
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటలు, కాలినడకన భక్తులకు 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 42 కంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీ లేవు
రూ.50 గదులు - ఖాళీ లేవు
రూ.100 గదులు- ఖాళీ లేవు
రూ.500 గదులు- ఖాళీ లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 27 ఖాళీ
సహస్ర దీపాలంకరణసేవ - 101 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - 78 ఖాళీగా ఉన్నాయి.