీ: మూడు రాజధానులు, సీఆర్డీఏపై వెలువడిన తీర్పు
-
‘ఎంఐజీ లే అవుట్ పనులు వేగవంతం చేయాలి’
మంగళగిరి: జగనన్న స్మార్ట్ కాలనీ ఎంఐజీ లే–అవుట్లో పనులు మరింత వేగవంతం చేయాలని సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కన వేసిన జగనన్న స్మార్ట్ కాలనీతో పాటు పక్కనే వున్న పాత టౌన్షిప్లో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. విజయకృష్ణన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులను సమన్వయం చేసుకుని టౌన్షిప్ మొత్తం పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. జగనన్న స్మార్ట్ కాలనీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని ఇప్పటివరకు సుమారు 600 దరఖాస్తులు రాగా 100 మందికిపైగా నగదు చెల్లింపులు చేశారని చెప్పారు. అనుకున్న సమయానికి జగనన్న స్మార్ట్ కాలనీని అభివృద్ధి చేసి యజమానులకు ప్లాట్లు అప్పగిస్తామని తెలిపారు. -
అమరావతిపై వ్యాజ్యాలన్నీ నిరర్థకమే
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ చట్టాలు వచ్చిన నేపథ్యంలో వాటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి, శాసన మండలి తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. ఆ వ్యాజ్యాల్లో విచారించడానికి ఏమీలేదని వివరించారు. ఈ ముగ్గురి వాదనలతో పాటు కేంద్ర ప్రభుత్వ వాదనలు సైతం ముగిసిన నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానం ఇచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులందరూ 4వ తేదీన అర్థగంటలో తమ వాదనలు ముగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఏవి నిరర్థకమయ్యాయి? అన్న పిటిషనర్ల వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరుపుతోంది. తాజాగా.. బుధవారం మరోసారి వీటిపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తిచేసిన నేపథ్యంలో ఏజీ ఎస్. శ్రీరామ్, సీనియర్ న్యాయవాదులు ఎస్. నిరంజన్రెడ్డి, ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆ అంశం తేలిస్తే ఇది కూడా తేల్చండి.. ముందుగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అమరావతిని రాజధానిగా మార్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారని, ఆ అంశంపై కోర్టు తేలిస్తే, అసలు అమరావతిని పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారమే రాజధానిగా నిర్ణయించారా? అన్న అంశాన్ని కూడా తేల్చాల్సి ఉంటుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటుచేసిందన్నారు. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం బోస్టస్ కమిటీ, జీఎన్ రావు కమిటీలను ఏర్పాటుచేసిందని, ఇవి నిజ నిర్ధారణ కమిటీల వంటివని శ్రీరామ్ వివరించారు. ఈ నివేదికలపై న్యాయ సమీక్ష చేయడానికి లేదా వాటిని రద్దు చేయడానికీ వీల్లేదన్నారు. ఆ చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత కూడా వాటిపై దాఖలైన వ్యాజ్యాలను విచారించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఏ రకంగా చూసినా అవన్నీ నిరర్థకమయ్యాయని శ్రీరామ్ తెలిపారు. సీఆర్డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. తర్వాత నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ చట్టం చేయాలి.. ఆ చట్టం ఎలా ఉండాలన్నది ప్రభుత్వ, శాసన వ్యవస్థ పరిధిలోని అంశమన్నారు. ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది మాత్రమే కోర్టులు చూడాల్సి ఉంటుందని తెలిపారు. సీఆర్డీఏ ప్రాంతాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో వెనక్కివెళ్లే ఉద్దేశంలేదన్నారు. అయితే.. నిధుల కొరతే ప్రధాన సమస్య అన్నారు. మాస్టర్ ప్లాన్ను అమలుచేసేందుకు రూ.1.09 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, ఇప్పుడు అది రూ.2 లక్షల కోట్లకు చేరవచ్చునని వివరించారు. ప్రాధాన్యతల ఆధారంగా కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం భవిష్యత్తులో ఏ చట్టం చేస్తుంది? అందులో ఏముంటాయి తదితర విషయాలు కోర్టుకు సంబంధంలేదన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలా? లేక మరేదైనా రాజధానిగా ఉండాలా? వంటి అంశాలను న్యాయస్థానాలను తేల్చజాలవన్నారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. పాలనా కేంద్రం ఎంపిక రాష్ట్రం ఇష్టం అనంతరం.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్. హరినాథ్ వాదనలు వినిపిస్తూ, రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. పాలనా కేంద్రం ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని తెలిపారు. దీంతో ప్రతివాదుల తరఫున వాదనలన్నీ పూర్తి కావడంతో ఈ వాదనలకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానమివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి కోర్టు సమయం ముగియడంతో మరికొందరి తిరుగు సమాధానం కోసం ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 4కి వాయిదా వేసింది. ఆ రోజున అందరి వాదనలు పూర్తయితే, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుంది. -
గవర్నర్ ఆమోదించేవరకు ఆ బిల్లులపై తేల్చలేం
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లులను గవర్నర్ ఆమోదించేవరకు ఆ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు పూర్తిగా నిరర్థకం అవుతాయా? కొంత భాగమే నిరర్థకం అవుతాయా? అన్న విషయాలను తేల్చడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పాలన వికేంద్రీరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ఉపసంహరణకు ముందున్న కార్యకలాపాలు, అభివృద్ధిని చట్టప్రకారం కొనసాగించేందుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి (స్టేటస్కో)ని కొనసాగించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో జారీ చేసిన ఇతర మధ్యంతర ఉత్తర్వులన్నీ తదుపరి విచారణ వరకు కొనసాగుతాయని చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, తాజా బిల్లులపై అఫిడవిట్ వేశామని చెప్పారు. బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపామన్నారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది, తదుపరి ఏం చేయబోతోంది తదితర వివరాలతో మెమో దాఖలు చేస్తామని, ఇందుకు నాలుగు వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. మా వ్యాజ్యాలపై విచారణను కొనసాగించండి పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, పీబీ సురేశ్ తదితరులు వాదనలు వినిపిస్తూ, బిల్లులు ఇంకా చట్ట రూపం దాల్చలేదన్నారు. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఒక వైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లులు తెచ్చిందని, మరో వైపు మూడు రాజధానుల కోసం బిల్లులు తెస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్నదే తమ ప్రధాన వాదన అని తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థన కూడా ముఖ్యమైనదని వివరించారు. అందువల్ల తాజా బిల్లులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోవడాన్ని మేం కోరుకోవడం లేదు ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, గతంలో ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వుల వల్ల అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడాన్ని తాము కోరుకోడం లేదంది. అభివృద్ధి కార్యకలాపాలకు యథాతథస్థితి ఉత్తర్వులు అడ్డంకి కాదని తెలిపింది. న్యాయస్థానం ఆదేశాలతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్న భావన ప్రజల్లో కలగకూడదంది. ప్రతీ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలను చట్టాలు చేయకుండా నిరోధించడం సాధ్యం కాదని, అవి నిబంధనల మేర ఉన్నాయో లేదో మాత్రమే చూస్తామని తెలిపింది. అనంతరం పిటిషనర్ల తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాలు పూర్తిగా నిరర్థకం అవుతాయా? కొంత భాగమే నిరర్థకం అవుతాయా? అన్న అంశాన్ని బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేంత వరకు తేల్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. -
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల..చట్టబద్ధతను తేలుస్తాం
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన నిర్ణాయక విధానాన్ని కూడా తేలుస్తామంది. రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతం అనువైనదన్న అంశం తమకు సంబంధించినది కాదని, అందువల్ల దానిజోలికి వెళ్లబోమని తేల్చిచెప్పింది. తమ ముందున్నది నగరాల మధ్య పోటీ వివాదం కాదంది. అందువల్ల న్యాయవాదులు చట్టాల చట్టబద్ధత గురించే వాదనలు వినిపించాలంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం నాలుగోరోజు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా తాము సరదాగా మాట్లాడుతున్న మాటలు కూడా ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వాదనల సమయంలో తాము పూర్తిస్థాయి చర్చలోకి వెళ్లలేకపోతున్నామని, ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందని తెలిపింది. తమ సందేహాలను నివృత్తి చేసుకునే పరిస్థితి ఉండటం లేదంది. సరదాగా మాట్లాడుకునే మాటలు సైతం కోర్టు వెలుపల మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, మీరూ అదేపని చేయాలంటూ అటు అడ్వొకేట్ జనరల్, ఇటు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పిటిషనర్లు దోనె సాంబశివరావు తదితరుల న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. అంతర్జాతీయస్థాయి రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీ నుంచి వెనక్కి వెళుతోందన్నారు. అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం అయితే మిగిలిన ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్న వాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరపైకి తెస్తోందని చెప్పారు. అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య ఉపాధ్యక్షుడు కళ్లం పానకాలరెడ్డి, మరో ఇద్దరి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. అమరావతి తమదన్న భావన ప్రజల్లో లేదన్న ప్రభుత్వ వాదన అర్ధరహితమన్నారు. తుగ్లక్, అక్బర్లు రాజధానులను మరో చోటుకు మార్చి, ఆ తరువాత తిరిగి పాత నగరాలకే రాజధానులను తీసుకొచ్చారన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సరదాగా స్పందిస్తూ.. చారిత్రాత్మకంగా తుగ్లక్ సమర్థతను ప్రపంచం తక్కువగా అంచనా వేసిందని చెప్పగా, నిజమేనని సీజే నవ్వుతూ బదులిచ్చారు. సరదా మాటలు సైతం పతాక శీర్షికలవుతున్న నేపథ్యంలో ఈ మాటలన్నీ బయట మాట్లాడుకోవాలని సీజే నవ్వుతూ చెప్పారు. -
రాజధాని కేసుల్లో విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో పలువురి అభ్యర్థన మేరకు తదుపరి విచారణను నవంబర్ 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఆ తరువాత ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా రోజువారీ పద్ధతిలో విచారణ జరిగేందుకు సహకరించాలని ధర్మాసనం న్యాయవాదులకు తేల్చి చెప్పింది. న్యాయవాదుల వ్యక్తిగత కారణాలు ఏవైనప్పటికీ తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మాట్లాడుకుని ముందు ఎవరు వాదనలు ప్రారంభిస్తారో అందుకు సంబంధించి షెడ్యూల్ను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ విధానంలోనే తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. న్యాయవాదుల నుంచి భిన్న సూచనలు ఈ వ్యాజ్యాల్లో విచారణను సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ అందించామని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ తరఫున జూనియర్ న్యాయవాది సంజయ్ సూరనేని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విచారణను ఎప్పటికి వాయిదా వేయాలన్న దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. సెప్టెంబర్ చివరి వారానికి కోవిడ్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయని, అక్టోబర్ మొదటి వారం నుంచి హైకోర్టుకు దసరా సెలవులు, ఆ తరువాత దీపావళి సెలవులు ఉంటాయని ఏజీ తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో నిరాటంకంగా వాదనలు జరగాల్సి ఉన్నందున విచారణను నవంబర్లో చేపట్టాలని కోరారు. దీనిపైనా న్యాయవాదులు భిన్న సూచనలు చేశారు. పిటిషనర్ల తరఫున హాజరైన సుప్రీంకోర్టు న్యాయవాది దేవదత్ కామత్ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ సమయంలో ధర్మాసనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమలో తాము మాట్లాడుకుని ఎవరు ఏయే సమయంలో వాదనలు వినిపించాలో నిర్ణయించుకుని కోర్టుకు తెలియచేస్తామని ప్రతిపాదించారు. స్వాగతించిన ధర్మాసనం అత్యధికుల సూచన మేరకు తదుపరి విచారణను నవంబర్ 15కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఆర్డీఏ: భూమిలేని కుటుంబాలకు పింఛన్ చెల్లింపు
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో భూమిలేని కుటుంబాలకు పింఛన్ చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పింఛన్ చెల్లింపునకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
CRDA కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు
-
'విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుంది'
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. '' త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి పరిపాలన చేస్తాము.సీఆర్టీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాం. కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తాం. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తాం. ఏలేరు-తాండవ రిజర్వాయర్ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం'' అని తెలిపారు. చదవండి: అనుకున్న సమయంలోగా లక్ష్యాలను చేరాలి: సీఎం జగన్ -
అక్రమాలు చేసేందుకే 'సీఆర్డీఏ'లో సెక్షన్లు
అనకాపల్లి: అమరావతి కోసం దళితవర్గాల అసైన్మెంట్ భూముల సేకరణ, అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. దళితులకిచ్చిన ప్రభుత్వ భూములను చంద్రబాబు అనుచరులు అక్రమంగా సేకరించి లబ్ధిపొందారని ఆయన ఆరోపించారు. భూముల సేకరణలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నా మంత్రిపై, అధికారులపై కేసులు పెట్టరాదని సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 146 చేర్చడాన్ని చూస్తే.. అక్రమాలు చేయడానికి ముందే సిద్ధపడినట్లు రుజువైందని చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి పోస్టులో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి చెరుకూరి శ్రీధర్ను నియమించడం ఒక నేరమని చెప్పారు. శ్రీధర్ను ముందుపెట్టుకొని సీఆర్డీఏను మంత్రి నారాయణ సొంత ఎస్టేట్గా వాడుకున్నారన్నారు. చంద్రబాబు ప్రతి విచారణకు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ గవర్నర్ వద్దకుగానీ, ప్రివిలేజ్ కమిటీ వద్దకుగానీ వెళ్లకపోవడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని ఆయన చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. తర్వాత వాయిదాకు హాజరుకాకపోతే ఆయనపై వారెంట్ జారీచేసి అరెస్టు చేసే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందన్నారు. ఆరు రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయకుండా ఎన్నికల కమిషనర్ పారిపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన ఉత్తరాలను లీకు చేస్తున్నారంటూ గవర్నర్ కార్యదర్శిపై ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేయడం సరికాదని చెప్పారు. -
‘అసైన్డ్’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారంటూ సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ను సీఐడీ అధికారుల బృందం ప్రశ్నించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు హయాంలో రాజధానికోసం భూ సమీకరణ(ల్యాండ్ ఫూలింగ్) జరిగినప్పుడు ఆ ప్రాంతమున్న గుంటూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్గాను, రాజధానిలో రైతుల భూముల సేకరణ, ప్లాట్లు కేటాయింపు తదితర చర్యలు చేపట్టినప్పుడు సీఆర్డీఏ కమిషనర్గాను కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్ను శుక్రవారం విజయవాడలోని సత్యనారాయణపురం సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు. అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా చేతులు మారుతున్నప్పుడు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న మీరు ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్పై సీఐడీ అధికారులు ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండానే జీవోలు జారీ చేస్తున్నా, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అడ్డగోలుగా జరిగినా ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారిగా తన పరిధి మేరకు ఏది చట్టబద్ధమో? ఏది చట్టబద్ధం కాదో? ప్రభుత్వానికి చెప్పడం వరకే తన బాధ్యత అని, ఆచరించడం, ఆచరించకపోవడం అనేది వారిష్టమని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇంకా అనేక కీలక ఆధారాలను శ్రీధర్ నుంచి సీఐడీ సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల నుంచి తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐడీ పోలీసులు శుక్రవారం పలు వివరాలు సేకరించారు. చంద్రబాబు హయాంలో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. -
రాజధాని నిర్ణయం భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుట్ర
సాక్షి, అమరావతి: రాజధాని నిర్ణయం, అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ పునరుద్ఘాటించారు. ఈ కుట్ర వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు నివేదించారు. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ ఇటీవల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితులు కిలారు రాజేశ్, ఆయన భార్య శ్రీహాస తది తరులు హైకోర్టులో వేర్వేరుగా క్రిమినల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపి తీర్పు వాయిదా వేశారు. అయితే అమరావతి భూ కొనుగోళ్ల కుంభకోణం కేసులో కొందరు ఉద్యోగులు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని, ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ రాయ్ కేసును తిరిగి ఓపెన్ చేయడంతో మంగళవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆ జీవోలు ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదు అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణానికి సం బంధించి పలు కీలక విషయాలను ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఆర్డీఏ చట్టం తీసుకురావడం, సీఆర్డీఏ ఏర్పాటు చేయడం, దాని పరిధి నిర్ణయించడం, అభివృద్ధి పనుల కొనసాగింపు బాధ్యతలు సీఆర్డీఏకి అప్పగించడం తదితరాలపై అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లు ఏవీ కూడా పురపాలకశాఖలో తయారు కాలేదని తెలిపారు. ఈ జీవోలను ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదని పలువురు ఉద్యోగులు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇచ్చారని వివరించారు. దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉంది రాజధానిని ప్రకటించడానికి ముందే రాజధాని ఎక్కడ ఉందో తమకు కావాల్సిన వ్యక్తులు, కంపెనీలకు సమాచారం ఇచ్చారని, తద్వారా రాజధాని చుట్టుపక్కల వారంతా కూడా నామమాత్రపు ధరలకే భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఇంత తీవ్రమైన వ్యవహారంలో దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉం దని ఏజీ చెప్పారు. రాజధానికి సంబంధించిన జీవోల తాలూకు నోట్ఫైళ్లను సీఎం హోదాలో చంద్రబాబు ఆమోదించి, వాటిపై సంతకం చేశారని వివరించారు. ఏ నిర్ణయాలపై జీవోలను జారీ చేశారో, ఆ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణంలో చంద్రబాబు, అప్పటి ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని వివరించారు. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలని కోర్టును కోరారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల భూ కొనుగోళ్లన్నీ కూడా చట్ట నిబంధనలకు లోబడే జరిగాయన్నారు. పిటిషనర్ల తరఫున పలువురు ఇతర న్యాయవాదులు కూడా వాదనలు విన్పించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఈ అంశాలన్నీ కుట్రను నిర్ధారిస్తున్నాయి రాష్ట్రంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాలను గురించిన వివరాలను నోట్ ఫైళ్లలో చేర్చలేదని తెలిపారు. రికార్డుల్లో చేర్చకుండా ఈ విధంగా కీలక నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. 30.12.2014 న ఒకేరోజు ఆ ఆరు జీవోల జారీకి తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని సంబంధిత ఉద్యోగులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. ఇవన్నీ కూడా రాజధాని నిర్ణయం, భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుట్ర ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయని చెప్పారు. అలాగే అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి సన్నిహితులైన కొందరు వ్యక్తులు, కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతి రాజధాని నిర్ణయం జరిగిందన్న దానిని కూడా ఆ ఉద్యోగుల వాంగ్మూలాలు నిర్ధారిస్తున్నాయని కోర్టుకు నివేదించారు. -
అమరావతిని నిర్ణయించింది రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల ఏర్పాటు నిర్ణయం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు నివేదించారు. ప్రజాప్రయోజనాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆపే దిశగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్ధించారు. పలు రంగాల్లో నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి, వారిచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కానీ అమరావతిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలసి రాజధానిగా నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానిపై ఏర్పాటైన మంత్రి నారాయణ కమిటీలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, అధికారులు తప్ప.. నిపుణులు లేనేలేరన్నారు. ఏపీ పునర్విభజన చట్టప్రకారం నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని, కానీ గత ప్రభుత్వం ఈ చట్టబద్ధ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుందని వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికివ్వడానికి ముందే.. అమరావతిని రాజధానిగా నిర్ణయించేసిందన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న దుష్యంత్ దవే.. బుధవారం రెండోరోజు తన వాదనలు కొనసాగించారు. రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోనిదని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధముండదని వివరించారు. గతంలో ఏర్పాటైన రాజధానుల విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. కోర్టులు ఇందులో జోక్యం చేసుకుంటే.. అది రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడమే అవుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ గుంటూరు–కృష్ణా జిల్లాల మధ్య రాజధాని వద్దని స్పష్టంగా చెప్పిందని దవే తెలిపారు. అయితే ఈ కమిటీ సిఫారసుల్ని బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వ పెద్దలు తమ స్వప్రయోజనాలకోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. నిపుణులతో కూడిన కమిటీ రాజధానిని నిర్ణయించివుంటే.. పరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు కలసి రూ.లక్ష కోట్ల రాజధానిని నిర్ణయించారన్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేందుకు సహేతుక కారణాలు ఏవీ లేవన్నారు. అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో కోర్టు తెలుసుకోవాలి... అనంతరం ఏజీ శ్రీరామ్ వాదనలు ప్రారంభిస్తూ.. అమరావతి పట్టణానికి, రాజధానిగా నిర్ణయించిన అమరావతికి సంబంధం లేదన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. అసలు అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో, అందులో ఎవరెవరు పాలుపంచుకున్నారో ఈ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఏజీ తదుపరి వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
గత సర్కారు నుంచి భూములు తీసుకున్నారు..
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో గత ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులు నామమాత్రపు రేట్లకే భూములు తీసుకున్నారు. ఇలా న్యాయమూర్తులు భూములు తీసుకోవచ్చా? తీసుకుంటే ఆ న్యాయమూర్తులు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించిన కేసులను నిష్పాక్షికంగా విచారణ జరపగలరా? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇది న్యాయవ్యవస్థ మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం. దీనిపై వాదనలు వినిపించేందుకు నాకు అవకాశమివ్వండి. కనీసం వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వకపోవడం రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కును హరించడమే అవుతుంది. ఒకవేళ ఈ వ్యాజ్యంపై విచారించడానికి ఇబ్బంది ఉంటే, దానిపై జ్యుడిషియల్ ఆర్డర్ జారీ చేయండి. తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం’’ అని న్యాయవాది సింహంభట్ల శరత్కుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యానికి, తమ ముందున్న రాజధానుల కేసుకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వేరే అంశమని, ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. తొలుత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఈ కేసులపై విచారణ ప్రారంభమవడానికి ముందే.. శరత్కుమార్ తన కేసును ప్రస్తావించారు. పలుమార్లు తన కేసును ప్రస్తావించినప్పటికీ, వాదనలు వినిపించేందుకు తనకు ఇప్పటివరకు అవకాశం రాలేదన్నారు. న్యాయమూర్తులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావిస్తూ.. తన పిటిషన్లోని పలు కీలకాంశాల్లో ఇదొకటని వివరించారు. అయితే ధర్మాసనం ఈ వ్యాజ్యానికీ, తమ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదంది. కనీసం తన వ్యాజ్యం విచారణకు నిర్దిష్టమైన తేదీని ఇవ్వాలని శరత్కుమార్ అభ్యర్థించగా.. ధర్మాసనం స్పందించలేదు. -
రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?
సాక్షి, అమరావతి: శాసనసభ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు... అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకు ఉండదని హైకోర్టు ప్రశ్నించింది. రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉన్నట్లు పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. వెంటనే ఆ రికార్డులు ఇస్తామని శానససభ న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు హైకోర్టుకు నివేదించారు. అయితే బ్లూ కాపీ (అసెంబ్లీ రికార్డులు నిర్వహించే బుక్)ని మాత్రం స్పీకర్ అనుమతి తీసుకున్న తరువాతే ఇవ్వగలమని నివేదించారు. ప్రస్తుతం స్పీకర్ రాష్ట్రంలో లేరని, ఆయన వచ్చిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. (అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?) ఆ చట్టాల్లో అలా ఎక్కడుంది? పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అంబటి సుధాకర్రావు వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, ఇప్పుడు రాజధానిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల రైతులకిచ్చిన హామీలను ఉల్లంఘించినట్లవుతుందన్నారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్బాబు వాదనలు వినిపిస్తూ పునర్విభజన చట్టం అమల్లో ఉన్నంత కాలం హైకోర్టును మార్చడానికి వీల్లేదన్నారు. హైకోర్టును మార్చేందుకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉందని పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. శానససభలో తీర్మానం చేయడం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని ఇంద్రనీల్ పేర్కొనగా.. మరి రాజధానిని నిర్ణయించడానికి శాసనసభకు అధికారం ఉన్నప్పుడు, దానిని మార్చే అధికారం కూడా శాసనసభకు ఉంటుంది కదా? అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ‘ధర్మ’సందేహం! 1. రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు మార్చే అధికారం కూడా అసెంబ్లీకి ఉంటుంది కదా..? 2. అమరావతిని రాజధానిగా చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు ఎలా నిర్ణయించారు? 3. పిటిషన్లు దాఖలు చేసి విచారణకు హాజరు కాకపోవడం ఏమిటి? వాదనలు వినిపించని కేసులను విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నాం. – హైకోర్టు ధర్మాసనం విచారణ జాబితా నుంచి ఆ కేసుల తొలగింపు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరి వాదనలు ముగిసిన తరువాత, మిగతావారు వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా తమ ముందు హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసులను వరుసగా పిలిచి, ఏ కేసులో సంబంధిత న్యాయవాది వాదనలు వినిపించేందుకు రాలేదో వాటిని విచారణ జాబితా నుంచి తొలగించింది. కొందరి తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
నాలుగో రోజూ కొనసాగిన వాదనలు
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో నాలుగో రోజు వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. పునర్విభజన చట్టంలో ఒకే రాజధాని అని మాత్రమే ఉందన్నారు. అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, అందులో భాగంగానే కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిందని చెప్పారు. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ను అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారని, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఓ చట్టం ద్వారా హైకోర్టును తరలించడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తెలిపారు. వారికి ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోర్టు సమయం ముగియడంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రత్యక్ష ప్రసారానికి ఆదేశాలు ఇవ్వలేం
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధాని’ కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి ఆదేశాలను ఏ కోర్టు కూడా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అభ్యర్థనను పలు హైకోర్టులు ఇప్పటికే తిరస్కరించాయని హైకోర్టు రిజిస్ట్రార్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. అలా అయితే ఆ తీర్పులన్నింటినీ తమ ముందుంచాలని ధర్మాసనం అశ్వనీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలతోపాటు రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో జరగబోయే తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా తగిన మార్గదర్శకాలను రూపొందించేలా రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వేమూరు లీలాకృష్ణ హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ► మరో కేసులో... పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ తన వాదనలను ముగించారు. ఆయన వరుసగా మూడు రోజులపాటు వాదనలు వినిపించారు. హైకోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ► రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తన బాధ్యతను విస్మరిస్తోందని హైకోర్టుకు సీపీఎం నివేదించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్లు అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కౌంటర్ దాఖలు చేశారు. -
ఉత్తరాంధ్ర, సీమ వాసుల అభ్యర్థన తిరస్కృతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాసుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అమరావతి వ్యాజ్యాల్లో వారిని ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో నిర్మించతలపెట్టిన అతిథి గృహానికి సంబంధించిన ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో అతిథి గృహానికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్లాన్లను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని పరిశీలించి, ఆ తర్వాత తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఆ డ్రాఫ్ట్ ప్లాన్ల విషయంలో అభ్యంతరాలుంటే లేవనెత్తవచ్చునని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.ప్రణతికి ధర్మాసనం వెసులుబాటునిచ్చింది. రాజధాని వ్యాజ్యాలపై మొదలైన తుది విచారణ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం నుంచి తుది విచారణ మొదలు పెట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ తన వాదనలను వినిపించారు. ల్యాండ్ పూలింగ్ కింద మంచి పంటలు పండే భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారని, ఇప్పుడు రాజధానిని మార్చడం ద్వారా ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్టయిందని కోర్టుకు నివేదించారు. ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
సీఎం క్యాంప్ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సీఆర్డీఏ చట్టంలో, ఈ చట్టం కింద నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్లో సీఎం క్యాంపు కార్యాలయం గురించి స్పష్టమైన నిర్వచనం, ప్రస్తావనేవీ లేవంది. ప్రతి జిల్లాలో తనకు నచ్చిన వసతిని క్యాంపు కార్యాలయంగా మార్చుకునే స్వేచ్ఛ సీఎం కార్యాలయానికి ఉందని తెలిపింది. ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని సీఎంను ఒత్తిడి చేసే హక్కు పిటిషనర్లకు లేదంది. అలాగే జిల్లాల్లో దేన్నీ క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోకూడదని చెప్పే హక్కు కూడా వారికి లేదని స్పష్టం చేసింది. అమరావతి నుంచి రాజ్భవన్, సచివాలయం, ఇతర శాఖా«ధిపతుల కార్యాలయాలను, పోలీస్ హెడ్క్వార్టర్స్ను విశాఖపట్నంకు తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు ఈ నెల 6న విచారణ జరిపింది. ఈ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం సీఎం క్యాంపు కార్యాలయం అంటే ఏంటి? అది ఎక్కడ ఉండాలని ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వులు కేవలం సీఆర్డీఏ పరిధిలో ఉన్న కార్పొరేషన్లకే వర్తిస్తాయని కౌంటర్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ పరిధిలో విజయవాడ, గుంటూరుల్లో ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్, ఏపీ రాజీవ్ స్వగృహ, ఏపీఎండీసీ, ఏపీటీడీసీ, ఏపీ రోడ్ డెవలప్మెంట్, ఏపీ బేవరేజస్, ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్, ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్, ఏపీ సేŠట్ట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు, జెన్కో, ట్రాన్స్కో, ఏపీఐఐసీ, తదితరాలు ఉన్నాయన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేయాలని అభ్యర్థించారు. -
అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధా?
సాక్షి, అమరావతి: కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి ఎలా అవుతుందని, ఈ విషయంలో చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, చొక్కారెడ్డి శివారెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అమరావతి అభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిగా చెప్పుకుంటూ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకించే వారు రాష్ట్రాభివృద్ధి నిరోధకులు అవుతారన్నారు. రాజధాని పేరుతో గత సర్కారు అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేసిందని, దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ తీవ్రంగా ప్రభావితమయ్యాయని కోర్టుకు నివేదించారు. ఏపీ పునర్విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఉత్తరాంధ్ర, రాయలసీమను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి కోసం పలు సూచనలు, సిఫారసు చేసిందని తెలిపారు. గత సర్కారుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుతనం కనిపించలేదని, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్ట దాఖలు చేసిందని నివేదించారు. కమిటీ నివేదికను అమలు చేసి ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేదన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలతో పాటు ఇతర అంశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఇందులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ రాయలసీమకు చెందిన హైకోర్టు న్యాయవాది చొక్కారెడ్డి శివారెడ్డి, శ్రీకాకుళంకు చెందిన న్యాయవాది పీసా జయరాం, మరికొందరు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా శివారెడ్డి, నాగిరెడ్డిలు తమ వాదనలను వినిపించారు. ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు ఇవీ.. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా గత సర్కారు వ్యవహరించింది. సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని వద్దని చెప్పినందుకే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయాలని, అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గతంలో దాఖలైన పిల్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది. సుప్రీంకు గత సర్కారు తప్పుడు అఫిడవిట్.. గత సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్ కారణంగా నేడు న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైకోర్టు భవన నిర్మాణం పూర్తైందంటూ ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ను సుప్రీంకోర్టు విశ్వసించి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.తీరా హైకోర్టు విభజన జరిగిన తరువాత విజయవాడలోని ఓ చిన్న భవనంలో హైకోర్టును ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. ఆ తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది... గత సర్కారు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తెచ్చింది. ఒకవేళ వీటిని న్యాయస్థానం కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ప్రభావితమై నష్టపోతారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో మమ్మల్ని ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలని అభ్యర్థిస్తున్నాం. మధ్యలో జోక్యం చేసుకోవద్దు..! విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు పదే పదే జోక్యం చేసుకుంటుండటంతో.. చేతులు వంచి దండం పెడతామని, ఇలా మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, లేదంటే ఈ వ్యాజ్యాల్లో విచారణ ముందుకెళ్లడం సాధ్యం కాదని ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కు నోటీసులు... అమరావతి కోసం ఇప్పటి వరకు చేసిన వ్యయాల వివరాలను అందచేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని హైకోర్టు అనుమతిస్తూ నోటీసులు జారీ చేసింది. ఓ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. శుక్రవారానికి వాయిదా వేసిన పలు వ్యాజ్యాలపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
సీఎం క్యాంపు కార్యాలయమంటే?
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా ప్రారంభమైన విచారణ ఎక్కువ సమయం ‘ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం’ చుట్టూనే తిరిగింది. తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, ఆ తరువాత జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తి వరుసగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్కు ప్రశ్నలు సంధించారు. సీఎం క్యాంపు కార్యాలయం అంటే అర్థం ఏమిటి? క్యాంపు కార్యాలయాలు ఏ సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు? అసలు వేటిని క్యాంపు కార్యాలయాలంటారు? శాశ్వత నిర్మాణాన్ని క్యాంపు కార్యాలయంగా చెప్పొచ్చా? సీఆర్డీఏ చట్టంలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రస్తావన ఉందా? గతంలో ఎప్పుడైనా సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, వినియోగం జరిగిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలుచోట్ల చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో ఒక క్యాంపు కార్యాలయం, హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో మరో క్యాంపు కార్యాలయాన్ని నడిపారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాటికి అయిన వ్యయాన్ని ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ పేర్కొనటంతో సీఎం క్యాంపు కార్యాలయం, పలు కార్పొరేషన్ల కార్యాలయాల తరలింపు అంశాలపై విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు.. సీఎం క్యాంపు కార్యాలయం గురించి సీఆర్డీఏ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని, సీఆర్డీఏ పరిధిలోనే సీఎం కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని ఏజీ తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రి ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు కొన్ని రోజులు ఉండి అధికారిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించిందే క్యాంపు కార్యాలయమని పేర్కొంది. సీఎం తాత్కాలికంగా ఉండి పాలనా కార్యకలాపాలు నిర్వహిస్తే ఇబ్బంది లేదని, శాశ్వత భవనం కడితే దాన్ని ఎలా పరిగణించాలని ప్రశ్నించింది. దీనిపై ఏజీ సమాధానమిస్తూ క్యాంపు కార్యాలయం ఏర్పాటు అన్నది ప్రస్తుత చట్టాల పరిధిలోకి రాని అంశమని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రిని పనిచేయకుండా తామేమీ నిరోధించడం లేదని, తమకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. రాజధానికి సంబంధించి విశాఖపట్నం, కర్నూలులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ దాఖలైన వ్యాజ్యంపై కూడా ఈ నెల 9న విచారణ జరుపుతామని ప్రకటించింది. ఆ కథనంపై.. మా అసంతృప్తిని తెలియచేస్తున్నాం పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా విచారణ ప్రారంభమైన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి సాక్షి పత్రికలో వచ్చిన ఓ కథనం గురించి ప్రస్తావించారు. దీనిపై తన అసంతృప్తిని తెలియచేస్తున్నట్లు ఏజీ శ్రీరామ్కు తెలిపారు. ఏ పత్రికైనా వాదనల సమయంలో జరగని సంభాషణలను రాయడం మంచిది కాదని, ఆ కథనం గురించి తనకు సోదర న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి చెప్పారని తెలిపారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తి ఏజీని ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎన్నో చెబుతుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సాక్షి పత్రికలో వచ్చిందన్నారు. తాను ఊర్లో లేనని, అందులో ఏం వచ్చిందో చూడలేదని, కోర్టు ప్రొసీడింగ్స్ను ఎవరూ తప్పుగా రాయడానికి వీల్లేదని ఏజీ శ్రీరామ్ పేర్కొన్నారు. న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం.. బార్ కౌన్సిల్ సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, ఆ విషయాన్ని న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం రాసిందన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ను రోజూ తప్పుగా రాస్తున్నారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం న్యాయస్థానంలో పెండింగ్లో ఉందని, అందువల్ల దీనిపై తామేమీ మాట్లాడబోమని పేర్కొంది. తప్పుగా వార్తలు రాసే పత్రికలపై న్యాయపరంగా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని నాగిరెడ్డికి సూచించింది. -
మండలి రికార్డులు మా ముందుంచండి
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించి శాసన మండలిలో జరిగిన చర్చ తాలూకు రికార్డులను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని శానససభ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అమరావతిలో నిర్మాణాలపై ఇప్పటివరకు చేసిన ఖర్చు లెక్కలను తేల్చేందుకు ప్రతివాదిగా చేర్చిన అకౌంటెంట్ జనరల్కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కావాలనుకుంటే దీనిపై కౌంటర్ దాఖలు చేయవచ్చని సూచించింది. మరోవైపు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన చట్టాలను కొట్టివేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, ఈ వ్యాజ్యాల్లో తమ వాదనలు కూడా వినాలంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణను అంశాలవారీగా న్యాయస్థానం ప్రారంభించింది. సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు శాసన మండలిలో చర్చకు సంబంధించిన రికార్డులు, సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ రికార్డులను ఎలా తారుమారు (మ్యానిపులేట్) చేస్తారో తనకు తెలుసని, అందుకే ఫుటేజీ సమర్పణకు ఆదేశాలు కోరుతున్నామని వ్యాఖ్యానించడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. గౌరవ సభ్యులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. శాసనసభ, శాసనమండలి గౌరవాన్ని తగ్గించేలా పిటిషనర్ తరఫు న్యాయవాది అనుచితంగా వ్యాఖ్యానించడం సరికాదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో సీజే జోక్యం చేసుకుని ఇరుపక్షాలకు సర్ది చెప్పారు. ఏం కావాలన్నా కోర్టు ముందుంచుతాం రికార్డులు, ఫైళ్లు ఏవి కావాలన్నా కోర్టు ముందుంచుతామని, అందులో ఎలాంటి రహస్యాలు లేవని ఏజీ పేర్కొన్నారు. అయితే శాసనసభ రికార్డుల విషయంలో స్పందించాల్సింది స్పీకరేనని, అందువల్ల సభ తరఫు న్యాయవాది స్పందన కోరాలని సూచించారు. శానససభ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావును పిలిచిన ధర్మాసనం.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించి మండలిలో చర్చ రికార్డులను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదు అనంతరం శాసనమండలి రద్దు వ్యాజ్యం విచారణకు రాగా.. రాజధానికి, మండలి రద్దుకు సంబంధం లేదన్న ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని ప్రస్తుత కేసుల విచారణ జాబితా నుంచి తొలగించింది. జీఎన్రావు, బోస్టన్ కమిటీలపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం కమిటీల నివేదిక సమర్పణ పూర్తైనందున అందులో ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. మా వాదనలు వినండి.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో న్యాయవాది వీఆర్రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ పాలనా రాష్ట్రం కోసం రాయలసీమ ఎన్నో త్యాగాలు చేసిందని, తమ వాదనలు వినాలని కోరారు. ఉత్తరాంధ్ర నుంచి న్యాయవాది పీసా జయరాం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడిందని, కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసమే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. -
రాజధాని వ్యాజ్యాలపై విచారణ 5కి వాయిదా
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతోపాటు రాజధాని తరలింపునకు సంబంధించి అన్ని వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. తాజాగా కొందరు పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై సమాధానమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదిగా ఉన్న అన్ని కేసుల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయడమా? లేక ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్లను ఆ వ్యాజ్యాలకు అన్వయించడమా? అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్లను అన్ని వ్యాజ్యాలకు అన్వయింప చేయదలిస్తే అదే విషయాన్ని తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాలపై విచారణను ఏ విధానంలో చేపట్టాలనే అంశాన్ని తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చారు. ► పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలతోపాటు ఇతర అంశాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాదాపు 94 వ్యాజ్యాలు దాఖలవడం తెలిసిందే. వీటిపై జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విశాఖలో అతిథి గృహం నిర్మాణానికి సంబంధించి ధర్మాసనం ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ల న్యాయవాది నిదేష్ పేర్కొన్నారు. తాజాగా తాము అనుబంధ పిటిషన్లు దాఖలు చేశామన్నారు. అతిథి గృహానికి, రాజధానికి సంబంధం లేదు: ఏజీ శ్రీరామ్ ► అతిథిగృహం విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ సిద్ధంగా ఉందని, త్వరలో కోర్టు ముందుంచుతామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. విశాఖలో నిర్మించ తలపెట్టిన అతిథిగృహానికి, రాజధానికి సంబంధం లేదన్నారు. అనుబంధ వ్యాజ్యాలపై వారంలోగా కౌంటర్లు దాఖలు చేస్తామన్నారు. ► రాజధాని శంకుస్థాపనకు ప్రధాని స్వయంగా వచ్చి పునాదిరాయి వేశారని, రాజధానితో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం సరికాదని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ పేర్కొన్నారు. అన్ని వ్యాజ్యాలపై కేంద్రం, ప్రధాని కార్యాలయం కౌంటర్లు దాఖలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని తామెలా బలవంతం చేస్తామని ప్రశ్నించింది. కేంద్రం తరఫున ఏఎస్జీ హరినాథ్ స్పందిస్తూ కొన్ని వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేశామని, వీటినే మిగిలిన వాటికీ అన్వయింపజేస్తామన్నారు. -
సీఆర్డీఏ భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు
అమరావతి : సీఆర్డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వెల్లడవడంతో ఈ వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ కోరేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు సంసిద్ధమయ్యారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)లో కూడా అంతులేని అవినీతి చోటుచేసుకుందని తెలియడంతో ఈ బాగోతంపైనా సీబీఐ దర్యాప్తు కోరాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ రెండు కుంభకోణాలపై గతంలోనే వైఎస్సార్సీపీ సీబీఐ దర్యాప్తు కోరినా, నెలల తరబడి కేంద్రం పెండింగ్లో పెట్టడంతో ఈ పార్లమెంటు సమావేశాల్లో దానిపై గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు సమాచారం. చదవండి : పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం గతంలో రాజధాని పరిధిలో చోటుచేసుకున్న భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కామ్ సాధారాణ కుంభకోణాలు కావని, చంద్రబాబుకు సన్నిహితులైన వారు ఎందరో వాటి వెనక ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు విస్పష్టంగా పేర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేపడితే ఈ కుంభకోణాల వెనుక పెద్దల హస్తం బయటపడుతుందని నిజానిజాలు వెలుగుచూస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీలు భావిస్తున్నట్టు తెలిసింది. ఉన్నతస్ధాయి విచారణతోనే చంద్రబాబు బాగోతం వెలుగుచూస్తుందని వారు చెబుతున్నారు. -
హైకోర్టు త్వరగా పరిష్కరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు హైకోర్టు త్వరితగతిన పరిష్కరించాల్సిన అంశాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో విధించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. ► రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది, ఎస్.నిరంజన్రెడ్డి, మెహ్ఫూజ్ నజ్కీ, పి.గౌతమ్తో కూడిన కౌన్సిల్ వాదనలు వినిపించింది. ► సన్నాహక పనులకు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అడ్డంకిగా మారిందని సుప్రీంకోర్టుకు నివేదించింది. ► పాత చట్టాన్ని తొలగించామని, కానీ కొత్త చట్టంపై హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని వాదించింది. ► ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టనుందని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ► హైకోర్టు జరిపే విచారణలో వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ► అలాగే వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. ► వీలైనంత త్వరగా అంటే ఆరు నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది కదా అని ధర్మాసనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేష్ ద్వివేది ప్రశ్నించారు. ► మొదట్లో ఈ రెండు చట్టాలపై కేవలం నాలుగు పిటిషన్లు మాత్రమే ఉన్నాయని, తర్వాత రోజుకో పిటిషన్ వేస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ► దీనివల్ల విచారణలో తీవ్ర జాప్యం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని నివేదించారు. ► రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే ఇది హైకోర్టు త్వరగా పరిష్కరించాల్సిన అంశం అని సుప్రీం ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘రాజధాని’ నిర్ణయం రాష్ట్రానిదే
సాక్షి, అమరావతి: ‘రాజధాని’ విషయంలో తన వైఖరి ఏమిటో కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి హైకోర్టుకు స్పష్టతనిచ్చింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని పునరుద్ఘాటించింది. రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. సీఆర్డీఏని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చిందని, ఈ చట్టం రూపకల్పన సమయంలో కూడా తమను సంప్రదించలేదని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ సెక్రటరీ లలిత టి.హెడావు కౌంటర్ దాఖలు చేశారు. రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ’ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ చట్టాన్ని తెచ్చి అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించింది. ► రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం. అందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదు. ► వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయ ప్రయోజనాల దృష్ట్యా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరుతున్నాం. కేంద్రం కౌంటర్లో ముఖ్యాంశాలు ఇవీ... ► ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన చట్టం 2014లోని సెక్షన్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల నిమిత్తం విశ్రాంత ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటైంది. కమిటీ 2014 ఆగస్టు 30న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్రం దీన్ని అదే ఏడాది సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది. ► 2015 ఏప్రిల్ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ► ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలితో సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయంలో భాగంగా నిధులు అందచేసింది. ఆ వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నాం. -
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై విచారణ 27కి వాయిదా
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. కార్యాలయాల తరలింపుపై యథాత«థస్థితి కొనసాగించాలంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు 27 వరకు పొడిగించింది. స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల ఇరుపక్షాలకు నష్టమని, అందువల్ల వాటిని ఎత్తివేయాలని.. రాజధానిని మార్చడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాజధానితో పనిలేకుండా కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం తమకుందని నివేదించింది. యథాతథస్థితి ఉత్తర్వులవల్ల సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు కూడా ఆగిపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపింది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. అయితే, హైకోర్టు అందుకు నిరాకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డిలు వాదనలు వినిపించారు. రాకేశ్ ద్వివేదీ, ఏజీ వాదిస్తూ.. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. అయితే, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు దీనిని వ్యతిరేకించారు. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. బ్లూజీన్స్ యాప్లో సాంకేతిక సమస్యలవల్ల విచారణను 27కి వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. 27 నుంచి కేసును రోజూ విచారించాలన్న ఎస్.నిరంజన్రెడ్డి అభ్యర్థనపట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. -
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై పిటిషన్లు
-
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై పిటిషన్లు
సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది. (నాలుగు ముక్కలతో ‘పిల్’లా?) -
అమరావతి అభివృద్ధికి..AMRDA
-
11 మందితో ఏఎంఆర్డీఏ
సాక్షి, అమరావతి: ఏపీసీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ)ని ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్పర్సన్గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమిస్తూ తరువాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్డీఏ కమిషనర్గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్డీఏ కమిషనర్గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు. ఏఎంఆర్డీఏలో సభ్యులు.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్పర్సన్ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు ఏఎంఆర్డీఏ కమిషనర్ –సభ్య కన్వీనర్ గుంటూరు జిల్లా కలెక్టర్ –సభ్యుడు కృష్ణా జిల్లా కలెక్టర్ – సభ్యుడు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ –సభ్యుడు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ –సభ్యుడు ఏపీ ట్రాన్స్కో ఎస్ఈ –సభ్యుడు ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ –సభ్యుడు రహదారులు భవనాల శాఖ ఎస్ఈ (గుంటూరు) –సభ్యుడు రహదారులు భవనాల శాఖ ఎస్ఈ (విజయవాడ) –సభ్యుడు -
గవర్నర్ నిర్ణయం శుభపరిణామం
కాకినాడ రూరల్: రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం గొప్ప శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వికేంద్రీకరణపై ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావితరాల కోసం ఆలోచన చేశారని.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి జరుగుతుందని, విశాఖ పరిపాలనా కేంద్రంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారబోతోందన్నారు. అమరావతి పేరుతో కొత్తగా కుట్రలకు అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► 2014 నుంచి చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లోనే మహానగరంగా చూపించారు. ► మా ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలన్న భావనతో మూడు రాజధానులు ఏర్పాటుకు నిర్ణయించారు. చంద్రబాబు ఉక్రోషంతో జేఏసీని ఉసిగొల్పారు. ► సింగపూర్ కన్సల్టెన్సీ, ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు భూములిచ్చారుగానీ కౌలు రైతులకు కనీసం కౌలు ఇవ్వలేకపోయారు. ► ఈ రోజు మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలతో వార్త కథనాలు వస్తున్నాయి. ఇది పద్ధతి కాదు. ► గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాలలో ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తారని, చంద్రబాబు రాజీనామా చేస్తారని లీకులు ఇస్తున్నారు.. గవర్నర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.. కుట్రలకు చంద్రబాబు కేంద్ర బిందువు. ► జగన్ ట్రాప్లో గవర్నర్ పడ్డారని లోకేష్ అంటున్నారు. ఈ మాటలేమిటి? రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి ► రాజధానిపై రిఫరెండం పెట్టాలని చంద్రబాబు చెబుతున్నారు. మీరు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి. ఎన్ని సీట్లు వస్తాయో తెలుస్తాయి. సీఎంగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలంపాటు ఉన్న మీరు రాయలసీమ, విశాఖ, ఉభయగోదావరి జిల్లాకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా? ► విశాఖపట్నం షిప్యార్డులో శనివారం జరిగిన క్రేన్ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ► మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. గాయపడిన వారికీ న్యాయం చేస్తాం. -
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే..?
సాక్షి, అమరావతి: ► 2019 సెప్టెంబర్ 13: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు. ► 2019 డిసెంబర్ 20: రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ (న్యాయ రాజధాని) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ నివేదిక. ► 2019 డిసెంబర్ 27: జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ(బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) నివేదికలపై అధ్యయనం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ► 2019 డిసెంబర్ 29: హైపవర్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ► 2020 జనవరి 3: రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ ఏకైక మార్గమని పేర్కొంటూ మూడు రాజధానుల ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ► 2020 జనవరి 17: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ ► 2020 జనవరి 20: హైపవర్ కమిటీ నివేదికపై చర్చించి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన శాసనసభ. ► 2020 జనవరి 22: శాసనసభ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించకుండా, తిరస్కరించకుండా శాసనమండలిలో తొండాట ఆడిన టీడీపీ ► 2020 జూన్ 16: అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ ►2020 జూన్ 17: శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా సైంధవపాత్ర పోషించిన టీడీపీ ► 2020 జూలై 18: శాసనమండలిలో రెండు పర్యాయాలు టీడీపీ మోకాలడ్డినప్పటికీ నిర్దిష్ట కాల పరిమితి ముగియడంతో ఇక శాసనమండలితో పనిలేకుండా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం ► 2020 జూలై 31: పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సీఆర్డీఏ స్థానంలో ‘ఏఎంఆర్డీఏ’ సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) రద్దు బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఇక ఆ సంస్థ కనుమరుగుకానుంది. ఆ స్థానంలో ఏఎంఆర్డీఏ (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు కానుంది. సీఆర్డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్డీఏ నిర్వహిస్తుంది. సీఆర్డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్డీఏ ఉద్యోగులుగా మారతారు. ► భూసమీకరణ సహా రాజధాని వ్యవహారాలన్నీ ఈ సంస్థే నిర్వహిస్తుంది. సీఆర్డీఏ చేసుకున్న అగ్రిమెంట్లు, కాంట్రాక్టులన్నీ ఇకపై ఏఎంఆర్డీఏ కిందకు వస్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్డీఏ కిందకు వస్తుంది. రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఏఎంఆర్డీఏ కృషి చేస్తుంది. ► 2014 డిసెంబర్లో టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం ద్వారా సీఆర్డీఏ ఏర్పాటైంది. ► అప్పటివరకూ ఉన్న వీజీటీఎం ఉడా (విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్థానంలో సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. ► ‘వీజీటీఎం ఉడా’ 2014లో ‘సీఆర్డీఏ’గా మారగా ఇప్పుడు ‘ఏఎంఆర్డీఏ’గా కొత్తరూపం దాల్చనుంది. -
అమరావతి భూ అక్రమాల కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి భూ అక్రమాల కేసులో నిందితుల రెండు రోజుల పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డులను తారుమారు చేసిన కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడ ఎం అండ్ ఎం వస్త్రదుకాణ యజమాని గుమ్మడి సురేష్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. చివరిరోజు శనివారం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విచారణ కొనసాగింది. రెండు రోజుల కస్టడీలో ఏడు గంటల పాటు నిందితులను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు జిల్లా జైలుకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి న్యాయవాది సమక్షంలో సురేష్ను విచారించారు. ఆయన ఏ విధంగా అసైన్డ్ భూమిని కొనుగోలు చేశాడు..? అప్పటి తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు సహాయంతో అసైన్డ్ భూమిని పట్టా భూమిగా ఏ విధంగా వెబ్ ల్యాండ్లోకి ఎక్కించారు..? ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. పరస్పర ఒప్పందంతోనే.. సుధీర్ బాబు, సురేష్లు ఇద్దరూ పరస్పర ఒప్పందంతోనే అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సురేష్ భూమిని కొనుగోలు చేసి సీఆర్డీఏకు రికార్డులు సమర్పించే రెండు నెలలకాలం భూమిని పట్టా భూమిగా చూపారని, అనంతరం అసైన్డ్ భూమిగా వెబ్ ల్యాండ్లో మార్పు చేసినట్టు సమాచారం. -
రాజధాని తరలిపోకుండా.. ఏం చేయాలో అన్నీ చేశాం
సాక్షి, హైదరాబాద్: అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఏం చేయాలో అన్నీ చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఏకపక్షంగా ఆమోదించరనే నమ్మకం ఉందన్నారు. దీనిపై పోరాటాలను ఇంకా ఉధృతం చేయాల్సి ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసం నుంచి ఏపీలోని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలతో చంద్రబాబు ఆన్లైన్ సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడైనా ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకోవాలంటే వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలి. త్వరలో చలో కావలి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ► రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకరం. మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా ఉంది, రికవరీ రేటులో అట్టడుగున ఉన్నాం. సీఎం జగన్ ఇంతవరకు మాస్క్ పెట్టుకోలేదు. ముఖ్యమంత్రే మాస్క్ పెట్టుకోకుండా, మాస్కు ధరించని వారికి జరిమానా విధిస్తామనడం ఎంతవరకు సమంజసం? ► రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. చేర్చుకున్న వారికి సరైన ఆహారం లేదు, ఆక్సిజన్ సరఫరా లేదు, అంబులెన్స్ల నిర్వహణ అధ్వాన్నం. ఒక్కో అంబులెన్స్లో డజన్ల సంఖ్యలో రోగులను కుక్కుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రభుత్వం ఇచ్చే రూ.500 ఆహారం కంపు కొడుతోంది. డిశ్చార్జ్ అయిన రోగులకు రూ.రెండు వేలు ఇస్తామని చెప్పి వందా యాభై చేతిలో పెడుతున్నారు. ► దళితులపై ఏడాదిగా దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ని అత్యాచారాలు, అరాచకాలు జరుగుతుంటే సీఎం జగన్మోహన్రెడ్డి ఇంతవరకు నోరు విప్పలేదు. ► కరోనా కష్టాల్లో ప్రజలుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు. ఏడాదిలో మూడుసార్లు పెంచారు. కరెంటు బిల్లులు నాలుగు రెట్లు అధికం చేశారు. ► ఒక్క ఏడాదిలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రూ.లక్ష కోట్లు అప్పులు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ఎన్ని అప్పులు చేస్తారో అనే ఆందోళన కలుగుతోంది. -
‘వైజాగ్ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా’
సాక్షి, తాడేపల్లి: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్లాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు బిల్లులను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒక ప్రాంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా ? చెప్పాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి మీకు కావాలా వద్దా ? ఇవాళ ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఒక కథనం వచ్చింది. వైజాగ్లో ఏదో జరిగిపోతుందని కథనంలో రాసుకొచ్చారు. ఇలాంటి కథనాలతో వైజాగ్ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా ? అక్కడి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. వైజాగ్ ఏం పాపం చేసింది. వైజాగ్ ప్రజలతో రాజధాని మాకొద్దు అని చెప్పించేలాగా ఉన్నారు. ఇది మహా పాపం. మాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది కావాలి. టీడీపీ వెర్షన్నే రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని కేంద్రం చెప్పింది. విభజన చట్టానికి రాజధానికి సంబంధం లేదు. అన్నీ ఒకే చోట ఉండాలని ఎక్కడా లేదు’అని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి ఆగదు అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అసెంబ్లీలో చర్చ కూడా జరిగిందని సజ్జల గుర్తు చేశారు. అసెంబ్లీలో రెండోసారి బిల్లుకు ఆమోదం లభించిందని అన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు దౌర్జన్యం చేసి బిల్లులను అడ్డుకున్నారని సజ్జల మండిపడ్డారు. సెలక్ట్ కమిటీ పేరుతో టీడీపీ సభ్యులు కాలయాపన చేయాలని చూశారని విమర్శించారు. సెలక్ట్ కమిటీ అనేది వాస్తవరూపం దాల్చలేదని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ముందడుగు వేశారని సజ్జల పేర్కొన్నారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. (డాలర్ శేషాద్రికి కరోనా అంటూ అసత్య పోస్టులు) -
ఆ రెండు బిల్లులు ఆమోదిస్తే కోర్టు ఉల్లంఘనే
సాక్షి, అమరావతి: హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించడం కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు ఆదివారం ఆరు పేజీల లేఖ రాశారు. లేఖలోని ముఖ్య అంశాలు.. ► ప్రస్తుత రాజధానిని విడగొట్టడం, తరలించే అంశాలు హైకోర్టులో ఉన్నప్పుడు, శాసనసభ నిబంధనల ప్రకారం ఈ బిల్లులను చర్చించడం, ఆమోదించడం కుదరదు. ► ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆధారంగా రాజధాని నగరం అమరావతి ఏర్పాటైంది. ఈ రెండు బిల్లులు ఈ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకం. ► కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజధాని నగరాన్ని ఎంపిక చేశాం. ► వైఎస్సార్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ► ప్రస్తుత సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి కేంద్రం రూ. 2,500 కోట్లు నిధులు సమకూర్చింది. ► హైకోర్టు ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా సుప్రీంకోర్టు అమరావతిని నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ. పది వేల కోట్లు ఖర్చు చేసింది. ► ఇప్పటి నుంచి రాజధానిపై పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. రాజధాని నగరాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రూపొందించడం జరిగింది. ఈ నగరమే స్వీయ ఆర్థిక సాయం అందించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది. ► ఈ రాజధాని నగరాన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన నగరంగా పకడ్బందీగా డిజైన్ చేశాం. ► వైఎస్సార్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి అమరావతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ కక్షల ముసుగులోనే ఈ రెండు బిల్లులను తీసుకువచ్చింది. ► అమరావతి శిథిలాల మీద మూడు కొత్త రాజధాని నగరాలను నెలకొల్పడానికే రెండు బిల్లులను తెచ్చింది. ► శాసన మండలి ఈ బిల్లులను తిరస్కరించలేదు. సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించింది. కౌన్సిల్లో రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు, సెలెక్ట్ కమిటీ అంశం పెండింగ్లో ఉండడం వల్ల ఈ బిల్లులను పరిగణించలేదు. ► ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు బిల్లులపై నిర్ణయం తీసుకునే సందర్భంగా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
తుది అంకానికి వికేంద్రీకరణ
సాక్షి, అమరావతి: చరిత్రాత్మకమైన ‘పరిపాలన వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపింది. దీనితోపాటు సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు కూడా పంపింది. ఈ రెండింటినీ రాష్ట్ర శాసనసభ ఇప్పటికే రెండుసార్లు ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, ఈ రెండు పర్యాయాలూ శాసన మండలిలో టీడీపీ గందరగోళం సృష్టించి ఈ బిల్లులకు మోకాలడ్డినప్పటికీ నియమిత కాలం పూర్తికావడంతో ఇక మండలితో పనిలేకుండా ఏపీ లెజిస్లేచర్ అధికారులు గవర్నర్ ఆమోదానికి వీటిని పంపారు. గవర్నర్ ఆమోదం ఇక లాంఛనమే కనుక ఆ తదుపరి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ప్రాంతీయ సమానాభివృద్ధి లక్ష్యంగా.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించింది. కానీ, ఈ రెండుసార్లూ శాసన మండలిలో టీడీపీ తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది. – ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేశారు. – శాసనసభ ఆమోదించిన బిల్లుపై మండలిలో ఎలాంటి తదుపరి చర్యలూ మూడు నెలలపాటు (నిర్ణీత గడువు) ముందుకు సాగకపోవడంతో దాని వ్యవధి పూర్తయింది. – మళ్లీ జూన్ 16న రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020, సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. – కానీ, 17న టీడీపీ కుటిల వైఖరివల్ల ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే. మండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలు నిజానికి.. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వచ్చినపుడు సభ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి.. – శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించడం తొలి ప్రత్యామ్నాయం. – గతంలో ఇదే బిల్లును తిరస్కరించినప్పుడు మండలిలో ప్రతిపాదించిన సవరణలను చేయాలని పట్టుబట్టడం రెండో ప్రత్యామ్నాయం. – రెండోసారి వచ్చిన బిల్లుపై 30 రోజుల వరకూ క్రియారహితంగా ఉండటం మూడో ప్రత్యామ్నాయం. – ప్రస్తుత పరిస్థితుల్లో తొలి రెండు ప్రత్యామ్నాయాలు సాధ్యంకాలేదు. – 30 రోజులపాటు ఈ బిల్లుపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది కనుక ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం పరిగణిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. – మండలికి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు రెండూ చేరి ఈ నెల 17వ తేదీకి 30 రోజులు పూర్తయ్యాయి కనుక శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వీటిని గవర్నర్ ఆమోదం కోసం శనివారం రాజ్భవన్కు పంపారు. – గవర్నర్ ఆమోదం పొందిన పిదప బిల్లు చట్టం అవుతుంది కనుక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే.. – సెప్టెంబర్ 13, 2019 : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం. – డిసెంబర్ 20, 2019 : రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ (న్యాయ రాజధాని) ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. – డిసెంబర్ 27, 2019 : జీఎన్ రావు కమిటీ నివేదిక.. బీసీజీ (బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్) ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. – డిసెంబర్ 29, 2019 : హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. – జనవరి 3, 2020 : రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని.. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్ జగన్కు నివేదిక ఇచ్చిన బీసీజీ. – జనవరి 17, 2020 : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ. – జనవరి 20, 2020 : హైపవర్ కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ. – జనవరి 22, 2020 : బిల్లును అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా శాసన మండలిలో తొండాట ఆడిన టీడీపీ. – జూన్ 16, 2020 : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ. – జూన్ 17, 2020 : శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా టీడీపీ సైంధవపాత్ర పోషించింది. ఏపీ లెజిస్లేచర్ అధికారులు గవర్నర్ ఆమోదానికి వీటిని పంపారు. గవర్నర్ ఆమోదం ఇక లాంఛనమే కనుక ఆ తదుపరి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ప్రాంతీయ సమానాభివృద్ధి లక్ష్యంగా.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించింది. కానీ, ఈ రెండుసార్లూ శాసన మండలిలో టీడీపీ తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది. – ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేశారు. – శాసనసభ ఆమోదించిన బిల్లుపై మండలిలో ఎలాంటి తదుపరి చర్యలూ మూడు నెలలపాటు (నిర్ణీత గడువు) ముందుకు సాగకపోవడంతో దాని వ్యవధి పూర్తయింది. – మళ్లీ జూన్ 16న రెండోసారి పరిపాలనా వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020, సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. – కానీ, 17న టీడీపీ కుటిల వైఖరివల్ల ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే. మండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలు నిజానికి.. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వచ్చినపుడు సభ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి.. – శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించడం తొలి ప్రత్యామ్నాయం. – గతంలో ఇదే బిల్లును తిరస్కరించినప్పుడు మండలిలో ప్రతిపాదించిన సవరణలను చేయాలని పట్టుబట్టడం రెండో ప్రత్యామ్నాయం. – రెండోసారి వచ్చిన బిల్లుపై 30 రోజుల వరకూ క్రియారహితంగా ఉండటం మూడో ప్రత్యామ్నాయం. – ప్రస్తుత పరిస్థితుల్లో తొలి రెండు ప్రత్యామ్నాయాలు సాధ్యంకాలేదు. – 30 రోజులపాటు ఈ బిల్లుపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది కనుక ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం పరిగణిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. – మండలికి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు రెండూ చేరి ఈ నెల 17వ తేదీకి 30 రోజులు పూర్తయ్యాయి కనుక శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వీటిని గవర్నర్ ఆమోదం కోసం శనివారం రాజ్భవన్కు పంపారు. – గవర్నర్ ఆమోదం పొందిన పిదప బిల్లు చట్టం అవుతుంది కనుక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే.. – సెప్టెంబర్ 13, 2019 : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం. – డిసెంబర్ 20, 2019 : రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ (న్యాయ రాజధాని) ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. – డిసెంబర్ 27, 2019 : జీఎన్ రావు కమిటీ నివేదిక.. బీసీజీ (బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్) ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. – డిసెంబర్ 29, 2019 : హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. – జనవరి 3, 2020 : రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని.. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్ జగన్కు నివేదిక ఇచ్చిన బీసీజీ. – జనవరి 17, 2020 : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ. – జనవరి 20, 2020 : హైపవర్ కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ. – జనవరి 22, 2020 : బిల్లును అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా శాసన మండలిలో తొండాట ఆడిన టీడీపీ. – జూన్ 16, 2020 : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ. – జూన్ 17, 2020 : శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా టీడీపీ సైంధవపాత్ర పోషించింది. -
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
-
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు బుధవారం విజయవాడలోని ఆమె ఇంటివద్ద అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి వీవీఎస్ఎన్ లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో మాధురిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణతో కుమ్మక్కై 3,880 చదరపు గజాలు కలిగిన పది ప్లాట్లను కేటాయించడంతో పాటు రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించి మాధురిపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం నెక్కల్లులో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ ముఖ్య అనుచరుడైన రావెల గోపాలకృష్ణ ల్యాండ్ పూలింగ్కు 3.11 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు. అందుకుగాను 3,110 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్డీఏ ద్వారా కేటాయించారు. వాస్తవానికి ఆ భూమి నాగార్జున సాగర్ కాలువ, రెండు రోడ్లకు చెందినది. తప్పులను సరిదిద్దుకునే క్రమంలో మాధురి మరిన్ని తప్పులకు ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయారు. -
భూ కుంభకోణం కేసులో టీడీపీ నేత అరెస్ట్
తుళ్లూరు (గుంటూరు జిల్లా): అమరావతి పరిధిలోని నెక్కళ్లు గ్రామంలో వెలుగు చూసిన భూ కుంభకోణం కేసులో టీడీపీ నేతను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో కొందరు టీడీపీ నేతలు దొంగపత్రాలు సృష్టించి.. లేని భూమిని ఉన్నట్టు చూపి ప్లాట్లు పొందారు. దీనికి తోడు అసలైన రైతుకు సీఆర్డీఏ సర్వేలో తక్కువ విస్తీర్ణం చూపించి.. టీడీపీ నేతలకు మాత్రం అసలు భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం, భూమి లేకపోయినా ఉన్నట్టు చూపించారు. రైతుల ఫిర్యాదుతో.. ► తమ భూమిని టీడీపీ నేతలు కాజేశారంటూ నెక్కళ్లు గ్రామానికి చెందిన అసలు రైతులు గతంలో తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ► దీనిని తహసీల్దార్ తుళ్లూరు సీఐకి సిఫారసు చేయగా.. సిట్ విచారణ చేపట్టింది. ► విచారణాధికారులు నెక్కళ్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ► మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకోనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ► ఇక్కడి భూ కుంభకోణాలపై సిట్ విచారణ కొనసాగుతుండటంతో అప్పట్లో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. -
ఆ బిల్లుల శాసన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నాం
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల ఉపసంహరణ బిల్లులకు సంబంధించిన శాసనపరమైన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. ఆ తరువాత తగిన సమయంలో చట్ట నిబంధనలకు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ఆందోళన ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. దశలవారీ అమలుకు కట్టుబడి ఉన్నాం హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ధర్మాసనం ఎదుట ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపించారు. మద్య నిషేధం దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో మద్యం షాపుల వద్ద అదుపు చేయలేని స్థాయిలో జనాలు ఉండటంతో మద్యం విక్రయాలను ఆపాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చిందని, అయితే రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
సీఆర్డీఏలో వర్క్ ఫ్రం హోమ్
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సీఆర్డీఏ ఉద్యోగుల్ని విడతలవారీగా ఇంటి నుంచి పనిచేయించాలని నిర్ణయించారు. 50 శాతం ఉద్యోగుల్ని సోమవారం నుంచి 29వ తేదీ వరకూ ఇంటి వద్ద నుంచి, మిగిలిగిన వారు కార్యాలయంలో పనిచేసేలా షెడ్యూల్ రూపొందించి అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీచేశారు. - ఈ వారం ఇంటి నుంచి పనిచేసిన ఉద్యోగులు వచ్చేవారం 30వ తేదీ నుంచి కార్యాలయంలో, కార్యాలయంలో పనిచేసిన వారు ఇంటి నుంచి పనిచేస్తారు. - ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలొచ్చే వరకూ ఇలా విడతల వారీగా ఉద్యోగులు పనిచేస్తారు. - కార్యాలయంలో పనిచేసే వారిని మూడు విభాగాలుగా విభజించి సామాజిక దూరం పాటించేలా, మూడు సమయాల్లో పనిచేసేలా నిర్దేశింసినట్టు సీఆర్డీఏ ఇన్చార్జి కమిషనర్ రామ్మోహనరావు చెప్పారు. - ఉద్యోగులు ఇంటి వద్దే ఈ–ఆఫీసు ద్వారా విధులు నిర్వర్తించాలని, ఫోన్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. - విభాగాధిపతులు, గెజిటెడ్ అధికారులు మాత్రం కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తారు. - తుళ్లూరు, గుంటూరులోని సీఆర్డీఏ కార్యాలయాలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కార్యాలయ ఉద్యోగులకూ ఇదే విధానాన్ని వర్తింపజేశారు. -
అమరావతిలో పేదల హౌసింగ్ జోన్
సాక్షి, అమరావతి: అమరావతిలో ఈడబ్లూఎస్, అఫర్డ్బుల్ హౌసింగ్ జోన్ ఏర్పాటుకు సీఆర్డీయే మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాల్లో ఈ హౌసింగ్ జోన్ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో నివాసయోగ్యంగా పేర్కొన్న ప్రాంతంలోనే ఈ కొత్త హౌసింగ్ జోన్ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్పై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో సీఆర్డీయే కమిషనర్ను ఉద్దేశించి లిఖిత పూర్వకంగా తెలపాలని చెప్పింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే వాటిని పరిశీలించేది లేదని స్పష్టం చేసింది. -
మాకు గూడు లేదు.. ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వండి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన మహిళలు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు విషయంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థిస్తూ దాదాపు 450 మంది మహిళలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా రెండు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేయతలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం వల్ల తమలాంటి లక్షల మంది నిరుపేదలు లబ్ధి పొందుతారని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. తమకెవ్వరికీ శాశ్వత నివాసాలు లేవని వివరించారు. చట్ట నిబంధనలను అనుసరించే జీవో సీఆర్డీఏ చట్ట నిబంధనలను అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు నిమిత్తం గత నెల 25న జీవో 107 జారీ చేసిందని మహిళలు కోర్టు దృష్టికి తెచ్చారు. నిడమర్రు గ్రామంలో 250.48 ఎకరాల్లో ఇంటి స్థలాల పట్టాల మంజూరు కోసం 10,247 మంది అర్హులైన లబ్ధిదారులతో అధికారులు ఓ జాబితా కూడా సిద్ధం చేశారని పేర్కొన్నారు. అలాగే తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో 11,300 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశారన్నారు. వీరికి నవులూరులో 215 ఎకరాల్లో, కృష్ణాయపాలెంలో 37 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం.. రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు వివరించారు. అది కూడా రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా కేటాయించవచ్చునని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల తమ వాదనలు కూడా విని.. ఆ తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. -
‘వికేంద్రీకరణ’పై కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వ్యవహారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అలాగే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ), హైపవర్ కమిటీల నివేదికలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ వ్యాజ్యాలపై విచారణను మార్చి 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని వ్యవహారంలో రకరకాల వ్యాజ్యాలు దాఖలై, గందరగోళంగా ఉన్న నేపథ్యంలో అంశాల వారీగా ఆ వ్యాజ్యాలను వేరు చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం సూచించింది. రాజకీయ ఆరోపణలు చేయొద్దు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో నిలిపేసిన పనులన్నింటినీ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అమరావతి నుంచి హైకోర్టును తరలించే వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోనిదని కోర్టుకు నివేదించారు. అనంతరం పిటిషనర్ల తరఫున మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించబోతుండగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రాజకీయ ఆరోపణలు చేయవద్దని స్పష్టం చేసింది. కేవలం న్యాయపరమైన అంశాలకే పరిమితం కావాలని గట్టిగా చెప్పింది. సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపిస్తూ.. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ విచారణ సందర్భంగా కోర్టులో ఏ న్యాయవాది ఏ అంశంపై వాదనలు వినిపిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అంశాల వారీగా వ్యాజ్యాలను విభజించి విచారణ జరపాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. 1250 ఎకరాల కేటాయింపుపై పిటిషన్లు... ఇదిలా ఉంటే, రాజధాని ప్రాంతంలో 1,250 ఎకరాలను పేదలందరికీ ఇళ్ల పథకం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 25న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై త్రిసభ్య ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం నుంచి విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ప్రారంభించారు. కోర్టు పనివేళలు ముగియడంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
దారి మళ్లించిన నిధులతో దర్జా!
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్కుమార్ ‘సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్కు వినియోగించారని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలోనే మరో బ్యాంకు ఫిర్యాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్జెక్ట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది. విచారణలో పలు కేసులు.. చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి తప్పుడు పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు టోపీ పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. ఇందులో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సుజనా ఆర్థిక నేరాలపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఆర్థిక నేరగాడైన సుజనా చౌదరిని చంద్రబాబు రాజ్యసభకు పంపడంతోపాటు 2014లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చేశారు. బ్యాంకును బురిడీ కొట్టించిన నిధులతో.. రాజధాని ప్రాంతంపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం అందుకున్న సుజానా చౌదరి తన కంపెనీలు, సోదరుడు జతిన్కుమార్, కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016, 2017, 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాను కేంద్ర సహాయ మంత్రిగా ఉండటంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్ 26, 2018న బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను విస్తరిస్తానని బ్యాంక్కు హామీ ఇచ్చారు. రుణానికి జతిన్కుమార్, స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాసరాజు, షెల్ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నారు. ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. -
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గత ప్రభుత్వ హాయాంలో చోటుచేసుకున్న రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ జరుపనుంది. రాజధాని వ్యవహారాల్లో జరిగిన న్యాయ, ఆర్థిక పరమైన అక్రమాలపైనా సిట్ విచారణ చేయనుంది. విశాఖపట్నం ఎస్పీ బాబుజి, ఇంటెలిజెన్స్ ఎస్పీ అట్టడా అప్పలనాయుడులతో పాటు మరో నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను సిట్ సభ్యులుగా నియమించింది. అమరావతిలో చోటుచేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్, భూముల లావాదేవీలపై కూడా విచారించనుంది. అలాగే టీడీపీ నేతలు అక్రమించిన భూములను రాజధాని పరిధిలోకి తెస్తూ చేసిన అక్రమాలపై కూడా సిట్ విచారించనుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా సిట్కు కట్టబెట్టింది. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా రాజధాని భూముల అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారం ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సీఆర్డీఏ చట్టంలో ఎక్కడుంది?
సాక్షి, అమరావతి: అమరావతి నుంచి మరో చోటుకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించరాదని సీఆర్డీఏ చట్టంలో ఎక్కడ ఉందో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. కార్యాలయాల తరలింపు వెనుక దురుద్దేశాలున్నాయని చెబితే సరిపోదని, ఎవరికి ఆ దురుద్దేశాలున్నాయో స్పష్టంగా చెప్పాలంది. అర్థం పర్థం లేని వాదనలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు తేల్చి చెప్పింది. నిరాధార ఆరోపణలతో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి, తమ ముందు నిల్చుంటే సరిపోదని, తరలింపు విషయంలో ప్రభుత్వానికి చట్టాలు ఎక్కడ అడ్డుపడుతున్నాయో కూడా చెప్పాలని స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నారని చెబుతున్న నేపథ్యంలో, ఆ సౌలభ్యం ఏమిటో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రెండు కార్యాలయాల తరలింపు జీవోలో కేవలం పాలనాపరమైన కారణాలు అని మాత్రమే పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో తరలింపు కారణాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. అన్ని వివరాలతో మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, సంబంధిత నోట్ ఫైళ్లు, ప్రొసీడింగ్స్ను కూడా జత చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపన్యాసాలొద్దు.. విషయానికి రండి... విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, తాళాయపాళెంకు చెందిన కొండేపాటి గిరిధర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దే తిరుపతిరావు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని ప్రభుత్వం తన జీవోలో పేర్కొందని, అయితే ఏ అంశాన్నీ పట్టించుకోలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఈ విషయాలన్నీ మీ పిటిషన్లో ఉన్నాయా? అంటూ ప్రశ్నించింది. ఉన్నాయని చెప్పిన ఇంద్రనీల్ మళ్లీ వాదనలు కొనసాగించారు. ఈ కార్యాలయాల తరలింపు, రాజధాని తరలింపు వెనుక దురుద్దేశాలున్నాయన్నారు. కోర్టు జోక్యం చేసుకుంటూ.. ఉపన్యాసాలకు న్యాయస్థానాలు వేదికలు కావని ఘాటుగా వ్యాఖ్యానించింది. దురుద్దేశాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తే చాలదని, ఎవరు అలా వ్యవహరిస్తున్నారో వారి పేర్లు చెప్పాలంది. దీంతో ఇంద్రనీల్ ఏమీ మాట్లాకుండా కూర్చుండిపోయారు. మరో న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు నోటిఫై అయి ఉన్నాయన్నారు. అలాంటప్పుడు ఈ శాఖలను తరలించాలంటే సీఆర్డీఏ అనుమతి తీసుకోవాలని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ శాఖల తరలింపునకు సీఆర్డీఏ అనుమతి కావాలని ఆ చట్టంలో ఎక్కడ ఉందని లక్ష్మీనారాయణను ప్రశ్నించింది. అయితే ఇందుకు ఆయన సూటిగా సమాధానం చెప్పకలేకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు చూపకుండా పిటిషన్లు దాఖలు చేసి మౌనంగా నిల్చుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. (చదవండి: భావి తరాల బాగుకే వికేంద్రీకరణ) -
ఏపీలో భగ్గుమన్న నిరసన జ్వాలలు
‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. విశాఖ జిల్లా: విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో మహిళలు నల్ల చీరలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ’ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, మళ్ల విజయప్రసాద్, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలిలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తన స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబుకు హితవుపలికారు. శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ నాయకులు తప్పుబట్టారు. విశాఖ నార్త్లో: శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ నుంచి నల్ల వస్త్రాలు ధరించిన మహిళలు నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు అండ్ కో పై కేకే రాజు మండిపడ్డారు. ఎన్ఏడీ జంక్షన్లో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో విశాఖ వాసులు మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ విశాఖ వెస్ట్ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ సంఘీభావం తెలిపారు. విశాఖ నార్త్ కన్వీనర్ కేకేరాజు మాట్లాడుతూ.. విశాఖ ప్రజల ఓట్లతో పరువు నిలబెట్టుకున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ద్రోహానికి పాల్పడ్డారన్నారు. విజయప్రసాద్ మాట్లాడుతూ.. శాసనమండలి చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పదవులు, బినామీ ఆస్తుల కోసం చంద్రబాబు ఎంతటి మోసానికైనా ఒడిగడతారన్నారు. పశ్చిమగోదావరిలో: శాసనమండలి టీడీపీ వైఖరికి నిరసనగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు విశాల్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులు,కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా: టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమ ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశాడంటూ న్యాయవాదులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయం ముట్టడి మండలిలో టీడీపీ వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నేతలు ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్కు మద్దతు పలకాలని, లేని పక్షంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. జేఏసీ నేతలు.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు అనంతపురం జిల్లా: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా గుత్తిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. కల్యాణదుర్గంలో.. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆంధ్రుల ద్రోహి చంద్రబాబు అని, శాసనమండలి బిల్లులను అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా తిరుపతి ఎస్వీయూలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మండలి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. రియల్ హీరో వైఎస్ జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన నేత ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. -
పెద్దల సభపై నమ్మకం పోయింది..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెద్దల సభపై నమ్మకం పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలిలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయని.. ఏపీలో మండలి తీరు బట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా శాసనమండలి కి వచ్చి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ దైవభక్తి, నిజాయితీ గల వ్యక్తి అని.. కానీ చంద్రబాబు ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ముఖ కవళికల్లో కనిపించిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం శాసన మండలిలో చర్చకు రాకుండా పక్కకు పెట్టడం అత్యంత నిబంధనలకు విరుద్ధం అని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలు ముందుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం అని చెప్పడం కూడా రూల్స్కు విరుద్ధమేనన్నారు. చైర్మన్కు నేరుగా రూలింగ్ ఇచ్చే అధికారం లేదని.. కమిటీకి పంపించాలా లేదా అనే అంశాన్ని సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. సభ్యులు ఓటింగ్ కోరితే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిన విషయం పై ఓటింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత చైర్మన్ కు వుందని వివరించారు. మండలి లో నిన్న జరిగిన తీరు అప్రజాస్వామికం అని వీరభద్రరావు పేర్కొన్నారు. (చదవండి: బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...) -
‘చంద్రబాబు ఒక అరాచక శక్తి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు అనర్హుడని.. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఈ నెపంతో రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని పెంచాలనే కుట్రతో 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే.. వేల కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాశ్వత హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు లేవని.. తాత్కాలిక భవనాలతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేల ఎకరాలను దోచేశారని ధ్వజమెత్తారు. 13 జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని.. టీడీపీ దీనిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి మాత్రమే కాదని..13 జిల్లాల అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరాచకం సృష్టించారని తెలిపారు. చంద్రబాబు, చైర్మన్లు కలిసి శాసనమండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకుని..చంద్రబాబు పైశాచిక ఆనందం.. నిన్నటి రోజు చరిత్రలో బ్లాక్డే గా మిగిలిపోతుందని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాథం అన్నారు. చంద్రబాబు మంది బలంతో చట్టాలను చుట్టంగా చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల బలం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుని చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 సంవత్సరాల అనుభవంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చేసిన కుటిల రాజకీయాలు మండలి సాక్షిగా బహిర్గతమయ్యాయన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.. రాయలసీమ వాసులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర నేత రాజ్కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు మండలిలో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమ రాజధాని కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాజ్కుమార్ స్పష్టం చేశారు. -
హద్దులు దాటిన అరాచకం
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసన మండలిలో బుధవారం చర్చ ముగిసే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అరాచకం హద్దులు దాటింది. మండలిలో ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపించేందుకు ఆయన శతధా ప్రయత్నించారు. అసాధారణ రీతిలో ఆయన శాసనమండలి అధికారుల గ్యాలరీకి హుటాహుటిన టీడీపీ ఎమ్మెల్యేలతో వచ్చారు. అక్కడ మండలి చైర్మన్కు ఎదురుగా నిలబడే సైగలు చేస్తూ చైర్మన్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాక.. టీడీపీ ఎమ్మెల్సీలకు సైగలు చేస్తూ అధికార పక్ష సభ్యులు, మంత్రులతో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రేరేపించారు. గ్యాలరీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా మార్షల్స్ చంద్రబాబును కోరగా.. ఆయన ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపైకి దూసుకెళ్తూ పెద్దపెద్దగా కేకలు వేశారు. స్పీకర్ను ఉద్దేశిస్తూ తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరించారు. ఆయన దౌర్జన్యకాండ ఎలా సాగిందంటే.. బిల్లులపై చర్చ అనంతరం మంత్రుల సమాధానం కూడా పూర్తయిన తరువాత మండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బిల్లుకు సవరణలను ప్రతిపాదించామని, సెలక్ట్ కమిటీకి పంపించాలన్నారు. ఇందుకు సంబంధించి మోషన్ కూడా ఇచ్చామన్నారు. దీంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు ఇతర మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇది అన్యాయమంటూ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతున్న సమయంలో చంద్రబాబు సా. 5గంటల ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి అధికారుల గ్యాలరీలోకి వచ్చి చైర్మన్కు ఎదురుగా నిలబడ్డారు. ఆయన చైర్మన్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలకు సైగలుచేస్తూ మంత్రులుపైకి వెళ్లేందుకు ప్రేరేపించారు. అదే సమయంలో చంద్రబాబు పక్కనే ఉండి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ కార్యాలయ ఉద్యోగి సురేశ్ కూడా మండలి ప్రొసీడింగ్స్ను తమతమ సెల్ఫోన్లతో వీడియోలు తీశారు. ఇది గమనించిన మార్షల్స్ వారిద్దరినీ వారించారు. మరోవైపు.. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతుండడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, చిన్నరాజప్ప, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్లు అధికారుల గ్యాలరీలోనే తిష్టవేశారు. ఈ సమయంలో మార్షల్స్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక్కసారిగా మార్షల్స్పైకి దూసుకువెళ్లి.. ‘వెళ్లిపోమని చెప్పడానికి స్పీకర్ ఎవరు? ఆయనను వచ్చి ఈడ్చుకు వెళ్లమనండి.. ఇక్కడ నుంచి నేను వెళ్లేది లేదు’.. అంటూ మార్షల్స్పై చంద్రబాబు పెద్దపెద్దగా కేకలు వేశారు. అంతేకాక.. ‘చైర్మన్ను చెప్పమనండి వెళ్తాను. తమాషాలు చేస్తున్నారా, ఇష్టానుసారం చేస్తారా ఇది పోలీసు రాజ్యమా’.. అంటూ వారిపై ఊగిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక మార్షల్స్ బిత్తరపోయారు. వైఎస్సార్సీపీ నేతల రాక మరోవైపు.. వీఐపీ గ్యాలరీల్లో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితోపాటు రోజా, కాసు మహేశ్రెడ్డి తదితర అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కూర్చుని మండలి ప్రొసీడింగ్స్ను వీక్షించారు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఐదు కోట్ల మంది ప్రజల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సమానాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏఎంఆర్డీఏ) ఏర్పాటు బిల్లును సోమవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్స చెప్పారు. నాడు చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అభివృద్ధిని అంతా ఒకే చోట కేంద్రీకరిస్తూ సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను కూడా గత ప్రభుత్వం బేఖాతర్ చేసిందన్నారు. దీంతో తాము అన్యాయానికి, వివక్షకు గురి అవుతున్నామని ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి రగులుతోందని చెప్పారు. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ చేపట్టారన్నారు. మంత్రి బొత్స ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.... విశాఖ వద్దని మీ ఎమ్మెల్యేలు చెప్పగలరా? - గతంలో ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నాం. - జీఎన్రావు కమిటీ, బీసీజీ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించి తుది నివేదికను సమర్పించింది. - అన్ని అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించిన అనంతరం పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. - రాయలసీమ ప్రజలు సాగునీరు, తాగునీరు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వాసులు తమ ప్రాంత అభివృద్ధి కోసం గళమెత్తుతున్నారు. వారందరి మనోభావాలను గుర్తించే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది - అభివృద్ధి అంటే ఏ ఒక్క ప్రాంతానికో, సామాజిక వర్గానికో పరిమితం చేయడం కాదు. - అభివృద్ధి ఫలాలను 13 జిల్లాలకూ సమానంగా అందించేలా పరిపాలన వికేంద్రీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి రూపొందించారు. - వైజాగ్ రాజధాని కావాలని ఎవరడిగారని చంద్రబాబు పదేపదే అంటున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్రవాసులుగా మేం అడుగుతున్నాం. కచ్చితంగా అడుగుతాం. మా ప్రాంత మనోభావాలను వెల్లడిస్తాం. - విశాఖ రాజధానిగా వద్దని అక్కడ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పగలరా? - చంద్రబాబు మాదిరిగా మేం రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయం. -
రాజధానులిక అందరివీ..
రాష్ట్ర శాసనసభ సరికొత్త చరిత్రకు వేదికైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సోమవారం సభ ఆమోదించింది. అభివృద్ధి అన్నది ఒకే చోట కేంద్రీకృతం కారాదని.. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సంపూర్ణంగా సమర్థించింది. అమరావతి ప్రాంతాన్ని కీలకమైన శాసన రాజధానిగా నిర్ణయించింది. ఇక సహజ వనరులతో సహజ సిద్ధంగా అభివృద్ధి చెందిన తీర ప్రాంత నగరం విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. తద్వారా మూడు కీలక వ్యవస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొల్పుతూ ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పురోభివృద్ధికి అడుగులు ముందుకు వేసింది. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలపై పలు వరాలు కురిపించడం ద్వారా తాను మనసున్న ముఖ్యమంత్రినని వైఎస్ జగన్ మరోమారు నిరూపించుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా మేలి మలుపు.. ప్రాంతీయ వివక్షకు చరమగీతం.. సమానాభివృద్ధికి తెరతీస్తూ నూతన అధ్యాయం..ఇటు పాలన, అటు అభివృద్ధి వికేంద్రీకరణకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు.. ఇలా మూడు ప్రాంతాల ప్రజల కలను సాకారం చేసే దిశగా రాష్ట్రం పెద్ద ముందడుగు వేసింది. తద్వారా రాష్ట్ర ప్రజల 67 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. పరిపాలన వ్యవస్థలోనూ తద్వారా అభివృద్ధిలోనూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సరికొత్త ప్రగతి చరిత్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాకు అన్ని ప్రాంతాలూ సమానమే. ఇదే కృష్ణా జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. స్వయానా మా మేనత్తను ఇదే జిల్లాకు ఇచ్చాం. ఇక్కడి (విజయవాడ) రాజ్, యువరాజ్ థియేటర్ల ద్వారా నాలుగు దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉన్నాం. శాసన రాజధానిలో.. ఏఎంఆర్డీఏ పరిధిలోని శాసనపరమైన రాజధాని అమరావతిలో శాసనసభ, శాసన మండలి ఉంటాయి. పరిపాలనా రాజధానిలో.. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో రాజ్భవన్, సచివాలయం, ప్రభుత్వ శాఖల శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిలో.. హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర న్యాయ సంబంధమైన సంస్థలు కర్నూలులోనే ఉంటాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాలనాపరమైన మూడు రాజధానుల ఏర్పాటుతోపాటు ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు నెలకొల్పేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతంగా పిలువబడే అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతంగా పిలువబడే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలు పట్టణాభివృద్ధి ప్రాంతంగా పిలువబడే కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు, అలాగే ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరైన మంత్రులు, అధికారులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీసీఆర్డీఏ)ను రద్దు చేస్తూ.. దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన మరో ముసాయిదా బిల్లుకు సైతం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. శివరామకృష్ణన్ కమిటీతోపాటు, ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. అమరావతి ప్రాంత రైతు కూలీలు, రైతులకు దన్ను.. అమరావతి రాజధానిలో భూములిచ్చిన రైతులకు కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ కాల వ్యవధిని అదనంగా ఐదేళ్లపాటు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఏఎంఆర్డీఏను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఇందుకు వీలు కల్పిస్తున్నది. రైతు కూలీలకిచ్చే నెల పెన్షన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచేందుకు, అలాగే పెన్షన్ను గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పుడు అదనంగా మరో ఐదేళ్లపాటు ఇవ్వాలని ఈ బిల్లులో స్పష్టం చేశారు. రైతులకిచ్చే కౌలును గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయిస్తే ఇప్పుడు అదనంగా మరో ఐదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించారు. 11,159 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు - రైతులకు వ్యవసాయంలో అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు, అలాగే నాణ్యమైన ఎరువులు, విత్తనాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు గ్రామ సచివాలయాల వద్దే రూ.199.44 కోట్ల వ్యయంతో 11,159 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్దేశించింది. - పులివెందుల డెవలప్మెంట్ అథారిటీకి పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నివేదికలోని అంశాలివీ.. - విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, అభివృద్ధి ప్రమాణాలను కలిగి ఉన్నాయి. - ప్రాంతీయ అసమానతలు, సమానాభివృద్ధి లేకపోవడం రాష్ట్రంలో అశాంతికి దారితీశాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య సమాన అభివృద్ధిని కోల్పోయామన్న తీవ్ర భావనను కలిగించాయి. - వివిధ ప్రాంతాల్లోని ప్రజలు సామాజిక, ఆర్థిక, ప్రగతి ఫలాలను సమానంగా అనుభవించేలా చూడటానికిగాను అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షలను గౌరవిస్తూ.. చరిత్రాత్మక నిబద్ధతలు, ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. - పరిమిత ఆర్థిక వనరులు, ద్రవ్యసాధనాలను దృష్టిలో ఉంచుకుని 217 చదరపు కిలోమీటర్ల ఒక చిన్న ప్రాంతానికి అన్ని వనరుల్ని ఉపయోగించడం వాంఛనీయం కాదు. ఇది వెనుకబడిన ప్రాంతాల వారికి ఏమాత్రం అభిలషణీయమూ కాదు. అభివృద్ధితోపాటు వికేంద్రీకరణ సిద్ధాంతానికి ఇది అసలు పొసగదు. -
సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స
సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సీఆర్డీఏ రద్దు బిల్లును మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విశాఖలోనే రాజ్భవన్, సెక్రటేరియట్ ఉంటుందన్నారు. అదే విధంగా కర్నూలులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు బుగ్గన ప్రకటించారు. అమరావతి మెట్రోపాలిటన్రీజియర్ అథారిటీ ఏర్పాటుకు సంకల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. బిల్లు ఎంతో చారిత్రాత్మకం సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎంతో చారిత్రాత్మకం అన్నారు. ‘రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ బిల్లును రూపొందించాం. సమ్మిళిత అభివృద్ధి మన బాధ్యత. రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తున్నాం. స్థానిక జోన్లను ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ మండళ్లనూ ఏర్పాటు చేస్తాం. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మండళ్లపై ఉంటుంది. ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాం. దీనిలో భాగంగానే శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలులో ఏర్పాటు చేయదలచుకున్నాం. న్యాయపరమైన అంశాలన్నీ కర్నూలులోనే జరుగుతాయి. హైకోర్టు అనుమతి తరువాతనే వీటిని ఏర్పాటు చేస్తాం. శ్రీబాగ్ ఒప్పందంలోనే వికేంద్రీకరణ.. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం జరిగితీరాలి. కృష్ణదేవరాయలు స్థానిక సంస్థలను ఎంతో అభివృద్ది చేశారు. సామాన్య ప్రజలెవరూ రాజభవనాలను కోరుకోరు. అభివృద్ధిలో సమన భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర అనే పదం వచ్చిన తరువాతనే తెలుగు వచ్చింది. 1937లో జరిగిన శ్రీ బాగ్ ఒడంబడికలో రాయలసీమ, ఆంధ్రా అభివృద్ధికి ఒప్పందాలు జరిగాయి. రాయలసీమ వెనుకబడి ఉందని అప్పుడే గుర్తించారు. వర్షాభావ పరిస్థితుల వల్లే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. శ్రీ బాగ్ ఒడంబడికలోనే వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్గా మార్చొద్దు గత వందేళ్ల చరిత్రను చూస్తే అభివృద్ధి ముఖ్యమని కనిపిస్తోంది.1920లోనే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్లో ఆంధ్ర మహాసభను పెట్టారు. ఉప ప్రాంతాలు అభివృద్ధి జరగకపోతే ఉద్యమాలు తప్పవు. తెలంగాణ ఏర్పాటు కూడా అదే కోవకు చెందుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమకు ఎక్కడా పోలిక లేదు. ఉప ప్రాంతాలకు ప్రత్యేక అవసరాలున్నాయి. ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉప ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ ఏర్పాటుపై నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అనేక అంశాలను పరిశీలించింది. ఆ కమిటీ కూడా తెలంగాణ కన్నా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని కమిటీ రిపోర్టులో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించింది. ఒకే నగరాన్ని అభివృద్ధి చేయవద్దని కమిటీ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని తేల్చిచెప్పింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలమని కమిటీ అభిప్రాయపడింది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్గా మార్చవద్దని కూడా సూచించింది. జియలాజికల్ సర్వే కూడా పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు నిర్శించవద్దని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పింది’ అని అన్నారు. -
మీ అభిప్రాయాలు, సందేహాలు చెప్పండి
సాక్షి, అమరావతి: అమరావతి గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ అభిప్రాయాలు, సలహాలను కోరింది. 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ సీఆర్డీఏ కమిషనర్కు వ్యక్తిగతంగా గానీ, పోస్టు, ఇ–మెయిల్ ద్వారా గానీ తాము చెప్పదలచుకున్న విషయాలను పంపాలని సూచించింది. హైపవర్ కమిటీ మూడో సమావేశం విజయవాడలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన జరిగింది. సమావేశం వివరాలను కమిటీ సభ్యులు, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని మీడియాకు వివరించారు. రాజధాని గ్రామాల రైతులే కాకుండా ఎవరైనా తమ అభిప్రాయాలు పంపవచ్చని పేర్ని నాని తెలిపారు. ప్రతి సమావేశంలోనూ తాము రాజధాని రైతుల గురించి చర్చిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలామంది రైతులు మంత్రి బొత్స సత్యనారాయణ, కొడాలి నానితోపాటు తన వద్దకు వచ్చి అభిప్రాయాలు వ్యక్తం చేసి తమ ప్రతిపాదనలు చెబుతున్నారని వివరించారు. ఈ అంశాలన్నింటినీ తాము ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో పొందుపరుస్తామన్నారు. వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయంగా వాడుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని, మహిళల్ని తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. అన్ని అంశాలపైనా రాజధాని రైతులు తమతో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రేరేపిత శక్తులు దాడి చేస్తాయనే భయంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తున్నామని, ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు: కన్నబాబు సంక్రాంతి పండుగ సమయంలోనైనా చంద్రబాబు రైతుల్ని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించకుండా ప్రశాంతంగా ఉండనివ్వాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. భూములిచ్చిన రైతులది ఒక ఆందోళనైతే చంద్రబాబుది మరో ఆందోళనని విమర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లి వెళ్లి పండుగ చేసుకుంటున్నారని, రైతుల్ని మాత్రం పండుగ చేసుకోవద్దంటున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్పై అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. ముడాలో కలపాలని కోరాం: కొడాలి నాని మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సీఆర్డీఏ పరిధి నుంచి తొలగించి ముడా పరిధిలోకి తేవాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. పోర్టును త్వరితగతిన చేపట్టాలని కూడా కోరామన్నారు. ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎక్స్పోర్టు, ఇంపోర్టును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఆక్వా పరిశ్రమల్ని మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేరం బయట పడటం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇందుకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. భూ దందాలో మరో కోణం క్విడ్ ప్రో కో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి గానీ రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్హౌస్ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసైన్డ్ భూముల వ్యవహారం.. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ప్లాట్లు రావని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన వారిలో దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. అసైన్డ్ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్కు మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. ఇంకో సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరా తక్కువ ధరకు లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. జోన్ల అలైన్మెంట్ల కుంభకోణం.. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూము లేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి సరిహద్దులను మార్చారు. 2015 జూన్లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్కు చెందిన సుర్బానాజురాంగ్కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ► మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. ► చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్కు చందర్లపాడులో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. ► రాజధాని చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలోనూ అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ► చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. పక్కా ప్లాన్తో భూ దందా 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజధాని ఎక్కడ రాబోతున్నదనే ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై 2014 ఆగస్టు 27న శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను పూర్తిగా పక్కన పడేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ 2014 డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీయే చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన 2014 సెప్టెంబర్ 4లోపు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో తమ బంధువులు, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. లంకా దినకర్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), కంభంపాటి రామ్మోహన్రావు కుమార్తె కంభంపాటి స్వాతి , పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష.. వారు నడుపుతున్న ఆర్.ఆర్.ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్.. కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు. (పైన పేర్కొన్న వాటికి అసైన్డ్ భూములు అదనం) రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్లరేషన్ కార్డు దారులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. చదవండి: ‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’ ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే రాజధాని దందా నిగ్గు తేలుస్తాం బట్టబయలైన అమరావతి కుంభకోణం ‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’ రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే -
అమరావతిలో ‘అసైన్డ్’ ప్లాట్లు రద్దు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించారు. కాగా దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్ భూములను కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. అనంతరం సీఆర్డీఏ వీటిని భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. అసైన్డ్ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే. ల్యాండ్ పూలింగ్ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. కాగా అసైన్డ్ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: బహుళ రాజధానులే బహుబాగు) -
శాసనమండలిలో అమరావతిపై చర్చ
సాక్షి, అమరావతి: ‘రాజధాని విషయంలో తెలుగుదేశం సభ్యుల మాటల్లో వారు దోచుకున్నది, ఆక్రమించుకున్నది ఏమైపోతుందో అన్న భయం వారిలో కనబడుతోంది’ అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం రాజధాని అమరావతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం చట్టాలను విస్మరించి భూములు లాక్కుంది. చట్ట ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదు. మొదట్లో సీఆర్డీఏ పరిధి 217 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు బంధువు కోసం పరిధిని పెంచి 498 ఎకరాలు కేటాయించారు. ఎకరం రూ.లక్ష చొప్పున చంద్రబాబు తన బంధువుకు కేటాయించారు. ఇక తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగులు పిల్లర్లు వేశారు. దీనివల్ల ఖర్చు పెరిగింది. అసైన్డ్ భూముల కొనుగోళ్లను రద్దు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. గతంలో శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరు మధ్య అతి సారవంతమైన భూములు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాంతం రాజధానికి అనువైనది కాదని తెలిపింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధానిపై జీఎన్రావు కమిటీ నివేదికను పరిశీలిస్తాం. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుంది.’ అని తెలిపారు. -
టిడ్కో మిగతా ఇళ్లకు డిసెంబర్లో రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: టిడ్కో (ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టామని, ఇప్పటికే తొలిదశ టెండర్ల ప్రక్రియ పూర్తైందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలి దశ టిడ్కో ఇళ్ల రివర్స్ టెండర్లలో రూ.105.91 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. బొత్స శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 65,968 ఇళ్లకు రూ.3,253 కోట్లతో రివర్స్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో అన్నీ అబద్దాలే.. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా అన్నీ అబద్ధాలే వల్లె వేశారని బొత్స పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.9,060 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆయన హయాంలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనన్నారు. ఇందులో కన్సల్టెంట్లకు రూ.845 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని రూ.321 కోట్లు చెల్లింపులు జరిపారన్నారు. రాజధాని బాండ్లు, హడ్కో రుణాలకు వడ్డీ కింద తాము రూ.330 కోట్లు చెల్లించామని తెలిపారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని, సీఆర్డీఏ పేరుతో అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ కింద పప్పు బెల్లాల్లా పంచారని విమర్శించారు. బాబు సర్కారు దోపిడీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బొత్స - గత ప్రభుత్వం 14,368 ఇళ్ల నిర్మాణానికి రూ.707.03 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా వీటికి రివర్స్ టెండర్లలో రూ.601.12 కోట్లకు కోట్ చేసి నిర్మాణ సంస్ధలు ఎల్ – 1గా నిలిచాయి. అంటే రివర్స్ టెండర్ల ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. - పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? - మిగతా ఇళ్లకు డిసెంబరు 13, 20, 26వతేదీల్లో మూడు విడతలుగా రివర్స్ టెండర్ల నిర్వహణ. - గత సర్కారు మాదిరిగా ఇళ్ల నిర్మాణానికి పాత రేట్లతో టెండర్లు పిలిచి ఉంటే ప్రతి లబ్ధిదారుడికి రూ.75 వేల నుంచి రూ.95 వేల వరకు భారం పడేది. - టీడీపీ సర్కారు అవినీతిని ఎండగట్టి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. - టిడ్కోలో రివర్స్ టెండర్ల ద్వారా ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 చొప్పున ప్రజాధనం ఆదా. -
కిలోమీటర్కు రూ. 27 కోట్లు ఎక్కువ వ్యయం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో అత్యంత భారీ వ్యయంతో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులను పున:సమీక్షించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) కసరత్తు చేస్తోంది. పనులన్నింటినీ విడివిడిగా సమీక్షించి, రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆర్భాటాలు, అనవసర ఖర్చులను తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏ అధికారులను ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రాధాన్యత ప్రకారం రోడ్ల నిర్మాణం ప్రస్తుతం రాజధానిలో జనాభా పెద్దగా లేదు కాబట్టి రోడ్లను మొదట రెండు వరుసలుగా నిర్మించాలని, అవసరాన్ని బట్టి విస్తరించేందుకు భూమిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకనుగుణంగా ఆయా రోడ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రైతులకిచ్చిన ప్లాట్ల లేఔట్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వీటిలో కొన్నింటి విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాల పనులు 25 శాతం కంటే తక్కువే జరిగాయి. ఇప్పటికే 75 శాతం పూర్తయిన ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాస భవనాల పనులు మరో రూ.2,830 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే పరిస్థితి ఉండడంతో వాటిని మొదలుపెట్టనున్నారు. వచ్చే నెలలో ఈ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారుల నిర్మాణంలో అవినీతి పర్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) రాజధానిలో దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన 34 రోడ్ల పనులను 23 ప్యాకేజీలుగా విభజించి, వివిధ సంస్థలకు అప్పగించింది. కిలోమీటర్కు సగటున రూ.42 కోట్ల భారీ వ్యయంతో ఈ రోడ్ల పనులను చేపట్టడంపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్కు కేవలం రూ.15 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మిస్తుండగా, రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అందుకు రెండు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం గమనార్హం. అంటే ఒక్కో కిలోమీటర్కు రూ.27 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజధానిలో పనుల విషయంలో సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించాలని, అవసరాన్ని బట్టి రివర్స్ టెండరింగ్ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నిధుల లభ్యతను బట్టి పనులు ‘‘రాజధానిలో ప్రాధాన్యతను బట్టి దశల వారీగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అనవసర వ్యయం తగ్గించాలని స్పష్టం చేశారు. రాజధానిలో పనుల విషయంలో నిధుల లభ్యతను బట్టి ముందుకెళతాం’’ – లక్ష్మీనరసింహం, సీఆర్డీఏ కమిషనర్ -
‘ఆర్భాటాలకు పోకుండా నిర్మాణాలు చేపట్టాలి’
సాక్షి, అమరావతి : సీఆర్డీఏ పరిధిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఆర్డీఏపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మినరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా ప్రాధాన్యత క్రమంలో పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల విషయంలో అనవసర ఖర్చులకు పోకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తి కావొస్తున్న నిర్మాణాలపై ముందు దృష్టిపెట్టాలని.. ఇందుకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ స్పష్టం చేశారు. పనుల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో రోడ్ల డిజైన్ల గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగిన సీఎం వైఎస్ జగన్.. ప్లానింగ్లో ఎక్కడా తప్పులు ఉండకూడదని సూచించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో, ఖర్చు, డిజైన్ల తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సమీపంలో కొండవీటివాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. అలాగే వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణం, నీటి వినియోగంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్ స్కేపింగ్ చేసి సుందరీకరించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో వ్యయం తగ్గించి.. మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి.. వారికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
విజయవాడ, గుంటూరులకు కొత్త రూపు
సాక్షి, అమరావతి: యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీవో) అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు విజయవాడ, గుంటూరు ఎంపికయ్యాయి. వీటితోపాటు రాజస్థాన్లోని జైపూర్, మధ్యప్రదేశ్లోని భోపాల్, కర్ణాటకలోని మైసూరులను కూడా పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేశారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూఎన్ హ్యాబిటాట్, జీఈఎఫ్ (గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ) సంస్థల భాగస్వామ్యంతో యూఎన్ఐడీవో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ ఐదు నగరాల సుస్థిరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, అవసరమైన పెట్టుబడులు, సామర్థ్యం పెంపు, నాలెడ్జ్ బదిలీ అంశాల్లో యూఎన్ఐడీవో ఈ కార్పొరేషన్లకు చేయూతనివ్వనుంది. మొదటి దశలో విజయవాడ, గుంటూరుల్లో సుస్థిరాభివృద్ధి స్థితి ఎలా ఉందో అధ్యయనం చేస్తుంది. దీన్నిబట్టి విజన్ను రూపొందించుకుని ప్రాధామ్యాలు నిర్దేశించుకుంటుంది. అనంతరం వాటిని అభివృద్ధి చేయడానికి ఉన్న వనరులు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టును అమలు చేస్తుంది. భాగస్వామ్య సంస్థలతో కలిపి పెట్టుబడులు పెట్టాలనుకున్న అంశాలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలపై సవివర నివేదికలు రూపొందిస్తుంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ప్రధానంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రవాణా నెట్వర్క్ అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాల్లో ఆర్థిక సహకారం అందించే అవకాశాలున్నాయి. యూఎన్ఐడీవో ప్రతినిధి బృందం తన అధ్యయనంలో భాగంగా రెండు రోజులుగా విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తోంది. కార్పొరేషన్ల అధికారులు, సీఆర్డీఏ కమిషనర్తో సమావేశమై ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు సంబంధించిన వివరాలు సేకరించింది. -
రాజధానిలో ఏది చూసినా అస్తవ్యస్తమే..
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం అంటూ ప్రచారం చేసిన మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పునాదులపై పేక మేడలు కట్టినట్లు నిపుణుల కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్డీఏ) రాజధాని అమరావతిలో చేపట్టిన పనులు, కార్యకలాపాలపై నిపుణుల కమిటీ అధ్యయనంలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నిపుణుల కమిటీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కన్సల్టెన్సీలు, డిజైన్ల పేరుతో ప్రజాధనం భారీ ఎత్తున దోపిడీ జరిగిందని కమిటీ నిగ్గు తేల్చింది. రాజధానిలో ఏది చూసినా అస్తవ్యస్తంగా ఉందని, అసాధారణంగా ఫీజులు పెంపు, ఒకే పనికి పలు కన్సల్టెన్సీల పేరుతో భారీగా చెల్లింపులు జరిగినట్లు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికలో కీలక అంశాలు... - రాజధాని మాస్టర్ ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పిన గత సర్కారు అందుకు విరుద్ధంగా సుర్బానాకు రూ.11.92 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని రూ.16.64 కోట్లకు పెంచింది. - సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిక వ్యయంతో రాజధాని నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. - బిడ్లు ఆహ్వానించకుండానే ఆర్కిటెక్ట్స్, కన్సల్టెన్సీ ఏజెన్సీలను ఇష్టానుసారంగా ఎంపిక చేశారు. - ప్రభుత్వ భవనాల డిజైన్ల తయారీకి తొలుత జపాన్కు చెందిన మకీ అసోసియేట్ను ఎంపిక చేసి తర్వాత ఫోస్టర్ అండ్ పార్టనర్కు అత్యధిక ఫీజుతో అప్పగించారు. - మాస్టర్ ప్రణాళిక, సీడ్ క్యాపిటల్, జ్యుడిషియల్ కాంప్లెక్స్, లెజిస్లేచర్ భనవాల డిజైన్లను ఏజెన్సీలకు అప్పగించడంలో ప్రామాణిక విధానాలను పాటించలేదు. - దశలు, ముగింపు ప్రణాళికలు లేకుండా మౌలిక వసతుల ప్రాజెక్టులను ఇష్టానుసారంగా చేపట్టడంతో వ్యయం ఇప్పటికే అధికంగా ఉంది. - ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో రూ.8 వేల కోట్ల విలువైన పనులను చేపట్టి అత్యధికంగా చెల్లించారు. - ఆర్కిటెక్చరల్ డిజైన్ల పేరుతో కన్సల్టెంట్లకు రూ.270 కోట్ల ఫీజు చెల్లించారు. ఈ విధంగా చెల్లించడం డూప్లికేషన్ అవుతుంది. - అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల తయారీని ఫోస్టర్–పార్టనర్ కన్సారి్టయం కన్సల్టెన్సీకి తొలుత రూ.60.72 కోట్లకు అప్పగించి రూ.121.76 కోట్లకు పెంచేశారు. - రాజధానిలో 39 ప్రాజెక్టుల విలువ రూ.25,877.67 కోట్లు కాగా డిజైన్ల కన్సల్టెన్సీ ఫీజుగా ఒక శాతం అంటే రూ.258.77 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2.12 శాతం మేర రూ.549.73 కోట్లను చెల్లించారు. రూ.290 కోట్లు అత్యధికంగా చెల్లించడం అసాధారణం. ఒకే పనికి పలు కన్సల్టెన్సీల పేరుతో చెల్లింపులు గత సర్కారు రాజధాని పేరుతో ఒకే పనికి ఫీజుల రూపంలో పలు కన్సల్టెన్సీలకు భారీగా చెల్లింపులు జరిపినట్లు నిపుణుల కమిటీ తేలి్చంది. అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ కాంప్లెక్స్ ఆర్కిటెక్చరల్ సరీ్వస్ పేరుతో హఫీజ్ కాంట్రాక్టర్కు రూ.32.29 కోట్లకు అప్పగించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, శాఖాధిపతుల టవర్ ఆర్కిటెక్చరల్ సరీ్వసు పేరుతో ఫాస్టర్–పార్టనర్కు రూ.181.06 కోట్లకు అప్పగించారు. మళ్లీ సచివాలయం, హైకోర్టు భవనాల ఆర్కిటెక్చరల్ సరీ్వస్ పేరుతో ఫోస్టర్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్కు రూ.8.74 కోట్లకు అప్పగించారు. సచివాలయం, శాఖాధిపతులు, ఐటీ టవర్స్ పేరుతో జినిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.48.21 కోట్లకు అప్పగించారు. తొలుత ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల పేరుతో ఫోస్టర్ పార్టనర్కు రూ.121.76 కోట్లకు అప్పగించగా మళ్లీ విడివిడిగా అవే పనులను పలు కన్సల్టెన్సీలకు అప్పగించడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. పర్యవేక్షణకు 135.99 కోట్లు రాజధానిలో రహదారులు, వాటర్ ట్రీట్మెంట్, ఐకానిక్ వంతెన, వరద నియంత్రణ తదితర పది ప్రాజెక్టుల పర్యవేక్షణ పేరుతో కన్సల్టెన్సీలకు గత సర్కారు ఏకంగా రూ.135.99 కోట్ల చెల్లింపులు జరిపింది. ఎలాంటి పురోగతి లేకున్నా కన్సల్టెన్సీలకు భారీగా చెల్లించడం గమనార్హం. నిపుణుల కమిటీ సభ్యులు సుబ్బరాయశర్మ... రిటైర్డ్ ఈఎన్సీ అబ్దుల్ బషీర్... రిటైర్డ్ ఈఎన్సీ నారాయణరెడ్డి... రిటైర్డ్ ఈఎన్సీ ఎఫ్సీఎస్ పీటర్.. రిటైర్డ్ ఈఎన్సీ ఐఎస్ఎన్ రాజు.. రిటైర్డ్ సీఈ సీడీవో ఆదిశేషు... రిటైర్డ్ డైరెక్టర్, జెన్కో సూర్యప్రకాశ్... కన్సస్టక్షన్ ఇంజనీరు -
అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ కొరడా
సాక్షి, అమరావతి: కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించిన అక్రమ కట్టడాలపై మరోసారి సీఆర్డీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన శైవ క్షేత్రానికి 2014 నుంచి నోటీసులు ఇస్తున్నామని... వాటిపై యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో అధికారులు గురువారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు ప్రొక్లెయిన్ల సహాయంతో కూల్చి వేస్తున్నారు. త్వరలోనే మిగిలిన కట్టడాలను ఇదే రీతిలో తొలగిస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. -
రాజధాని అభివృద్ధి కమిటీ విధి విధానాలు ఖరారు
సాక్షి, అమరావతి: రాజధానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన, సమగ్రాభివృద్ధి కోసం ఇటీవల నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు, అధికారాలను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం మునిసిపల్ శాఖ కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలో ఏ అధికారితోనైనా సంప్రదింపులు జరిపి చర్చించవచ్చు. అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించవచ్చు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించవచ్చు. రాష్ట్రంలో వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల నుంచి, వివిధ వర్గాల సాధారణ ప్రజల నుంచి, ఆన్లైన్ ద్వారా సమాచారం పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లనైనా తెప్పించుకుని విశ్లేషించేలా ఈ కమిటీకి ప్రభుత్వం అధికారాలను కల్పించింది. కమిటీ కన్వీనర్, సభ్యులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చారు. వసతి, వాహన సౌకర్యం కల్పిస్తారు. కమిటీకి కార్యాలయం ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది కేటాయింపు బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ ఈ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కమిటీ జిల్లాల పర్యటన సందర్భంగా కలెక్టర్లు సమన్వయ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. కమిటీకి అవసరమైన నిధులు సీఆర్డీఏ నుంచి సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మున్సిపల్ కార్యదర్శితో సంప్రదింపులు జరిపిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. -
‘అక్వా డెవిల్స్’పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అమరావతి కరకట్ట వద్ద బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నిర్మించిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏడీడబ్లు్యఏ) కట్టడాల కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు జారీచేసిన తుది నోటీసులపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఇవ్వలేదు. సదరు నోటీసులకు ఏడీడబ్లు్యఏ ఏమాత్రం సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని హైకోర్టు అభిప్రాయపడింది. సంతృప్తికరమైన వివరణలు ఇవ్వకుండా, జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరితే ఎలా అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సీఆర్డీఏ జారీచేసిన నోటీసులకు ఇచ్చిన వివరణలను అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ న్యాయవాదికి న్యాయస్థానం సూచించి తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. తమకు చెందిన స్విమ్మింగ్ ఫూల్, ఇతర నిర్మాణాలను కూల్చివేసే నిమిత్తం సీఆర్డీఏ అధికారులు జారీచేసిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏడీడబ్లు్యఏ అధ్యక్షుడు కేఎస్ రామచంద్రరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ విజయలక్ష్మి గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టామన్నారు. తమవి చిన్నచిన్న షెడ్డులు మాత్రమేనని.. ఇవి కృష్ణా నదికి 100 మీటర్ల వెలుపలే ఉన్నాయని వివరించారు. సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏడీడబ్లు్యఏ ఆర్సీసీ నిర్మాణాలు చేపట్టిందన్నారు. స్విమ్మింగ్ ఫూల్తో సహా ఈ నిర్మాణాలన్నీ 100 మీటర్లలోపే ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన కోర్టు ముందుంచారు. పిటిషనర్ కోర్టులో చెబుతున్న అంశాలేవీ సీఆర్డీఏ అధికారులకిచ్చిన వివరణలో లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీఆర్డీఏ ఉత్తర్వులపై ఎటువంటి స్టే మంజూరు చేయకుండా తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేశారు. తుది ఉత్తర్వులివ్వకుండా చర్యలుండవు కరకట్ట వద్ద తమకున్న నిర్మాణాన్ని కూల్చివేయకుండా సీఆర్డీఏను నియంత్రించాలని కోరుతూ పాతూరి సుధారాణి అనే మహిళ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ వివరణను పరిగణనలోకి తీసుకున్నాకే తుది ఉత్తర్వులు జారీచేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జగన్మోహన్రెడ్డి కోర్టుకు తెలిపారు. తుది ఉత్తర్వులివ్వకుండా చర్యలుండవన్న కాసా వాదనను న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి నమోదు చేస్తూ సుధారాణి పిటిషన్ను పరిష్కరించారు. -
అక్రమ కట్టడాలపై కొరడా
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వెంబడి కృష్ణానదిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలకు ఇదివరకే నోటీసులు జారీచేసిన అధికారులు... వాటిపై యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సోమవారం నుంచి ఒక్కో అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందుగా పాతూరి కోటేశ్వరరావు నిర్మించిన కాంక్రీట్ చప్టాను సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ధ్వంసంచేసి నదీ ప్రవాహం సాఫీగా వెళ్లేలా చేశారు. కానీ, దీనిపై ఎల్లో మీడియా రాద్ధాంతం మొదలుపెట్టి చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తున్నట్లు గగ్గోలు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లోనూ టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు దీనిపై హంగామా చేశారు. కొద్దిసేపటికి తొలగించేది చంద్రబాబు నివాసం కాదని తేలడంతో ఎల్లో మీడియా గప్చుప్ అయింది. ‘లింగమనేని’కి తుది నోటీసులు వాస్తవానికి చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహానికి మూడు రోజుల క్రితం సీఆర్డీఏ అధికారులు తుది నోటీసులు జారీచేశారు. అక్రమంగా నిర్మించిన ఆ భవనాన్ని వారం రోజుల్లో తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, రెండు నెలల క్రితం కృష్ణా నది కరకట్ట లోపల నిర్మించిన 24 అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ ప్రాథమిక నోటీసులు జారీచేసింది. ఆ కట్టడాల యజమానుల నుంచి వచ్చిన వివరణలు, ఇతర అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాత అందులో ఐదు నిర్మాణాలు నదీ పరిరక్షణ చట్టం ప్రకారం ఏమాత్రం సహేతుకంగా లేవని నిర్ధారించారు. అందులో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిథిగృహంతోపాటు ఆక్వా డెవిల్స్, పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 19 నిర్మాణాలకు సంబంధించి ఐదుగురు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మిగిలిన నిర్మాణాల నుంచి వచ్చిన వివరణలను పరిశీలించి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, సోమవారం తొలగించిన పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణానికి అధీకృత అథారిటీ నుంచి ఎటువంటి అనుమతిలేదని, 1884 నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా దీన్ని నిర్మించినట్లు సీఆర్డీఏ తెలిపింది. తమ భూమి కోతకు గురికాకుండా ఈ నిర్మాణం చేపట్టినట్లు యజమాని కోటేశ్వరరావు ఇచ్చిన వివరణలో ఎటువంటి సహేతుకత లేకపోవడంతో దాన్ని తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సీఆర్డీఏ పేర్కొంది. మరోవైపు.. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటన్నింటిని కూల్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్రెడ్డి తెలిపారు. మరోచోట ఎటువంటి అనుమతులు లేకుండా పంట పొలం మధ్యలో చేపట్టిన ఓ నిర్మాణానికి సీఆర్డీఏ నోటీసులు జారీచేయడంతో దాని యజమానులే స్వచ్ఛందంగా తొలగించారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
విజయవాడ : కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కృష్ణా నదీ తీరంపై అక్రమ కట్టడాలుగా గుర్తించిన 24 నిర్మాణాలకు ప్రాధమికంగా సీఆర్డీఏ నోటీసులు జారీ చేయగా, వాటిలో ఐదు నిర్మాణాల యజమానులు ఇచ్చిన వివరణలు సహేతుకంగా లేకపోవడంతో వాటిపై తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నిర్మాణాలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపడతారు. ఇక మిగిలిన 19 అక్రమ నిర్మాణాలపై ఆయా యజమానులు ఇచ్చిన వివరణను సీఆర్డీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో కృష్ణ నదీ సమీపంలో పాతూరు కోటేశ్వరరావు నిర్మించిన అక్రమ కట్టడానికి జూన్ 6న నోటీసులు జారీ చేశామని సీఆర్డీఏ పేర్కొంది. సంబంధిత అధికారుల నుంచి, రివర్ కన్జర్వేటర్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై నోటీసులు జారీ చేశారు. భవన యజమాని ఇచ్చిన వివరణలో ఏమాత్రం సహేతుకత లేకపోవడంతో అధికారులు సోమవారం నిర్మాణాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదిపై నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు చేపడతామని సీఆర్డీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. -
కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కృష్ణానది కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలకు గతంలోనే నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నోటీసులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారని, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసాన్ని ఈ రోజు (సోమవారం) కూల్చేస్తున్నామంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు పాతురి కోటేశ్వరరావు భవనంలోని అక్రమ కట్టడాలు తొలగించామని తెలిపారు. చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడమేనని, చంద్రబాబు కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారని బొత్స గుర్తు చేశారు. రాజధాని ల్యాండ్ పూలింగ్లో భాగంగా ఆ రోజు ఈ భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు అంగీకరించారని, కానీ, ఇప్పుడేమో దానిపై మాట మారుస్తున్నారని బొత్స తప్పుబట్టారు. లింగమనేని నివాసానికి కూడా నోటీసులు ఇచ్చామని, చట్టప్రకారం అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తామని బొత్స తేల్చిచెప్పారు. సీఆర్డీఏ పరధిలోని అన్ని అక్రమ కట్టడాలు తొలగిస్తామని ఆయన తెలిపారు. -
అక్రమ నిర్మాణాలకు తుది నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు సీఆర్డీఏ తుది నోటీసులు జారీ చేసింది. నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో శుక్రవారం లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ భవనాలకు తుది నోటీసులిచ్చారు. నిర్మాణాలకు అనుమతులు లేవని, సరైన అనుమతులు చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారంలో ఆ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన 26 కట్టడాలకు సీఆర్డీఏ గతంలోనే నోటీసులివ్వగా అందరూ వివరణ ఇచ్చారు. తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు. సీఆర్డీఏ కమిషనర్ స్వయంగా వారితో మాట్లాడి అభ్యంతరాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్ కూడా సీఆర్డీఏకు వివరణ ఇచ్చారు. తనకు పంచాయతీ అనుమతి ఉందని చెప్పిన ఆయన తాను భవనం నిర్మించినప్పుడు సీఆర్డీఏ లేదని, కాబట్టి సీఆర్డీఏకు నోటీసులిచ్చే అధికారం లేదన్నారు. గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సీఆర్డీఏకు పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వారి వద్దనున్న పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ భవనాలు అక్రమమేనని తేల్చిన సీఆర్డీఏ చంద్రబాబు నివాసం సహా మూడు భవనాలకు తుది నోటీసులు జారీ చేసింది. మిగిలిన అక్రమ నిర్మాణాలకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. -
చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్హౌజ్కు సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. లింగమనేని రమేశ్ పేరుతో..గెస్ట్హౌజ్ గోడకు అధికారులు శనివారం నోటీసులు అంటించారు. వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ లింగమనేని గెస్ట్హౌజ్కు గతంలో కూడా సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లింగమనేని రమేశ్ అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్న అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా గ్రౌండ్ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్పూల్, ఫస్ట్ఫ్లోర్ డ్రెస్సింగ్ రూం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మరోసారి నోటీసులో పేర్కొన్నారు. -
నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ అబద్ధాలు
-
నాకేం సంబంధం: మంత్రి బొత్స ప్రశ్న
సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమని, ఎవర్నీ నిర్లక్ష్యం చేయబోమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికో, వ్యక్తులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అన్ని జిల్లాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. సీఆర్డీఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, జరగాల్సిన వాటిపై మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు సీఎం జగన్కు వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనులు 40 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సీఎంకు వివరించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. టెండర్ల దశలో ఉన్న పనులను రద్దు చేస్తున్నామన్నారు. ఆయా పనులకు నిధులు ఎలా వస్తాయి అనేది లేకుండానే టెండర్లు పిలిచారని వెల్లడించారు. చంద్రబాబు బంధువు రామారావు స్థలాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చిన విషయాన్ని ఆయన జీవో ఆధారంతో సహా చూపించారు. 2012లో చేర్చినట్లు చెప్పడం అబద్దమేనని బొత్స అన్నారు. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి భూములు గురించి తాము చెప్పిన లెక్కలు వాస్తవమేనని అన్నారు. రాజధాని పరిధిలో ముంపు వ్యవహారంపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన విలేకరులకు స్పష్టం చేశారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. (ఇది చదవండి: నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు) -
నాకేం సంబంధం: మంత్రి బొత్స ప్రశ్న
-
నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు
సాక్షి, విజయవాడ: రాజధాని భూముల విషయంలో టీడీపీ నేత నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ అబద్ధాలు బట్టబయలైయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సమీంలోని సర్వే నంబర్ 93లో 498 ఎకరాల భూమిపై శ్రీభరత్ అవాస్తవాలు చెప్పినట్టు సీఆర్డీఏ అధికారులు తేల్చారు. ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమకు కేటాయించినట్టు భరత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 2015, జూలై 15న జయంతిపురం భూములను విఎఫ్సీఎల్ ఫెర్టిలైజర్ కంపెనీకి కేటాయించినట్టు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. లోకేశ్ తోడల్లుడికి భూములు కేటాయించిన తర్వాత ఈ ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు 2015, సెప్టెంబర్ 22న సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. తన బంధువులు, బినామీలతో భూములు కొనిపించి వాటిని రాజధాని పరిధిలోకి వచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. రాజధాని భూముల్లో వందశాతం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆధారాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేరుతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బట్టబయలు చేసిన విషయం విదితమే. (చదవండి: సుజనా.. భూ ఖజానా) -
వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే
సాక్షి, అమరావతి: రాజధాని భూముల్లో వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వీటన్నిటిపై ప్రభుత్వం విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వరదలు వస్తే రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందని అనగానే టీడీపీ నేతలు ఉలిక్కిపడి రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారంటూ దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. ‘సుజనా చౌదరి రాజధానిలో సెంటు భూమి లేదంటున్నారు. సుజనాకు ఉన్న 120 కంపెనీల్లో కళింగ గ్రీన్టెక్ కంపెనీ డైరెక్టర్ జతిన్కుమార్కు చందర్లపాడు గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉండటం అవాస్తవమా? సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్యకు వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉండటం నిజం కాదా? బాలకృష్ణ వియ్యంకుడు (నారా లోకేష్ తోడల్లుడి తండ్రి) రామారావుకి 493 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా ఎకరం రూ.లక్ష చొప్పున ఇచ్చి ఆ తర్వాత ఆ భూములను సీఆర్డీఏ పరిధిలోకి తేవడం నిజం కాదా? ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా?’ అని బొత్స ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు డీకేటీ భూములను పట్టాలుగా మార్చి రాజధానికి ఇవ్వవచ్చని జీవో ఇస్తే వాటిని తీసుకుని ల్యాండ్పూలింగ్కు ఇచ్చారని, ఓ వ్యక్తి పేరిట 25 వేల చదరపు గజాలు ఉన్నట్టు తేలిందని దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనక ఇంకేమంటారో చంద్రబాబే చెప్పాలని బొత్స వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలని నిలదీశారు. ‘రాజధానిలో అభివృద్ధి ఆగిపోయిందని, రియల్ ఎస్టేట్ దెబ్బ తిందని చంద్రబాబు చెబుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు ఇలా పలు పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న విషయం గమనించాలి. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది వినకుండా నారాయణ కమిటీ చెప్పినట్టు చేశారు’ అని బొత్స పేర్కొన్నారు. మెట్రో రైలు డీపీఆర్ అందింది.. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నివేదిక వచ్చిందని, మంగళవారం దీన్ని పరిశీలించామని బొత్స తెలిపారు. 67 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.24,460 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారన్నారు. సాధారణంగా రోడ్డుపై నిర్మిస్తే కిలోమీటరుకు రూ.169 కోట్లు వ్యయం అయితే భూగర్భ లైనుకు రూ.490 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారన్నారు. అమరావతిలో భూగర్భ రైలు మార్గం ఎందుకో అర్థం కావడం లేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని రైతులందరికీ కౌలు చెల్లింపులు రాజధానికి భూములిచ్చిన రైతులందరికీ రెండు రోజుల్లో కౌలు చెల్లిస్తామని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ఈ విషయం చెప్పామని, రైతులకు ఇబ్బంది కలగకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారని, త్వరలోనే రూ.187.40 కోట్ల కౌలు పరిహారం చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుకు చీమకుట్టినా సహించదన్నారు. ప్రతి సంవత్సరం జూలై నుంచి ఆగస్టు లేదా సెప్టెంబర్లో భూములిచ్చిన రైతులకు కౌలు ఇస్తామన్నారు. కృష్ణా వరదలపై పెయిడ్ ఆర్టిస్టులతో బురద చల్లేందుకు ప్రయత్నించి చంద్రబాబు అభాసుపాలయ్యారని బొత్స పేర్కొన్నారు. -
అమరావతికి పార్లమెంట్ ఆమోదం లేదు!
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం నియమించిన శివ రామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పటికీ దానికి పార్లమెంట్ ఆమోదం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం మాత్రమే ఉందని పలువురు వక్తలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరాన్ని నిర్మించాలనే భ్రమలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లూ కొట్టుమిట్టాడి.. దాని చుట్టూనే పరిభ్రమించిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి.. చంద్రబాబు చెప్పినట్టు ఏ రైతూ సొంతంగా తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని, మెడ మీద కత్తి పెట్టి భూములు లాక్కున్నారన్నారు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్– అభివృద్ధి– సమస్యలపై ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఆంధ్రప్రదేశ్’ విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ముగింపు రోజైన సోమవారం అమరావతి, రాజధాని అభివృద్ధిపై సదస్సు జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సెస్ (హైదరాబాద్)కు చెందిన డాక్టర్ సి.రామచంద్రయ్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పురేంద్ర ప్రసాద్, వి.రాజగోపాల్, సామాజిక సేవా కార్యకర్తలు అనుమోలు గాంధీ, ఎం.శేషగిరిరావు, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, తదితరులు ప్రసంగించారు. చంద్రబాబు తలపెట్టిన భూసమీకరణ పెద్ద బోగస్ అని, సీఆర్డీఏ ప్రాంతంలో గత ఐదేళ్లు మిలటరీ తరహా పాలన సాగిందని శేషగిరిరావు ఆరోపించారు. చివరకు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకున్నారన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి తన అనుచరులు భూములు కొనుక్కునేలా చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయించారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సీఆర్డీఏ పనికి వచ్చిందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయని గాంధీ ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని అవుట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పురేంద్రప్రసాద్ చెప్పారు. ప్రతి గ్రామాన్ని పోలీసు క్యాంపుగా మార్చి ప్రజలను భయపెట్టి భూముల్ని గుంజుకున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. మాజీ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ ప్రజలకు ఏది కావాలో దాన్నే పాలకులు చేపడితే సత్ఫలితాలు వస్తాయన్నారు. -
కన్సల్టెన్సీలకు స్వస్తి
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో కన్సల్టెన్సీల ఇష్టారాజ్యానికి తెరపడింది. ఏ విభాగంలోనూ కన్సల్టెన్సీలు ఇకపై కొనసాగరాదని సీఆర్డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్)లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 30 కన్సల్టెన్సీల సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జూలై 31వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దుబారా లెక్కలపై ఆరా తీయటంతో.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దల సూచనలకు అనుగుణంగా రాజధానిలో ప్రతి పనికి సీఆర్డీఏ, ఏడీసీలు ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించుకుని కోట్ల రూపాయలు ముట్టచెప్పాయి. అవసరం లేకున్నా విదేశీ, స్వదేశీ కన్సల్టెన్సీలను ఎడాపెడా నియమించాయి. ఈ భారం రూ.460 కోట్లకుపైనే ఉండగా గతంలోనే రూ.329 కోట్లను చెల్లించారు. కన్సల్టెన్సీలు ఇప్పటికీ సీఆర్డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో తిష్ట వేసి పని లేకపోయినా పెత్తనం చలాయిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దుబారా వ్యయాలపై దృష్టి సారించడంతో కన్సల్టెన్సీల లెక్కలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో నియమించిన కన్సల్టెన్సీలు, పనులు, ఖర్చుల గురించి ఉన్నతాధికారుల కమిటీ ఇటీవలే నివేదిక అందచేసింది. దీని ప్రకారం 30 కన్సల్టెన్సీలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల 31వ తేదీన సమాచారం ఇచ్చారు. తక్షణం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటే సమాచారం ఇస్తామని తెలిపారు. అన్ని విభాగాల డైరెక్టర్లకు నియమించిన కన్సల్టెన్సీలు, చేపట్టిన పని, చెల్లించిన సొమ్ము, ప్రస్తుతం వాటి అవసరం ఉందా? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కన్సల్టెన్సీలకు కోట్లకు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నిపుణులైన అధికారులతోపాటు దేశంలో నైపుణ్యం కలిగిన పలు సంస్థలున్నా పట్టించుకోకుండా టీడీపీ హయాంలో భారీ వ్యయంతో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించారు. మొత్తం 70కిపైగా కన్సల్టెన్సీలను నియమించగా సీఆర్డీఏలో 50, ఏడీసీలో 20 వరకు కన్సల్టెన్సీలున్నాయి. పరిపాలనా నగరం డిజైన్ల పేరుతో హడావుడి చేసిన నార్మన్ పోస్టర్ సంస్థకు సీఆర్డీఏ ద్వారా రూ.112 కోట్లను చెల్లించారు. హఫీజ్ కాంట్రాక్టర్ను పార్టనర్గా నియమించుకునేలా లండన్ కంపెనీ నార్మన్ ఫోస్టర్పై ఒత్తిడి తెచ్చి అదనంగా రూ.60.72 కోట్లు ముట్టచెప్పారు. ఈ రెండు సంస్థలు అందచేసిన రంగుల బొమ్మల కోసమే రూ.173.31 కోట్లు వ్యయం చేశారు. పెత్తనం అంతా వాటిదే! ఒకపక్క వందల సంఖ్యలో కొత్తగా ఇంజనీర్ల నియామకం మరోపక్క డిప్యుటేషన్లపై వివిధ శాఖల నుంచి పనిచేయించుకుంటూనే ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో గత సర్కారు ప్రతి పనికి మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించింది. ఈ నిర్వహణ సంస్థలకే రూ.100 కోట్లకుపైనే చెల్లించింది. రాజధాని ప్రకటనకు ముందే మాస్టర్ప్లాన్ కోసం సింగపూర్కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్ను కన్సల్టెన్సీగా నియమించుకున్న టీడీపీ సర్కారు రూ.14.8 కోట్లు చెల్లించింది. బ్లూ కన్సల్టెంట్, గ్రీన్ కన్సల్టెంట్, రాజధాని స్ట్రాటజీ ప్రోగ్రాంను తయారు చేసేందుకు రూ.29 కోట్లు చెల్లించి మెకన్సీని నియమించింది. సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయానికి సలహాలిచ్చేందుకు కూడా ఒక కన్సల్టెంట్ను నియమించుకున్నారు. సీఆర్డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల కంటే ఈ కన్సల్టెంట్ల హడావుడే ఎక్కువగా ఉంది. -
గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..
సాక్షి, అమరావతి: కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్ నెంబర్ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్ నెంబర్ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది. అంతేకాకుండా ఈ భవంతిపైన ఆర్సీసీ రూఫ్తో మరో అంతస్తు, నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) నుంచి రాజధాని ప్రాంతాన్ని మినహాయించామని వివరించింది. అందువల్ల గతంలో సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురైనట్లేనని పేర్కొంది. పర్యావరణ, నదీ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు విరుద్ధంగా ఏ స్థానిక సంస్థలకు కూడా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. కరకట్ట సమీపంలోని నిర్మాణాలు కృష్ణానది సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని వల్ల కృత్రిమ వరద ఏర్పడే పరిస్థితి వచ్చిందని తెలిపింది. కృష్ణానదికి 100 మీటర్ల మేర బఫర్ జోన్ను ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలను తూచా తప్పక అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందంది. హైకోర్టును ఆశ్రయించిన గోకరాజు కృష్ణానది, కరకట్ట సమీపంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే భవంతులు నిర్మించారని, వీటిని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసులను కొట్టేయడంతోపాటు, తమ భవంతి విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీఆర్డీఏ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీఆర్డీఏ డైరెక్టర్ కోనేరు నాగసుందరి రెండు కౌంటర్లు దాఖలు చేశారు. ‘చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పిటిషనర్ వంటి వ్యక్తుల విషయంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదు. పర్యావరణానికి జరుగుతున్న హాని విషయంలో ఏ రకంగానూ రాజీ పడకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. మేం లేవనెత్తిన ఉల్లంఘనలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే పిటిషనర్ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ అని, ఆయన కుమారుడు సింగపూర్లో ఉన్నారని, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కావాలంటూ ఈ నెల 16న పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. అయితే ఆ గడువు లోపు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా పిటిషనర్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయండి’ అని నాగసుందరి తన కౌంటర్లలో కోర్టును అభ్యర్థించారు. -
‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్ ఎవరో’
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిందని గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శలు కురిపించారు. తుగ్లక్ పాలన అంటూ పిచ్చి కూతలు కూస్తున్న లోకేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ పాలనకు అసలైన నిదర్శనం చంద్రబాబు పాలనే అని చురకలంటిచారు. పాలనా పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మనసులు చూరగొన్నారని కొనియాడారు. ఐదేళ్ల తుగ్లక్ పాలన అనంతరం ఇప్పుడు రాజన్న పరిపాలన సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో అవినీతి.. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పిన బాబు అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని జోగిరమేష్ ఆరోపించారు. మొదట నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి తర్వాత అమరావతిని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. అనుయాయులు, పచ్చ పత్రికలతో విస్తృత ప్రచారం చేయించిన బాబు నూజివీడుల భూములు కొనేలా చేసి చాలామందిని మోసం చేశారని అన్నారు. ఇళ్లకు భూములు ఇవ్వని రైతుల ఇళ్లకు అధికారులు, మంత్రులను పంపి భయభ్రాంతులకు గురిచేశాడని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు రైతులకు ఏం లబ్ది చేకూర్చారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణమే భ్రాంతి అన్నట్టుగా మార్చి భ్రమరావతిగా చూపెట్టారని ఎద్దేవా చేశారు. విఠలాచార్య సినిమాల్లో సెట్టింగుల్లా.. బాహుబలి గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా ప్రచార ఆర్భాటాలే తప్ప ఐదేళ్ల పాలనలో కనీసం రాజధానికి సరైన రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. రుణం ఇస్తామని వాళ్లు చెప్పలేదు.. ‘అమరావతి నిర్మాణ విషయంలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయని, సామాజిక న్యాయం జరగలేదని ప్రపంచబ్యాంకు జూన్ 12న ఓ లెటర్ను వారి వెబ్సైట్లో పెట్టింది. రాజధాని నిర్మాణం నుంచి తప్పుకుంటున్నామని జూలై 17 స్పష్టం చేసింది. అప్పటికీ మా ప్రభుత్వం వచ్చి 12 రోజులే అవుతోంది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంతటి దారుణం ఉంటుందా. మమ్మల్ని విమర్శించే ముందు లోకేష్ ఒకటి గుర్తుంచుకోవాలి. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని నడిబొడ్డున ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. మా పార్టీ కార్యాలయం కూడా రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు ఉందా. కనీసం పార్టీ కార్యాలయమైనా ఉందా. మీ దరిద్రంతోనే ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసింది’అని చురకలంటించారు. -
‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’
సాక్షి, అమరావతి : చంద్రబాబు దుర్మార్గాల వల్లనే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపారని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూ రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు ప్రపంచ బ్యాంకు దృష్టి తీసుకెళ్లారని వెల్లడించారు. కౌలు రైతులు, రైతులను టీడీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిన కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. తమ భూములు కాజేస్తున్నారని దళితులు ప్రపంచబ్యాంకుకు సమాచారమిచ్చారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. -
ఆ ఉత్తర్వులను రద్దు చేయండి
సాక్షి, అమరావతి : కృష్ణానది కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్ పేరుతో నిర్మించిన కట్టడం కూల్చివేత నిమిత్తం తాము జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సీఆర్డీఏ కమిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ అప్పీల్పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ‘ఏదైనా వ్యవహారంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే దాఖలు చేసే వ్యాజ్యాల విషయంలో ఉన్నత న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. నోటీసులు జారీ చేసిన అభ్యంతరాలు ఆహ్వానించిన దశలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పిటిషనర్ సీఆర్డీఏ చట్ట ప్రకారం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత పరిధిలో నిర్మించిన కట్టడం న్యాయ సమ్మతమైందని పిటిషనర్ చూపలేకపోయారు. రాజధాని ప్రాంత పరిధిలో అభివద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్డీఏకు అన్నీ అధికారాలున్నాయి. నదికి 100 మీటర్లలోపు నిర్మాణాలు చేపట్టడంపై స్పష్టమైన నిషేధం ఉంది. 2007లో ఈ మేర జీవో కూడా జారీ అయింది. పిటిషనర్ ఏ కట్టడం గురించి అయితే చెబుతున్నారో, ఆ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి నిర్మించిన అక్రమ కట్టడాలకు క్రమబద్ధీకరణను సాకుగా చూపడం తగదు. ఈ విషయాలన్నింటినీ సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ఏ కోణంలో చూసినా కూడా సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట విరుద్ధం. అందువల్ల వాటిని రద్దు చేయండి.’ అని సీఆర్డీఏ కమిషనర్ తన అప్పీల్లో పేర్కొన్నారు. ఈ అప్పీల్ గురించి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సోమవారం ఉదయం ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ అప్పీల్పై మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. రైతు సంఘం భవనం పేరుతో నిర్మించిన తమ కట్టడాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ, దానిని తొలగించే నిమిత్తం సీఆర్డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గత వారం విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు, సీఆర్డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: సీఆర్డీఏపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈ సమావేశం ప్రారంభమైంది. సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ రెండోసారి సీఆర్డీఏ సమీక్షా సమావేశం జరుపుతున్నారు. జూన్ 26న తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. -
స్విమ్మింగ్పూల్కు అనుమతి.. భారీ భవన నిర్మాణం
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం సక్రమమేనంటూ టీడీపీ నాయకులు చూపిస్తున్న అనుమతి పత్రాలేవీ చెల్లవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు చూపించే అనుమతులు కరకట్ట లోపల భవనాలు నిర్మించేందుకు వీలుగా లేవని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ అనుమతి తీసుకోకుండా మిగిలిన ఎన్ని అనుమతులు తీసుకున్నా అవి లెక్కలోకి రావని చెబుతున్నారు. తమ అధినేత నివాసం ఉంటున్న భవనానికి పంచాయతీ అనుమతి ఉందని, నీటి పారుదల శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చిందని, రూ.18 లక్షల నాలా పన్ను కట్టామని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పలు పత్రాలు చూపిస్తున్న విషయం తెలిసిందే. 2007లో ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకున్న తర్వాతే భవనాలు నిర్మించినట్లు చెబుతున్నా, వాస్తవానికి పంచాయతీ రికార్డుల్లో అది నమోదు కాలేదని సమాచారం. నిజంగా అనుమతి తీసుకుని ఉంటే పంచాయతీ రికార్డుల్లో నమోదై ఉండేదని, ఈ పరిస్థితిలో వారు చూపిస్తున్న అనుమతి పత్రం నకిలీదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఉండవల్లి పంచాయతీని సీఆర్డీఏ అధికారికంగా సమాచారం కోరే అవకాశం ఉంది. నాలా పన్ను కన్వర్షన్ వరకే.. భవన నిర్మాణానికి కాదు వ్యవసాయ భూమిని నివాస యోగ్యంగా మార్చేందుకు కన్వర్షన్ పన్ను కట్టినా, అది భవన నిర్మాణానికి సరిపోదని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ ఇచ్చిన ఎన్ఓసీ కూడా భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతి కాదని, నదీ తీరంలో తాత్కాలికంగా పరిమితమైన నిర్మాణాలకు అభ్యంతరం లేదని ఇవ్వడం వరకేనని చెబుతున్నారు. భవన యజమాని లింగమనేని రమేష్, టీడీపీ నాయకులు చూపిస్తున్న పంచాయతీ అనుమతి కూడా గతంలో వారిచ్చిన వివరణ ప్రకారం స్విమ్మింగ్ పూల్, దుస్తులు మార్చుకునే గదికి మాత్రమేనని చెబుతున్నారు. రికార్డుల్లో నమోదవ్వని పంచాయతీ అనుమతిని పరిగణనలోకి తీసుకున్నా, అది దుస్తులు మార్చుకునే గది వరకే తప్ప జీ+2 నిర్మాణం, అదీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నివసించే భవనానికి ఎలా సరిపోతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ పంచాయతీ అనుమతి ఉందనుకున్నా, జీ+2 భవనంతో పాటు హెలీ ప్యాడ్, పది షెడ్లు కట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఇదీ సంగతి ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు ఉండవల్లి పరిధిలోని 250, 254, 272, 274, 290/1 సర్వే నంబర్లలో లింగమనేని ఎస్టేట్స్ అధినేత రమేష్కు 1.31 ఎకరాల భూమి ఉంది. 2007 మే పదో తేదీన ఈ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నీటి పారుదల శాఖ నుంచి ఆయన నిరభ్యంతర పత్రం తీసుకున్నారు. కానీ స్విమ్మింగ్ పూల్ పేరుతో జీ+1 భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత రెండో అంతస్తు కూడా నిర్మించుకున్నారు. టీడీపీ హయాంలో జలవనరుల మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 22 భవనాలపై చర్యలు తీసుకుంటామని 2015 మార్చి నెలలో ప్రకటించారు. అందులో ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న భవనం కూడా ఉంది. బిల్డింగ్ ప్లాన్ నిబంధనలు, నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను ఎందుకు కూల్చరాదో చెప్పాలంటూ అప్పట్లో తాడేపల్లి తహశీల్దార్ నోటీసులిచ్చారు. నోటీసులు ఇచ్చిన కొద్దిరోజులకే చంద్రబాబు ఆ అక్రమ భవనంలోకి మకాం మార్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలనూ సైతం పట్టించుకోలేదు. రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేసి ఆ భవనాన్ని ఆధునీకరించడంతోపాటు రూ.3.30 కోట్లతో ప్రత్యేకంగా 33 కేవీ సబ్ స్టేషన్, కొత్త రోడ్ల నిర్మాణం, ప్రత్యేకంగా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ భవనం అప్పగించడానికి ప్రతిఫలంగా చంద్రబాబు.. దాని యజమాని అయిన లింగమనేని రమేష్కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న లింగమనేనికి చెందిన రెయిన్ ట్రీ పార్కులో 700 ఫ్లాట్లను అధికారుల నివాసం కోసం అద్దెకు తీసుకుని ఒక్కో ప్లాటుకు నెలకు రూ.40 వేలు చొప్పున అద్దె చెల్లించారు. రాజధాని పేరుతో సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్లో లింగమనేని గ్రూపు అడ్డగోలుగా సంపాదించింది. పథకం ప్రకారం కాజ, కంతేరు గ్రామాల్లో 804 ఎకరాలను తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటిని ఎస్టేట్స్గా మార్చారు. ఈ భూములు భూ సమీకరణ పరిధిలోకి రాకుండా తప్పించి భారీగా లబ్ధి పొందారు. ఈ ఎస్టేట్స్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు వాటాలున్నట్లు ఆరోపణలున్నాయి. కాజ గ్రామంలో సున్నపురాయి నిక్షేపాలున్న 300 ఎకరాలను రైతుల నుంచి లీజుకు తీసుకున్న లింగమనేని రమేష్ టీడీపీ అధికారంలో ఉండగా వాటిని తన సొంతం చేసుకున్నారు. మరో పది భవనాలకు నోటీసులు సీఆర్డీఏ అధికారులు శనివారం కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన మరో పది భవనాలకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం పది భవనాలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. శనివారం తులసి గార్డెన్స్, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్, సాగర్ వాటర్ ప్లాంట్, సత్యానంద ఆశ్రమం, శైవ క్షేత్రం తదితర భవనాల యజమానులకు నోటీసులు అందించారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన ప్రధాన అతిథి గృహాన్ని పరిశీలించిన తర్వాత నోటీసు ఇవ్వాలనుకుంటున్నారు. అందులో నాలుగు భవనాలుండగా ఒక దానికి గతంలో పరిమితమైన అనుమతి చూపిస్తున్నారని, పూర్తిగా పరిశీలించాక నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నారు. సోమవారం మిగిలిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వనున్నారు.