నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు.
విశాఖ: నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని హుకుంపేట మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో గురువారం చోటుచేసుకుంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.