స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు మారినవారికి ఎదురుదెబ్బలు తప్పడంలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మునిసిపల్ చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె అనర్హతపై స్టేను హైకోర్టు గురువారం నాడు ఎత్తేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అలేఖ్య.. ఆ తర్వాత పార్టీ మారారు. దాంతో అలేఖ్య చైర్మన్ పదవికి అనర్హురాలంటూ కావలి ఆర్డీవో నిర్ణయం తీసుకున్నారు.
15 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఆమె అనర్హతపై ఉన్న స్టేను కోర్టు ఎత్తేసింది. అనర్హత పిటిషన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
కావలి చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్!
Published Thu, Dec 11 2014 5:46 PM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement