కాకినాడ టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా కుండపోతగా వర్షం పడింది. దీంతో కాకినాడ మెయిన్ రోడ్డులో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.
నగరంలోని జగన్నాయకపూర్, ట్రెజరీకాలనీ, గోడారిగుంట, జె. రామారావుపేట తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాకినాడలో భారీ వర్షం
Published Sun, Aug 16 2015 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement