ముప్పాళ్ల : బంగారానికి మెరుగుపెడతామని చెప్పి బంగారం దోచుకున్న సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి బంగారం మెరుగు పెడతామనడంతో తన దగ్గర ఉన్న 8 సవర్ల బంగారాన్ని ఇచ్చానని..చూసుకునే లోపలే దుండగులు పరారైనట్టు బాధితురాలు సరసమ్మ తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బంగారానికి మెరుగుపెడతామని..
Published Fri, Mar 11 2016 1:58 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement