తేనెటీగల దాడిలో రైతు మృతి | Farmer killed in the attack of bees | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో రైతు మృతి

Published Wed, Jan 6 2016 7:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Farmer killed in the attack of bees

తేనెటీగల కుట్టటంతో తీవ్రంగా గాయపడిన రైతు మరణించాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరివిచింతలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగన్న బుధవారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లాడు. మోటారు పనిచేయకపోవటంతో దానిని బావి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బావిలోని తుట్టెలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా గంగన్నపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల రైతులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement