-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఊహించని ఎదురుదెబ్బ!
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. బ్రిటన్లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కాగా, బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్ సునాక్పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్లో 107 కౌన్సిల్స్కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. Disaster for Tories. Love to see it. Now @RishiSunak call for general elections. pic.twitter.com/6Bj1ARAUbh— OppaGaymer 🇵🇸 (@RafLee84) May 3, 2024 కాగా, బ్లాక్పూల్ సౌత్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్ తెలిపారు. Local elections in England and Wales have delivered a blow to Prime Minister Rishi Sunak and his governing Conservative Party. The opposition Labour Party is on track to win the next general election which takes place later this year pic.twitter.com/iiHfbaqqUZ— TRT World (@trtworld) May 3, 2024 మరోవైపు.. బ్లాక్పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్పూల్ సౌత్ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. -
జూన్లో లోకల్ వార్.. తెలంగాణ రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్సభ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్లు, పాలకవర్గాల పదవీకాలం జనవరి నెలాఖరులోనే పూర్తికాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. జూలై తొలివారం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో జూన్ రెండో వారం నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఒకే దఫాలో పూర్తిచేయాలని సీఎం రేవంత్ యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా పూర్తిచేయడం ద్వారా గ్రామ స్థాయిలోనూ రాజకీయంగా పట్టు సాధించడానికి, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలతో సీఎం పేర్కొన్నట్టు సమాచారం. మధ్యమధ్యలో ఎన్నికలు వస్తూ ఉంటే ఇబ్బందులు వస్తుంటాయని చెప్పినట్టు తెలిసింది. రేవంత్ ఇచ్చిన సంకేతాల ప్రకారం.. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలివారంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పనితీరు ఆధారంగా చాన్స్ లోక్సభ ఎన్నికల్లో పార్టీపరంగా చూపిన పనితీరు ప్రాతిపదికనే.. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యరి్థత్వాలతోపాటు ఇందిరమ్మ కమిటీల్లో సభ్యుల నియామకం చేపడతామని పార్టీ నేతలతో సీఎం రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని.. ఇప్పటికే నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వలంటీర్గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. -
ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా గెలుపు వైఎస్సార్సీపీదే
-
పూర్వ పశ్చిమ గోదావరి జెడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు
-
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్ఫ్రంట్లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
తమిళనాడును తాకిన హిజాబ్ సెగ.. రియాక్షన్ ఇది
Hijab Row In Tamil Nadu: దాదాపు పదేళ్ల తర్వాత విరామం తర్వాత తమిళనాట స్థానిక సంస్థల హడావుడి నెలకొంది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 640 స్థానాలకు.. 12, 800 పోస్టులకు శనివారం పోలింగ్ జరుగుతోంది. చాలాకాలం తర్వాత జరుగుతుండడంతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో హిజాబ్ సెగ తమిళనాడుకు పాకింది. కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్’ పరిణామం.. దేశంలో పలుచోట్ల రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆమెతో హిజాబ్ తొలగించి.. ఓటు వేయడానికి అనుమతించాలంటూ ఆ బూత్ ఏజెంట్ వీరంగం సృష్టించాడు. అయితే అతన్ని నిలువరించాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యలు కోరగా.. పోలీసుల జోక్యంతో అతను బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్నిధి స్టాలిన్ స్పందించాడు. #TamilNadu Urban Local Body Poll |A BJP booth committee member objected to a woman voter who arrived at a polling booth in Madurai while wearing a hijab;he asked her to take it off. DMK, AIADMK members objected to him following which Police intervened. He was asked to leave booth pic.twitter.com/UEDAG5J0eH — ANI (@ANI) February 19, 2022 బీజేపీ చేష్టలను తమిళనాడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశాడు. ‘‘బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో.. ఇక్కడి జనాలకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించబోదు’’ అంటూ ఉదయ్నిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరిట మనుషుల్ని తిరస్కరించడం బాధాకరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనేది వ్యక్తిగత విషయం, హక్కు కూడా. అది ఎక్కువా.. తక్కువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారామె. தமிழகத்தில் இன்று நடைபெறும் நகர்ப்புற உள்ளாட்சித் தேர்தலை முன்னிட்டு சென்னை,சாலிகிராமத்தில் உள்ள வாக்குச்சாவடியில் எனது வாக்கினை செலுத்தி ஜனநாயக கடமையாற்றினேன். #LocalBodyElection pic.twitter.com/v4ItGVnkdn — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 19, 2022 ఇక తమిళనాట పదకొండేళ్ల తర్వాత అర్బన్ లోకల్ బాడీ పోల్స్ జరుగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే తమ మధ్య పోటీ ఉండాలనే ఉద్దేశంతో.. బీజేపీని ప్రచారంలో ఏకీపడేశాయి. ఉదయం ఏడు గంటలకే మొదలైన పోలింగ్.. చాలా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతోంది. కాకపోతే లాంగ్ క్యూలతో జనం విసిగిపోయి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31, 180 పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించింది పోలీస్ శాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు కమల్ హాసన్ తెయ్నామ్పేట్లో, తెలంగాణ గవర్నర్ తమిళసై, తమిళ స్టార్ హీరో విజయ్ నీలాన్గరైలో, పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగిల్ ఫేజ్లో ముగియనున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 22న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. సంబంధిత వార్త: హిజాబ్ వివాదం.. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు -
ఓటింగ్లో అసౌకర్యం... క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో విజయ్
Thalapthy Vijay Apologised To The Public: చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ సైతం తన ఓటును వినియోగించుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన విజయ్ ఫోటోలు తీసేందుకు మీడియా పెద్ద ఎత్తున గుంపులుగా చేరడంతో అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. పరిస్థితిని గమనించిన విజయ్ తనవల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో దళపతి అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. His Simplicity 😊🖤 #Vijay#TnLocalBodyElection @actorvijayhttps://t.co/sLr7WM2a00 pic.twitter.com/fAAW0voj0S — مادهيسفج (@MADHESVJ1) February 19, 2022 -
‘నీవు చనిపోయావు’ నామినేషన్ ఎలా వేస్తావు?
లాభనష్టాలతో పనిలేదు.. అప్పులై పోతామనే భయంలేదు.. గెలుపుకోసం ఎందాకైనా వెళ్తాం.. అన్నట్లుగా అభ్యర్థులు జోరు చూపిస్తున్నారు. నగరపాలక ఎన్నికల బరిలో విజయలక్ష్మిని వరించడమే తమ ధ్యేయమన్నట్లు ముందుకుసాగుతున్నారు. పైగా వడ్డీ నూటికి పది రూపాయౖలñ నా..∙పర్వలేదంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘కష్టపడి సీటు దక్కించుకున్నా.. తాడోపేడో.. అటోఇటో.. ఏదో ఒకటి తేలిపోవాల్సిందే.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు.. గెలుపుకోసం ఎంత వరకైనా పోరాడుతా.. ఎంత డబ్బయినా పెడతా..’’ ఇదీ ఎన్నికలపై ఓ పార్టీ అభ్యర్థి మనోగతం.. అవును.. నగరపాలక ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో ఇదే అదనుగా అప్పులుస్తాం రండి అంటూ జాతీయస్థాయి రుణదాతలు రాష్ట్రంలో వాలిపోతున్నారు. ఫైనాన్షియర్ల చుట్టూ.. రాష్ట్రంలో 21 కార్పొరేషన్లు, 138 మునిసిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీల్లోని 12,838 వార్డులకు ఈనెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. సీటు దక్కించుకునేందుకు ఆయా పార్టీల అధిష్టానికి భారీగా ముట్టజెప్పిన అభ్యర్థులు ప్రస్తుతం.. ప్రచారపర్వంలో దిగిపోయారు. మరోవైపు ఖర్చుల కోసం ఫైనాన్షియర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక సీటు ఇచ్చేశాం.. విజయం సాధించడం మీ వంతు అని పార్టీల పెద్దలు హుకుం జారీ చేస్తుండడంతో అభ్యర్థులు శాయశక్తులా విజయం కోసం పోరాడుతున్నారు. తిరునెల్వేలి, తూత్తుకూడి జిల్లాల నుంచి పలువురు ఫైనాన్షియర్లు కందువడ్డీపై అప్పులిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సంచరిస్తున్నారు. భూమి, ఇంటి స్థలం, వాహనం ఇలా ఏదైనా తాకట్టుపెట్టుకుని డబ్బులిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. డిమాంబ్ను బట్టి నూటికి 10 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. చెన్నైలోనే రూ. వెయ్యికోట్లకు పైగా? రుణాల వ్యవహారంపై ఒక ఫైనాన్షియర్ మాట్లాడుతూ, చెన్నైలో 200 వార్డులున్నాయి. ఒక్కో అభ్యర్థి రూ.5 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. దీంతో కేవలం చెన్నై కార్పొరేషన్లోనే రూ.1000 కోట్లు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లెక్కకడితే మొత్తం రూ.7వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యర్థుల ఎన్నికల అవసరాలకు ఎన్నికోట్ల రూపాయలు కావాలన్నా ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, లక్నో, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం తదితర మహానగరాల నుంచి 24 గంటల్లో అప్పు ఇస్తామంటూ (మార్వాడీలు, రానా నెట్వర్క్, శర్మ నెట్వర్క్, సురాణా నెట్వర్క్ అనే పేర్లతో) రుణదాతలు ముందుకొస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల జోరు ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా అన్నిపార్టీల అభ్యర్థులు ఎన్నికల కార్యాలయాల వద్ద గురువారం క్యూకట్టారు. పెద్దసంఖ్యలో తరలివచ్చి నామినేషన్లను సమర్పించారు. దాదాపుగా అన్నిచోట్లా ప్రధాన ప్రత్యర్థులు ఒకేసారి రావడంతో ఎన్నికల అధికారులకు దిక్కుతోచలేదు. గత నెల 28వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం వరకు 10,153 మంది నామినేషన్లు వేశారు. చిన్నమ్మ పెద్ద మనసు ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేపై కయ్యానికి కాలుదువ్విన చిన్నమ్మ శశికళ ప్రస్తుతానికి పెద్దమనసు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఆమె మద్దతు పలికారు. అన్నాదురై 53వ వర్ధంతి సందర్భంగా గురువారం చెన్నై టీనగర్లోని ఆమె నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయలలిత బాటలో నడిచేవారు ఎవరైనా సరే విజయం సాధించాలని అన్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆశీస్సులతో కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే త్వరలోనే తన చేతుల్లోకి వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ప్రజల్లోకి వస్తానని, జిల్లాలవారీగా పర్యటిస్తానని ఆమె స్పష్టం చేశారు. తిరువళ్లూరు: జిల్లాలో ఇంత వరకు స్తబ్దుగా ఉన్న నామినేషన్ల ప్రక్రియ గురువారం ఊపందుకుంది. తిరుమళిసైలో డీఎంకే నేతలు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తిరువళ్లూరు, ఆవడి, తిరునిండ్రవూర్, పూందమల్లిలోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది. వేలూరు: వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో గురువారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వేలూరు కార్పొరేషన్లో మొత్తం 60 వార్డులుండగా గురువారం సాయంత్రం నాటికి సుమారు 80 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పలుచోట్ల నగదు స్వాధీనం ► తిరుచ్చిరాపల్లి, తంజావూరు, పుదుక్కోట్టైలో ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.58.35 లక్షలను అధికారులు సీజ్ చేశారు. ► చెన్నైలో బుధవారం వరకు రూ.1.26 కోట్ల విలువైన బహుమతులు, రూ.5.59 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ► కోయంబత్తూరులో అన్నాడీఎంకే ప్రముఖుడు ఉలగనాథన్ (42) ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ప్రత్యేక తహసీల్దారు కల్పన తనిఖీ చేసి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి గెలుపొందాలని అన్నాడీఎంకే, డీఎంకే నేతలు భావిస్తున్నారని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ విమర్శించారు. ప్రాణం తీసిన నిరాశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదనే నిరాశ ఓవ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈరోడ్ జిల్లా గోపీ సమీపం వానిపుత్తూరు పట్టణ పంచాయతీకి చెందిన రామన్ (53), మహేశ్వరి (49) దంపతులు. గతంలో నాలుగుసార్లు జరిగిన పట్టణ పంచాయతీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి రామన్ రెండుసార్లు, మహేశ్వరి రెండుసార్లు అన్నాడీఎంకే సీటుపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం అదే వార్డు నుంచి పోటీచేసేందుకు తనకు లేదా భార్యకు అవకాశం దక్కుతుందనే నమ్మకంతో పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండురోజుల క్రితం అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలకాగా దంపతుల ఇద్దరి పేర్లూ అందులో లేవు. పార్టీ కోసం 40 ఏళ్లు పాటు పడినా శ్రమ వృథాగా మారిందని భార్య వద్ద తీవ్రంగా వాపోయిన రామన్ గురువారం ఉదయం స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు విడిచాడు. అన్నాడీఎంకే అభ్యర్థికి చేదు అనుభవం సాక్షి ప్రతినిధి, చెన్నై : ‘ ఓటర్ల జాబితాలో నీవు చనిపోయినట్లు ఉంది.. నామినేషన్ ఎలా దాఖలు చేస్తావు...’ అంటూ అధికారులు ప్రశ్నించడంతో అన్నాడీఎంకే మహిళా అభ్యర్థి నిర్ఘాంతపోయారు. వివరాలు.. నాగపట్టిన మునిసిపాలిటిలో 4వ వార్డు నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా అమృతవల్లి (33) నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. పత్రాల తనిఖీలో భాగంగా ఓటర్ల జాబితాను తెరిచిచూస్తే ఆమె పేరు లేదు. ఇదేం చోద్యమని ఆమె ప్రశ్నించగా, మీరు చనిపోయినందున పేరు తొలగించారని అధికారులు బదులిచ్చారు. అభ్యర్థుగా తన పేరు ఖరారైనప్పుడు పేరు ఉందని.., నామినేషన్ వేసేటప్పుడు మాత్రం లేకపోవడం, పైగా చనిపోయిన వారి జాబితాలో పేరు చేర్చడం కుట్రే నని ఆమె అధికారులపై ఆమె మండిపడ్డారు. -
రెండాకుల ముసలం.. వేరుపడిన కమలం
పంతం పట్టు వీడనంది.. బంధం బీటలు వారింది..ఫలితం రెండాకుల కూటమి నుంచి కమలం వేరుపడింది. పురిట్చితలైవి జయలలిత మరణానంతరం జోడీ కట్టిన అన్నాడీఎంకే, బీజేపీ నగరపాలక ఎన్నికల్లో తమదారులు వేరంటూ విడిపోయాయి. అయితే రాష్ట్రంలో వేరుపడినా.. కేంద్రంలో దోస్తీలమే అంటూ తమ కటీఫ్ కహానీకి కొత్తఅర్థం చెప్పాయి. సాక్షి, చెన్నై(తమిళనాడు): అన్నాడీఎంకేతో అనుబంధాన్ని బీజేపీ తాత్కాలికంగా తెంచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆ పార్టీతో కటీఫ్ చెబుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోమవారం అధికారికంగా ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ముగించారు. గత కొద్దిరోజులుగా.. తమిళనాడులో ఈనెల 19న నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. యథాప్రకారం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఆ రెండు కూటములు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై గత కొన్నిరోజుల్లో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే–బీజేపీ సైతం సీట్ల పంపకంపై ఎడతెగని చర్చలు జరిపాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అన్నాడీఎంకే–బీజేపీ మధ్య చాపకింది నీరులా పెరిగిపోతున్న అగాధం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బట్టబయలైంది. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, పీఎంకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. డీఎంకే కూటమిలో ఎడతెగని పంచాయితీ ఇదిలా ఉండగా, డీఎంకే కూటమిలో సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. అన్నాడీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డీఎంకే కూటమి భావిస్తూ జాబితా విడుదలలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థల ఖరారులో ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన జాబితాను డీఎంకే కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఈ జాబితాను పరిశీలించి మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా తమ కూటమి నుంచి బీజేపీ దూరం జరగడంతో అన్నాడీఎంకే సోమవారం రెండో, మూడో జాబితాలను విడుదల చేసింది. కాగా సీట్ల సర్దుబాటుపై డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఆ పార్టీ అగ్రనేత రమేష్ చెన్నితాల సోమవారం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న డీఎండీకే 100మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. చర్చలు విఫలం.. కాగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గతనెల 29వ తేదీన సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగినందున 30శాతం సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబట్టగా అన్నాడీఎంకే ఐదు శాతం మాత్రమే ఇస్తామని చెప్పింది. బీజేపీ క్రమేణా 18 శాతానికి దిగిరాగా అన్నాడీఎంకే మాత్రం 8 శాతానికి మించి ఇచ్చేది లేదని తెలిపింది. తుది ఆఫర్గా 11 శాతం అంటూ ద్వితీయశ్రేణి నేతలతో బీజేపీకి అన్నాడీఎంకే ఆదివారం కబురుపంపింది. అయితే 18 శాతం కంటే తగ్గేదిలేదని కమలనాథులు ఖరాఖండీగా బదులిచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయడంతో కమలనాథులు ఖంగుతిన్నారు. బీజేపీతో మళ్లీ చర్చలకు తావులేకుండా ఎడపాడి పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సోమవారం ఎలాంటి పిలుపురాలేదు. తాజా పరిణామంపై అన్నామలై సోమవారం హడావిడిగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అగ్రనేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నామలై మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు దిగుతోందని ప్రకటించారు. తాము కోరినన్ని స్థానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో 2024 పార్లమెంటు ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందని పేర్కొన్నారు. -
మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు. మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు. చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు -
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
హడావుడి చేసి.. హ్యాండిచ్చారు!
సాక్షి, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు రానున్నాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికల పోలింగ్లో కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికే మద్దతు ఇచ్చినట్లు వ్యవహరించినా.. ఓటు వేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారా అన్న చర్చసాగుతోంది. రాష్ట్రంలో జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదైంది. 77 మంది ఓటు వేయకపోగా, అందులో ఐదారుగురు మినహా మిగతా అందరూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయాలని తీర్మానించారు. కానీ ఇరు పార్టీల ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉండి అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తీరే వేరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న సంఖ్యలో రెండో స్థానంలో ఆదిలాబాద్ డివిజన్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఓల్డ్ సమావేశ మందిరంలో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికి పోలింగ్ ఏజెంట్గా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్రెడ్డి వ్యవహరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడు పాయల శరత్ శుక్రవారం పోలింగ్ కేంద్రం వద్ద పుష్పరాణి మద్దతుదారులైన తుడుందెబ్బ నాయకులతో చర్చిస్తూ బిజీబిజీగా కనిపించారు. పోలింగ్ మొదలైన తర్వాత ఉదయం నుంచి బీజేపీ సభ్యులను తీసుకువచ్చి పుష్పరాణికి ఓటు వేయించడంలో తోడ్పాటు అందించినట్లు ప్రత్యక్షంగా చూస్తున్నవారికి అనిపించింది. తీరా పోలింగ్ ముగిసిన తర్వాత ఈ కేంద్రంలో 20 మంది ఓటు వేయలేదని, అందులో 13 మంది బీజేపీ సభ్యులు ఉన్నారని తేలడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. మున్సిపాలిటీలో ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్కు దూరంగా ఉండటం చర్చనీయంగా మారింది. వారు అలకబూనడంతోనే ఓటు వేయలేదనే ప్రచారం సాగుతోంది. ఒకరోజు ముందు జిల్లా నాయకత్వం ఓటు ఎవరికి వేయాలనే అంశంపై చర్చించేందుకు పిలవగా వారు అందులో పాల్గొనలేదని అంటున్నారు. ప్రధానంగా ఒక ముఖ్య నేత ఈ ఎన్నికల పరంగా వ్యవహరించిన తీరుతోనే వారు అసంతృప్తికి లోనయ్యారని చెప్పుకుంటున్నారు. ఇది బీజేపీలో లుకలుకలకు దారితీస్తోంది. కాంగ్రెస్ది వైరి వర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైరి వర్గం మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పెందూర్ పుష్పరాణికి పార్టీ మద్దతు ఇస్తుందని నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ఖాన్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థితో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. పోలింగ్ కేంద్రం వద్ద శుక్రవారం సాజిద్ఖాన్ పెందూర్ పుష్పరాణికి మద్దతుగా పార్టీ సభ్యులను ఓటు వేయాలని చెబుతూ కనిపించారు. అయితే కొన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధికార టీఆర్ఎస్ సభ్యులతో కలిసి రావడం చర్చనీయమైంది. మరోపక్క మంచిర్యాల, బెల్లంపల్లి పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ సభ్యులు 45 మంది ఓటు వేయకపోవడం గమనార్హం. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు ఆదేశాలతోనే వారు ఓటు వేయలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే బెల్లంపల్లిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలిచిందా.. లేదా అనే అయోమయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. -
తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటింగ్ శాతం ఇదే..
04:00 PM ►తెలంగాణలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలోని జెడ్పీటీసీల, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 14న కౌంటింగ్ జరగనుంది. ►కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది కేంద్రాలలో పోలింగ్ పూర్తవగా..మొత్తం ఓట్లు 1324 ఉంటే 1320 ఓట్లు పోలయ్యాయి. అంటే 99.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఓటు వేయలేదు. మరో వ్యక్తి చనిపోగా, సిరిసిల్లలో అనారోగ్యంతో ఓ ఎంపీటీసీ ఓటు వేయలేదు. ► స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ►ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రికార్డ్ స్థాయిలో 91.78% పోలింగ్ నమోదైంది. ►భువనగిరిలో 197 ఓట్లకు 197 ఓట్లు పోల్ అయ్యాయి. ►ముగిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 95 శాతం పోలింగ్ నమోదైంది. ►ఖమ్మం-మొత్తం 348ఓట్లకు గాను 338 ఓట్లు పోలింగ్ ►కల్లూరు-మొత్తం 115 ఓట్లకు గాను 114 ఓట్లు పోలింగ్ ►కొత్తగూడెం-మొత్తం 221ఓట్లకు గాను 209 ఓట్లు పోలింగ్ ►భద్రాచలం-మొత్తం 84ఓట్లకు గాను 79 ఓట్లు పోలింగ్.. ►మొత్తం 768ఓట్లకు గాను 740ఓట్ల పోలింగ్ ►నల్లగొండలో మొత్తం 235 ఓట్లకు గాను 229 ఓట్లు పోలయ్యాయి. ►సూర్యాపేట జిల్లాకేంద్రం లో 186 ఓట్లకు గానుక 183 పోలయ్యాయి. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రల్లో 100శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ మినహా అందరూ ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►మొత్తం 1026 ఓటర్లకు గానూ, 1018 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► సిరిసిల్లలో 99.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్త 201 ఓట్లు ఉండగా.. 200 ఓట్లు పోలయ్యాయి. 03:00 PM ►కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్ఎస్ వైపు ఏకపక్షమే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పదవులు ఇస్తే సీఎం కేసీఆర్ దేవుడు లేకపోతే దయ్యంలా చూస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ శిఖండీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ►ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పని లేదని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కమల రాజ్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో మూడు గంటలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా.. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. 02:00 PM ►కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ 76.06 శాతం పోలింగ్ నమోదు అయ్యింది ►యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ ఎన్నికల కేంద్రంలో 106 మందికి గాను 82 మంది ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ► నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు 83.63 % నమోదదైంది 01:05 PM ► 1 గంట వరకు ఖమ్మంలో 58శాతం పోలింగ్ నమోదు ► మెదక్లో ఎమ్మెల్యే మాణికరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► సంగారెడ్డిలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కేసీఆర్ వరిధాన్యం పేరిట డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపారని విమర్శించారు. 12:05 PM ► ఉమ్మడి మెదక్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 42.1 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► నల్లగొండలో మధ్యాహ్నం వరకు 42.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► సూర్యపేట జిల్లా పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం వరకు 43.28 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో 64.97 శాతం, చౌటుప్పల్లో 66.98 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ► సంగారెడ్డిలో అందోల్ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► సిద్ధిపేటలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా నిధులు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ► నిర్మల్లో 81 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► ఆదిలాబాద్లో 1గంట వరకు 77 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 11:45 AM ► సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► భువనగిరి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ► కరీంనగర్ జడ్పీహాలులో మంత్రి గంగుల కమలాకర్ తన ఓటుహక్కు వినియోంచుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కొంత మంది కళ్లు మండుతున్నాయి. మాకు బలంలేదని బీజేపీ, కాంగ్రెస్లు ఎన్నికల నుంచి తప్పుకున్నాయి. అవి మాకు శుభసూచకమని గంగుల అన్నారు. ► టీఆర్ఎస్ కుటుంబ సభ్యులలో చిచ్చుపెట్టాలని కొందరు ఎన్నికలు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇండిపెండెంట్గా పోటిచేసిన రవీందర్ సింగ్కు ఈటల మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈటల శిఖండి రాజకీయాలు మానుకోవాలని గంగుల హితవు పలికారు. 11: 15 AM ► రాజన్న సిరిసిల్లలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మంచిర్యాల బెల్లంపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి పరిశీలించారు. 10: 48 AM ► ఖమ్మం పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► నల్లగొండలో స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 10: 15 AM ► మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలోని ఎన్నికల కేంద్రాన్ని స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి పరిశీలించారు. ► నల్లగొండలోని బాలికల జూనియర్ కాలేజీలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, చిన్నపరెడ్డి తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. 09: 25 AM ► కోరుట్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ ఓటు హక్కును వినియోంచుకున్నారు. ► మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్లో ఎమ్మెల్యే బాల్క సుమన్, దివాకర్రావు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ►ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్ సందర్శించారు. 09: 15 AM ► యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలేరు, శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► నల్లగొండ జిల్లాలోని బాలికల కాలేజ్లో ఎక్స్ అఫిషియో మెంబర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 08: 25 AM ► కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అభ్యర్థి రవీందర్ సింగ్ ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ► సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ మేయర్ రవీందర్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 08: 15 AM ► నల్లగొండ జిల్లాలో.. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఆయన భార్య ఓటు హక్కును వినియోంచుకున్నారు. ► ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి గాను.. నిర్మల్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 08: 02 AM ► ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్లారు. ► నల్లగొండలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటింగ్ సెంటర్కు చేరుకుంటున్నారు. ► కరీంనగర్ జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: 6 స్థానాలు.. 26 మంది అభ్యర్థులు.. 5326 మంది ఓటర్లు..37 పోలింగ్ కేంద్రాలు. శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం లో ఒక్కో స్థానానికి, కరీంనగర్లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇందులో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. అందరు కోవిడ్ నిబంధనలను పాటించాలని సీఈఓ శశాంక్ గోయల్ కోరారు. -
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్
సాక్షి, తిరుపతి: 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి స్థానిక సంస్థలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వరకు వరుస ఓటములతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో టెన్షన్ వెంటాడుతోంది. కుప్పం ఎన్నికల్లో ఇప్పుడు ఓటమి పాలైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మరోసారి పరాభవం ఖాయమని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కుప్పంపై ఆయన ‘ప్రత్యేక’ దృష్టిపెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చదవండి: Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు కుట్రలు, కుతంత్రాలకు పన్నాగం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. వాటిని పక్కాగా అమలుచేసేందుకు ఆయన, లోకేశ్.. టీడీపీ నేతలు, ఇన్చార్జ్లుగా ఉన్న మాజీమంత్రి అమరనాథ్రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏం చేయాలో ఏ రోజుకా రోజు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంతైనా ఖర్చు చేయండి నిజానికి.. కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఎన్నికలను అధిగమించేందుకు భారీగా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేసేందుకు వెనుకాడొద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బు ఎంతైనా ఖర్చుచేయాలని.. అవసరమైన మొత్తం తాను పంపుతానని ఇన్చార్జ్లకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఖర్చు బాధ్యతలను చంద్రబాబు తన పీఎస్ దొరస్వామినాయుడుకు అప్పగించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోజువారీ ప్రచారం నిమిత్తం ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు, మద్యం, బిర్యాని పంపిణీ కూడా చేయమని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఏపీలో మద్యం కొనుగోలు చేయవద్దని, పక్కనే ఉన్న కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా తెప్పించుకోమని సూచించినట్లు సమాచారం. మద్యం కోసమే ప్రత్యేకంగా ఓ టీంని నియమించారు. ఇక ఓటర్లకు ఎంత ఇవ్వాలో తాను తరువాత చెబుతానని బాబు చెప్పినట్లు తెలిసింది. దాడి చేయండి.. ఎదురు కేసులు పెట్టండి ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వైఎస్సార్సీపీ శ్రేణులే టార్గెట్గా దాడులు చేయమని కూడా చంద్రబాబు సూచనలు చేసినట్లు కుప్పం టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టి.. వారిపైనే తిరిగి కేసు పెట్టాలని ఇన్చార్జ్లకు సూచనలు అందాయి. ఇందులో భాగంగానే శుక్రవారం వీ కోట టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ రంగనాథ్ తన అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తప్ప మిగిలిన వారికి ఇక్కడ ఏం పని అని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గణపతి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రంగనాథ్ అనుచరులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అదే విధంగా ఎన్ఎఫ్సీ కళాశాల వద్ద కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి మునస్వామి, బంధువు వెంకటేష్పై స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు దాడిచేశారు. దాడిచేసిన వారే బాధితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాబు ఆదేశాలకు అద్దంపడుతున్నాయి. కుప్పానికి పరిటాల, జేసీ వర్గీయులు కుప్పంలో అలజడులు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల, జేసీ వర్గీయులను దింపనున్నారు. అల్లర్లలో ఆరితేరిన వారిని కుప్పం ఎన్నికలకు వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. వారంతా ఒకట్రెండు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్నారు. వీరి కోసం కుప్పం శివారుల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని టీడీపీ ప్రచారాల్లో రచ్చచేయాలని.. వీలైతే దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనల ద్వారా తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు కూడా చంద్రబాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిసింది. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడం ఈ బృందం బాధ్యత. -
ఏపీ: ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ►గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ. ►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ►పరిషత్ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. -
AP: మున్సిపోల్స్కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
Updates: ►ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్లో 9వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి అనిల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు, ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) ఈ నెల 15న వీటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుధవారం (నేడు) నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడతారు. పోటీ చేయని అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మహిళా ఓటర్లే అత్యధికం ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 9,58,141 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,67,045 మంది పురుషులు కాగా 4,90,897 మంది మహిళలు. 199 మంది ఇతర ఓటర్లు. మొత్తం ఓటర్లలో 4,77,244 మంది నెల్లూరులో ఉండగా మిగిలినవారు ఇతర మునిసిపాలిటీల్లో ఉన్నారు. 10 చోట్ల తొలిసారి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, వైఎస్సార్ జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుకొండ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు.. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో ఆగిన ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న విషయం విదితమే. మరణించిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మాత్రమే ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అందులో ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో కేవలం టీడీపీ అభ్యర్థులకు మాత్రమే కొత్తగా నామినేషన్ల వేసుకునే వీలుంటుంది. అలాగే రెండేసి చొప్పున జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొత్తగా నామినేషన్లు వేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఒక జెడ్పీటీసీ స్థానంలో బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులకు అవకాశమిచ్చింది. ఈ జెడ్పీటీసీ స్థానాలతో పాటు 81 ఎంపీటీసీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కాకుండా కేవలం ఒక్కొక్క పార్టీ నుంచి మాత్రమే నామినేషన్ల స్వీకరణకు అనుమతిచ్చింది. కాగా, మరో మూడు జెడ్పీటీసీ స్థానాలు, 95 ఎంపీటీసీ స్థానాలు, 69 గ్రామ సర్పంచ్, 533 వార్డు సభ్యులకు అన్ని రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. -
బాబోయ్ మేము పోటీ చేయబోమంటున్న టీడీపీ క్యాడర్
-
ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
యంగెస్ట్ ప్రెసిడెంట్..నీళ్ల కోసం గెలిచింది
‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్గా గెలుపొందింది. తెన్కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది. తమిళనాడులో ‘కరువు’ ఆధార్ కార్డ్ తీసుకుంటే దాని మీద అడ్రస్ ‘తెన్కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్ టీచర్. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ. ఎన్నికలొచ్చాయి తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్లో నిలబడతా అని చెప్పసాగింది. సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్ వేశారు. గట్టి అభ్యర్థి షారుకళ కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు. ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది. ‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు. గెలుపు వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది. ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది. -
‘ప్రజలు సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకున్నారు’
అమరావతి: ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కేసులతో ఎన్నికల రద్దుకోసం ప్రయత్నం చేశాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఈ ఫలితాలే సీఎం వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమని తెలిపారు. కాగా, తాము ఎన్నికలను బహిష్కరించాం అంటున్న నేతలకు సిగ్గుందా.. అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసింది. కానీ, ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి పారిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు టీడీపీ వైపు ఎందుకుంటారు? ఆయా వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్ను గుండెల్లో పెట్టుకుని తీర్పునిస్తున్నారని అన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్లో ఉంటేనే మంచిదని.. ఇక్కడ అడుగుపెడితే కుట్రలు చేస్తారని మండిపడ్డారు. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్ర చేయాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని చెప్పారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేత అచ్చెన్న మాట్లాడుతున్నాడు.. అసలు ఆయా చోట్ల ఆ పార్టీకి ఒక్కరు కూడా నామినేషన్ వేయడానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఫలితాలను చూసి చంద్రబాబు అయ్యన్నతో మాట్లాడిస్తున్నట్టుందని మండిపడ్డారు. తమకు చేతకాదా? తాము తిట్టలేమా? కానీ తమకు సంస్కారం ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: బాబు ఇలాకాలో ఫ్యాన్ హవా -
స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల కాలపరిమితి ముగిసి, నేటికి మూడేళ్లు పూర్తయింది. అయినా ఎన్నికల నిర్వహణకు సర్కారు ఏమాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి, తీరాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం..ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుండడం నుంచి ఈ ‘పంచాయితీ’ నడుస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఓబీసీల ఓటు బ్యాంకు సమకూర్చుకునేందుకు ఎన్నికల్లో వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికార బీజేడీ ప్రకటన జారీ చేసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! ఇప్పుడు మళ్లీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు ఇవ్వకుండా ఫలితాల కోసం ఓ ప్రత్యేక రోజుని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఇదివరకు ఏ పంచాయతీలో జరిగే ఎన్నికల ఫలితాలు.. ఎన్నికలు జరిగిన రోజునే ప్రకటించేవారు. ఇప్పుడు అలా కాకుండా సమితిలోని మొత్తం పంచాయతీల బ్యాలెట్ బాక్సులను సమితి కేంద్రానికి తరలించి, లెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు మార్పుల పట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా ఓట్లను తారుమారు చేసి, గెలిచేందుకే నవీన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలకు పైబడి పంచాయతీలు ఉండగా, 314 సమితులు ఉన్నాయి. 15 రోజుల్లో అభ్యంతరాలు.. పంచాయతీ ఎన్నికల్లో ఇదివరకున్న బూత్ స్థాయి ఓట్ల లెక్కింపునకు తెరపడుతుంది. సమితి ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృత విధానంలో ఈసారి ఓట్లను లెక్కిస్తారు. సమితి వ్యాప్తంగా అంచెలంచెలుగా పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని బూత్లలో పోలైన ఓట్లను ఒకేసారి లెక్కపెడతారు. ఈ నేపథ్యంలో ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–1965 సంస్కరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు జారీ చేసింది. వీటి పట్ల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను 15 రోజుల్లోగా దాఖలు చేయాలని అభ్యర్థించింది. ఈ ప్రక్రియ తర్వాత ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–2021 అమలు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. -
Tamil Nadu: స్టాలిన్తో జతకట్టనున్న నటుడు విజయ్కాంత్!
ఉదయసూర్యుని (డీఎంకే చిహ్నం) కిరణాల ధాటికి రాష్ట్రంలోని రెండాకులు (అన్నాడీఎంకే చిహ్నం) విలవిల్లాడుతున్నాయి. రెండాకుల నీడను వీడి, దినకరన్ పంచన చేరిన విజయకాంత్ ఇకపై ఉదయసూర్యుడి కోసం ఢంకా (డీఎండీకే చిహ్నం) భజాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు విజయకాంత్ అధ్యక్షతన డీఎండీకే ఏర్పడిన తరువాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తరువాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రధాన ప్రతిపక్షస్థానం హోదాను పొందింది. ఆ తరువాత జయలలితతో విబేధించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలుపార్టీలు ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగి అందరూ బోల్తాపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేడీకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్కసీటులో కూడా గెలుపొందలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసినా అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సీఎం స్టాలిన్ అనారోగ్యంతో ఉన్న విజయకాంత్ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.10 లక్షలను విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే, డీఎండీకే కార్యకర్తలు, నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే శ్రేణుల కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఏమీ సాధించలేమని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో చేరాలని భావించాం, అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతోపాటూ డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవిచూడరాదని డీఎండీకే గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరి స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు సమాచారం. అదే సమావేశంలో డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
BJP: స్థానికంలో ఒంటరిపోరు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. కమలం గుర్తును క్షేత్రస్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశంగా మలుచుకోవాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. గడిచిన తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. బీజేపీ 4 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెట్టింది. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం వల్లనే అధికారంలోకి రాలేకపోయామనే భావన అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాబోయే సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అన్నామలై ఇటీవల తరచూ జిల్లాల వారీగా కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తూ పార్టీ స్థితిగతులను, కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశాన్ని చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల్లో స్థానికంగా పార్టీకున్న బలం, పట్టు, అభ్యర్దికి ఉన్న ప్రజాదరణపై గెలుపు ఆధారపడి ఉంటుందని పలువురు నేతలు ఆయన వద్ద అభిప్రాయపడ్డారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అవసరం, అయితే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వాడుకోవడమే మేలని ఎక్కువశాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి లేకుంటే క్షేత్రస్థాయి వరకు కమలం గుర్తుపై పోటీచేసే అవకాశం కలుగుతుంది. ప్రజల్లో కమలం గుర్తును తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మహత్తర అవకాశం. అదే సమయంలో మిత్రపక్ష అన్నాడీఎంకేతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించాలని మరికొందరు సూచించారు. ఈ కొత్త ప్రయత్నానికి మొత్తం మీద ఒంటరి పోటీకే ఎక్కువమంది ఓటేశారు. ఒంటరిగా పోటీ దిగితే డిపాజిట్ కూడా దక్కదేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి వల్లనే ఆసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందారా అని పార్టీ అధిష్టానం మండిపడింది. నాగర్కోవిల్కు చెందిన సీనియర్ నేత ఎంఆర్ గాంధీ అనేకసార్లు ఓటమి పాలయినా అతనిపై ఉన్న మంచి అభిప్రాయమే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిందని హితవు పలికింది. తిరునెల్వేలీలో నయనార్ నాగేంద్రన్ గెలుపుకు వ్యక్తిగత పరపతి, దేవేంద్రకుల సామాజిక సమీకరణ సహకరించింది. కోయంబత్తూరు నియోజకవర్గంలో మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్హాసన్కు పెద్ద సంఖ్యలో ఓట్లు పోలైనా బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసనే గెలుపొందింది. మొట్టకురిచ్చిలో డీఎంకే అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బీజేపీకి గెలుపుబాటలు వేసింది. కూటమి వల్లనే గెలుపు అనే భావన ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సహా పలువురు ఎందుకు ఓటమిపాలయ్యారని కొందరు ప్రశ్నలేవనెత్తారు. కూటమిపై ఆధారపడడం మానుకుని పార్టీ ప్రగతిపై దృష్టిపెట్టండని బీజేపీ అధిష్టానం, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హితవుపలికారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరు దాదాపు ఖాయమైనట్లేనని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement