
'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి
గుంటూరు : దేశం మొత్తం హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంటే ఆ కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. అయినా ఆ కుటుంబం పెద్ద మనసు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన తమ ఆత్మీయుడి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. రెండు రోజులు క్రితం విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో అతని గుండె, లివర్, కాలేయం, కళ్లు, కిడ్నీలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆ యువకుడి గుండెను అమర్చనున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.