kakinada
-
హోలీ వేళ కాకినాడలో విషాదం.. చదవు రాకపోతే చంపేస్తారా? నాన్న..
కాకినాడ రూరల్: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్లోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్(7) ఒకటో తరగతి, నిఖిల్(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్లో తన ప్లాట్ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతaమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్లో చంద్రకిశోర్ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్ కనిపించాడు. పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్కుమార్ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్ బెడ్రూంలో సూసైడ్ నోట్ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు. -
కాకినాడలో సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్న నిరసన
-
సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జనసేన నాయకుడు వీరంగం
-
వాటర్ బాటిల్పై రూ.7 అదనం.. 27 లక్షల ఫైన్ విధించిన కన్జ్యూమర్ కోర్టు
సాక్షి,అమరావతి : కాకినాడ వినియోగదారులు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఓ కస్టమర్ నుంచి ఒక్కో వాటర్ బాటిల్పై అదనంగా రూ.7వసూలు చేసినందుకు గాను హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్కు రూ.27లక్షల 27వేలు పెనాల్టీ విధించింది.వివరాల్లోకి వెళితే.. 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్లోని ఓ హోటల్లో ఓ మహిళ మూడు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. అయితే, తాను కొనుగోలు చేసిన ఒక్కో వాటర్ బాటిల్ ధరపై అదనంగా రూ.7వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ మహిళ సదరు హోటల్ నిర్వాకంపై కాకినాడ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు.మహిళ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ కాకినాడ వినియోదారుల కోర్టు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో హోటల్పై కాకినాడ వినియోగదారుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటల్ యాజమాన్యానికి రూ.27లక్షల 27వేలు ఫైన్ విధించింది. రూ.27 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, ఫిర్యాదు చేసిన మహిళకు రూ.25000, కోర్టుకి రూ2000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
కాకినాడ బాలాజీ ఎక్స్పోర్ట్లో భారీ పేలుడు
-
తునిలో రెడ్బుక్ రాజ్యాంగం.. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు
కాకినాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికే సై అంటోంది. వేరే పార్టీల నాయకులను బెదిరించడంతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి టీడీపీలో చేర్చుకుంటోంది. తాజాగా తునిలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించడంతో పాటు అక్రమ కేసులు బనాయించింది. దాంతో వారు టీడీపీలో చేరకతప్పలేదు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవగా, ఇప్పుడు తాజాగా టీడీపీ రాజకీయ కుట్రలకు తెరలేపింది. టీడీపీకి సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేరేలా కుట్రలు చేశారు యనమల.ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించిన టీడీపీ.. చైర్మన్ సుధాబాలు రాజీనామా చేసేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. ఈ క్రమంలోనే సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. పోలీసుల సహకారంతో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి.. వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. -
కాకినాడ జిల్లా బూరుపూడిలో మందుబాబు వీరంగం
-
వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు
-
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.రైలు కిందపడి..శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
కూటమి కార్యకర్త హల్చల్.. ముద్రగడ ఇంటిపై దాడి
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్చల్ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్లో ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను చీఫ్గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్లాల్ను డీజీపీ తన చాంబర్కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్లాల్ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
సెల్ఫోన్ మింగి మహిళ మృతి
కాకినాడ క్రైం: సెల్ఫోన్ మింగిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చేరింది. అక్కడ తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈసోఫాగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బ తింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్కు సిఫారసు చేశారు. రమ్య స్మృతిని శఽనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సెల్ఫోన్ తొలగింపు ప్రక్రియలో రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు చేసిన పొరపాటు వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి విలపించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడయ్యే వరకూ అక్కడే ఉంచాలని కోరినా రాజమహేంద్రవరం జీజీహెచ్ అధికారులు బలవంతంగా కాకినాడకు తరలించారని ఆరోపించాడు. అక్కడి నుంచి కాకినాడ చేరేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ వ్యవధిలో రమ్య ఆరోగ్య స్థితి మరింత క్షీణించి మరణానికి దారి తీసిందని వాపోయాడు.భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం! -
గుండాట పేరుతో గుండు కొట్టేశారట
-
పవన్ పర్యటన.. జనసేన మహిళా నేతకు అవమానం!
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చల్లా లక్ష్మీని బయటకు పంపారు. దీంతో, తోపులాట జరిగి ఆమె కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అనంతరం, ఆమె విలవిల్లాడిపోయింది.సంక్రాంతి సందర్బంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోకులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, స్థానికులు వచ్చారు. అలాగే, జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అనుమతి లేదంటూ చల్లా లక్ష్మీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు. దీంతో, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలవిల్లాడిపోయారు.ఈ నేపథ్యంలో జనసేన నేతలు, పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, గాయపడిన చల్లా లక్ష్మీ అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది. పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వీరంతా.. పవన్ కళ్యాణ్ను కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గత ఎన్నికల్లో మండుటెండల్ని లెక్క చేయకుండా.. కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పని చేశామని వీర మహిళలు గుర్తు చేశారు. ఇద్దరు నేతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. -
సీజ్ ద షిప్! అంతా తూచ్..!
-
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025 -
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. నేటి నుంచి బుకింగ్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు.కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్ -కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.హైదరాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే! -
జనసేన ఎమ్మెల్యేపై ప్రజల తిరుగుబాటు
-
పుంగనూరు గిత్త దూడ ఎత్తు 16 అంగుళాలు
కాకినాడ జిల్లా, కరప మండలం జెడ్. భావారం గ్రామంలో పుంగనూరు జాతి గిత్త దూడ 16 అంగుళాల ఎత్తుతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మరీ పొట్టిగా ఉండటంతో గ్రామంలోని రైతులు వింతగా చూస్తున్నారు. పుంగనూరు ఆవు బుధవారం ఉదయం ఈ దూడకు జన్మనిచ్చిందని ఆ గ్రామానికి చెందిన రైతు కంచెర్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 36 అంగుళాల పొడవు, 4 కిలోల బరువు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. – కరపరైతులకు ‘జల’గండంవరుసగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామ రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీరి పంట భూములు బాహుదానదికి అవతల ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బాహుదా గెడ్డలోకి నీరు చేరడంతో కోత కోసిన ధాన్యం ఓవులను ఇంటికి తెచ్చేందుకు రైతులు పీకల్లోతు నీటిలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం మినీ వంతెన నిర్మిస్తేనే ‘జలగండం’ తప్పుతుందని అన్నదాతలు చెబుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్‘మా రోడ్డు చూడండి..’తమ రోడ్డు దుస్థితిని చూడాలంటూ విజయనగరం జిల్లా వంగర మండలం భాగెంపేట యువకులు రోడ్డుకోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరసాడ జంక్షన్ నుంచి భాగెంపేట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును డ్రోన్ కెమెరాలో బుధవారం చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీలయ్యవలస, భాగెంపేట, పటువర్ధనం, శ్రీహరిపురం, దేవకివాడ ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలకు ఈ గోతులమయమైన రోడ్డే గతని, అధికారులు సమస్యపై స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బస్సు సర్వీసును నిలిపివేశారని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – వంగరచదవండి: బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..! -
‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైప్ నేపథ్యంలో .. ఈ ఎపిసోడ్లో నెక్ట్స్ ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ‘‘ స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తాం. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. .. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్కు అనుమతిస్తాం. .. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్పోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్ను సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు’’ అని కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గత నెల 29న అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యపు అక్రమ రవాణా షిప్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో.. తనను ఎవరూ పట్టించుకోలేదని అధికార యంత్రాంగంపైనా ఆయన చిర్రుబుర్రులాడారు కూడా.ఇదీ చదవండి: అందులో భాగంగానే తెరపైకి సీజ్ ద షిప్! -
‘కుడా’ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో ‘కూడా’(కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. పరిమితికి మించి స్టేజ్పైకి ఎక్కవ మంది చేరడంతో కుప్పకూలింది. వేదిక కూలడంతో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కిందపడిపోయారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత యథావిధిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. -
కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి
-
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా: Kanna Babu
-
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
-
వైఎస్సార్సీపీలో ఉంటే ఆస్తులు కొనుక్కోకూడదా?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ, కాపులను అణివేసే ధోరణీ జరుగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత వైఎస్ జగన్ హయంలో ధాన్యం ధర రూ.2వేలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.1400 లకే రైతులు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రింబయిర్స్మెంట్ చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రమైన ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు శుక్రవారం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాకినాడ సెజ్లో తాను ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్ మీద హెచ్చు రేటు పెట్టి భూములను రైతుల నుంచి కొనుక్కున్నానని చెప్పారు. 1940 నుంచి తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందన్నారు. తన దగ్గర డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూములు కొన్నుకున్నట్లు పేర్కొన్నారు.‘చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదేదో తప్పులా అసత్య ప్రచారాలు చేశాయి. ఆ మధ్య చంద్రబాబు భూములు కొనుక్కున్నారు. ఇటీవల పిఠాపురంలో 15 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ పది రోజుల కాలంలో రెండు ఆస్ధులను యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల కొన్న ఆస్ధులు ప్రజల దగ్గర దోచుకున్నవే అని నేను ఆరోపించగలను.ఒక్క బకెట్ బురద చల్లేస్తే సరిపోతుందా?. వైఎస్సార్సీపీలో ఉన్నాం కాబట్టి మేము ఆస్ధులు కొనుక్కోకూడదా?. యనమల మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ. రెండు లక్షలు లేకపోతే రైతు సంఘాలు ఖర్చులు బరించి గెలిపించాయి. ఇవాళ యనమల దగ్గర వేలాది కోట్ల ఆస్ధులు ఉన్నాయి. ఆ ఆస్ధులన్ని పేదలకు పంచిపెట్టాలి’ అని తెలిపారు -
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
-
సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారు?
-
MLA కొండబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్
-
పాఠాలు పక్కన పెట్టి పనిలో పిల్లలు
-
ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో పనులు
-
కాకినాడ జిల్లా పెద్దాపురంలో మైనర్ బాలిక కిడ్నాప్
-
Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
చీరమీను.. రుచి అదిరేను.. రేటెంతైనా తినాల్సిందే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు. కొలత ఏదైనా.. ధర ఎంతైనా.. మార్కెట్లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు. చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది. సెలీనియం అధికం సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు. అంగుళం నుంచి.. ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు. అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి. రేటెంతైనా తినాల్సిందే చాలా అరుదైన చీరమీను మార్కెట్లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం. – చిక్కాల నరసింహమూర్తి, యానాం ఆరోగ్యానికి దోహదం సీజనల్గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు. – కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు
-
ఆత్మహత్యకు యత్నించిన మహిళను పరామర్శించిన కన్నబాబు
-
కాకినాడ జిల్లాలో ప్రియురాలి మృతికి కారణమైన ప్రియుడు
-
కాకినాడ కాలింగ్
కాకినాడ కాలింగ్ అంటూ అక్కడికి వెళ్లనున్నారు పుష్పరాజ్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూ΄÷ందనున్న ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో పుష్పరాజ్గా అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీ వల్లీ ΄ాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుంది. కాగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో కొన్ని రోజులుగా ‘పుష్ప: ది రూల్’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను తీశారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కాకినాడలో జరగనుందని తెలిసింది. కానీ ఈ షెడ్యూల్ రెండు మూడు రోజుల్లోనే పూర్తవుతుందట. దీంతో ‘పుష్ప: ది రూల్’ సినిమా మేజర్ టాకీ ΄ార్టు పూర్తవుతుందని, ఆ తర్వాత మిగిలి ఉన్న ΄ాటల చిత్రీకరణను ΄్లాన్ చేశారని సమాచారం. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు కీలక ΄ాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
అవయవదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు
-
ఫలిస్తున్న వైఎస్ జగన్ కృషి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా చేసుకున్న ఒప్పందాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్ (గ్రీన్కో గ్రూప్ సంస్థ) రూ.12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు 2026లో ప్రారంభం కానున్నాయి.ఇందుకోసం 1,300 మెగావాట్ల కార్బన్ రహిత విద్యుత్, 4,500 మెగావాట్ల సోలార్, 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, ఇతర వనరులను కంపెనీ సమకూర్చుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే అమ్మోనియాను యూరప్కు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం యారా క్లీన్, కెప్పెల్, యూనిపర్ వంటి ప్రధాన సంస్థలతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందాలు సైతం ఇప్పటికే కుదుర్చుకుంది. మరోవైపు ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యాన్ని 2030 నాటికి ఛేదించేలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు గ్రీన్కో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. -
రైతులకు జగన్ భరోసా..
-
జగన్ పర్యటనలో జన సందోహం
-
నీటమునిగిన పంటలు పశువులకు మేత లేదు రైతుల ఆవేదన
-
TDP నేతల వేధింపులతో YSRCP నేత ఆత్మహత్య..
-
బెంగాలీ కూలీలకు అస్వస్థత
కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపటి ముండ్, ఫ్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు. పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు. వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాండ్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. -
రాక్ సిరామిక్స్ కార్మికుల ఆందోళన
-
ఏపీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉన్న ఏఎం గ్రీన్ (గతంలో గ్రీన్కో జీరోసీ) సంస్థకు చెందిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. యూరప్కు చెందిన పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహక సంస్థ సర్టిఫ్హై నుంచి ప్రీ-సర్టిఫికేషన్ పొందింది.పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫ్హై ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్-బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్బీఓ) ప్రీ-సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది. ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైంది.కార్బన్ రహిత ఇంధన వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఏఎం గ్రీన్ నిబద్ధతను ప్రీ-సర్టిఫికేషన్ నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగాలను డీకార్బోనేట్ చేయడానికి కీలకమైన ఈ దశలో రవాణా, పరిశ్రమలో సుస్థిరత కోసం ఈయూ నియంత్రణ ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీ సంసిద్ధతను ఈ ప్రీ-సర్టిఫికేషన్ ధ్రువీకరిస్తుంది. లాభదాయకమైన ఈయూ ఆర్ఎఫ్ఎన్బీఓ మార్కెట్ను సమర్థవంతంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫ్హై ప్రీ-సర్టిఫికేషన్ ప్రాముఖ్యతను ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి నొక్కి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఎం గ్రీన్ పాత్రను పునరుద్ఘాటించారు. 2030 నాటికి కాకినాడలో ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.మహేష్ కొల్లి, ఏఎం గ్రీన్ అధ్యక్షుడు -
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
-
కాకినాడ జిల్లాలో పోలింగ్ కోసం స్వరం సిద్ధం
-
కాకినాడ తీరం... విస్తరిస్తున్న పారిశ్రామికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్ఫీల్డ్’ నిర్మాణం తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్ఫీల్డ్ ఇన్ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది. పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. -
గోదారిలో గాలి కబుర్లే..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నవతరం రాజకీయాలకు ఆలంబన అని...ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన ఆలోచనలతో పురుడుపోసుకున్న పార్టీ అని..పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అగ్రాసనం వేస్తామనే అజెండాతో వచ్చిందీ జనసేన అని చెప్పడంతో నిజమనుకుని నమ్మి జనసేనలో పలువురు చేరారు. ఇన్నేళ్లూ ఆ పార్టీని భుజాన వేసుకుని కార్యక్రమాల కోసం లక్షలు తగలేసుకున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి అవన్నీ గాలి కబుర్లేనని తెలిసొచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ఆవేదన ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటముల ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖం చాటేసినప్పుడే ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని తేలిపోయిందని అప్పట్లోనే ఆ శ్రేణులు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును విభేదించాయి. అయినా, ఆయన పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి పొత్తులంటూ తలాతోకా లేని నిర్ణయాలతో పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేసేశారని మండి పడుతున్నారు.పొత్తుతో మరింత దిగజారి..టీడీపీతో పొత్తులో కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. చివరకు మూడింట ఒక వంతు సీట్ల కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిని సమర్థించుకుంటూ పవన్ కల్యాణ్..‘మన బలం మనం తెలుసుకోకుండా ఎన్ని అంటే అన్ని సీట్లు ఎలా అడిగేస్తాం? గత ఎన్నికల్లో కనీసం నన్ను కూడా గెలిపించుకోలేకపోయామని ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించారు.గోదావరి జిల్లాలపైనే ఆశలు!రాష్ట్రంలో కొద్దోగొప్పో పార్టీకి మనుగడ ఉందంటే అది గోదావరి జిల్లాల్లోనేనని ఆ పార్టీ నాయకుల మాట. దీనికి బలం చేకూర్చేలా ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సగం ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఆ పార్టీకి బలం, బలగం ఉందనే నమ్మకంతో ఈ జిల్లాల పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.కానీ పార్టీని వీడుతున్న నేతలు ఈ జిల్లాల నుంచే ఎందుకు ఎక్కువగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ జిల్లాల పైనే ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఏకైక స్థానం రాజోలులో మాత్రమే ఆ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా గెలుపొందింది. చివరకు రాష్ట్రంలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.ఆ పార్టీకి దూరంగా..పార్టీపై నమ్మకంతో ఇంత కాలం పార్టీని భుజాన మోసిన నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్యమైన నాయకులు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, ముమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట, ఆచంట ఇన్చార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, చేగొండి, అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్ వంటి సుమారు డజను మందికి పైగా నాయకులు జనసేనకు గుడ్బై చెప్పారు. సిద్ధాంతం మాట దేవుడెరుగు కనీసం పార్టీలో విలువనేదే లేకుండా చేసేశారని, ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఆ పార్టీలో కొనసాగలేమని అంటున్నారు.ఇవి చదవండి: ఓహెూ.. అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది! -
ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
-
‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
కాకినాడ: అధికారం అనే ఆకలితో చంద్రబాబు నాయుడు అలమటిస్తున్నాడని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసి... తన కుటుంబాన్ని వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ జత కడతారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెంకుటింటికి మరమత్తులు చేయించుకోలేదా? ఎమ్మెల్యే అయ్యేంత వరకూ పెంకుటింట్లో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉన్న పళంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు. చంద్రబాబు ఎలా అపర కోటీశ్వరుడు అయ్యారో ప్రజలకు చెప్పమని కోరుతున్నాను. అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నాడు.వయస్సు పెద్దదైంది... ఆబద్దాలు ఆపేయండి. జగన్కు ఓటేయద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. పేదల పెన్నిధి జగన్. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. కుమిలి కుమిలి చనిపోయేలా చేశారు. రాష్ట్రంలో మీరు స్వేచ్చగా తీరుగుతున్నారు. మీరు, మీ సతీమణీ,.కుమారుడుకోడలు..వియ్యంకుడు,దత్తపుత్రుడుస్వేచ్చగాతిరుగుతున్నారు.ఇంకేమి స్వేచ్చ కావాలో తమ సతిమణీని అడగండి.కాపు ఉద్యమాన్ని అణిచివేసి.. .నా కుటుంబాన్ని వేధించిన చంద్రబాబుతో పవన్ జతకడతారా? నన్ను ప్రేమించే జగన్తో నేను జతకట్టకూడదా?, పవన్ సినిమా డైలాగ్లు చదువుతున్నారు. సినిమాల్లోను..రాజకీయాల్లోను పవన్ నటించేస్తున్నారు. యువతను పాడు చేయకండి..వారి జీవితాలను నాశనం చేయకండి.యువత జీవితాల్లో చీకటి నింపకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని యువతను కోరుతున్నాను.సినిమా హీరోలతో తిరిగి మీ బంగారు భవిష్యతు పాడుచేసుకోకండి.మీ కుటుంబాలు నాశనం అవకుండా యువత మేలుకోండి. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
వైఎస్ జగన్ను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
వైఎస్ జగన్ను కలిసిన న్యాయవాదులు
-
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, కాకినాడ : లోక్సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై రేపు ఉదయం ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ప్రెస్మీట్ ఉంటుందని వైఎస్సార్సీపీ మీడియా సెల్ తెలిపింది. Keenly following the happenings at the Loksabha #NoConfidenceMotion. I will react on this episode at tomorrow’s 8:30am press conference. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2018 -
వైఎస్ జగన్ హామీలపై ప్రజల్లో హర్షం
-
భారీగా వైఎస్సార్సీపీలో చేరిక
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలు చాలా బావున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుని ఆశీర్వాదంతో జగన్ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిపించే విధంగా ఆయన పాలన ఉండబోతోందని మాకు సంపూర్ణ విశ్వాసం కలుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం’ అని కాకినాడకు చెందిన పలువురు బ్రాహ్మణ యువకులు పేర్కొన్నారు.ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 216వ రోజు గురువారం కాకినాడ పట్టణంలో కొనసాగింది. ఉదయం పలువురు బ్రాహ్మణ యువకులు జగన్ను కలుసుకున్నారు. నవరత్నాల పథకాలు తమను ఆకట్టుకున్నాయని, మీ పోరాట పటిమ చాలా నచ్చడంతో పార్టీలో చేరాలనుకుంటున్నామని తమ అభీష్టాన్ని వెల్లడించారు. దీంతో జగన్ సుమారు 50 మంది బ్రాహ్మణ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆకెళ్ల మురళీకృష్ణ, విఆర్జె దిలీప్కుమార్, భమిడిపాటి మూర్తి, ఎస్.విష్ణుమూర్తి, వేదుల మణితో పాటు పలువురు యువకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు అకుంఠిత దీక్షతో పని చేస్తామని చెప్పారు. తరలివచ్చిన జనం కాకినాడలో రెండవ రోజు కూడా జగన్కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం జననేత అడుగులో అడుగు వేశారు. కాకినాడలో బుధవారం జగన్ బ్రహ్మాండమైన బహిరంగ సభలో పాల్గొన్నాక రాత్రికి ఆదిత్య కళాశాల సెంటర్ వద్ద బస చేశారు. గురువారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించడానికి ముందే పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు శిబిరం వద్దకు తరలి వచ్చారు. ఆ పరిసరాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటంతో వాటిలో చదువుకునే విద్యార్థులు సైతం పెద్ద సంఖ్యలో జగన్ను కలవడానికి ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని వచ్చారు. పాదయాత్ర ప్రారంభం కాగానే రోడ్డుపై వందల సంఖ్యలో విద్యార్థినులు ఉత్సాహంతో జగన్ను కలిశారు. అక్కడి నుంచి మాధవనగర్ మీదుగా జేఎన్టీయూ సెంటర్ వరకూ దారి పొడవునా వేలాది మంది జగన్ వెంట నడిచారు. ఇక వినతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. కాకినాడకు చెందిన మత్స్యకారులు.. హార్బర్ కోసం కేటాయించిన భూమిని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు కబ్జా చేశారని జగన్కు వినతిపత్రం అంద జేశారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు జగన్కు వివరించారు. ఉప్పరలను ఆదుకోవాలని ఆ సంఘం నేతలు నక్కా మాధవరావు, లోవరాజు కోరారు. మా మద్దతు జగన్కే... కాకినాడ ముస్లిం నేతలు ఎండీఏ ఖౠన్, ఏకె జిలాని, కరీంఖాన్, అహ్మద్ ఖాన్ తదితరులు జగన్ను కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తేనే అందరి కష్టాలు తీరతాయని, అందుకే తాము పూర్తిగా మద్దతిస్తున్నామని ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో పేదలు అధికంగా ఉన్న ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగన్ అందరికీ ‘రోటి, కపడా ఔర్ మకాన్’ కల్పిస్తారన్న నమ్మకం ఉందన్నారు. దారిపొడవునా పలువురు ప్రజలు పింఛన్లు, రేషన్కార్డులు ఇవ్వడం లేదని, రేషన్లో కోత విధిస్తున్నారని అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదని జగన్ ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. అందరికీ ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు. టీడీపీ పాలనలో అన్నీ కష్టాలే అన్నా.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నిరుపేదలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా లాభం లేదు. రేషన్ షాపుల్లో గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటి రెండు సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదు. కొంతమందికి సరుకులు ఇవ్వకుండానే వేలిముద్రలు వేయించుకుని పంపిచేస్తున్నా పట్టించుకునే వారు లేరు. – వైఎస్ జగన్తో డానెల బేబి, కాకినాడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగులు మరింత బాధ్యతతో పని చేస్తారు. ఈ దిశగా ఇప్పటికే మీరు చేసిన ప్రకటనపై ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారికి క్యాడర్తో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలి. – వైఎస్ జగన్తో డి.రామ్మోహన్రావు జగనన్న వస్తేనే అందరికీ న్యాయం రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. నేను 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నాను. పాదయాత్ర అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. ఇప్పుడు వైఎస్ మాదిరిగా జగనన్న కూడా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలందరికీ మేలు చేస్తారనే నమ్మకం ఉంది. – పందిటి ధనలక్ష్మి -
వైఎస్ జగన్ వెంట కదులుతున్న జన సునామీ
-
కాకినాడ బహిరంగ సభలో పోటెత్తిన జనాభిమానం
-
అమరావతిలో బాబు జిమ్మిక్కులు కనిపిస్తాయి
-
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. ఈజ్ ఆఫ్ కరప్షన్’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు ఈజ్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదన్నారు. గజ దొంగలు పాలిస్తే ఎలా ఉంటుందో దానికి కాకినాడే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీలేదని జననేత ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో అంతులేని అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి కట్టబెట్టినా.. సంతలో పశువులను కొన్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్నారని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. అంతకంటే సిగ్గులేని వ్యక్తి ఎవరు ఉండరు.. ‘కాకినాడ స్మార్ట్ సిటీగా మారలేదు.. అవినీతి మాత్రం స్మార్ట్గా జరుగుతోంది. జిల్లాలో 19మంది ఎమ్మెల్యేలకు 17 మంది చంద్రబాబు వద్దే ఉన్నారు. అయినా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలకు చేసిందేమీ లేదు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కాకినాడకు చంద్రబాబు ఏంచేశారు? కాకినాడలో ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్తులను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. కాకినాడలో యథేచ్చగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ప్రతీనెల పేకాట క్లబ్బుల నుంచి టీడీపీ నేతలకు మామూళ్లు అందుతున్నాయి. లంచం లేనిదే ఒక్క పని కూడా ముందుకు వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 400 కోట్లు కాకినాడకు వస్తే.. కేవలం రూ. 50కోట్లు కూడా కాకినాడకు ఖర్చు పెట్టని పరిస్థితి. కాకినాడలో డంపింగ్ యార్డ్ మార్చాలని జనం చెబుతున్నా.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాకినాడకు ప్రకటించిన మంచినీటి పథకం ప్రాజెక్టుల పనులు ఎక్కడి వేసిన గొంగలిలా అక్కడే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదు. పేదవాడి వద్ద అవినీతి చేయాలంటే అంతకంటే సిగ్గులేని వ్యక్తి ఎవరు ఉండరు’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. బాహుబలి గ్రాఫిక్స్ కనిపిస్తాయి.. ‘కాకినాడ అర్బన్లో వైఎస్ఆర్ 13 వేల ఇళ్లు కటించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇళ్లైనా కట్టించారా? పేదల ఫ్లాట్లలో కూడా చంద్రబాబు అవినీతి చేస్తున్నారు. చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ ఫ్లాట్లపై ఉన్న అప్పును మాఫీ చేస్తాం. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు. ఇద్దరు రోగులకు ఒకే బెడ్ ఇస్తున్నారు. కాకినాడ ఆస్పత్రిలో 500పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు పాలన అంతా అవినీతి చేయడం, వెన్నుపోట్లు పొడవడం. వారం రోజుల కిందట చంద్రబాబు సింగపూర్ పోయారు. అవినీతి గురించి చంద్రబాబు సింగపూర్లో మాట్లాడారు. సింగపూర్లో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారు. అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయట. అమరావతిలో ఇప్పటివరకు శాశ్వత భవనాలకు ఒక్క ఇటుక కూడా పడలేదు. అమరావతిలో ఎమ్మెల్యే గేదెలు గడ్డి మేస్తు కనిపిస్తాయి. అమరావతిలో చంద్రబాబు బాహుబలి గ్రాఫిక్స్ కనిపిస్తాయి. సమ్మిట్ల ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. నాలుగేళ్లలో రూ. 20 వేలకోట్లు పెట్టుబడులు కూడా రాలేదు. ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్లో చంద్రబాబు ఫస్ట్ ఎలా వచ్చారు? పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను నాలుగేళ్లుగా బకాయి పెడుతున్నారు. అలాంటి చంద్రబాబుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చిన వాళ్లకు బుద్ది ఉందా? వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డుయింగ్ కాదు.. ఈజ్ ఆఫ్ కరప్షన్ ‘కరెంట్ చార్జీలు రూ.3.75 పైసల నుంచి రూ. 8.75 పైసలకు పెంచడంతో కర్నూల్ జిల్లాలో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయి. కర్నూల్, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్ పరిశ్రమలపై రాయల్టీ విపరీతంగా పెంచడం ద్వారా ఈ పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చాయి. ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే? షుగర్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు అన్నీ మూతపడుతున్నాయి. మరీ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎక్కడ జరుగుతోంది? ఏపీలో ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. ఈజ్ ఆఫ్ కరప్షన్’ అని రాజన్న బిడ్డ ఎద్దేవా చేశారు. మోసంలో చంద్రబాబు నంబర్ వన్ స్థానం.. ‘హోదా కోసం వైఎస్సార్సీపీ లోక్సభ ఎంపీలు రాజీనామా చేశారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరాహారదీక్ష చేసి ఉంటే అప్పుడే దేశం మొత్తం ఏపీ వైపు చూసేది. మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్వన్ స్థానం వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగార్చినందుకు చంద్రబాబుకు నంబర్వన్ స్థానం వచ్చింది. గ్రామాల్లో మన పిల్లలను తాగించడంలో చంద్రబాబుకు నంబర్ వన్ స్థానం. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నందుకు నంబర్ వన్ స్థానం. ప్రతీ కులాన్ని మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్ వన స్థానం. హామీలను అమలు చేయమని అడిగితే వారిని కొట్టించడంలో నెంబర్ వన్. మట్టి ఇసుక, బొగ్గు, కరెంట్ కొనుగోళ్ల కాంట్రాక్టులు, రాజధాని భూములు దోచుకోవడంలో చంద్రబాబుకు నంబర్వన్ స్థానం. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్వన్. ఓటుకు కోట్లు కేసులో వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుని కేసులు లేకుండా చేసుకోవడంలో నెంబర్వన్ స్థానం. లంచం లేనిదే పనులు జరగకుండా చేయడంలో నెంబర్వన్ స్థానం. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి’ అని జననేత విమర్శలు గుప్పించారు. బయట యుద్ధం.. లోపల కాళ్లబేరం.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తున్నట్లు డ్రామాలు. వైఎస్సార్సీపీ ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా స్పీకర్ అనుమతించలేదు. కాగా, వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిన తర్వాత టీడీపీ అవిశ్వాసం పెట్టడం.. వెంటనే స్పీకర్ ఆమోదించడం చాలా ఆశ్చర్యకరం. పార్టీ ఫిరాయించినా బుట్టా రేణుకను డిస్క్వాలిఫై చేయాలని ఫిర్యాదు చేశాం. కానీ, అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున బుట్టా రేణుకను పిలిచారు. చంద్రబాబు ప్లాన్లో భాగంగానే బుట్టా రేణుకను పిలిచారు. బయటికేమో బీజేపీతో యుద్ధం.. లోపల చూస్తే కాళ్లబేరం. అధికారం కోసం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి దండం పెడతారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బహిరంగ సభలో వైఎస్ జగన్ చెప్పారు. ‘ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ సచివాలయాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. వైఎస్సార్సీపీకి చెందిన 25మంది ఎంపీలను గెలిపించండి. హోదా ఎవరిస్తే కేంద్రంలో వారికే మద్దతు ఇస్తామని’ వైఎస్ జగన్ చెప్పారు. జనోత్సాహం ఉప్పొంగింది. కాకినాడ జన ప్రభంజనమైంది. ఎగసిపడిన కెరటంలా జన సందోహం వెల్లివిరిసింది. కాకినాడలో ఓ ప్రభంజనంలా వైఎస్ జగన్ వెంట జనం నడిచారు. కాకినాడ సిటీలోకి ప్రవేశించిన జననేతకు గులాబీ పూలతో విద్యార్ధినులు స్వాగతం పలికారు. నేడు కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభకు అశేష జనవాహిని కదలివచ్చారు. -
214వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర విశేషాలు
-
కాకినాడ రూరల్లో జన సునామీ
సాక్షి, కొవ్వాడ (కాకినాడ రూరల్) : ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కాలినడక ఇడుపులపాయ నుంచి బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు కొవ్వాడ గ్రామంలో అడుగుపెట్టబోతున్న వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు రైల్వే గేటు వద్ద 65 అడుగుల భారీ కటౌట్తో ఆహ్వానం తెలుపగా, వందలాది మంది మహిళలు వైఎస్ జగన్కు హారతి ఇస్తూ నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు అమర్ వైఎస్ జగన్ను కలుసుకున్నారు. ఆయనతో పాటు అడుగులో అడుగేశారు. తమ సమస్యలు వినేందుకు వచ్చిన వైఎస్ జగన్ను కలుసుకునేందుకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. దీంతో కొవ్వాడ వీధులు జనసంద్రాన్ని తలపించాయి. పాదయాత్ర కొవ్వాడ శివార్లకు చేరుకునే సందర్భంగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షాన్ని కూడా లెక్కచేయని ప్రజలు వైఎస్ జగన్తో కలసి నడిచారు. అనపర్తిలో పాదయాత్ర హీట్.. అనపర్తిలో పాదయాత్ర హీట్ నియోజకవర్గం నలుమూలలా ప్రతిధ్వనించింది. దాదాపు మూడు రోజుల పైచిలుకు అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. పెదపూడిని దాటేందుకు దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టిందంటే ప్రజలు వైఎస్ జగన్ రాకను ఎంతలా కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. జీమామిడాడలో ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ యానిమేటర్లు తమ సమస్యలను వైఎస్ జగన్కు విన్నవించగా స్పందించిన జగన్ వేతనాల పెంపునకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
గట్టు చెరెవరకూ గండమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఈ ఫొటోలోని పడవను చూశారా? పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులతో నడిచింది. ఇదెక్కడో కాదు తాజాగా మంటూరు–వాడపల్లి మధ్య లాంచీ ప్రమాదానికి గురైన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో నడిచిన పడవిది. రక్షణ కోసం ఉండాల్సిన లైఫ్ జాకెట్లు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు జల సమాధి కావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఉభయ గోదావరి జిల్లాల అధికారుల కళ్లముందే పరిమితికి మించి ప్రయాణికులతో నడిచింది. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రమాద ఘటనకు చేరుకునేందుకు ఈ పడవలపైనే ప్రయాణాలు సాగాయి. జనాల రద్దీ దృష్ట్యా అక్కడున్న లాంచీలు తిప్పాల్సిందిపోయి ప్రమాదకరమైన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు చోద్యం చూశారు. లాంచీలు తిరగకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో పడవలపైనే స్థానికులు రావల్సి వచ్చింది. ఒక్కొక్క పడవపై 25 మందికి మించి ప్రయాణించిన దృశ్యాలు కన్పించాయి. ఏముందిలే ఈ ఒక్కరోజే కదా అన్నట్టుగా లాంచీ ప్రమాద ఘటనా స్థలి వద్ద అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కానీ, ఇక్కడ రోజూ జరుగుతున్న తంతు కూడా దాదాపు ఇదే. లాంచీ ప్రయాణాలతో పాటు పడవ ప్రయాణాలు సమాంతరంగా సాగుతున్నాయి. లాంచీలే ప్రమాదాలకు గురైతే, పడవల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మచ్చుకు ఇక్కడ జరిగిన పరిణామాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ జిల్లాలో చాలా చోట్ల జరిగేది ఇదే. రహదారుల్లేక, ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించక జిల్లాలో 70 వరకు గ్రామాల ప్రజలు పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. నిర్వాహకులు తమకెంత సొమ్ము వస్తోందని చూసుకుంటున్నారే తప్ప పరిమితిని పట్టించుకోవడం లేదు. అసలు ప్రయాణికుల రాకపోకలకు పడవలను అనుమతించకూడదు. లాంచీలు, పంటుల పైనే ప్రయాణాలు సాగించాలి. ఇప్పుడా లాంచీలు, పంటులే ప్రమాదాలకు గురై ప్రయాణికుల్ని బలితీసుకుంటున్నాయి. అలాంటి పడవ ప్రయాణాలను ఇంకెంత తీవ్రంగా తీసుకోవాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, జిల్లాలో ఆ దిశగా పర్యవేక్షణ చేయడం లేదు. ప్యాసింజర్లను ఎక్కించకూడదన్న నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. పడవ ప్రయాణాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగాక అయ్యో పాపం అంటూ హడావుడి చేయడం తప్ప నిబంధనలు, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో పడవ ప్రయాణాలు సాగిస్తున్న గ్రామాలివే ► ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. 1992లో గోగుల్లంక, భైరవలంక మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు. ► ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవ ప్రయాణమే సాగిస్తారు. 1990లో లంక రేవులో పడవ మునిగిపోయి 10మంది చనిపోయారు. ► తాళ్లరేవు మండల పరిధిలో గోవలంక, పిల్లంక, అరిటికాయ లంక, శేరిలంక, కొత్తలంక ప్రజలు పడవ ప్రయాణం చేయకతప్పడం లేదు. ఈ ప్రాంతంలోని గోదావరి నదీపాయపై 2004లో జరిగిన పడవ ప్రమాదాల్లో తొమ్మిది మంది వరకు మృతి చెందారు. ► మామిడికుదురు మండలంలో కరవాక–ఓడలరేవు, గోగన్నమఠం–బెండమూర్లంక, పెదపట్నం లంక–కె.ముంజవరం గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. ► రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ► పి.గన్నవరం మండలంలోని కనకయ్యలంక–దొడ్డిపట్ల, ఎల్.గన్నవరం– కోడేరులంక గ్రామాల ప్రజలకూ పడవలే గతి. ► కొత్తపేట మండలంలోని తొగరిపాయకు వెళ్లేందుకు వరదలొచ్చినప్పుడు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు.ఆలమూరు మండలంలో వరదలొచ్చినప్పుడు చెముడులంక నుంచి బడుగువాని లంక గ్రామాలకు పడవపైనే వెళ్లాల్సి ఉంటుంది. ► కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం–కేదారిలంక గ్రామానికి పడవపైనే ప్రయాణాలు సాగిస్తుంటారు. ► కాట్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ పరిధిలోని రామాలయంపేట, జీ. మూలపొలం మధ్య, తల్లంకుర్రు–కేశనకుర్రుపాలెం మధ్య, కుండలేశ్వరం– కేశనకుర్రుపాలెం మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. ► సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకు వెళ్లేందుకు పడవపైన ప్రయాణం సాగిస్తున్నారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీపై ప్రయాణికులు వెళ్తుంటారు. ► వీఆర్పురం మండలంలోని తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు, కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకు పడవపై వెళ్తుంటారు. ► తాజాగా లాంచీ ప్రమాదం జరిగిన దేవీపట్నం మండలంలోనైతే 17 గ్రామాలకు పడవలు, లాంచీలే ఆధారం. సర్కార్ చిన్నచూపు – గ్రామాలకు ప్రయాణ ముప్పు రహదారి సౌకర్యం లేని గ్రామాలన్నింటికీ నాటు పడవలే ఆధారం. వాటి మీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవనయానం సాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ప్రమాదకర పరిస్థితులను నియంత్రించే దిశగా అధికారులు, పాలకులు అడుగు వేయడం లేదు. వాస్తవానికైతే పైన చెప్పిన 70 గ్రామాల్లో చాలా వరకు రహదారులు వేస్తే పడవలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులు వేసినట్టయితే పడవలపై వెళ్లి రావాల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు రహదారుల్లేక పోవడం వల్ల అధికారులు, సిబ్బంది సైతం అక్కడికి వెళ్లడం లేదు. ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లేవు. అంతెందుకు తాజాగా లాంచీ ఘటనలో మృతి చెందినవారు ఉన్న కొండమొదలు, కచ్చులూరు, కె.గొందూరు, తాటివాడ గ్రామాల్నే తీసుకుంటే.. అక్కడ కనీస సౌకర్యాల్లేవు. గ్రామాలకు రహదారులు లేవు సరే.. కనీసం ఫోన్ సౌకర్యం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం మరమ్మతులకు గురైనా ఇంతవరకు పట్టించుకోలేదు. కచ్చులూరు గ్రామంలోనైతే పది రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. ఇటీవల కురిసిన గాలివానకు పడిపోయిన విద్యుత్ స్తంభాలను రోజులు గడుస్తున్నా పునరుద్ధరించలేదు. ఇక, వైద్యం పరిస్థితీ అంతే. వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారంతా పడవలు, లాంచీల మీద ప్రయాణాలు సాగించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. ఆయా గ్రామాల్లో టెలిఫోన్, విద్యుత్ సౌకర్యాల సంగతి పక్కన పెడితే ప్రయాణమే ప్రమాదకరంగా ఉన్న గ్రామాలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాకపోకలకు వీలుగా రహదారులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో.. ఇంకెన్ని ప్రమాద ఘటనలు జరగాలని చూస్తుందో చూడాలి. -
టికెట్ బుక్చేసిన పరిపూర్ణానంద.. రంగంలోకి పోలీసులు!
సాక్షి, హైదరాబాద్ : నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలలు హైదరాబాద్ నగర బహిష్కరణను పోలీసులు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు తెలిసిందే. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది. -
కాకినాడకు చేరిన పరిపూర్ణనంద
-
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు
-
మానస సరోవరం: ముమ్మరంగా సహాయక చర్యలు!
ఢిల్లీ: మానస సరోవర యాత్రలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అనే తెలుగు యాత్రికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెల్సిందే. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్కు నేపాల్ అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తర్వగా తరలించేందుకు నేపాల్ రాయబార కార్యాలయంతో ఏపీభవన్ అధికారులు సంప్రదింపులు చేపడుతున్నారు. కేరళకు చెందిన మరో యాత్రికుడు కూడా ఈ మానస సరోవర యాత్రలో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు తెలిసింది. యాత్రికులకు తరలించేందుకు అధికారులు ఏడు విమానాలను ఏర్పాటు చేశారు. సిమికోట్ నుంచి నేపాల్గంజ్కు 104 మంది యాత్రికుల తరలించారు. తెలుగువారి బాగోగులు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ గంజ్కు ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ఒక టీంను ఓఎస్డీ రవి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం పంపుతున్నామని ఏపీ భవన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. మానస సరోవర యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. హిల్సా బేస్ క్యాంప్ లో చిక్కుకున్న వారికి అవసరమైన వైద్య చికిత్స అందించాలన్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన వారు సురక్షితంగా రావాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్రలో అపశృతి అమర్నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) అనే తెలుగు మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం అందింది. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
సెల్ ఫోన్ దొంగలు అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి : ఆర్టీసీ బస్టాండులో ఆదమరిచి నిద్రపోతున్న ప్రయాణికుడి జోబు నుంచి సెల్ఫోన్ను దొంగలించిన ఓ కిలాడి జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ బస్టాండులో చోటుచేసుకుంది. ఐతే ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బండారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాదితుడు ఆర్టీసీ బస్టాండులో నిద్రలోకి జరుకోగానే దొంగలు చీకట్లో తాము ఏమి చేసినా గమనించలేరని సెల్ఫోన్ను దొంగలించి ఉడాయించారు. బాధితుడి నిద్రలేచే సరికి సెల్ఫోన్ లేకపోడంతో పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కిలాడి దొంగలను సీసీ కెమెరాల సాయంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో చోరీకి పాల్పడిన జంట
-
‘చంద్రబాబు కామెడీ.. జనం నవ్వులు..’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని, అది అధర్మ పోరాట దీక్షని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనం సొమ్ముతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. దీక్ష కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. దీక్షకు ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లను బలవంతంగా తరలించారని ఆరోపించారు. సభలో చంద్రబాబు చేసిన కామెడీ చూసి జనం ఫుల్లుగా నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. దీక్ష పేరుతో 2 వేల ఆర్టీసీ బస్సులను సభాస్థలికి తరలించడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వివరించారు. సభ కోసం పాఠశాలలకు సెలవులు ఇస్తారా? అని నిలదీశారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ గురువారం తెలిపారు. సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు (07757) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్ రైలు (07758) ఆగస్ట్ 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ ప్రత్యేక రైలు (07942) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21 ,28వ తేదీల్లో తిరుపతిలో సాయంత్రం బయలుదేరుతుంది. కాకినాడటౌన్–రేణిగుంట ప్రత్యేక రైలు (07941) ఆగస్టు 6, 13, 20, 27వ తేదీల్లో, సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో, అక్టోబర్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 7.00 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. నాందేడ్ –తిరుపతి ప్రత్యేక రైలు (07607) ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో, సెప్టెంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో, అక్టోబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో సాయంత్రం 6.45కు నాందేడ్లో బయలుదేరుతుంది. -
అయ్యో! కన్నా!
కాకినాడ: వీధి కుక్కలు దాడి చేశాయి. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాయి. వివరాలివి...కాకినాడ నగరం నడిబొడ్డున ఉన్న బాలాజీ చెరువు వద్ద మండల రెవెన్యూ కార్యాలయం ఎదుటి వీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వాసంశెట్టి శ్రీనివా స్, భూలక్ష్మి దంపతులు 15 రోజు క్రితమే ఇంద్రంపాలెం నుంచి ఇక్కడి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వీరికి సాందిక, సాయిశారద ఇద్దరు కుమార్తెలు. దాదాపు 11 సంవత్సరాల తరువాత నాగేంద్ర అనే బాలుడు జన్మించాడు. దీంతో అతడ్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బాలాజీచెరువు వద్ద ఆటో మెకానిక్గా పని చేస్తున్న శ్రీనివాస్ శనివారం ఉదయం మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు. భూలక్ష్మి ఒక వృద్ధురాలికి సహాయకురాలిగా వెళ్లింది. ఇంట్లో ఇద్దరు అక్కలతో పాటు ఆరేళ్ల బాలుడు నాగేంద్ర ఉన్నారు. ఆ బాలుడు ఆడుకునేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. విశాలమైన ఆవరణలో చెట్లు, మొక్కల మధ్య చిన్న కత్తెర పట్టుకుని ఆకులు కత్తిరిస్తూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ప్రహరీ గోడదూకి వచ్చిన కుక్కలు నాగేంద్రపై హఠాత్తుగా దాడి చేశాయి. అతడ్ని ఈడ్చుకుంటూపోయాయి. భుజంపై చర్మం పీకేశాయి. తలపై చర్మం ఊడిపోయింది. ఒళ్లంతా గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఇంతలో పక్క ఇంట్లో నివసిస్తున్న మహిళ బయటకు వెళ్తూ నిర్జీవంగా ఉన్న నాగేంద్రను చూసి అతడి అక్కలకు చెప్పింది. దీంతో వారు బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరమైపోయాడని తల్లిదండ్రులు, అక్కలు గోలు గోలున విలపించారు. బాలుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. మూడో వపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సత్యవేణి, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న పరామర్శించారు. కుక్కల దాడికి మాంసం వ్యర్థాలే కారణమా? కుక్కలు బాలుడిని హతమార్చిన ఇంటి ముందు డంపర్ బిన్నులో ఆస్పత్రి, హోటళ్ల నుంచి తెచ్చి వేసిన వ్యర్థాలను తినేందుకు కుక్కలు అక్కడ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉండే ఆస్పత్రుల నుంచి రక్తం మరకలతో కూడిన వ్యర్థాలు, హోటళ్లలోని ఆహార వ్యర్థాలను రాత్రి వేళల్లో తెచ్చి డంపర్ బిన్లో వేయడంతో వాటిని తినేందుకు కుక్కలు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. వాటిని తిన్నాకా ఎండ తీవ్రతకు మొక్కల మధ్యకు వచ్చి పడుకోవడానికి ప్రహరీ దూకి వస్తున్నాయని స్థానికులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలుడిపై కుక్కలు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు. -
కుక్కల దాడిలో బాలుడు మృతి
సర్పవరం (కాకినాడ సిటీ): ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి దారుణంగా చంపేశాయి. ప్రహరీ దూకి వెళ్లి మరీ చిన్నారిపై దాడి చేశాయి. అందరూ ఇంటి లోపల ఉండడంతో ఆ బాలుడి ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. కాకినాడ బాలా చెరువు సెంటర్లోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న దీపాలవారి వీధిలోని ఓ ఇంటిలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆటోమెకానిక్గా పనిచేస్తున్న వాసంశెట్టి శ్రీనివాస్ కుటుంబంతో సహా ఇటీవలే ఆ ఇంటిలో అద్దెకు దిగాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భార్య భూలక్ష్మి ఓ వృద్ధురాలి వద్ద ఆయాగా పనిచేస్తోంది. కుమారుడు నాగేంద్ర ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో చిన్నారులు ఇంటి వద్దే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ రోజు మాదిరిగానే పనికి వెళ్లిపోయారు. అక్కలు ఇంటిలో ఉండగా, నాగేంద్ర ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఇంటి ప్రహరీ దూకి వీధికుక్కలు ఒక్కసారిగా నాగేంద్రపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి. అందరూ లోపల ఉండిపోవడంతో అతడి ఆర్తనాదాలు ఏ ఒక్కరి చెవినా పడలేదు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు గమనించి వారి బంధువులకు చెప్పారు. వారి వెళ్లి చూడగా అప్పటికే నాగేంద్ర మరణించాడు. అతడి తల వెనుక భాగాన్ని, భూజాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
తనువు చాలిస్తాం..అనుమతించండి
జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలిచే నేల మనది. నాన్నంటే నడిచే దేవాలయం లాంటి వ్యక్తి. అమ్మప్రేమకు సాటిలేదు. ఇలాంటి కర్మభూమిలో పుట్టి, జీవిత చరమాంకంలో జబ్బు బారిన పడిన తండ్రిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిందిపోయి.. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలున్నా చికిత్స చేయించకుండా అడ్డుపడుతున్నాడో కొడుకు. గారాబంగా పెంచి, ఓ ఇంటి వాడిని చేసిన తండ్రి సంపాదించిన ఆస్తిని లాగేసుకొని వీధిన పడేశాడు. ఓవైపు మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది.. మరోవైపు ఇంకెంతకాలం బతుకుతారంటూ హేళన చేస్తూ దుర్మార్గంగా మాట్లాడే కుమారుడు.. వెరసి తమకు ఆత్మార్పణే శరణ్యమని, చనిపోయేందుకు అనుమతించాలంటూ శనివారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి అర్జీ ఇచ్చారు ఆ వృద్ధదంపతులు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా సర్పవరానికి చెందిన పిట్టా అప్పారావు, లక్ష్మి దంపతుల దయనీయస్థితి ఇది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకు రవి విడిగా ఉంటున్నాడు. అప్పారావుకు కిడ్నీ పాడవడంతో రెండ్రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రిలో రూ.వేలు ఖర్చు అవుతున్నాయి. కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ దుస్థితిలో తల్లిదండ్రులను రవి పట్టించుకోవడంలేదు. అప్పారావు కష్టపడి కూడబెట్టిన ఆస్తి రూ.2 కోట్లు ఉంటుంది. చికిత్స నిమిత్తం అందులో కొంత భూమిని అమ్ముదామంటే కొడుకు ఒప్పుకోవడం లేదు సరికదా.. ‘62 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఎంతకాలం బతుకుతారేంటి?’ అంటున్నాడు. తన భర్త సంపాదించిన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను రెండేళ్ల క్రితం బ్యాంకులోను కోసం అని చెప్పి కొడుకు తీసుకెళ్లిపోయాడని, వాటిని ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని, విషయాన్ని పెద్దల వద్ద పెట్టినా ప్రయోజనం లేకపోయిందని లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్తకు వచ్చిన వ్యాధిని బాగుచేయించుకోలేక, కొడుకు పెడుతున్న ఇబ్బందులను భరించలేక తీవ్ర మనోవ్యధ చెందుతున్నామని, తామిద్దరం చనిపోయేందుకు అనుమతి ఇప్పించాలంటూ వృద్ధ దంపతులు ఎస్పీని అభ్యర్థించారు. వారిని సముదాయించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరపాలని కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదేశించారు. వృద్ధుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసిందని, అధైర్య పడొద్దని చెప్పి పంపించారు. -
లక్షల విలువైన గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
సాక్షి, కాకినాడ : ఆన్లైన్లో సొమ్మును బదిలీ చేస్తానని చెప్పి బంగారం అపహరించిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకున్నారు. వివరాలు.. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసేవాడనీ, తరువాత విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి చోరీలకు కూడా పాల్పడ్డాడని, ఈ క్రమంలోనే బంగారు దుకాణంలో గోల్డ్ బిస్కెట్లను కూడా అపహరించాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద రూ. 26లక్షల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కరెంట్ షాక్ తగిలి వదిన,మరిది దుర్మరణం
-
కాకినాడ నడిబొడ్డున మహిళ హత్య
కాకినాడ రూరల్: కాకినాడ బ్యాంక్పేటలో ఓ మహిళ హత్యకు గురైంది. పేటలో నివాసం ఉంటున్న పెంకే విజయలక్ష్మి అలియాస్ జయమ్మ (54) గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. ఈమెను ముందు పీక నొక్కి, అనంతరం ఇనుప రాడ్డుతో తల పగలగొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన జయమ్మకు భర్త చనిపోయి ఏడేళ్లయ్యింది. ఏడాదిన్నర క్రితం మండపేటకు చెందిన కట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కొద్ది రోజుల పాటు సహజీవనం చేసిందని, అనంతరం ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతున్నారు. జయమ్మ ఇంటికి, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లింటికి వెళ్లి రావడానికి కేవలం మూడు అడుగుల సందు మాత్రమే ఉంది. వెళ్లిన మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. జయమ్మకు రెండు అంతస్తుల డాబా ఇల్లు ఉండగా ఓ పోర్షన్లో ఆమెతో పాటు ఆమె రెండో భర్త కట్టా వెంకటేశ్వర్లు ఉంటూ మిగిలిన పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటితో పాటు జయమ్మకు మండపేటలో రెండు డాబా ఇళ్లు, ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉందని, వ్యవసాయ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పదేళ్లుగా జయమ్మ మండపేట నుంచి వచ్చి బ్యాంకుపేటలో ఉన్న ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళుతుంటుందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఏడాదిగా రెండో భర్త వెంకటేశ్వర్లుతో వచ్చి ఇక్కడ ఉంటోందంటున్నారు. నెల రోజుల క్రితం బ్యాంకుపేట వచ్చి తన ఇంట్లోనే రెండో భర్త వెంకటేశ్వర్లుతో ఉంది. ఈమెకు పిల్లలు లేకపోవడంతో అక్క కుమార్తెను పెంచి పెళ్లి చేసిందని, రెండో భర్తగా చేసుకున్న వెంకటేశ్వర్లుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారని పోలీసులు వివరించారు. జయమ్మ హత్య జరగడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. జయమ్మ హత్య జరిగిన మంచం కింద కట్టా వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో ఉండడం గమనించిన పోలీసులు, స్థానికులు అతడిని వైద్య నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. వెంకటేశ్వర్లుకు తగిలిన గాయం పెద్దదేమీ కాదని, అయితే ఇతడిని హత్య ఎలా జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే ఎవరో వచ్చి తమపై దాడి చేశారని, ఎవరనేది తాను చెప్పలేనని, మండపేటలో ఓ షావుకారుకి, జయమ్మకు ఆస్తి గొడవలు ఉన్నాయని, వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు వివరించినట్టు సమాచారం. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ హత్య చేశారా? లేక జయమ్మ ఆస్తులు ఎవరికైనా వెళ్లిపోతాయని ఆమెతో ఉంటున్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్రైమ్ డీఎస్పీ పల్లపురాజు, డీఎస్పీ రవివర్మ, త్రీటౌన్ సీఐ దుర్గారావు సందర్శించి సంఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. జయమ్మ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దుర్గారావు తెలిపారు. శవపం^నామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. -
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం.. పిడుగులు!
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందగా.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురంలో మరో ఇద్దరు పిడుగుల బారిన పడి మరణించారు. జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములతో వర్షం పడుతోంది. -
నా బిడ్డను చంపేశారు...మమ్మల్నీ చంపేస్తారు
నా బిడ్డను చంపేశారు. మమ్మ ల్నీ చంపేస్తారు. భయపడి వేరే ఇంట్లో తలదాచుకుంటున్నాం. ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారూ పట్టించుకోలేదు. నా కొడుకును చంపేసినోళ్లే మా చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడేం చేస్తారోనని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని గడుపుతున్నాం. నోట్ల మార్పిడిలో నా కొడుకును ఓ పావుగా వాడుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, బయటకు తీసుకువెళ్లి చంపేశారు. చావును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అనుమానాస్పద మృతిగా చెబుతున్నప్పటికీ నమ్మకం కలగడం లేదు. నా బిడ్డ చావుకు నలుగురు వ్యక్తులు కారణం, వారి పేర్లతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. దీంట్లో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. ఇప్పుడా వ్యక్తులే మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. పోలీసులకు మొర పెట్టుకున్నాం. ఓ న్యాయవాదిని ఆశ్రయించాం. కానీ న్యాయం జరగలేదు. ఎవరికి చెప్పాలన్నా భయమేస్తోంది. అందుకే మీడియా ముందుకు వచ్చాం...కాపాడండి. – 27 ఏళ్ల వయసున్న కుమారుడిని పోగొట్టుకున్న కర్రి కృష్ణవేణి కన్నీరుమున్నీరు... సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెదపూడి మండలం అచ్యుతాపురత్రయానికి చెందిన కర్రి నాగేశ్వరరావు, కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యం కోసమని తిమ్మాపురంలో ఓ ఇంటిలో అద్దెకుంటున్నారు. నాగేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల రెండో కుమారుడు కర్రి దుర్గా ప్రసాద్ తొలుత కేబుల్ టీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు. కొంతకాలం క్రితం ఈయన భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నోట్ల రద్దు తర్వాత కొంతమంది వ్యక్తులతో కలిసి నోట్లు మార్పిడి చేసేవారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కూడా వీరిని వినియోగించుకుని నోట్లు మార్పిడి చేయించుకున్నారన్న వినికిడి ఉంది. ఈ క్రమంలో వ్యవహారాలు ఏరకంగా బెడిసికొట్టాయో తెలియదు గానీ ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన దుర్గాప్రసాద్ తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం దుర్గా ప్రసాద్ స్నేహితుడికి దుర్గా కుటుంబీకులు ఫోన్ చేసి అడిగారు. దుర్గా ప్రసాద్ ఊరు వెళ్తున్నాడని, బట్టలు, ఛార్జర్ తనను తీసుకు రమ్మన్నాడని, సామర్లకోట రైల్వే స్టేషన్కు వెళ్తున్నానని సదరు స్నేహితుడు చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజులు దుర్గా ప్రసాద్ స్నేహితులు ఇంటికొచ్చి అక్కడ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఎంతకీ రాలేదని అదే నెల 27వ తేదీన దుర్గా ప్రసాద్ కుటుంబీకులు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన దుర్గా ప్రసాద్ ‘తాను ఆపదలో ఉన్నానని, డబ్బు తినేశాననే అనుమానంతో నన్ను బంధించారని, మన ఇల్లును ఫలానా వ్యక్తుల పేరున రాసి ఇచ్చేయాల’ని అదే ఫోన్లో ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఎవరి పేర్లైతే దుర్గా ప్రసాద్ చెప్పాడో ఆ నలుగురు అదే నెల 28, 29వ తేదీల్లో ఇంటికొచ్చి ఇల్లును తమ పేరున రిజిస్ట్రేషన్ చేసేయాలని సతాయించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే దుర్గా ప్రసాద్ను చంపేస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 3వ తేదీన దుర్గా ప్రసాద్ నేరుగా ఫోన్ చేసి, ‘మన ఇల్లును వారి పేరున రిజిస్ట్రేషన్ చేసేయ’మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే రోజున బెదిరింపులకు దిగినవారి పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఎటువంటి బాకీ లేదని లిఖిత పూర్వకంగా> ఆ నలుగురు వ్యక్తులు రాసిచ్చారు. ఆ వెంటనే తన కుమారుడ్ని ఇంటికి పంపించేయండని ఆ వ్యక్తులను కోరారు. వణికిపోతున్న కుటుంబీకులు అటు తాడేపల్లి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి న్యాయం జరగలేదని దుర్గా ప్రసాద్ కుటుంబీకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. మధ్యలో ఒక న్యాయవాది వద్దకు వెళ్లి చెప్పుకున్నా...ఫలితం లేదు సరికదా కొంత డబ్బు గుంజేసి పలాయనం చిత్తగించాడని దుర్గా ప్రసాద్ తల్లి కృష్ణవేణి రోదిస్తూ చెబుతున్నారు. పెద్ద వ్యక్తులు (మంత్రి, ఎమ్మెల్యేలు) ఉండటంతో తమనేం చేస్తారేమోనన్న భయంతో దుర్గా ప్రసాద్ కుటుంబీకులు వణికిపోతున్నారు. ఎవరూ న్యాయం చేయడం లేదని, కనీసం మీరైనా లోకం దృష్టికి తీసుకురావాలని, మేలు జరిగేలా చూడాలని కృష్ణవేణి ‘సాక్షి ప్రతినిధి’ని కలిసి మొరపెట్టుకున్నారు. వాస్తవమేంటో నిగ్గు తేల్చాలి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేస్తే తప్పనిసరిగా ఆ దిశగా విచారణ జరపాలి. అనుమానాల్నే క్లూస్గా తీసుకుని విచారణ చేస్తే వాస్తవమేంటో బయటికొస్తుంది. మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల ఆరోపణల్లో పస ఎంత ఉందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా నోట్ల మార్పిడి వ్యవహారంతో సంబంధాలుండటంతో ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలున్నారని వెనక్కి తగ్గితే ఇలాంటి బాధితులు బలి అయిపోవల్సి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ కుటుంబీకులకు రక్షణ కల్పించడమే కాకుండా వారి అనుమానాలను నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది. చనిపోయినట్టు ఫోన్ కాల్... రెండు రోజుల్లో వచ్చేస్తాడని చెప్పిన మూడో రోజే (ఫిబ్రవరి 6వ తేదీ) తాడేపల్లిగూడెం పోలీసుల నుంచి ‘దుర్గా ప్రసాద్ చనిపోయాడని, నవాబుపాలెం అనే గ్రామంలో మృతదేహం ఉందని’ ఫోన్ వచ్చింది. ఎవరైతే ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిలో ఓ వ్యక్తితో కలిసి దుర్గా ప్రసాద్ కుటుంబీకులంతా తాడేపల్లిగూడెం వెళ్లారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని’... అని చెప్పి సూసైడ్ నోట్ రాసి పెట్టాడని దుర్గా ప్రసాద్ కుటుంబీకుల దృష్టికి అక్కడి పోలీసులు తీసుకొచ్చారు. సదరు వ్యక్తే పోలీసులతో మాట్లాడి, సంతకాలు చేయించి, మృత దేహాన్ని తీసుకొచ్చేసేలా చేశాడు. రెండు రోజుల అనంతరం ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి, మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. జరిగిన పరిణామాలన్నీ గమనించాక దుర్గా ప్రసాద్ కుటుంబీకులు తాడేపల్లిగూడెం వెళ్లి, నలుగురిపై అనుమానం ఉందని, వారే చంపేసి ఉంటారని, సూసైడ్ నోట్లో ఉన్న అక్షరాలకు ... దుర్గాప్రసాద్ రాసే అక్షరాలకు తేడా ఉందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యక్తులు వెంబడిస్తూ, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రాణభయం ఉందని తిమ్మాపురంలో ఉన్న ఇంటిని ఖాళీ చేసి, వారి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని సదరు ఫిర్యాదులో అభ్యర్థించారు. ఫిర్యాదు వచ్చింది మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల నుంచి ఫిర్యాదు వచ్చింది. దాన్ని కాకినాడ రూరల్ సీఐకి రిఫర్ చేశాను. –విశాల్ గున్నీ, జిల్లా ఎస్పీ అనుమానాస్పద మృతిగా విచారణ చేస్తున్నాం తాడేపల్లిగూడేం మండలం నవాబుపాలెంలో మృతి చెందిన దుర్గా ప్రసాద్ కేసుపై విచారణ జరుపుతున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వద్ద నుంచి మాకు సమాచారం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదులో ఆరోపించిన వ్యక్తులను కూడా పిలిచి విచారించాం. వారి స్టేట్మెంట్ రికార్డు చేశాం. మృతుడికి చెందిన ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఫోరెన్సిక్ నుంచి రావల్సి ఉంది. సూసైడ్ నోట్లో అక్షరాలు దుర్గాప్రసాద్వి కావని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. కాకపోతే, అందుకు తగ్గ ఆధారాలు అడిగాం. మృతుడు తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. – చంద్రరావు, ఎస్ఐ, తాడేపల్లి గూడెం -
అక్రమ ఆయిల్ ముఠా అరెస్ట్
కాకినాడ రూరల్: వాకలపూడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఆయిల్ అమ్మకాలు నిర్వహిస్తున్న ముఠాపై సర్పవరం పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సర్పవరం సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సర్పవరం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగ ఆయిల్ ముఠా వివరాలను వెల్లడించారు. తీరప్రాంతంలో ఒకసారి ఉపయోగించిన ఆయిల్ను నిల్వ చేస్తూ అమ్మకాలు చేస్తున్న ఆవుల శ్రీనివాసరెడ్డి, మందపాక సూరిబాబు, పెంటకోట గంగాధర్లను ఎస్సై శ్రీనివాసరెడ్డి సిబ్బంది సహాయంతో అరెస్టు చేసినట్టు వివరించారు. ఆవుల శ్రీనివాసరెడ్డి నుంచి ఆరు బ్యారెల్స్ (1200 లీటర్లు) యూజ్డ్ ఇంజన్ ఆయిల్, మందపాక సూరిబాబు నుంచి 75 లీటర్లు క్రూడ్ కాటన్ ఆయిల్ను, పెంటకోట గంగాధర్ అనే వ్యక్తి నుంచి 20 లీటర్ల డీజిల్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పాతనేరస్తుడైన ఆవుల శ్రీనివాసరెడ్డి వాకలపూడి ఎఫ్సీఐ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని పాత ఇనుప వ్యాపారం షాపు నడుపుతున్నట్టు తెలిపారు. ఒకసారి ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ను సేకరించి వాటిలో కొంత మంచి ఆయిల్ను కలిపి మంచి ఇంజన్ ఆయిల్గా చుట్టుపక్కల లారీ యజమానులకు, చిన్నచిన్న కంపెనీవాళ్లకు విక్రయిస్తూ వ్యాపారులను మోసగిస్తున్నాడన్నారు. సీఐ చైతన్యకృష్ణకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నామన్నారు. ఈనెల 6వ తేదీన ఏపీ5డబ్ల్యూ 1282 నంబర్ గల లారీ యజమాని కడలి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ వాకలపూడిలోని ఎన్సీఎస్ ఆయిల్ కంపెనీ నుంచి అమలాపురం, రావులపాలెం పెట్రోల్ బంకులకు వెళ్లేందుకు డీజిల్ నింపిన ట్యాంకర్ నుంచి డ్రైవర్ పెంటకోట గంగాధర్ ట్యాంకర్ కంపార్ట్మెంట్కు సీలు తొలగించి సుమారు 20 లీటర్లు డీజిల్ ఆయిల్ను దొంగిలించడంపై అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. ఇదే విధంగా వాకలపూడి గ్రామంలోనే అక్రమంగా ఆయిల్ వ్యాపారం చేస్తున్న మంటపాక సూరిబాబుని అరెస్టు చేసి అతడి నుంచి 75 కిలోల కాటన్ క్రూడ్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్ల వద్ద నుంచి కాటన్ క్రూడ్ ఆయిల్ కలిపి చుట్టుప్రక్కల వారిని స్వచ్ఛమైన ఆయిల్గా నమ్మించి అమ్మి మోసగిస్తున్నట్టు తెలియడంతో అరెస్టు చేశామన్నారు. సర్పవరం పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పేకాట, జూదం ఆడుతున్న తొమ్మిది పేకాట కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. నాలుగు గుట్కా కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. పోర్టులో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను మోసగించి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వివిధ కేసుల్లో ఉన్న పాతనేరస్తులు(ఆయిల్ కేసుల్లో) 15 మందిని అదుపులోకి తీసుకుని 15 కేసుల్లో బైండవర్ చేసినట్టు వివరించారు. ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల ఏరకు స్పెషల్ టాస్క్ఫోర్స్లో భాగంగా పోర్టు ఏరియాలో రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. కార్యక్రమంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడటౌన్–తిరుపతి ప్రత్యేక రైలు (07210) మే 11, 13, 18, 20, 25, 27, జూన్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29వ తేదీల్లో రాత్రి 6.45కు కాకినాడటౌన్లో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్ రైలు (07209) మే 12, 14, 19, 21, 26, 28, జూన్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నర్సాపూర్–హైదరాబాద్ ప్రత్యేక రైలు (07258) మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్లో బయలుదేరుతుంది. హైదరాబాద్–విజయవాడ రైలు (07257) మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.20కు హైదరాబాద్లో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక పోకలు సాగిస్తాయని రాజశేఖర్ తెలిపారు. -
దాచేపల్లి ఘటన మరువక ముందే..
-
అప్పటివరకు మాట్లాడింది..అంతలోనే..
గొంతులో వచ్చిన సమస్యకు చికిత్స పొందిన ఆ పాప గళం.. అంతలోనే శాశ్వతంగా మూగబోయింది. ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మానాన్నల హృదయాల్లో ఆరని శోకాగ్ని రగిలింది. కాకినాడ జీజీహెచ్లో టాన్సిల్స్కు చికిత్స పొందిన రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ప్రేమాంజలి (13) గురువారం మరణించింది. చికిత్సలో లోపమే పాపను బలిగొందని అయినవారు ఆక్రోశిస్తున్నారు. తూర్పుగోదావరి, సర్పవరం (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల నిర్లక్ష్యం కారణంగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రాయుడు వెంకటరమణ, సత్యవేణిల ఏకైక కుమార్తె రాయుడు ప్రేమాంజలి(13) ఏడో తరగతి చదువుతుంది. ఆమెకు టాన్సిల్స్(గొంతుకు ఇరువైపులా కాయలు) రావడంతో బుధవారం సాయంత్రం కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. జీజీహెచ్లోని ఈఎన్టీ విభాగంలో చికిత్స పొందుతుండగా గురువారం ఉదయం 7.20 గంటల వరకు అందరితో బాగానే మాట్లాడిందని, జ్వరం, కడుపుమంట ఉండడంతో నర్సుని పిలిస్తే ఇంజక్షన్ ఇచ్చినట్టు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చిన పది నిమిషాల్లోపే ఆమె ఒళ్లంతా దద్దుర్లు, విరేచనాలు, నోట్లో నుంచి రక్తం వచ్చిందని వెంటనే పీఐసీయూకి తరలించారని తెలిపారు. తరువాత ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా బాలిక తండ్రిని పదినిమిషాలు మాత్రమే లోపలికి అనుమతించారు. కొంత సమయం తరువాత మీ పాప చనిపోయిందని మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్యులు తెలిపారని మృత్యురాలు మేనమామ బోరున విలపిస్తూ చెప్పారు. చాలా బాధాకరం హిమరేక్స్ ఫీవర్స్ కావచ్చు. బాలికకు ఇచ్చిన ఇంజక్షన్ పారాసిటమాల్ మాత్రమే. దీని వల్ల ప్రమాదం కాదు. ఇంజక్షన్ వల్ల మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాబట్టి వైద్య బృందాన్ని వివరణ కోరాను. కొన్నిసార్లు హిమరేక్స్ ఫీవర్స్ ఉన్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయినా ఈ బాలికకు అటువంటి సూచనలు కనిపించలేదు. ఈ సంఘటనపై విచారిస్తున్నాం. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తా.– డాక్టర్ ఎం.రాఘేవేంద్రరావు,జీజీహెచ్ సూపరింటెండెంట్, కాకినాడ -
ఖర్మాసుపత్రులు
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాట ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. దవాఖానాల దుస్థితికి నిత్య దర్పణం ఆ పాట. దానిని దాదాపు ప్రతినిత్యం ఎక్కడో దగ్గర వింటున్నా.. ప్రభుత్వాల కళ్లు తెరచుకోవడంలేదు. ప్రభుత్వాసుపత్రులపై పాలకులు నేటికీ అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. అరకొర వైద్య సేవలు, చాలీచాలని వసతులు, సౌకర్యాల లేమి, మందుల కొరత.. ఇలా అనేక సమస్యలు సర్కారీ ఆసుపత్రులను పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్లో ఇటువంటివే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అరకొరగానే ఉన్నాయి. దీంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని విభాగాలకైతే డాక్టర్లు లేక వైద్యం అందని దుస్థితి నెలకొంది. ఇక కొన్ని విభాగాల్లో ఒకే మంచంపై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్న దుర్భర పరిస్థితి నెలకొంది. పేద రోగులకు అందించాల్సిన మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.∙కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) బోధనాసుపత్రి కూడా. ఇక్కడ పడకల కొరత తీవ్రంగా ఉంది. అనేక విభాగాల్లో ఒకే బెడ్పై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. కీలకమైన కార్డియాలజీ విభాగానికి పూర్తిస్థాయి వైద్యులు లేరు. ప్రస్తుతం గుండె వ్యాధుల చికిత్స నిపుణునిగా సేవలందిస్తున్న డాక్టర్ చలం మూడు రోజులు కాకినాడ జీజీహెచ్లో, మూడు రోజులు విశాఖ కేజీహెచ్లో సేవలు అందిస్తున్నారు. దీంతో ఇక్కడ అరకొర వైద్యసేవలే దిక్కవుతున్నాయి. ప్రధానమైన బీ కాంప్లెక్స్ నుంచి గుండె జబ్బులు, న్యూరాలజీ, కీళ్లనొప్పులతోపాటు కాల్షియం మాత్రలు కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి. చెవి, కంటికి సంబంధించి వేసే డ్రాప్స్ కూడా మూడు నాలుగు నెలలుగా సరఫరా కావడంలేదు. ఆసుపత్రి డ్రగ్స్ బడ్జెట్ రూ.1.82 కోట్లు. ఇది ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు.∙రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఓపీ చీటీలు రాసేచోట సరైన సిబ్బంది లేరు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిని పారిశుద్ధ్య సిబ్బందిగా, ట్రైనీ నర్సులుగా నియమిస్తుంటారు. ఇక్కడ పని చేస్తున్న 69 మందిని ఒకేసారి బదిలీ చేయడంతో పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందడంలేదు. ఒకేసారి సీనియర్ సిబ్బందిని బదిలీ చేయడంతో గైనిక్ వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డెలివరీ కూడా సకాలంలో చేయడం లేదని రోగులు వాపోతున్నారు. ఏడాదికి రూ.1.62 కోట్ల మేర డ్రగ్స్ బడ్జెట్ కేటాయించినా అది చాలడంలేదు. దీనిని రూ.3 కోట్లకు పెంచాల్సిన అవసరం ఉంది.∙అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కన్ను, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వైద్యం అందే పరిస్థితి లేదు. కోనసీమలోని కిడ్నీ రోగులను ఈ ఆసుపత్రి ఆదుకోలేకపోతోంది. డయాలసిస్ యూనిట్ లేక కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మందుల కొరత ఉంది. దాదాపు రూ.70 లక్షల బడ్జెట్ అవసరం కాగా, కేవలం రూ.51.52 లక్షల మేరకే ప్రభుత్వం ఇస్తోంది. ∙తుని ఏరియా ఆసుపత్రిలో చీటీలు తీసుకున్న రోగులు సంబంధిత డాక్టరు గది వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇక్కడ మూడు ఎక్స్రే మెషీన్లు ఉండగా ఒకటి మాత్రమే పని చేస్తోంది. నెలలు నిండిన మహిళలు పురుడు కోసం వస్తే చేయి తడపందే వైద్యులు కత్తెర పట్టుకోవడం లేదు. డ్రగ్స్ కొరత ఉంది. ప్రభుత్వం కేటాయించిన రూ.52.65 లక్షల బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదు. రూ.75 లక్షల మేర అవసరం ఉంది.∙మూడు నియోజకవర్గాలకు ఏరియా ఆసుపత్రిగా ఉన్న రామచంద్రపురంలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సహితం ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోంది. గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, చంటిపిల్లల వైద్యులు లేకపోవటంతో మహిళా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్డియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గుండెపోటుకు గురైనవారికి అత్యవసర చికిత్స అందించే పరిస్థితి లేదు. ముఖ్యమైన సామగ్రి అందుబాటులో లేకపోవటంతో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు అవసరమైన వారిని కాకినాడ తరలిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఏటా రూ.35.80 లక్షల మేర డ్రగ్స్కు కేటాయిస్తున్నా సరిపోవడం లేదు. మందుల కొరత తీరాలంటే రూ.55 లక్షల మేరకు అవసరం ఉంది. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లోనూ దాదాపు ఇదే దుస్థితి నెలకొందిగొంతుకు ఎక్స్రే తీయమంటే చెస్ట్కు తీశారుకాకినాడ జగన్నాథపురానికి చెందిన 12 ఏళ్ల రాముడుకు గొంతులో కాయ ఏర్పడింది. శనివారం ఎక్స్రే తీయాల్సిందిగా వైద్యులు సూచించారు. తీరా అన్నీ చేసి సోమవారం ఆస్పత్రికి వచ్చాక గొంతుకు తీయాల్సిన ఎక్స్రే చెస్ట్కు తీశారని వైద్యులు తేల్చారు. ఎక్స్రే సరిగా లేనందున మళ్లీ తీయించుకురమ్మని చెప్పడంతో ఉసూరుమంటూ మండుటెండలో అతడి తల్లి చక్కా రాఘవ ఎక్స్రే విభాగం వైపు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.. మందులు లేవు కాకినాడకు చెందిన ఓలేటి అప్పారావుకు అకస్మాత్తుగా కాళ్లు, చేతులు పడిపోయాయి. చేపల వేట చేస్తూ జీవనం సాగించే అప్పారావు చికిత్స నిమిత్తం నాలుగు రోజుల క్రితం జీజీహెచ్లో చేరాడు. చికిత్స అందించేందుకు అవసరమైన ఇమ్యునోగ్లోబ్లెన్స్ అందుబాటులో లేవని సిబ్బంది తేల్చేశారు. ఇది ఉంటేనే కానీ రోగికి మెరుగైన వైద్యం అందించలేని పరిస్థితి. మందులు అందుబాటులో లేని దుస్థితి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మందు బయట కొనలేకపోతున్నామని రోగి బంధువు చెప్పాడు. అతడిని ఆసుపత్రిలోనే ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నారు. -
గొడ్డు చాకిరీ.. గొర్రె తోక జీతం
కాకినాడ రూరల్ : చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. పనిని బట్టి పారితోషికం అంటూ నియామకాలు చేసుకున్న ప్రభుత్వం, వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే అవకాశం లేదని ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు తగ్గించడం మొదలు, గర్భిణులకు, శిశువులకు టీకాలు, పల్స్ పోలియో చుక్కలు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా చూడడం తదితర పనుల్లో ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుంటోంది. రూరల్ నియోజకవర్గంలో 172 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. అన్ని పనులు వీరితోనే.. గ్రామాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తదితర విష జ్వరాలు ప్రబలితే తొలుత వైద్యసేవలు అందించేది ఆశ వర్కర్లే. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులు ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరిస్తారు. ప్రసవం కేసులు కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేసి వారి వెనువెంటనే ఉంటూ ప్రసవం పూర్తి అయ్యే వరకు సేవలందిస్తున్నారు. వేతనం తక్కువ.. వీరికి నెలకు రూ.800 నుంచి రూ.1200కి మించి ఇవ్వడంలేదు. పల్స్ పోలియో కార్యక్రమంలో (రోజంతా పనిచేస్తే) రూ.75, గర్భిణిని ఆసుపత్రిలో పరీక్షకు తీసుకువస్తే రూ.60, ప్రభుత్వాసుపత్రిలో పరీక్షకు పంపితే రూ.300, కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయిస్తే రూ.150, బాలింతను పర్యవేక్షిస్తే రూ.20, టీబీ రోగికి ఐదు నెలల పాటు మందులు అందజేస్తే రూ.300, ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తే ప్యాకెట్కి రూపాయి చొప్పున అందజేస్తున్నారు. ఏటా ఆశ కార్యకర్తలకు యూనిఫారం ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా ఇవ్వడం లేదు. ఇటీవలే 36 గంటలపాటు ఆందోళన నిర్వహించిన కార్యకర్తలు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని మంత్రి యనమల రామకృష్ణుడు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా. డిమాండ్లు ఇవీ.. ∙కనీస వేతనం అమలు చేయాలి. ∙కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలి. ∙రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అర్హత కల్పించాలి. ∙104 సేవల బకాయిలు చెల్లించాలి. ∙రెండేళ్లుగా ఇవ్వని యూనిఫాంతో పాటు అలవెన్స్ చెల్లించాలి. ∙అర్హులైన ఆశలకు ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలి. .ఇప్పటికే శిక్షణ పొందిన వారిని సెకండ్ ఏఎన్ఎంగా తీసుకోవాలి. -
ఆత్మహత్యాయత్నంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళ
సర్పవరం (కాకినాడ సిటీ) : టీడీపీ మహిళా నాయకురాలు తనను వేధిస్తోందంటూ కాకినాడ ధర్మపోరాట దీక్షలో హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సమక్షంలో పురుగుమందు తాగి కాకినాడ ప్రభుత్వాసుపత్రి మెడికల్ విభాగం ఏఎంసీయూ–2లో చికిత్స పొందుతున్న మల్లాడి లక్ష్మి పరిస్థితి మూడురోజులైనా విషమంగానే ఉంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు సంధ్యకుమారి, అమృతవల్లీలకు వివాహం కాగా, మౌనికకు వివాహం కాలేదు. ఇదిలా ఉంటే తమ తండ్రి చేపలు వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడని, తల్లి లక్ష్మి జీజీహెచ్లో సెక్యూరిటీగా పనిచేస్తుందని కుమార్తెలు తెలిపారు. వేట నిషేధం ఉండడంతో ప్రస్తుతం అమ్మ ఆదాయంపైనే ఆధారపడ్డామని, అమె ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండడంతో తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కుమార్తెలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైద్యులు ఏడు రోజుల వరకు ఆమె పరిస్థితిని చెప్పలేమంటున్నారని, ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారని వారు రోధిస్తున్నారు. -
బాబు దిగజారుడుతనానికి పరాకాష్ట
కాకినాడ : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష సందర్భంగా వ్యవహరించిన తీరు ఆయన దిగజారుడు తనానికి పరాకాష్టగా నిలిచిందని కాకినాడ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసి దీక్షల పేరుతో ఖర్చు చేశారని మండిపడ్డారు. విజయవాడలో చంద్రబాబు చేసిన దీక్షకు మజ్జిగ, నీళ్ల కోసం రూ.నాలుగు కోట్లు ఖర్చు చేశారని, ఇక ప్రజలను తరలించడం, ఇతర ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. దీక్షలు చేస్తే హోదాలు వస్తాయా? అంటూ గతంలో వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసిన చంద్రబాబు ఎం దుకు దీక్ష చేస్తున్నారో ప్ర జలకు సమాధానం చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. జపాన్ తరహాలో ఉద్యమించాలంటూ నాడు ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉద్యమబాట పట్టడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసనలను ఆక్షేపిస్తూ ఆందోళనలు ఇక్కడి చేస్తే రావని, ఢిల్లీలో చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చిన చంద్రబాబు తాను మాత్రం ఇక్కడే ఎందుకు దీక్ష చేశారని కన్నబాబు నిలదీశారు. తన ప్రచార ఆర్భాటం కోసం అధికార యంత్రాంగంతోపాటు అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ అనేక జిమ్మిక్కులు చేస్తోందన్నారు. అనవసర వివాదాలను తెరపైకి తెచ్చి సమస్యను దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. -
చిత్ర హింసలకు గురైన వృద్ధురాలి మృతి
రాజమహేంద్రవరం క్రైం : మూడు నెలలు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. రాజా నగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో తనకు చిన్నమ్మ కుమార్తె చెల్లెలు వరుసయ్యే మంగాదేవి ఇంట్లో ఉంటోంది. కాళ్లు, చేతులు చచ్చపడిపోవడంతో మంచానికే పరిమితమైన పుష్పవతిని తనకు ఉన్న భూమి కోసం సంతకం చెయ్యాలంటూ మూడు నెలలుగా నిత్యం కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్ మిడియాలో పెట్టడంతో కలకలం రేగింది. స్థానికుల సహాయంతో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వం హాస్పటల్లో చేర్చారు. వృద్ధురాలి పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ కేసులో చిత్రహిసలకు గురిచేసిన నిందితురాలు ప్రగడ మంగాదేవిని బొమ్మురు పోలీసులు అరెస్ట్ చేశారు. -
దేశం’ నేతల సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం
కాకినాడ : ‘‘లక్షన్నరపోసి కొన్న స్థలంతో ఇల్లు కట్టేందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. మరికొంత సొమ్ము ఇస్తేగానీ ఇల్లు కట్టనిచ్చేది లేదని ఇబ్బందుల పాల్జేస్తున్నారు. టీడీపీ సమావేశాలకు రావాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కాదంటే దాడి చేసి కొడుతున్నారు. ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర ముఖ్యనేతల సమక్షంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం రేపింది. జిల్లా కేంద్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్లో శుక్రవారం జరిగిన టీడీపీ ధర్మ దీక్ష వేదికగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘మీ అండ చూసుకునే మా ప్రాంతంలోని టీడీపీ మహిళానాయకురాలు ఇలా వేధింపులకు పాల్పడుతోంది’ అంటూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చి అంతలోనే పురుగు మందు తాగేసింది. ధర్మదీక్ష జరుగుతోన్న దీక్షలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆమెను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. స్థలం కొనుగోలుపై వివాదం బాధితురాలి కథనం ప్రకారం.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే పోలినాటి సత్యవేణి నుంచి కాకినాడ మహాలక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన మల్లాడి లక్ష్మి సుమారు 40 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. దాదాపు లక్షన్నర సొమ్ము కూడా చెల్లించింది. కొన్న స్థలంలో ఇల్లు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంది. దీంతో స్థలం అమ్మిన సదరు టీడీపీ నాయకురాలు మల్లాడి లక్ష్మి వద్దకు వచ్చి మరికొంత సొమ్ము ఇస్తేగానీ ఇల్లు కట్టేందుకు వీలులేదంటూ హెచ్చరించింది. ఎంతగా బతిమాలినా ఆమె ససేమిరా అనడంతోపాటు ఎదురు తిరిగితే దాడి చేసేందుకు సైతం వెనుకాడలేదు. పైగా తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరిగితే తప్పనిసరిగా హాజరుకావాలని, ఆమె రాలేకపోతే కూతురినైనా పంపాలంటూ ఒత్తిడి చేసేది. వీటన్నింటిని అంగీకరించకపోవడంతో అనేక వేధింపులకు గురి చేస్తోందంటూ బాధితురాలు వాపోయింది. కుమార్తెపైనా దాడి.. మహిళకు చికిత్స సర్పవరం (కాకినాడసిటీ): బాలాజీచెరువు సెంటర్లో టీడీపీ దీక్షస్థలంలో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మల్లాడి లక్ష్మి (40)ని కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో తల్లిని చూసి కుమార్తె రోధిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కేవలం మా అమ్మ ధర్మపోరాట దీక్షకు వెళ్లకుండా డ్యూటీకి వెళ్లినందుకు తన జుట్టు పట్టుకుని గోడకు వేసి కొట్టిందని కుమార్తె మౌనిక వాపోయింది. -
డీజిల్ స్మాగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు..
సాక్షి, కాకినాడ : మినరల్ స్పిరిట్ పేరుతో డీజిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న భారీ రాకెట్ను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ అక్రమ దందా దుబాయ్ నుంచి కొనసాగిస్తున్నారు. కాకినాడ, చెన్నై కేంద్రంగా డీజిల్ అక్రమ దందా సాగుతున్నట్లు సమాచారం. దాదాపుగా 12 ప్రాంతాల్లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ కంపెనీలు, తప్పుడు డాక్యుమెంట్లతో డీజిల్ అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. 40 శాతం ధర తక్కువ చూపించి కస్టమ్స్ డ్యూటీ పన్ను ఎగవేస్తున్నారు. రూ. 17.7 కోట్ల విలువైన 285 కంటైనర్తు దిగుమతి అయినట్లు అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన డీఆర్ఐ బృందం నలుగురిని అరెస్టు చేసింది. అంతేకాక హవాల ఆపరేటర్ను కూడా అరెస్టు చేశారు. కోటి విలువైన 14 కంటైనర్ల డీజిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. -
మానవత్వం చాటిన న్యాయమూర్తి
కాకినాడ లీగల్ : రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని చూసిన హైకోర్టు జస్టిస్ శివశంకరరావు కారు దిగి పరిశీలించి వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైకోర్టుకు జస్టిస్ శివశంకరరావు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి బుధవారం వచ్చారు. అన్నవరంలో సత్యనారాయణస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరం కారులో వెళ్తుండగా పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పడి ఉన్న వృద్ధుడిని చూశారు. వెంటనే కారుదిగి వృద్ధుడిని పరిశీలించగా స్పహకోల్పోయి ఉన్నట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రధాన జిల్లా జడ్జి ఎన్.తుకారామ్జీకి ఫోన్లో సమాచారం తెలియజేసి ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రధాన జిల్లాజడ్జి పెద్దాపురం మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేశారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని వృద్ధుడికి ప్రాథమిక వైద్య సేవలు అందజేసి, అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులకు వివరాలు తెలియజేశారు. దీంతో కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకువెళ్లగా ఆస్పత్రిలో ముందుగా పేరు, ఊరు, ఎటువంటి సమాచారం లేని వ్యక్తులకు ఓపీ ఇవ్వలేమంటూ సిబ్బంది నిరాకరించారు. దీంతో న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. న్యాయమూర్తి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫోన్ చేసి అనాథకు వైద్యసేవలు అందజేయాలని సూచించారు. దీంతో అనాథను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించి వైద్యులకు, సిబ్బందికి వైద్యసేవలు అందజేయాలని సూపరింటెండెంట్ సూచించారు. పేరు, ఊరు చెప్పలేకుండా ఉన్న అతని మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో వైద్యులు అతనిని ప్రత్యేక వార్డులో ఉంచి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితంలేని ఆ అనాథకు క్షౌవరం చేయించి, శుభ్రంగా స్నానం చేయించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
ప్రజాగ్రహాన్ని చూసైనా కళ్లు తెరవండి
కాకినాడ : ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో సోమవారం విజయవంతంగా జరిగిన బంద్ రుజువు చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా బంద్ విజయవంతమైన సందర్భంగా కన్నబాబు సోమవారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రావడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశాయన్నారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీల వైపు మొగ్గు చూపడం వల్లే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. హోదా ఆవశ్యకతను తెలియజేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన నాలుగేళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలకన్నా పదవులు ముఖ్యంకా దని స్పష్టం చేస్తూ తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడంతోపాటు పది రోజులుగా జిల్లా అంతటా నిరసన దీక్షలు, ధర్నాలు, రైలురోకోలు వంటి ఎన్నో నిరసనలు తెలియజేసిందన్నారు. ఇన్నాళ్ళు నోరు మెదపని టీడీపీ నేతలు ఇప్పుడు రోడ్డెక్కుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి దీక్ష చేస్తాననడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామాలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని కన్నబాబు నిలదీశారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే అలాంటి ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. -
కాకినాడలో ఉద్యోగి అరాచకం
-
ఎస్పీ ఆఫీసు ఎదుటే కారు బీభత్సం
సాక్షి, కాకినాడ: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ఇండికా కారు హల్ చల్ చేసింది. సాక్షాత్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులను ఢీకొడుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కారును నడపటం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రాఫీక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఎస్పీ ఆఫీసు ఎదుట పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి తప్పించుకునే యత్నంలో ఇండికా కారు డ్రైవర్ పోలీసుల పైనుంచి దూసుకుపోయింది. కారు ఆపడం లేదని గ్రహించిన ఓ పోలీసు బారికేడ్ అడ్డు పెట్టినా అతడిని ఢీకొడుతూ డ్రైవర్ ఆ కారును నడిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయి. బానుగుడి వైపు వెళ్తున్న కారును ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు బైకర్స్ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులకు లిఫ్ట్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది. -
పోలీసులు తనిఖీలలో కారుతో హల్ చల్
-
టీడీపీ మహిళా ఎమ్మెల్సీపై కేసు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నేతల అవినీతి కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆకతాయిలకు..చెక్
భానుగుడి(కాకినాడ సిటీ): బాలికలు, మహిళలు ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం స్థానిక భానుగుడి సెంటర్లో కాకినాడ స్మార్ట్సిటీలో ఈవ్టీజింగ్ నివారణకు జిల్లా పోలీస్ విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. 2కే రన్ ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. జేఎన్టీయూకే అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై షీ టీమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం రాజప్ప మాట్లాడుతూ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 30 శాతం ప్రాధాన్యం పాటించామన్నారు. మహిళల గౌరవాన్ని, స్వేచ్ఛను భంగపరిచే అనుచిత ప్రవర్తన, వేధింపులను నిర్మూలించేందుకు షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, మఫ్టీలో షీటీమ్ల నిఘాలో కాకినాడ నగరంలో మహిళలకు మరింత భద్రతంగా రూపుదిద్దినందుకు ఎస్పీ, పోలీసు యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఎస్పీ విశాల్గున్ని మాట్లాడుతూ నగరంలో ఈవ్టీజింగ్ జరిగే ప్రదేశాల్లో ఒక మహిళా ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లతో షీ టీమ్ మఫ్టీలో రహస్య నిఘా ఉంచుతాయన్నారు. ఫిర్యాదులను 100 నంబర్కు ఫోన్ ద్వారాగానీ, ‘షీటీమ్కేడీఏ’ ఫేస్బుక్ అడ్రస్కు, వాట్సాప్ నంబర్ 94949 33233కు మెసేజ్ ద్వారా లేదా, కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్ పై అంతస్తులోని డీఎస్పీకి తెలియజేస్తే 24 గంటలలోపు ఆకతాయిలపై చర్య చేపట్టి భద్రత కల్పిస్తామన్నారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో బాలికలు, మహిళలకు ఎదురయ్యే ఆకతాయి వేధింపులను షీ టీమ్స్ అండతో ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రంపచోడవరం ఏఎస్పీ అజితావేజెండ్ల మాట్లాడుతూ మహిళల రక్షణకోసం ఏర్పాటైన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలని కోరారు. ఐడియల్ కళాశాల కార్యదర్శి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మాట్లాడుతూ మహిళలకు నేనున్నానని ఆత్మస్థైర్యం కల్పిస్తూ పోలీస్ షీటీమ్స్ వ్యవస్థ నిలవడం ముదావహమన్నారు. ముందుగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూకే ఆడిటోరియం వరకు పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల భాగస్వామ్యంతో 2కే రన్ సాగింది. ఈ రన్లో విజేతలుగా నిలిచిన బాలికలు జి.దివ్య, పుష్పవాణి, మోహితాప్రసన్న, రామలతలకు జేఎన్టీయూకే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప బహుమతులు అందజేశారు. ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్ఓ డాక్టర్ నందినీ సలారియా, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, డీఎస్పీలు, కళాశాల విద్యార్థినిలు, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. -
బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కాకినాడలో సీఐటీయు ధర్నా
-
పండుల వర్సెస్ గొల్లపల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అంటేనే రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రంకెలు వేస్తున్నారు. ఎంపీ పేరు ఎత్తితే చాలు ఎమ్మెల్యే చిర్రెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో తనదే పైచేయి అని, తన మాటే వేదవాక్కని, ఇందులో ఎవరి పెత్తనం కుదరదు అన్నట్టుగా గొల్లపల్లి వ్యవహరిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొస్తున్న వారిని ఆమడదూరంలో పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఒకరు. ఎంపీ రవీంద్రబాబు, రాపాక వరప్రసాద్లు ఒకే తాను ముక్కగా భావిస్తూ ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముందు ఎంపీ ప్రస్తావన తేడానికి టీడీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న ఆధిపత్య పోరులో ‘ముందుకెళితే నుయ్యి ... వెనక్కి వెళితే గొయ్యి’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారు. తొలి నుంచీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పోరు గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం గొల్లపల్లి సూర్యారావు యత్నించారన్న వాదనలున్నాయి. అయితే వేర్వేరుగా లాబీయింగ్ ద్వారా పండుల రవీంద్రబాబుకు టిక్కెట్ దక్కింది. దీంతో గొల్లపల్లి తట్టుకోలేక ఎంపీకి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారని సమాచారం. 2014 ఎన్నికల ఖర్చు కూడా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు దారితీసిందనే వాదనలున్నాయి. ఎన్నికల ఖర్చు విషయంలో ఎంపీ పండుల రవీంద్ర బాబు రాజోలు నియోజక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వర్గీయుల వాదన. రాజోలు నియోజక వర్గంలో ఎన్నికల ఖర్చుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. మిగిలిన నియోజక వర్గాలకు మాత్రం ఆయన దండిగా నిధులు పంపారని, రాజోలులో గొల్లపల్లిని ఓడించడం కోసమే పండుల అలా చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడాకి కారణమని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తనను దూరంగా పెట్టినప్పుడు తానెందుకు వెనక్కి తగ్గాలని ఎంపీ కూడా నియోజక వర్గం ఎప్పుడువచ్చినా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లరు. తన అనుయాయుల ఇళ్లకు వెళ్లి వెనుతిరగడం...ఇలా నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఆరోపణల దాడి... మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ప్రస్తుతం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుల మధ్య కాంట్రాక్టుల విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. ఇరిగేషన్, రోడ్డు పనులను తన ఆనుయాయులకు కట్టబెట్టి ఎమ్మెల్యే గొల్లపల్లి లబ్ధిపొందుతున్నారని రాపాక వర్గీయులు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. బినామీల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, డబ్బులిస్తేనే పని చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. మామిడికుదురు మండలం ఆదూరులో సొంతంగా పెట్టుకున్న కళాశాలకు కాంట్రాక్టర్లు, లబ్ధిపొందిన వారిని ఉపయోగించుకుంటున్నారని గొల్లపల్లిపై పరోక్ష ఆరోపణలకు దిగారు. ఆ కళాశాలకు అవసరమైన ఇసుకను అడ్డంగా తరలించేశారని ఆరోపిస్తూ అప్పట్లో రాపాక వరప్రసాదరావు ఆ కళాశాలకు వెళ్లి పరిశీలించి హడావుడి చేశారు. తన కళాశాలకు వచ్చి హల్చల్ చేయడమేంటని గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఇక, గొల్లపల్లి వర్గం కూడా రాపాకపై కౌంటర్ ఆరోపణలకు దిగింది. చింతలమోరిలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు వరప్రసాదరావు అండగా నిలిచారని ప్రత్యారోపణలకు దిగారు. తనకు శత్రువుగా తయారైన ఎంపీని కూడా గొల్లపల్లి వర్గం వదల్లేదు. కోటిపల్లి– నర్సాపూర్ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పులో చేతులు మారాయని పరోక్ష ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సన్మానంపైనా గ్రూపు రాజకీయాలు. కోటిపల్లి– నర్సాపూర్ రైల్వే లైన్కు పండుల కృషి చేశారని రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మానం చేస్తున్నట్టు కరపత్రాలు ముద్రించారు. దీన్ని టీడీపీలో ఉన్న గొల్లపల్లి వర్గం వ్యతిరేకించింది. ఎస్సీ సంక్షేమ సంఘానికి సంబంధం లేదని తమకు అనుకూల నాయకుల చేత ప్రెస్మీట్లు పెట్టి హడావుడి చేయించారు. అయినప్పటికీ రాపాక వర్గం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ రవీంద్రబాబును పిలిచి ఘనంగా సన్మానించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టినట్టు చేసింది. ప్రతీకారేచ్ఛ రాజకీయాలకు మరింత ఊపు ఇచ్చినట్టు అయ్యింది. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే, మధ్యలో రాపాక వరప్రసాదరావు రాజకీయాలతో రాజోలు టీడీపీ హాట్ హాట్గా ఉంది. ఎంపీ చెంత చేరిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందర్నీ ఎంపీ ఆదరిస్తున్నారు. తొలుత రాపాక పండుల రవీంద్ర చెంత చేరారు. రాపాకను వెంట వేసుకుని తిరుగుతుండడంతో గొల్లపల్లిలో ఆవేదన అధికమైంది. గత ఎన్నికల్లో టిక్కెట్కు పోటీపడ్డ బత్తుల రాము వర్గీయులను తొలుత ఎమ్మెల్యే దూరంగా పెట్టారు. తనకు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారన్న అనుమానంతో కక్ష పెట్టుకున్నారు. దీంతో ఆయన తప్పని పరిస్థితుల్లో ఎంపీ గూటికి చేరారు. ఇక, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముదునూరి చినబాబు (జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు)తో కూడా ఎమ్మెల్యేకు వైరం వచ్చింది.ఆయన కూడా ఎంపీ పక్కన చేరారు. ఇలా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు, రాపాక ఒక గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఎంపీని ఎవరు కలిస్తే వారిని వ్యతిరేకులుగా చూడటం మొదలు పెట్టారు. వారిని బహిరంగంగా తిట్టడం ప్రారంభించారు. అంతేకాకుండా ఎంపీ గ్రాంటుతో పనులు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న గ్రామ నాయకులతో తీర్మానాలు ఇవ్వకుండా, అధికారుల సహకారం లేకుండా ఎంపీకి అడ్డు తగులుతూ వస్తున్నారు. గొల్లపల్లికి కొరకరాని కొయ్యగా రాపాక ఎంపీతో విభేదాలు ఇలా ఉంటే...స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కూడా ఎమ్మెల్యే గొల్లపల్లికి తీవ్ర విభేదాలున్నాయి. ఎన్నికల్లో గెలిచాక రాపాకను ఎమ్మెల్యే దూరం పెట్టడం మొదలు పెట్టారు. రాపాక నిలదొక్కుకుంటే భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చనే భయంతో గొల్లపల్లి వ్యూహాత్మకంగా రాజకీయాలకు తెరదీశారు. దీన్ని గమనించిన రాపాక కూడా తనదైన శైలి రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్న అక్కసుతో గొల్లపల్లికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇదే అదనుగా చూసుకుని ఎంపీ రవీంద్రబాబుతో కలిసి ప్రయాణం సాగించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టేలా చేసింది. ఎంపీ, రాపాక లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలను ఎమ్మెల్యే గొల్లపల్లి మొదలు పెట్టారు. గొల్లపల్లి, రాపాక మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడానికి మరో కారణం కూడా ఉంది. రాపాక ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో చింతలమోరి గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరైంది. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యారావు ప్రతీకార రాజకీయాలకు శ్రీకారం చుట్టి రాపాక సొంతూరైన చింతలమోరిలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం ఇష్టం లేక శంకరగుప్తానికి మార్చారు. తన గ్రామానికి మంజూరైన లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వేరే గ్రామానికి మార్చుతారా? అని రాపాకలో కసి పెంచింది. ఇంకేముంది గొల్లపల్లి లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభించారు. -
ధ్వంస రచన .. అధికార భజన
తాండవ నదిలో పొక్లైనర్తో చేపట్టిన ఇసుక అక్రమ తవ్వకాలపై రైతులిచ్చిన ఫిర్యాదు మేరకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెళ్లి అడ్డుకోగా స్థానిక టీడీపీ నేతలు ప్రోత్సహించి కేసులు పెట్టించారు. దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదు చేయించారు. అక్రమాన్ని అడ్డుకున్నందుకు తప్పుడు కేసు పెట్టించారు. దీనిపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా న్యాయస్థానానికి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పెదపూడి మండలం చాపరం గ్రామంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు చింపేశారని ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తే అటువైపు (టీడీపీ నాయకుల) నుంచి కూడా ఫిర్యాదు తీసుకుని ఇటు వైపు వారిని కూడా అరెస్టు చేసిన ఘటన చోటుచేసుకుంది. కాకినాడలోని తారకరామనగర్లో ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు బలవంతంగా పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చేస్తుంటే బాధితులను పోలీసు స్టేషన్కు పిలిపించి, వెనక్కి తగ్గాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పెదపూడి మండలం శహపురం గ్రామంలో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని టీడీపీ నాయకులు ర్యాలీ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వైఎస్సార్పార్టీ నాయకుల మోటార్ బైక్లను ధ్వంసం చేశారు. దీనిపై అధికార టీడీపీ నాయకులు బైక్లు పాడైన వైఎస్సార్ పార్టీ నాయకులపైనే అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేశారు. కాపు ఐక్య గర్జన దాడి ఘటనలో సంబంధంలేని ఎస్సీ, బీసీలు, ఇతర కులాల నాయకులపై బలవంతంగా కేసులు పెట్టారు. వీరంతా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో అరెస్టులను తప్పించుకున్నా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోటనందూరు మండలం భీమవరపుకోట సర్పంచి జిగటాల వీరబాబు (వికలాంగుడు, ఎస్సీ)పై కేసు పెట్టారు. కోటనందూరు మాజీ జెడ్పీటీసీ పెదపాటి అమ్మాజీ (ఎస్సీ) అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారన్న వాదనలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా కేసులుండవు. ఒకవేళ పెట్టినా బెయిలబుల్ కేసులతో సరిపెట్టేస్తున్నారు. పోలీసులు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినా ఫర్వాలేదు గానీ టీడీపీ నాయకులపై మాత్రం ఈగ వాలకూడదన్నట్టుగా అధికారులు కాపాడుతూ వారి అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తున్నారు. తటస్థులు, ప్రతిపక్ష నేతలపై మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా నాన్ బెయిల్బుల్ కేసులు బనాయించి, అరెస్టులు చేసేవరకు వదలడం లేదు. ఇప్పుడిది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా నడుస్తున్న రెండు విధ్వంస ఘటనలే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ధ్వంసం ఘటనపై కేసులేవీ..? ప్రభుత్వ నిధులతో వేసిన రహదారిని ధ్వంసం చేసిన కేసును గాలికొదిలేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని కలెక్టర్ చేసిన ప్రకటన ఉత్తిదేనని తేలిపోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికార యంత్రాంగం దాసోహమైపోయిందని స్పష్టమైంది. కాకినాడ మహలక్ష్మీనగర్లో రహదారి ధ్వంసం చేసిన వివాదం నెల రోజులు దాటుతున్నా చర్యల్లేవు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) సోదరుడు సత్యనారాయణ, కార్పొరేటర్ వనమాడి ఉమాశంకర్తోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు రహదారిని ధ్వంసం చేశారు. రహదారి వేసిన ప్రాంతమంతా తమదని రౌడీయిజం చేసి, పొక్లెన్ల సాయంతో విధ్వంసం సృష్టించారు. ఈ వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమవడంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పథక రచన చేశారు. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని, సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ట్రైనీ కలెక్టర్తో విచారణ చేపడుతున్నామని, నిందితులెవరైనా విడిచిపెట్టేది లేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా లీకులు ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతకుముందు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ, సోదరుడు కుమారుడు ఉమాశంకర్ సహా ఏడుగురిపై హడావుడిగా కేసు నమోదు చేసి, బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసి ‘మమ’ అనిపించేశారు. దీనికంతటికీ టీడీపీ పాలక పెద్దల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. వెలుగుబంటి విధ్వంసంపైనా... కడియం మండలం వేమగిరిలో ప్రభుత్వానికి చెందిన కంకర గుట్టను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుడు వెలుగుబంటి వెంకటాచలం అక్రమంగా తవ్వేశారు. సుమారు 80 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా తవ్వేశారు. తవ్వకాలకు అడ్డొచ్చిన విద్యుత్తు స్తంభాలను కూల్చేశారు. అక్కడున్న ఇళ్లకు రక్షణగా నిలిచిన గోడను తొలిచేశారు. ఇళ్లకు ముప్పు వాటిల్లే విధంగా తవ్వకాలు జరిపేశారు. ఫలితంగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా తనకు అడ్డొచ్చిన మహిళపై అనుచితంగా వ్యవహరించారు. వీటిన్నింటిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.8.61 కోట్లమేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆమేరకు రికవరీ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ అరెస్టులు జరగలేదు. రికవరీ నోటీసుల వివరణ గడువు పూర్తయి వారాలు గడుస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైనా అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై ఇప్పుడు దళిత సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు. ఇలా చెప్పుకుపోతే జిల్లాలో అనేకం ఉన్నాయి. కానీ చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నేతలు ఏం చేసినా ఫర్వాలేదన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. -
సొంత తమ్ముడితోనే వివాహేతర సంబంధం
కాకినాడ రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే భార్య చంపిన సంఘటన శనివారం కాకినాడలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్న ట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు ముగ్గురు ఆడ పిల్లలు. హిమచందు తండ్రి రెండో భార్య కొడుకు (సొంత తమ్ముడు) భానుప్రసాద్తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుం ది. ఈ విషయం హరిప్రసాద్కు తెలిసి అనేక సార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పూలేదు. దీంతో భా ర్యా భర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని హిమచందు, భానుప్రసాద్ భావించారు. హత్య చేసేందుకు పథకం రూపొందించారు. శుక్రవారం రాత్రి హరిప్రసాద్ తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉండడంతో హరిప్రసాద్ను కొట్టి, ముఖంపై తలగడ పెట్టి నొక్కి చంపేశారు. భానుప్రసాద్ తన స్నేహితులతో కలిసి చనిపోయిన హరిప్రసాద్ను మోటార్ సైకిల్పై తీసుకెళ్లి రమణయ్యపేట కాలువ పక్కన ఉన్న డంపింగ్ యార్డులో టైర్లు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఉదయం హరిప్రసాద్ కోసం తండ్రి ఇంటికి వెళ్లగా హిమచందు బయటకు వెళ్లారని చెప్పింది. ఎంతకూ కన్పించకపోవడంతో హరిప్రసాద్ తమ్ముడు రాయుడు శ్రీను శనివారం ఉదయం సర్పవరం పో లీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోగా సగం కాలి ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సగం కాలిన మృతదేహం రాయుడు హరిప్రసాద్దేనని గుర్తించారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ భార్య హిమచందును, భానుప్రసాద్ను అతని తల్లిని, హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవివర్మ వివరించారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేయగా త్రీటౌన్ సీఐ దుర్గారావును దర్యాప్తునకు ఆదేశించినట్లు డీఎస్పీ రవివర్మ తెలిపారు. హరిప్రసాద్ను తగులబెట్టిన స్థలాన్ని డీఎస్పీ రవివర్మతో పాటు సర్పవరం సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై స్వామినాయుడు పరిశీలించారు. -
కాకినాడలో హోదా కోసం ఎందాకైనా..
-
‘వైఎస్ జగన్ నిర్ణయంలో విశ్వసనీయత ఉంది’
తూర్పుగోదావరి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంలో విలువలు, విశ్వసనీయత ఉందని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తన ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమన్నారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి ఉద్యమిస్తున్న నాయకుడు వైఎస్ జగనేనని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చట్టం చేసిన ప్రత్యేక హోదా కాదని.... ప్యాకేజీ కి ఒప్పుకునే అధికారం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పార్లమెంటు ముందు టీడీపీ ఎంపీలు బుడబుక్కల వేషాలు వేస్తూ ఆంధ్రుల పరువు తీస్తున్నారని విమర్శించారు. హోదాపై చంద్రబాబు వైఖరి ఏమీటో ఇప్పటికైన స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
సీతా.. ఎంత మారిపోయావ్రా!
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టు సుదీర్ఘ కాలం తర్వాత తనయుడిని చూసిన ఆ తల్లి సంబరపడిపోయింది. ‘సీతా.. ఎలా ఉన్నావ్రా?’ అంటూ ఆప్యాయంగా ముద్డాడింది. చిన్న పిల్లాడికి తినిపించినట్టు కంచంలో అన్నం తెచ్చి కొసరి తినిపించింది. ఎన్నో కబుర్లు చెప్పింది. ఏమిటిదంతా అనుకుంటున్నారా? భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ ఏపీ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కొద్ది విరామం దొరికింది. దీంతో ఆయన పార్టీ నేత బి.బలరాంకు మనసులో మాట చెప్పారు. ‘మా అమ్మను చూసి చాలాకాలం అయింది. ఒక్కసారి కాకినాడ వెళ్లి చూసొస్తా.. వాహనం ఏర్పాటు చేయగలరా?’ అని కోరారు. దానికాయన ‘మీరు వెళ్లటం ఎందుకు? అమ్మనే ఇక్కడకు (భీమవరం) తీసుకొద్దాం’ అని చెప్పగా ఏచూరి సున్నితంగా తిరస్కరించారు. తానే వెళ్లొస్తానని ఆదివారం కాకినాడ బయల్దేరారు. కాకినాడ కుళాయిచెరువు సమీపంలోని గాంధీపార్క్ వద్ద తన ఇంటికి వెళ్లే సమయానికి ఏచూరి మాతృమూర్తి కల్పకం పూజ చేస్తున్నారు. ఏచూరి రాక గురించి తెలియటంతో ఆమె వచ్చి.. ‘సీతా, ఎలా ఉన్నావ్ రా.. ఎంత మారిపోయావ్’ అంటూ కౌగిలించుకున్నారు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ‘ఎలా ఉన్నావమ్మా? మావయ్య వాళ్లు ఎలా ఉన్నారు?’ అంటూ ఏచూరి వాకబు చేశారు. భోజనం అనంతరం తిరిగి భీమవరం బయల్దేరారు. -
ప్రభుత్వాస్పత్రి ఓపి డిస్పెన్సరీలో అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపి డిస్పెన్సరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం. ఈ సంఘటనలో మందులు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆస్పత్రి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంటెక్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బాలాజీచెరువు: ఆయనో బాధ్యతాయుత వృత్తిలో ఉన్న ప్రొఫెసర్. ఉన్నత విలువలు బోధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తే దారితప్పాడు.. తన వద్ద చదివే విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థినుల ఫిర్యాదు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో సీఎస్ఈ, వీఎల్ఎస్ఐ విభాగాల్లో ఎంటెక్ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ల్యాబ్లో జరగాల్సిన ‘వైవా’ మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్టీ) డైరెక్టర్ ప్రొఫెసర్ కె.బాబులు క్యాబిన్లో నిర్వహించారు. ఈ సందర్భంలో అబ్బాయిలను త్వరగా పంపించి తమను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇరవై మందికి పైగా విద్యార్థినులతో ఆయన వ్యవహరించారని ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్లకు రాతపూర్వకంగా శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉందని, అలాంటి ఫ్యాకల్టీ తమకొద్దంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరికి మద్దతుగా ఇతర విభాగాలకు చెందిన విద్యార్థులు సంతకాలు చేశారు. ఐదుగురు సభ్యులతో కమిటీ.. ఎంటెక్ విద్యార్థినుల ఫిర్యాదుతో జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ కుమార్.. రెక్టార్ పూర్ణానందం చైర్మన్గా ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీ బాధిత విద్యార్థినులను పిలిచి మాట్లాడింది. వీరందరి దగ్గర స్టేట్మెంట్లను తీసుకున్నారు. ఆదివారం ప్రొఫెసర్ బాబులు వివరణ తీసుకున్నాక నివేదిక అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. -
కాకినాడ జేఎన్టీయూలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
-
వేసవికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పిఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07942) మార్చి 4, 11,18,25 తేదీల్లో, ఏప్రిల్ 1,8,15,22,29, మే 6,13,20,27, జూన్ 3,10,17,24 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్–రేణిగుంట రైలు (07941) మార్చి 5,12,19,26, ఏప్రిల్ 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్ 4,11,18,25 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.00కు రేణిగుంట చేరుతుంది. తిరుపతి–నాగర్సోల్ రైలు (07417) మార్చి 2,9,16,23,30 తేదీల్లో, ఏప్రిల్ 6,13,20,27, మే 4,11,18,25, జూన్ 1,8,15,22,29 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.55కు నాగర్సోల్ చేరుకుంటుంది. నాగర్సోల్–తిరుపతి రైలు (07418) మార్చి 3,10,17,24, ఏప్రిల్ 7,14,21,28, మే 5,12,19,26, జూన్ 2,9,16,23,30 తేదీల్లో రాత్రి 10.00 గంటలకు నాగర్సోల్లో బయలుదేరి రెండోరోజు ఉదయం 4.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. -
కాకినాడలో తమ్ముళ్ల గూండాగిరి
-
బ్రహ్మే భ్రమించేలా త్రీడీ బొమ్మ..
-
కాకినాడ ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు
-
'దేశం' గూండా గిరీ..
ఆయనో అధికారి పార్టీ ప్రజా ప్రతినిధి. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా సద్వినియోగమయ్యేలా చూడాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఎమ్మెల్యే. సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ సొమ్ముతో వేసిన రహదారిని జేసీబీతో నిర్దాక్షిణ్యంగా తన అనుచరులతో ధ్వంసం చేయించారు. 120 మీటర్లు ... సుమారు రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారిని ఎందుకు తవ్వేస్తున్నారని అడ్డగించిన స్థానికులపై కన్నెర్ర చేయడంతో వారు మిన్నకుండిపోయారు. అ పంచాయతీ అధికారులు మాత్రం ఎమ్మెల్యే అనుచరుల ఒత్తిడికి తలొగ్గి ‘రోడ్డా... మేము వేయలేదే’ అంటూ ముఖం చాటేస్తున్నారు. అదే నిజమైతే ఎవరి సొమ్ముతో ఆ రోడ్డు వేశారు? వేసిన రోడ్డును ఎమ్మెల్యే మనుషులు తొలగిస్తుంటే ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. సాక్షి, కాకినాడ: కాకినాడ మహాలక్ష్మి నగర్ శివారు ప్రాంతంలో సుమారు 15 రోజుల క్రితం గ్రావెల్ వేశారు. రెండు రోజుల కిందట సిమెంట్ రోడ్డు 50 శాతం పూర్తి చేశారు. మిగిలిన 50 శాతం శనివారం ప్రారంభిస్తుండగా ‘దేశం’ మద్దతుదారులు అక్కడకు చేరుకుని వీరంగం చేశారు. ఓ జేసీబీని తీసుకొచ్చి దగ్గరుండి మరీ ధ్వంసం చేసేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అన్న, అతని కుమారులు స్వయంగా దగ్గరుండి అక్కడి స్థానికులను నియంత్రిస్తూ ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. పంచాయతీ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో వేసిన స్థలాన్ని ఎలా తవ్వేస్తారంటూ ఎదురుతిరగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ స్థలంలో పంచాయతీ రోడ్డు ఎలా వేస్తున్నారంటూ ఎమ్మెల్యే అనుయాయులు ఎదురు తిరగడంతో స్థానికులు అధికార పార్టీకి ఎదురు వెళ్లలేక వెనుకడుగు వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి ఎకరాల కొద్ది స్థలాన్ని రహదారి మీదుగా కొనుగోలు చేయడంతో ఈ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ స్థలమేనని, గతంలో ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పాకలు వేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో వారిపై కేసులు పెట్టి బలవంతంగా తీయించేశారని, దీన్ని ఏళ్ల తరబడి రహదారిగానే వినియోగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎవరు వేశారు ఈ రహదారిని...? ఆ రహదారిని తాము వేయలేదంటూ ఇప్పుడు తూరంగి పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహరావు చెబుతున్నారు. అలాంటప్పుడు బయట వ్యక్తులెవరో 120 మీటర్ల రహదారిని సుమారు రూ.6 లక్షల వ్యయంతో ఎందుకు వేస్తారని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేకు చెందిన స్థలం కావడంతో పంచాయతీ అధికారులు భయపడి ఈ వ్యవహారంపై వెనుకడుగు వేశారని స్థానికులు మండిపడుతున్నారు. సర్వేలోను ‘పచ్చ’ పాతం: ఎమ్మెల్యేకు చెందిన స్థలానికి సంబంధించి సర్వేలో కూడా అధికారులు ‘పచ్చ’పాతంతో వ్యవహరించారని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో పంచాయతీ స్థలంగా ఉన్న ఆ ప్రాంతాన్ని సదరు ప్రజాప్రతినిధి అధికారంలోకి రాగానే ప్రైవేటు స్థలంగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డు దౌర్జన్యంగా తవ్వుతుంటే అడ్డుకున్న మహిళలపై ప్రజా ప్రతినిధికి చెందిన వ్యక్తులు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తూరంగి మాజీ సర్పంచి బలగం ప్రసన్నకుమార్, ఎస్సీ నాయకులు సిద్ధాంతపు రాజు, మల్లాడి రామచంద్రరావు తదితరులు ఎమ్మెల్యే అనుచరులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును ఆందోళనకారులు కలిశారు. అందరితో మాట్లాడిన తరువాతే ఏమైందీ తాను చెప్పగలనని వనమాడి చెప్పినట్లు ఆందోళనకారులు వివరించారు. -
కాలేజీలో సందడి చేసిన హీరో నాగ శౌర్య
-
వివాదంలో టీడీపీ పార్టీ కార్యాలయం
-
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జె.వి.ఆర్.కె.రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 07051 నంబరు కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 16, 17 తేదీల్లో రాత్రి 6 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30లకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు వయా విజయవాడ, గుంటూరు మీదుగా రాక పోకలు సాగిస్తుందని తెలిపారు. -
ఆగని నిలదీతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో సోమవారం జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామ సభల్లో కూడా నిలదీతల పరంపర కొనసాగింది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం, కొత్తపల్లి మండలం కొమరిగిరి, గోర్సల్లో తమ సమస్యలు పరిష్కరించని ఈ సభలు ఎందుకని అధికారులను నిలదీశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో సీపీఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ‘దశాబ్దాలు దాటుతున్నా ఈనాం భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ నేతలను దిగ్బంధనం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం పేగ గ్రామంలో గిరిజనులు ఏకంగా సభలో నిరసన తెలిపి బహిష్కరించారు. దేవీపట్నం మండలం కూడిపల్లి, చినరమణయ్యపేటలో పోలవరం ముంపు బాధితులు తమ నిరసన గళం వినిపించారు. సభను బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన సభలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. తన పట్ల టీడీపీ నేతలు అవలంబించిన తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సభను బహిష్కరించారు. సభలో తొలుత ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అరకొరగా అమలు చేస్తున్న పథకాలను, అమలు చేయని హామీలను, ప్రభుత్వ దుబారాను ఎండగడుతుండగా టీడీపీ శ్రేణులు లేచి అడ్డుతగిలి గలాటా సృష్టించారు. దానికి ప్రతిగా వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసి రసాభాసగా మారింది. దీన్ని నిరసిస్తూ జగ్గిరెడ్డి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు. -
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పుదుచ్చేరి మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మండిపడ్డారు. విశాఖలో మత్సకారులపై అసహనంతో మండిపడ్డ చంద్రబాబుపై మల్లాడి విమర్శలు గుప్పించారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులపై మండిపడటానికి చంద్రబాబు ఎవరంటూ ప్రశ్నించారు. తక్షణమే మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. యాభై సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు ఫించన్లు, బ్యాన్ పిరియడ్ రిలీఫ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఇవ్వలేందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పిన బాబు.. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు చేర్చలేదో వివరణ ఇవ్వాలని మల్లాడి డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ పాలనలో నలుగురు మత్స్యకారులని గెలిపించుకొని, ఒకరికి మంత్రి పదవి, మరో ఇద్దరు మత్స్యకార మహిళలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలంటూ చురకలంటించారు. -
మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా సందడి
-
అడుగుపెట్టి చూడ... అధ్వానమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు...అన్నారు పెద్దలు. సొంతింటి కలను సాకారం చేసుకోవడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికీ తెలుసు. అంత స్తోమత లేకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ‘హౌస్ çఫర్ ఆల్ పథకా’న్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘అందరికీ ఇళ్లు’ ఉండాలన్న లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమిటో నేటికీ స్పష్టత లేకపోయినా దాని నిర్మాణం పేరిట పూర్తి అజమాయిషీ చెలాయిస్తోంది. పోనీ అలా అయినా లబ్ధిదారులకు మేలు చేస్తుందా అంటే అదీ లేదు. నిర్మాణ బాధ్యతలను భుజానకెత్తుకుని ఇరుకు గదులు...ఆపై ‘సన్షేడ్ లేని ఇళ్లు, కప్ బోర్డుల్లేని గదులను నిర్మిస్తోంది. ఇవి చాలదన్నట్టు వాస్తు చూడకుండా నిర్మాణం చేపట్టేస్తున్నారు. ఇప్పుడీ నిర్మాణాలపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వస్తువులు భద్రపరుచుకోవడానికి వీల్లేని ఇళ్లు తమకెందుకని నిలదీస్తున్నారు. శనివారం ఆ ఇళ్ల పరిశీలనకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణకు ఆ అసంతృప్తి సెగ తాకింది. కట్టిన ఇళ్లు నాలుగు కాలాలపాటు ఉండాలని భావిస్తారు. మళ్లీ మళ్లీ మదుపు పెట్టే పరిస్థితి ఉండకూడదని ఆలోచిస్తారు. అందుకే ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు దగ్గరి నుంచి అన్ని సౌకర్యాలున్నాయా లేవా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ఏదోరకంగా కట్టించి ఇచ్చేస్తాం....వాటిలోనే ఉండండన్నట్టుగా వ్యవహరిస్తోంది. వాస్తవంగా కొత్తగా నిర్మించినప్పుడే అన్నీ చూసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇలాగే కడతాం...ఏదైనా మార్పులు చేసుకోవల్సి వస్తే తర్వాత చేసుకోండన్నట్టుగా ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద పెద్దాపురంలో నిర్మిస్తున్న ఇళ్ల విషయంలో ముందుకెళ్తోంది. ఇప్పుడా ఇళ్లు మేడిపండు చందంగా తయారయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దాపురం పట్టణంలో తొలి విడతగా సుమారు 1734 ఇళ్ల నిర్మాణాలను ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద గృహ నిర్మాణం చేపట్టారు. రెండో దఫాగా సుమారు 1676 ఇళ్లు మంజూరు కాగా వాటిని కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక వాలుతిమ్మాపురం రోడ్డులో నిర్మించే ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఏపీ టిడ్కోకు అప్పగించగా ఓ బడా కంపెనీతో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇళ్ల నిర్మాణాలను మూడు విభాగాలుగా నిర్మిస్తున్న పాలకులు, అధికారులకు కూడా ఏ ప్లాన్ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో తెలియని ఆయోమయ స్థితిలో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. వరండా, గదులు కూడా ఇరుకుగా నిర్మించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్క ఇటుక వాడకుండానే అధునాతన టెక్నాలజీ పేరుతో స్లాబ్ పద్ధతిలో గోడ నిర్మాణాలు చేపడుతోంది. ఇదిలా ఉంటే గదుల్లో ఎక్కడా సన్షేడ్లుగాని, కప్ బోర్డులు గానీ లేవు. వీటి నిర్మాణం జోలికి వెళ్లలేదు. అవి లేకపోవడంతో లబ్ధిదారులు తమ వస్తువులు భద్రపరుచుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ దిశగా ఆలోచించ లేదు. ఇక కేటగిరీ 2 కింద చేపడుతున్న నిర్మాణాల్లో ఈశాన్యంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇది వాస్తుకు విరుద్ధమని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలే అప్పు...ఆపై లోపాలా ? ప్రభుత్వం నిర్దేశించిన మూడు కేటగిరీల్లోనూ లబ్ధిదారుడికి రూ.3 లక్షలకుపైగా రుణభారం పడుతుంది. దీన్ని చెల్లించుకోవడమే పేద, మధ్య తరగతి వారికి తలకు మించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో సన్ షేడ్ల్లేని ఇళ్లు, కప్బోర్డులు లేని గదులు నిర్మిస్తే వాటి కోసం మళ్లీ మదుపు పెట్టాల్సి ఉంటోంది. అలాగే వాటి కోసం కొత్త గోడలపైన పునర్నిర్మాణం చేయవల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి లబ్ధిదారులు నిలదీస్తుంటే ఏర్పాటు చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంత్రి నారాయణకు నిరసన సెగ ఇరుకు గదులు, సన్షేడ్లు, కప్ బోర్డుల్లేవన్న విషయాన్ని గుర్తించిన లబ్ధిదారులు శనివారం ఆ ప్రాంతానికి వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణను నిలదీశారు. మహిళలంతా మంత్రిని చుట్టుముట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక సన్షేడ్లు, కప్ బోర్డులు ఏర్పాటు చేస్తామని సర్దిచెప్పే ప్రయత్నం మంత్రి చేశారు. పూర్తి స్థాయి వసతులు లేవు అన్ని వసతులతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. కనీస వసతులు లేకుండా ఇరుకు గదులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. సన్సైన్, కప్ బోర్డులు లేకుంటే సామాన్లు పెట్టుకోవడానికి లేకుండాపోతుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. – సుందరపల్లి సుజాత, లబ్ధిదారులు, పెద్దాపురం. రుణభారం తప్పదు... నాణ్యత కనబడడం లేదు ‘అందరికీ ఇళ్లు’ పేరిట ఇళ్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం లబ్ధిదారులకు రుణభారం తప్పడం లేదు. ఏళ్ల తరబడిగా ఇచ్చిన రుణాన్ని చెల్లించేందుకు సిద్ధపడ్డా కనీస ఇటుక లేని ఇళ్లు నిర్మిస్తున్నారు. ఎంతవరకు నాణ్యతగా నిలబడతాయో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆధునిక ఇళ్ల పేరిట విశాలమైన గదులు లేకుండా ఇరుకుగా నిర్మిస్తున్నారు. ప్రశ్నిస్తే చూడడానికి బాగున్నాయా..? లేదా...? అంటున్నారే తప్ప వసతులు కల్పిస్తున్న దాఖలాలైతే కనబడడం లేదు. – కంపర పార్వతి, స్థానికులు, లబ్ధిదారు, పెద్దాపురం -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వరుస పండుగల నేపథ్యంలో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిల్చార్–బెంగళూరు కాన్ట్ ప్రత్యేక రైలు (02552) డిసెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సిల్చార్లో బయలుదేరి రెండో రోజు ఉదయం 10.00కి బెంగళూరు కాన్ట్ చేరుకుంటుంది. కాగా, హైదరాబాద్–తిరుపతి రైలు (07441) 27న సాయంత్రం 6.00కు హైదరాబాద్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.00కు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి–హైదరాబాద్ రైలు (07442) 28న మధ్యాహ్నం 2.15కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ పోర్ట్ రైలు (07447) 29న సాయంత్రం 6.50కు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. -
కాచిగూడ–కాకినాడ ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ (07452/07453) ప్రత్యేక రైలు ఈ నెల 23న (శనివారం) సాయంత్రం 7.50 కి కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ (సోమవారం) రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు. -
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
కాకినాడ: ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల సమక్షంలో సహచర విద్యార్థి తల్లిదండ్రులు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన అతడి బంధువులు స్కూల్పై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. చివరకు దిగివచ్చిన యాజమాన్యం రూ.5.50 లక్షలు పరిహారంగా చెల్లించడంతో వివాదానికి తెరపడింది. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. కాకినాడ శశికాంత్ నగర్ సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కనపర్తి యువకిషోర్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఏడో తరగతి విద్యార్థితో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువకిషోర్ను మరో విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పాఠశాల ఆవరణకు పిలిపించి గట్టిగా మందలించి చేయి చేసుకొన్నారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్తో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకిషోర్ మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లకుండా రాజేశ్వరినగర్లోని ఇంటి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సమాచారం తెలుసుకొన్న తల్లి సత్యవేణి, తండ్రి రాంబాబులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే విద్యార్థి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషయం తెలుసుకున్న బంధు మిత్రులు మృతదేహంతో స్కూల్ ఆవరణకు చేరుకొని ఆందోళనకు దిగారు. అక్కడ ఫర్నిచర్ను మరికొన్ని వస్తువులను దగ్ధం చేశారు. పోలీసులు విద్యాశాఖాధికారులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వివాద సమాచారం తెలుసుకొన్న యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపింది. సిబ్బంది కూడా గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకొన్న యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థి బంధువులతో చర్చించింది. జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పి రూ. 5.50 లక్షలు పరిహారంగా అందజేసి వివాదానికి ముగింపు పలికింది. వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో విద్యలో రాణించలేక మనస్తాపంతో ఉరివేసుకొన్నట్టుగా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అజ్ఞాతంలోకి టీడీపీ మహిళా ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులు పట్టించుకోలేదని ఇప్పటికే అలక మీదున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మరోసారి తన అక్కసును వెళ్లబుచ్చారు. తనను అవమానించేలా వ్యవహరించారని బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త, రూరల్ ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా మంత్రులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న బీచ్ ఫెస్టివల్కు ఆదిలోనే నేతల షాక్ తగిలినట్టయ్యింది. భర్తను వేదికపైకి పిలవలేదని.. గతేడాది జరిగిన బీచ్ ఫెస్టివల్లో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. సీఎం సమక్షంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి ఆమె భర్త సత్తిబాబును పిలవకపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక వద్ద నిరసనతో పాటు ఆందోళన చేశారు. వేదికపైకి ఎక్కిన ఎమ్మెల్యేను కిందికి దిగిపోవాలని పిల్లి అనుచరులందరూ పెద్ద పెద్ద నినాదాలతో హల్చల్ చేశారు. వాస్తవానికి, ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఏ పదవిలోనూ లేని పిల్లి సత్తిబాబును పిలవాల్సిన అవసరం లేదు. అధికారులు అనుసరించిన తీరు సరైనదే. కానీ ఎమ్మెల్యే భర్త అన్న హోదాలో పిలవాలన్న డిమాండ్తో పరిస్థితి చేయిదాటిపోతుండడంతో సీఎం జోక్యం చేసుకుని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలిచారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పట్టించుకోలేదన్న ఆవేదన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల నుంచి ప్రారంభోత్సవం వరకు తనను పట్టించుకోలేదన్న ఆవేదనతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు ఉన్నారు. అన్నీ తమకు తెలిసే జరగాలన్న అభిప్రాయంతో ఉన్న వారిని అధికారులు పట్టించుకోలేదు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం రగిలిపోతూ వచ్చింది. ప్రారంభోత్సవానికి గైర్హాజర్ అవమాన బాధతో కుంగిపోయి ఏకంగా ప్రారంభోత్సవానికి గైర్హాజయ్యారు. తమ ఎమ్మెల్యేకు పరాభవం జరిగిందని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, సర్పంచ్లు, ఇతర నాయకులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ పరిణమాలను గమనించిన మంత్రులు కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మంగళవారం ఉదయం నుంచి ‘ఎమ్మెల్యే అనంతలక్ష్మి’ ఫ్యామిలీకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎమ్మెల్యే, ఆమె భర్త, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బుజ్జగింపు కుదరలేదు. ఎంత యత్నించినా ఫోన్లో కూడా ఎమ్మెల్యే అందుబాటులో రాకపోవడంతో చేసేదేం లేక షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు కానిచ్చేశారు. అక్కసుతోనే.. అవమాన భారంతో రగిలిపోతున్న రూరల్ ఎమ్మెల్యేకు అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం మరో సంకటంగా పరిణమించింది. వీఐపీ పాసులు తక్కువగా జారీ చేయడం గాయంపై కారం చల్లినట్టయ్యింది. పాసుల విషయంలో నియంత్రణ పాటించడంతో రూరల్ ఎమ్మెల్యే తట్టుకోలేక పోయారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమానికి పాసుల పరిమితి ఏంటంటూ అధికారులపై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇదే సందర్భంలో కొన్ని రోజులుగా ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కినుక వహించారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పలకలేదని, ఏర్పాట్లలో కార్పొరేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఫెస్టివల్కు ముందు నిర్వహించిన 2కే రన్కు ఆహ్వానించలేదని, తన సలహా లేకుండా, మాట వరస చెప్పకుండా ఏర్పాట్లన్నీ చేశారని, ప్రోటోకాల్ విషయంలో మేయర్కిచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదని, రూరల్లో జరిగిన కార్యక్రమంలో మేయర్కు పెద్దపీట వేయడమేంటన్న అక్కసుతో అలకబూనారు. -
రీచ్... ఫెస్టివల్
మంగళవారం సాయంత్రం నుంచి కాకినాడ సాగర తీరాన జరగనున్న బీచ్ ఫెస్టివల్కు సర్వం సిద్ధమవుతోంది. లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. తొలిరోజున ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నేప«థ్య గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ కాకినాడకు సోమవారం రాత్రి చేరుకున్నారు. కాకినాడ రూరల్: సువిశాల సాగరతీరం కాకినాడ సొంతం. నిరంతరం అలల సవ్వడులతో, పాలనురగను పోలిన తరంగాలతో.. ఇసుక తిన్నెల అందాలతో అలరారే ఈ ప్రాంతం జిల్లాకే పెట్టని ఆభరణంగా అభివర్ణిస్తారు. అయితే పాలనా యంత్రాంగం దీనిని అభివృద్ధి చేసేలా ఆలోచిస్తే ప్రపంచ పర్యాటక పటంలో కాకినాడ స్థానం సుస్థిరమవుతుంది. కాకినాడ తీరాన్ని ఆనుకొని ఉన్న మడ అడవులు, సముద్రం మధ్యలో ఉన్న హోప్ఐలాండ్ ద్వీపం జిల్లాకే తలమానికంగా ఉన్నా వీటి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంపై పర్యాటకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొరియాను పోలిన తీరం మన తీర ప్రాంతం దక్షిణ కొరియాను పోలి ఉంది. అక్కడి బీచ్ అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వల్ల నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంది. తద్వారా ఎంతో ఆదాయాన్ని సైతం సమకూర్చుకోగలుగుతోందని పర్యాటక శాఖ అధికారులు సైతం చెబుతుంటారు. ఆ తరహాలోనే కాకినాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేశామని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. మన జిల్లాలో సుమారు 160 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. దీని అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేయడం లేదనే చెప్పాలి. అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు చొరవతో.. కాకినాడ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా 2013లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు సాగరసంబరాల పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. దీంతో కాకినాడ బీచ్ అంతర్రాష్ట్ర ఖ్యాతిని సంపాదించింది. ఐదేళ్లుగా ఈ ప్రాంతానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. ఇదే ప్రాంతంలో అప్పట్లోనే హరితా రిసార్ట్స్ పేరుతో ప్రత్యేక బీచ్ ఏర్పడడం దానిలో పర్యాటకశాఖ రూ.4.5 కోట్ల వ్యయంతో 18 ఏసీ కాటేజీలను నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఈ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.45 కోట్ల వ్యయంతో వివిధ రకాల భవనాలతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా పనులు చేట్టారు. అయినా పర్యాటకాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డామనే చెప్పాలి. అభివృద్ధి జరిగితే అద్భుతమే.. ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి కాకినాడ, ఉప్పాడ, అద్దరిపేటల మీదుగా విశాఖపట్నం వరకు ఎక్కడా వంపులు లేని తీరం ఈ జిల్లా ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాకినాడ బీచ్లో సరైన సౌకర్యాలు లేకపోయినా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే బీచ్ ప్రాంతం ప్రజలు, పర్యాటకులతో నిండిపోతుంది. కొరియా తీరాన్ని పర్యాటకశాఖాధికారులు సందర్శించి ఆ తరహాలో అభివృద్ధి చేయగలిగితే పర్యాటకంగా ప్రాచుర్యం సాధించవచ్చంటున్నారు. కానరాని సౌకర్యాలు మన జిల్లాలో ఐదేళ్లుగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్ అయిన తరువాత దానిపై ఎటువంటి శ్రద్ధ కనబరచడంలేదు. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా వాటి అభివృద్ధి కోసం నిధులు వెచ్చించక పోవడం, కనీస సౌకర్యాలకు దూరంగా ఉండడంతో పర్యాటకుల సందర్శన తక్కువగా ఉంటోంది. హరితా రిస్టార్స్ బీచ్లో ఇప్పటికే బార్ అండ్ రెస్టారెంట్, మీటింగ్హాల్, జిమ్, 18 కాటేజీలు నిర్మించినా పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులో లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం బీచ్లో రూ.45 కోట్ల వ్యయంతో లేజర్షో, వాటర్ఫౌంటెన్, గ్యాలరీ కన్వెన్షన్ హాళ్లు, ల్యాండ్ స్కేపింగ్, సస్పెన్షన్ బ్రిడ్జి వంటి పనులు చేస్తున్నారు. పర్యాటకులకు నిత్యం తాగునీరు, ఆహారం అందించే ఫుడ్కోర్టులు, ఇతర షాపింగ్లు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. బీచ్లో పడక కుర్చీలు, టెంట్లు, బీచ్ ప్రాంతంలో సీ మోటార్బైక్, వాటర్ స్కైయింగ్, తినుబండారాల స్టాల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే షటిల్ సర్వీసులు కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్కు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా షటిల్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ విశాల్గున్ని వివరించారు. బీచ్ ఫెస్టివల్ ప్రాంతాన్ని ఆయన సోమవారం సందర్శించి పరిశీలించారు. బీచ్లో వేదిక, ప్రత్యేక అతిథులు, అతిథుల గ్యాలరీ, పార్కింగ్ స్థలాలు, షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాలన్నీ పరిశీలించి బీచ్ ఫెస్టివల్కు వచ్చిన ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్కు 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ట్రాఫిక్ పర్యవేక్షణకు నియమించామని, ఆయన ఆధ్వర్యంలో పార్కింగ్ తదితర అంశాలను సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా షటిల్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేశామని, దీనివల్ల దొంగతనాలు నిరోధించే వీలుంటుందన్నారు. అదే విధంగా నాలుగు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పిఠాపురం- గోర్స రైల్వే గేట్ దగ్గర ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఏడిదకు చెందిన నందిన సూరిబాబుగా గుర్తించారు. యువతి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సాగరతీరంలో ఉప్పొంగిన ‘శ్రియా’భిమానం
సాక్షి, కాకినాడ: ప్రముఖ సినీ హీరోయిన్ శ్రియ రాకతో కాకినాడలో సందడి నెలకొంది. మెయిన్రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్మాల్ను ఆమె బుధవారం ప్రారంభించారు. ఆ షాపింగ్ మాల్ పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రియ అభిమానులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో అభిమానులను నియంత్రించారు. ఉదయం 11 గంటలకు శ్రియ జ్యోతి ప్రజ్వలన చేసి చందన షాపింగ్మాల్ను ప్రారంభించారు. ఆమెకు చందన బ్రదర్స్ అధినేతలు చందన రమేష్, చందన నాగేశ్వర్, అల్లక మల్లిఖార్జునరావు, సంప్రదాయ దుస్తులతో చందన సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రియ షాపింగ్మాల్ ఏర్పాటైన ఐదుఫ్లోర్లను సందర్శించి, వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలను తిలకించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన చందన షాపింగ్మాల్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా, అందుబాటు ధరల్లో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ‘చందన’ ప్రత్యేకతను కొనసాగిస్తాం.. చందన అధినేతలు రమేష్, నాగేశ్వర్, మల్లిఖార్జునరావు మాట్లాడుతూ పురుషుల రెడీమేడ్ దుస్తుల నుంచి ఫ్యాన్సీ, పట్టుచీరలు, జ్యూయలరీ, ఫుట్వేర్, వన్గ్రామ్ గోల్డ్, బంగారు, వెండి ఆభరణాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. పేదల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటులో నాణ్యమైన వస్త్రాలు అందించడంలో తమకున్న ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, మేయర్ సుంకర పావని, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్ కె.శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూకేకు దక్కని చోటు
సాక్షి, బాలాజీచెరువు(కాకినాడసిటీ): సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. విదేశీ వర్సిటీలతో కోర్సుల ఒప్పందాలు, మ్యూక్స్ ఆన్లైన్ కోర్సుల నిర్వహణతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నామంటూ పత్రికా ప్రకటనలు విడుదల చేసే వర్సిటీ అధికారులు ప్రపంచస్థాయి వర్సిటీ ర్యాంకుల్లో జేఎన్టీయూకేకు చోటు కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నాం.. వర్సిటీకి తగిన గుర్తింపు కోసం అన్ని విభాగాలు కలిసికట్టుగా పోరాడదామన్న ఆలోచన లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్సిటీలో ఏదైనా డైరెక్టర్ పోస్టు ఖాళీ అయితే ఆ పదవిని తమకున్న అధికార, ధన, కుల బలాలతో సర్వశక్తులూ ఒడ్డి దక్కించుకునే అధికారులు జేఎన్టీయూకే అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇటీవలే విడుదల చేసిన క్యూఎస్ ర్యాంకుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న జేఎన్టీయూ కాకినాడకు స్థానం లేకపోవడం విస్మయానికి గురి చేసింది. విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ఆసియా బ్రిక్స్ ర్యాంకులు ఇచ్చే క్యూ ఎస్ సంస్థ విడుదల చేసిన 2018 ఫలితాల్లో జేఎన్టీయూ కాకినాడ ఎక్కడా కనిపించడకపోవడం గమనార్హం. ఏపీ ఎంసెట్, పీజీ సెట్, పోలీస్ రిక్రూట్మెంట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహిస్తున్న వరిర్సిటీకి గుర్తింపు రాలేదు. అకడమిక్, పరిశోధన, అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, వర్సిటీ ప్రతిష్ట తదితర అంశాలను ఆధారంగా అందజేసే ఈ ర్యాంకులలో జేఎన్టీయూ కాకినాడకు స్థానం లభించలేదు. ఏపీలో అనంతపురం, వైజాగ్ ఏయూ, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు 500 లోపు ర్యాంకులు సాధించగా జేఎన్టీయూ కాకినాడ దరిదాపుల్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచేలా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు తగ్గకుండా సాంకేతిక యూనివర్సిటీలు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నా దానికి తగ్గట్టుగా వర్సిటీ అధికారులు కృషి చేయడంలేదు. రాష్ట్ర విభజనకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ అంటూ మూడుగా విభజించాక జేఎన్టీయుహెచ్ తెలంగాణాలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీయూ అనంతపురం, కాకినాడ ఉన్నాయి. ప్రతిభ చూపిన నాలుగు వర్సిటీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్రువీకరణ పత్రాలను ఆయా వర్సిటీల వీసీలకు అందజేస్తున్న నేపథ్యంలో ఆ అదృష్టం జేఎన్టీయూకేకు లేదు. ప్రస్తుత ఉపకులపతి అభివృద్ధి, పరిపాలనపై పెద్దగా దృష్టిసారించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించుకున్న ముఖ్యమంత్రి ఆ వర్సిటీకి గుర్తింపురాకపోవడంపై గల కారణాలు తెలుసుకుంటారని వర్సిటీ ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు. -
తన వైఖరి స్పష్టం చేసిన కాపు ఉద్యమనేత
సాక్షి, కాకినాడ : కాపు రిజర్వేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎదురుచూస్తామని.. అప్పటికీ కాపు రిజర్వేషన్లు అమలుకాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏపీ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పదర్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన కాపు జేఏసీ కార్యాచరణ సదస్సుకు 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు, ఉద్యమనేత ముద్రగడ పాల్గొన్నారు. కాపు జేఏసీ సదస్సులో ముద్రగడ పలు అంశాలను ప్రస్తావించారు. 'పేద వారికి రిజర్వేషన్లు కావాలన్నది నా ఆశ. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందాలంటే రిజర్వేషన్నది కచ్చితంగా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గించకూడదని మనవి చేస్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండానే కాపు రిజర్వేషన్లు అమలుచేయాలన్నది ప్రధాన డిమాండ్. ఏళ్ల తరబడి కోరుతున్నా కాపు రిజర్వేషన్లపై ముందడుగు పడటం లేదు. ఉద్యోగ, ఇతర రంగాలతో పాటు, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలి. అలా జరిగితే అందరికీ సమాన అవకాశాలుంటాయని' కాపు నేత ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు. -
'దేశం' లో రగడ
కాకినాడ: కో ఆప్షన్ ఎన్నిక టీడీపీలో చిచ్చు రేపుతోంది. ఐదు పదవుల కోసం పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కమ్మ సామాజికవర్గానికి, ముస్లిం మైనార్టీ వర్గానికి కో–ఆప్షన్ ఇచ్చే సభ్యత్వం అంశంపైనే వివాదం నడుస్తోంది. కమ్మ వర్గానికి కో–ఆప్షన్ ఇవ్వాలని ఇప్పటికే హైకమాండ్ నిర్ణ యం తీసుకోగా, ఇందుకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ససేమిరా అన్నారు. మరోపక్క మైనార్టీ కోటాలో ఓ ముస్లిం మహిళకు పదవి ఇవ్వాలన్న నిర్ణయంపై టీడీపీలోని ముస్లింలు ఎదురు తిరిగారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు మొత్తం ఐదు పదవులను తనకు నచ్చినవారికే ఇచ్చేందుకు వనమాడి చేస్తున్న ప్రయత్నాలపై రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఈ వ్యవహారం టీడీపీ పెద్దలకు శిరోభారంగా మారింది. కమ్మవర్గానికి మొండిచెయ్యి? కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడంపై అప్పట్లో ఆ వర్గానికి చెందిన నేతలు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. దీంతో మంత్రులు, పార్టీ ఎన్నికల ఇన్చార్జ్లు జోక్యం చేసుకుని కో–ఆప్షన్ పదవి ఇస్తామంటూ అప్పట్లో కమ్మ వర్గాన్ని సముదాయించారు. ఆ మేరకు మాజీ కార్పొరేటర్ ముళ్ళపూడి రాంబాబు కో–ఆప్షన్ పదవి కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆయన ఎంపికపై సానుకూలంగా లేని కొండబాబు.. ప్రత్యామ్నాయంగా అదే సామాజికవర్గానికి చెందిన పుచ్చకాయల మహాలక్ష్మిని తెరపైకి తెచ్చారు. చివరి క్షణంలో ఆమె దరఖాస్తు సాంకేతికంగా చెల్లదని తేలింది. దీంతో ఇప్పుడు ముళ్ళపూడి రాంబాబుకు పదవి ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. అయితే తన మాటే నెగ్గాలన్న పట్టుదలతో కొండబాబు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేశారని పార్టీ నేతల సమాచారం. మాజీ కార్పొరేటర్లు యాళ్ళ రామకృష్ణ, శీకోటి అప్పలకొండ, మాజీ కౌన్సిలర్ గుండవరపు శాంతకుమారికి కో–ఆప్షన్ ఇచ్చేందుకు దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. మాజీ కౌన్సిలర్లు గుత్తుల రమణ, చింతపల్లి చంద్రశేఖర్, జీవీఎస్ శర్మ, కింతాడ వెంకట్రావు, కడారి భవాని, రాయుడు కనకదుర్గారత్నం కూడా పదవిని ఆశిస్తున్నా వారికి అవకాశాలు అంతంతమాత్రమేనని అంటున్నారు. ఇటీవలి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కో–ఆప్షన్ అవకాశం లేదంటూ పార్టీ నేతలు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. మైనార్టీ వర్గాల్లో జగడం మైనార్టీ కోటాలో ఇద్దరికి కో–ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ఓ ముస్లిం మైనార్టీ మహిళకు పదవి ఇచ్చేందుకు కొండబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఆమె భర్తకు జిల్లా పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్ష పదవితోపాటు ఓ నామినేటెడ్ పదవి కూడా ఉన్నందున ఆమెకు ఎలా ఇస్తారంటూ మైనార్టీ నేతలు కొండబాబుతో బాహాటంగానే వాగ్వాదానికి దిగారని అంటున్నారు. పురుషుల కోటాలో పార్టీలో పని చేసిన ముస్లిం మైనార్టీకి అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టు పడుతున్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల భేటీ కో–ఆప్షన్ ఎన్నికతోపాటు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి మేయర్ సుంకర పావని చాంబర్లో ఆదివారం సమావేశమయ్యారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో కో–ఆప్షన్ అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. సమావేశం వివరాలను మాత్రం నేతలు వెల్లడించలేదు. రెబల్ వైపే మొగ్గు ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్రంగా బరిలో దిగిన మాజీ కార్పొరేటర్ శీకోటి అప్పలకొండ వైపు ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నారన్న సమాచారం పార్టీ నేతలకు మింగుడు పడడంలేదు. రెబల్కు అవకాశం కల్పించి హైకమాండ్ సిఫారసు చేసిన ముళ్ళపూడి రాంబాబు పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు సీనియర్ నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా కో–ఆప్షన్ అభ్యర్థిత్వాలను సోమవారం ఉదయం హైకమాండ్ ద్వారా ప్రకటించే అవకాశం ఉందని, చివరి క్షణంలో కొండబాబు నిర్ణయాన్ని కాదని ముళ్ళపూడి రాంబాబు పేరు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. మొత్తంమీద కో–ఆప్షన్ వ్యవహారం టీడీపీలో కలకలం రేపుతోంది. -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
సాక్షి, కాకినాడ : కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. టైర్లకు నిప్పు అంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్ వైపు నుంచి వెళ్తున్న రవాణా వ్యవస్థను స్తంభించింది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి. బీసీల మెరుపు ముట్టడితో కలెక్టరేట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నాయి. -
ఆయిల్ చోరీ కేసులో టీడీపీ నేత కుమారుడు
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు మంగళవారం ఆయిల్ మాఫియా ముఠాను అరెస్టు చేశారు. పోర్టు నుంచి వచ్చే పైపు లైన్లకు రంధ్రాలు వేసి ఈ ముఠా ఆయిల్ చోరీకి పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా అరెస్టుతో మాఫియా వెనుక టీడీపీ నేత కుమారుడు గ్రంథి బాబ్జీ కుమారుడు రాజా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తస్కరించిన రెండు టన్నుల ఆయిల్ ను రాజా కొనుగోలు చేసినట్లు అభియోగాలున్నాయి. -
కలల హార్బర్!
అక్కడ నిత్యం రెండు వేలకు పైగా పడవల్లో మత్స్యకారులు జీవన పోరాటం సాగిస్తుంటారు. వింత చేపలు, అరుదైన జాతులకు అది ఆలవాలం. ‘తూర్పు’ తీరంలోని దాదాపు 20 వేల కుటుంబాలకు అక్కడ లభ్యమయ్యే జలచరాలే పెద్ద సంపద. అయితే వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, పడవలు లంగరు వేసేందుకు ఫిషింగ్ హార్బర్ లేకపోవటంతో మత్స్యకారుల కష్టం వృథాగా మారుతోంది. వారి కష్టాలను తీర్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తూర్పు గోదావరి జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేయించినా ఆయన ఆకస్మిక మృతితో తరువాత ప్రభుత్వాలు ఆ విషయాన్ని గాలికి వదిలేశాయి. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.300 కోట్లకు చేరుకున్న దశలో ఫిషింగ్ హార్బర్ను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా మత్స్యకారులకు నమ్మకం కలగడం లేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కలగానే మిగిలిపోయింది. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు తీరంలో ఎక్కడా జట్టీలు, హార్బర్లు లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లు లంగరు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొత్తపల్లి మండలం మత్స్యకారులు ఉప్పాడ సమీపంలోని ఉప్పుటేరుని జట్టీగా వినియోగించుకుంటున్నారు. అది అనువుగా లేకున్నా బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి చేపలను ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఆ అవకాశం కూడా లేక పడవలను సముద్రంలోనే లంగరు వేసి దేవుడిపైనే భారం మోపుతున్నారు. కెరటాల తాకిడికి మునుగుతున్న బోట్లు తుపాన్లు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. సముద్రంలో లంగరు వేసిన బోట్లు కెరటాల ఉధృతికి నీట మునిగి మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సమయాల్లో బోట్లు, వలలు లాంటి విలువైన ఉపకరణాలను అతి కష్టం మీద వ్యయప్రయాసల కోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలైతే అక్కడ ఎటువంటి రక్షణా లేకుండా ఒడ్డుకు తరలిస్తున్నారు. ఒక్కోసారి లంగరు వేసిన బోట్లలో సామాగ్రిలు చోరీలకు గురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు, బోట్లను ఒడ్డుకు చేర్చే మత్స్యకారులకు హార్బర్ సురక్షిత ప్రాంతం. కానీ తూర్పు గోదావరి తీరంలో మినీ హార్బర్ లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలించని డ్రెడ్జింగ్ పనులు.. సముద్రంలో చేపల వేట అనంతరం వాటిని ఒడ్డుకు చేర్చి హార్బర్లో విక్రయించేందుకు వీలుంటుంది. అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల చేపలు పాడయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ లభ్యమయ్యే మత్స్య çసంపదను బెంగళూరు, కోల్కత్తా, చెన్నై, కేరళ తదితర చోట్లతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ దొరికే వింత చేపలు, అరుదైన జాతులకు మంచి గిరాకీ ఉన్నా హార్బర్ సదుపాయం లేదు. ఇక బోట్లు మరమ్మతులకు గురైనా, గుక్కెడు నీళ్లు కావాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లాలి. వేసవిలో సూర్యభగవానుడి భగభగలకు మాడిపోవాల్సిందే. ఇన్ని సమస్యలున్నా ఇక్కడ రోజూ లక్షల్లో వ్యాపారం జరగటం గమనార్హం. మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోట్లు ఒడ్డుకు చేరేలా తాత్కాలికంగా సుమారు రూ. 1.25 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టినా రెండో రోజే ఇసుక మేట వేయటంతో నిధులు నిరుపయోగంగా మారాయి. నిధులు మంజూరు చేయించిన వైఎస్సార్ మత్స్యకారుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో సుమారు రూ.50 కోట్లతో మినీ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నిధులు కూడా మంజూరు చేయించారు. వైఎస్సార్ మృతితో ఇక ఆ విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి మినీ హార్బర్ నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పుడు హార్బర్ నిర్మాణ అంచనా వ్యయం రూ. 300 కోట్లకు చేరింది. తాజాగా హార్బర్ ప్రతిపాదనను 28 ఎకరాలకు పరిమితం చేశారని తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలను పరిశీలించకుండా నిర్మాణం ముందుకు సాగదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది కూడా ప్రకటనకే పరిమితమని మత్స్యకారులు భావిస్తున్నారు. జెట్టీ లేక తీవ్ర ఇబ్బందులు హార్బర్ నిర్మాణానికి సంబంధించి వైఎస్సార్ హయాంలో జీవో విడుదలైనా తరువాత ప్రభుత్వాలు పట్టించుకోక కార్యరూపం దాల్చలేదు. వేటపై ఆధారపడిన మత్స్యకారులు జెట్టీ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మత్స్య సంపదతో రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రభుత్వం మత్స్యకారుల సౌకర్యాలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. – కర్రి నారాయణ , అఖిల భారత మత్స్యకార సమాఖ్య సభ్యుడు, కాకినాడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మినీ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నాం. నిబంధనల మేరకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. – కోటేశ్వరరావు (మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, తూర్పు గోదావరి జిల్లా) -
కాకినాడలో విజృంభిస్తున్న డెంగ్యూ
-
సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష
కాకినాడ రూరల్: డిసెంబర్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న కాకినాడ బీచ్ ఫెస్టివల్ ప్రారంభ రోజున ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్పీ విశాల్గున్ని, జేసీ ఎ.మల్లికార్జునలతో పాటు జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు కాకినాడ నగరం, బీచ్ ఫెస్టివల్ ప్రాంతాల్లో చేయవలసిన ఏర్పాట్లను కలెక్టర్ చర్చించారు. పర్యటనలో నగరంలో హెలీప్యాడ్ ఏర్పాటు, సీఎం పర్యటన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. కాకినాడ బీచ్ ఫెస్టివల్కు ఈసారి అధిక సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, గతంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్ అనుభవం దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బీచ్ ప్రాంతానికి సామాన్య ప్రజలు ఇబ్బంది లేకుండా చేరుకోవడం, వీఐపీలు కూడా సభాస్థలికి సులువుగా చేరేందుకు చేపట్టవలసిన చర్యల్లో భాగంగా అందుబాటులో ఉన్న బ్రిడ్జిలతో పాటు అవసరమైన తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటుపై కూడా చర్చించారు. బీచ్ ఫెస్టివల్కు వచ్చే ప్రజలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి బీచ్కు చేరే విధంగా రవాణా ఏర్పాటుతో పాటు బీచ్ సమీపంలో ఉన్న ఓఎన్జీసీ స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటన, బీచ్ ఫెస్టివల్ కోసం పక్కా ట్రాఫిక్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ తదితర విషయాలపై మార్గనిర్దేశం చేయాలన్నారు. సీఎం పర్యటించే నగరంలోని ప్రాంతాల్లో శానిటేషన్ పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ శివపార్వతికి కలెక్టర్ కార్తికేయమిశ్రా సూచించారు. ట్రైనీ కలెక్టర్ ఆనంద్, డీఎస్పీ వర్మ, ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మెడలో గుచ్చుకొని నోట్లో నుంచి బయటకి
-
హోంమంత్రి ఇంటిముందు అర్థరాత్రి బైఠాయింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం వైపు తరలించారు. ఇటీవల తనపై దాడి చేసిన రామ చంద్రపురం ఎస్సై కె. నాగరాజును సస్పెండ్ చేయాలని కోరు తూ వైఎస్సార్సీపీ నాయకులు, తన సోదరుడు గణేష్, రామ జోగి, వంకా శ్రీహరి తదితరులతో కలసి జక్కంపూడి రాజా బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని హోంమంత్రి ఇంటి ముందు బైఠాయించారు. ఆ సమయంలో మంత్రి రాజప్ప ఇంట్లో లేరు. రాజా ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ వర్మ, సీఐ కృష్ణ చైతన్య తమ సిబ్బందితో వచ్చి రాజా తదితరులను బలవంతంగా అదుపు లోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం వైపు తరలించగా ఆందోళన చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హోంమంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. రాజాపై దాడి జరిగి ఇన్నాళ్లయినా ఎస్సైపై ఇంతవరకు చర్య తీసుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. -
టీడీపీలో ‘కొండబాబు’ రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆధిపత్యానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న అక్కసుతో కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) స్వరం పెంచుతున్నారు. ఎమ్మెల్యే అని చూడడం లేదు...మంత్రి అని తగ్గడమూ లేదు... సహ నేతలపై మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నువ్వానేనా అన్నట్టుగా ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా స్వప్రక్ష ప్రత్యర్థులు కూడా కొండబాబుని లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారు. కాకినాడ నగరమంతా తనదిగా ఎమ్మెల్యే కొండబాబు భావించడమే కాకుండా ఎంతటి పెద్ద నేతలైనా తన తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా జిల్లా కేంద్రమైన కాకినాడ అందరిదీ అనే రీతిలో మంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు మిగతా నేతలూ భావిస్తున్నారు. ఆ తరహాలోనే కాకినాడకు వచ్చి పలువురు నేతలు చక్రం తిప్పుతుండడంతో కొండబాబు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. కొండబాబే లక్ష్యంగా... వాస్తవానికి ఎమ్మెల్యే కొండబాబుపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు సత్యనారాయణైతే సూపర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీలోని ప్రత్యర్థులకు ఇవి అస్త్రాలుగా మారాయి. కాకినాడలో పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ప్రచారానికి ప్రత్యర్థులు తెరలేపారు. ఇదే క్రమంలో కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయులకు దక్కకుండా మంత్రి రాజప్ప, ఎంపీ తోట నర్సింహం వ్యవహరించారు. కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా దక్కించుకోవాలని, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పించుకోవాలని కొండబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి వ్యూహాత్మకంగా ఎగరేసుకుపోయారు. కార్పొరేషన్లోని కో ఆప్షన్ పదవులైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నా అది కూడా ఫలించేలా లేదు. దీంట్లో మంత్రి రాజప్ప జోక్యం చేసుకుని కొండబాబు వశం కాకుండా పావులు కదుపుతున్నారు. ఇలా అడుగుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతుండడంతో ఆ వర్గం అయోమయంలో పడింది. రగిలిపోతున్నా అదే బాట... వరుసగా ఎదురవుతున్నా అవమానాలు, వస్తున్న ఆరోపణలతో కొండబాబు రగిలిపోతున్నారు. తానడిగిన మేరకు ఇవ్వకపోగా కాదన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపోతున్నారు. దీంతో మొన్నటికి మొన్న రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగగా, తాజాగా మంత్రి రాజప్పపైనే ధ్వజమెత్తుతున్నట్టు తెలిసింది. మంత్రి సోదరుడే ఎక్కువ సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారంటూ ఆరోపణలు సంధిస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాజప్ప పెత్తనమేమిటని ప్రశ్నించడమే కాకుండా తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్దే తేల్చుకుంటానని తన అనుయాయుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతూ సాగుతున్న పోరు టీడీపీలో అసక్తి రేకెత్తిస్తోంది. -
చే...నేత్రానందం
-
కాకినాడను ముంచెత్తిన వర్షం
-
కత్తిపూడిలో దారుణం.. కారం చల్లి కత్తులతో దాడి
-
కత్తిపూడిలో దారుణం.. కారం చల్లి కత్తులతో దాడి
తూర్పు గోదావరి : కత్తిపూడిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడి కుటుంబం లక్ష్యంగా చేసుకొని కత్తులతో దాడి జరిగింది. గొర్రెల రాజు అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంటిబాబు అతడి కుమారుడు నాగబాబు, భార్య లక్ష్మీపై కత్తులతో దాడికి దిగాడు. వారి కళ్లల్లో కారం చల్లి మరీ ఈ దాడికి పూనుకున్నాడు. ఈ దాడిలో చంటిబాబు మెడకు తీవ్ర గాయాలు కాగా కుమారుడు నాగబాబు, లక్ష్మీకి కూడా గాయాలయ్యాయి. దీంతో వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చంటి బాబు ఒళ్లంతా రక్తసిక్తంగా మారింది. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొర్రెల రాజు భార్యకు చంటిబాబు కుమారుడికి అక్రమ సంబంధం ఉందనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. చంటిబాబు అన్నవరం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. -
హైదరాబాద్–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
లక్ష్మీపురం(గుంటూరు): దసరాకు హైదరాబాద్–కాకినాడ పోర్ట్ వయా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును నడపాలని నిర్ణ యించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్–కాకినాడ పోర్ట్ ప్రత్యేక రైలు (07001) ఈ నెల 27, 29, అక్టోబర్ 1తేదీల్లో నడుస్తుం దని తెలిపారు. 27, 29 తేదీల్లో హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.50కి రైలు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.35కి చేరుకుం టుందన్నారు. అక్టోబర్ 1న హైదరాబాద్ నుంచి రాత్రి 11.40కి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11.45కి కాకినాడ పోర్ట్కు చేరుకుంటుందన్నారు. కాకినాడ పోర్ట్–హైద రాబాద్ ప్రత్యేక రైలు (07002) ఈ నెల 28, అక్టోబర్ 2న కాకినాడ పోర్ట్ నుంచి సాయంత్రం 5.55కి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.10కి హైదరాబాద్ చేరు కుంటుందని తెలిపారు. ఈ నెల 30న కాకి నాడ పోర్టు నుంచి సాయంత్రం 6.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10కి హైదరాబాద్కు చేరుకుంటుందన్నారు. హైదరాబాద్–విశాఖపట్నం–హైదరాబాద్ వయా గుంటూరు హైదరాబాద్– విశాఖపట్నం వయా గుంటూ రు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. హైదరా బాద్–విశాఖ రైలు (07148) ఈ నెల 28, 30 తేదీల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 6.50కి బయల్దేరి మర్నాడు ఉదయం 8కి విశాఖకు చేరుకుంటుందన్నారు. విశాఖ–హైదరా బాద్ రైలు (07147) ఈ నెల 29న రాత్రి 7.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుందన్నారు. -
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
-
ఈ చేప బరువు ఒకటిన్నర టన్నులు