కౌలు రైతు ఆత్మహత్య
Published Fri, Dec 25 2015 2:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
గుత్తి: అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్మ చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉబిచర్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాముడు(44) పంట కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement