
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన భక్తుల సంఖ్య మంగళవారం ఉదయం స్వల్పంగా ఉంది. చలి ఎక్కువగా ఉండడంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుని 87,477 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.