దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపుల పర్వం | Digvijay Singh appeasement | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపుల పర్వం

Mar 13 2014 4:39 PM | Updated on Aug 14 2018 3:55 PM

దిగ్విజయ్ సింగ్ - Sakshi

దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపు పర్వం మొదలైంది.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ,  పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపు పర్వం మొదలైంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈరోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు.  ఆ తరువాత ఆయన పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానా రెడ్డిలను కూడా కలుస్తారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశం గాంధీభవన్లో  ప్రారంభమైంది.  దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా టిఆర్ఎస్తో పొత్తు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. దిగ్విజయ్ సింగ్ మార్గదర్శకాలను సూచిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement