local body elections
-
TG: ‘బీసీ’ బిల్లులు ఏకగ్రీవం
బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా.-సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సోమవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు ఆమోదం పొందాయి. అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ రెండు బీసీ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. తర్వాత సాయంత్రం వరకు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదాం.. బీసీ బిల్లులపై చర్చ అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీలకు 37శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును గతంలో అసెంబ్లీ ఆమోదించింది. దానికి సంబంధించిన తీర్మానం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సాంకేతిక కారణాల రీత్యా గతంలో చేసిన తీర్మానం ఉపసంహరించుకుని, కొత్తగా అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లుకు మద్దతు ఇచ్చిన పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామని మా నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోనని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదామన్నారు. ఏకాభిప్రాయంతో వెళదాం.. నాయకత్వం వహిస్తా.. బీసీల లెక్క తెలియకపోవడం వల్లే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రం కులగణన సర్వే చేపట్టామన్నారు. ‘‘బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా. అఖిలపక్ష నాయకులంతా సమైక్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలుద్దాం. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి. మేం రాహుల్ గాం«దీని కలసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతాం. ఆయనను కలిసే బాధ్యత, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేలా చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అప్పగిస్తాం..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చేసే బాధ్యత ప్రతి పార్టీపైనా ఉందన్నారు. చట్టబద్ధత లభించేలా శాస్త్రీయంగా చేశాం: భట్టి విక్రమార్క బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు కసరత్తు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్నారు. శాస్త్రీయంగా, పకడ్బందీగా 50రోజుల్లో దీనిని పూర్తి చేశామని చెప్పారు. ‘‘దేశంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే.. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వేను మోడల్గా తీసుకునేంత శాస్త్రీయంగా చేయించాం. గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేశాం..’’ అని భట్టి వివరించారు. కుల గణనలో బీసీలు 50.36 శాతం ఉన్నట్టు తేలిందని.. దీని ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సభలో తీర్మానం పెట్టామన్నారు. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం: పొన్నం ప్రభాకర్ తమిళనాడులో మొత్తం 68శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధన కూడా ఈడబ్ల్యూఎస్కు 10శాతం రిజర్వేషన్లతో తొలగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఒకేతాటిపై ఉన్నాయన్న సంకేతం పంపిద్దామని.. ఎవరేం చేశారన్నది మరోసారి చర్చించుకుందామని చెప్పారు. బీసీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. బీజేపీకి ఇది శీలపరీక్ష లాంటిదని, ఆ పార్టీ వ్యాపారుల పార్టీనా, బీసీల పార్టీనా తేలిపోతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులకు అవకాశం: కేపీ వివేకానంద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద పేర్కొన్నారు. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ల పేర్లతో శాస్త్రీయత లేకుండా బీసీ రిజర్వేషన్లను నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా అదే చెప్తున్నారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరగాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జరిపారని పేర్కొన్నారు. అయితే వివేకానంద చెప్పిన అంశాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అభ్యంతరం తెలిపారు. కేంద్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ బిల్లును ఆమోదిస్తుందని చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ప్రసంగించారు. స్వీట్లు తినిపించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం పొందడం మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి, బీసీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించుకున్నారు. -
‘స్థానిక’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్లు, గూగుల్మీట్లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘స్థానికం’.. ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో విడత కులగణన సర్వే.. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వడివడిగా అడుగులు వేసినా.. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి. సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది. ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం. -
TG: స్థానిక సంస్థల్లో అభ్యర్థిగా ‘నోటా’!
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ బటన్ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఏకగ్రీవాలు ఉంటాయా? ఉండవా? అనే దానిపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉండనుంది. ట్రయల్ ప్రతిపాదికన పంచాయితీ ఎన్నికల్లో ‘నోటా’ను నామమాత్రపు అభ్యర్థిగా ఈసీ పెట్టాలనుకుంటోంది. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడితే.. ఆ స్థానంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. తాజా నిర్ణయం అమలైతే.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండకూడదనే అంశంపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి స్పందన ఎలా ఉండనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా.. పంచాయితీ ఎన్నికల్లో వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులు చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే.. ఇప్పుడీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుదిజాబితా ఖరారుపై ఈసీ ఇవాళ్టి సమావేశంలో చర్చించనుంది. మరోవైపు ఎన్నికల సంఘంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. మరో నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. -
‘స్థానిక’ తేదీలపై నేడు స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపైనా బుధవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో, నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే అయిదారు రోజుల్లోనే అంటే ఈ నెల 17 లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి?, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా..?, లేక గ్రామపంచాయతీ ఎన్నికలా?.. ఏయే తేదీల్లో వీటిని నిర్వహించాలి? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.వారం తేడాతోనే రెండు ఎన్నికలు!ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, వారం రోజుల తేడాతోనే రెండు ఎన్నికలూ నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలిసింది.తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లేదా ప్రత్యక్షంగా ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను మండలాలు, జిల్లా పరిషత్లలో ప్రదర్శించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఈ నెల 15 కల్లా పూర్తవుతాయని, షెడ్యూల్ వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యరంగంలోకి దిగుతారని పంచాతీరాజ్, ఎస్ఈసీ అధికారులు చెబుతున్నారు.తొలుత ఎంపీటీసీ ఎన్నికలే..?పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షలను బట్టి చూస్తే మాత్రం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలున్నాయి. బుధవారం ఉదయం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), ఆర్డీవోలు, సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి లేఖ పంపించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే.. వచ్చే 3,4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల స్థాయిల్లో (స్థానికంగా జీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా...స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
మిగిలింది రిజర్వేషన్ల లెక్కే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. -
సీఎల్పీ.. వెంటనే ఢిల్లీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితోపాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ తదితర అంశాలను కొలిక్కి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి, వారి పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభ పక్షం గురువారం భేటీకానుంది. ఈ భేటీ తర్వాత రాష్ట్ర నాయకత్వం వెంటనే ఢిల్లీ వెళ్లనుంది. వాస్తవానికి తొలుత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీకి రాష్ట్ర నాయకత్వం సిద్ధమవగా.. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ భేటీని సీఎల్పీ సమావేశంగా మార్చారు. అది ముగియగానే ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం సీఎల్పీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గత ఏడాదికాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించనున్నట్టు తెలిసింది. పార్టీలో ఇటీవలి అంతర్గత పరిణామాలు, ఎమ్మెల్యేల డిన్నర్ పే చర్చ వ్యవహారం గురించి కూడా సీఎం ప్రస్తావించనున్నట్టు సమాచారం. పాలనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలు, పెండింగ్ బిల్లుల మంజూరు, ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయం, ఇన్చార్జి మంత్రుల పెత్తనం తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో సీఎం రేవంత్తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పాల్గొననున్నారు. ఈ అంశాలు ప్రజల్లోకి వెళ్లడం లేదా? రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళుతున్నా.. ప్రజల్లో అంత దూకుడుగా చర్చ జరగడం లేదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. దీనితో ఈ అంశంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్తోపాటు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పోషించాల్సిన పాత్రను వివరించనున్నట్టు సమాచారం. కులగణన, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 80శాతానికి పైగా గెలుచుకోవాలన్న దిశగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ.. రాష్ట్ర కాంగ్రెస్లో ఇటీవలి పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. డిన్నర్ పేరుతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమై తమ అసంతృప్తిని వెళ్లగక్కడం, పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వంటివి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి. వీటితోపాటు చాలాకాలంగా మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ పెండింగ్లో ఉన్నాయి. పీసీసీ కొత్త కార్యవర్గం కూర్పు విషయం కూడా ఇంకా తేలలేదు. వీటన్నింటిపైనా చర్చించి మార్గనిర్దేశం చేసేందుకు సీఎం రేవంత్ బృందాన్ని ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీనితో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కార్యక్రమంలో మార్పు జరిగింది. సీఎల్పీ సమావేశం ముగియగానే మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. -
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్రాయల్, మోహన్కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
Telangana: స్థానిక పోరుకు రెఢీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 5న కేబినెట్ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్స్లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజర్వేషన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీలకు తక్కువగా, బీసీల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు. తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్రెడ్డి బదులిచ్చారు. ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు.. ‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు. -
మార్చిలోగా పూర్తి చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మార్చిలోగా జీహెచ్ఎంసీ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. ఆ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను అప్రమత్తం చేయాలి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను తొలుత నిర్వహించాలి. తర్వాత మిగతా ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న దృష్ట్యా కనీసం 80 శాతం విజయాలు నమోదు చేయాలి. రాష్ట్ర మంత్రులు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండొద్దు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి. ముఖ్య నేతలు కూడా స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసింది. ‘స్థానిక’ సంసిద్ధతపై ఆరా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. మండల, జిల్లా పరిషత్ల పదవీకాలం గత జూలైతో పూర్తయ్యింది. ఇక ఈ నెల 26వ తేదీకి ఒకటీ రెండు మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ వాటి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ సంసిద్ధతపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కేసీ పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా ఈ కీలక భేటీని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరు, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, రాహుల్గాంధీ సభ తదితర అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కుల గణనపై కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు వివరించిన నేతలు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను కేసీ వేణుగోపాల్కు రాష్ట్ర నేతలు వివరించారు. రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందజేయనుండటం, కొత్త రేషన్ కార్డుల జారీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తదితరాలపై తాజా వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీ మాట్లాడారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలన్న కేసీ మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయని, ఇన్చార్జి మంత్రులు తమ తమ జిల్లాల కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేలా బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్థత, ఆయా ఎన్నికల్లో విజయడంకా మోగించడంపై దిశానిర్దేశం చేశారు. పీసీసీకి సంబంధించి సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు జిల్లాల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగిలిపోయిన నామినేటెట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న రాహుల్గాంధీ సభ విజయవంతం చేసేలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. కష్టపడి పనిచేస్తున్న వారికే పదవులు: మహేశ్గౌడ్ ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు, పెండింగ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, పీసీసీ కూర్పు ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్గాంధీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ఆమోదించింది. ఒక బిల్లు వాయిదా పడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లు 2024 బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. గతంలో జరిగిన చట్ట సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయిందన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. గతంలో ఆ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.జనాభా పెరగదుఈ బిల్లుపై అధికార కూటమి శాసన సభ్యులే పలువురు పెదవి విరిచారు. చట్ట సవరణ చేసినప్పటికీ, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంతానోత్పత్తి పెరగకపోవచ్చునని, పైగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఆలోచిస్తే ఈ సవరణ సంతానోత్పత్తి రేటు వృద్ధికి దోహద పడదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. జననీ సురక్ష పథకం ఒక్కరికే వర్తిస్తుందని, ఇద్దరు పుడితే ఆ పథకం వర్తించదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఉన్నన్ని రోజులూ సంతానోత్పత్తి రేటు పెరగదని స్పష్టం చేశారు. కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలైన రోజే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత పెరగడానికి ఈ సవరణ తోడ్పడుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి అన్నారు.మరి కొన్ని బిల్లులకూ ఆమోదంవైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను శాసన సభ ఆమోదించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు మేరకు మూగ, చెవిటి, కుష్టు పదాలను తొలగిస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2024ను సభ ఆమోదించింది. ఆయా సమస్యలున్న వారికి విశ్వవిద్యాలయం ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి చెప్పారు. అదే విధంగా ఈ మూడు పదాలను తొలగిస్తూ ఏపీ ఆయుష్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లులనూ సభ ఆమోదించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు –2024కు కూడా సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్–2024ను మరో రోజుకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. -
‘లోకల్’లో కారు దూసుకెళ్లేలా!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపాలనే గట్టి పట్టుదల బీఆర్ఎస్లో కనిపిస్తోంది. ఆ మేరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను పెంచడం, నాయకులు, కేడర్ నడుమ సమన్వయం సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పదును పెడుతున్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించాలనే యోచనలో ఉన్న కేసీఆర్ ఈ భేటీలోనే ఎన్నికల సన్నద్ధత దిశగా కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా పలువురు మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దసరా లోపే పార్టీ ప్లీనరీ! స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా భారీ సభలు నిర్వహించాలా లేక ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున బహిరంగ సభలు ఏర్పాటు చేయాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సుయాత్ర చేపట్టే అంశంపైనా కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సిన పార్టీ ప్లీనరీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. దసరా లోపు పార్టీ ప్లీనరీని రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశముంది. అయితే ఈ ప్లీనరీని హైదరాబాద్ బయట నిర్వహించాలనే సూచనలు కేసీఆర్కు అందుతున్నాయి. వరంగల్లో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆ సెగ్మెంట్లలో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కేసీఆర్ దృష్టి సారించారు. బాన్సువాడ, జగిత్యాల, పటాన్చెరు, చేవెళ్ల, గద్వాల సిర్పూరు, నిర్మల్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇన్చార్జీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సిర్పూరులో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఇప్పటికే కేడర్ను సమన్వయం చేస్తున్నారు. రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాతో పాటు దళితబంధు, ఆసరా పింఛన్ల మొత్తం పెంపు తదితరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది. -
బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తోంది?: బొత్స
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 580కి పైగా ఓట్ల బలం ఉందన్నారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎవరో బిజినెస్మేన్ను తెచ్చి టీడీపీ పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతోందని, రాజకీయాలంటే ఆ పార్టీకి వ్యాపారంలా ఉందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. 300 ఓట్లకు పైగా తేడా ఉన్న సమయంలోనూ పోటీకి దిగడాన్ని ఎలా చూడాలని బొత్స ప్రశ్నించారు. కూటమి గెలుస్తుందని చెప్పేవారు ఈ నెల 14 తర్వాత మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ తనుజారాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి బలం : సుబ్బారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయి బలం ఉందని.. అయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
స్థానిక సమరానికి సై
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ‘లోకల్ బాడీ’ఎలక్షన్స్ టార్గెట్గా పెట్టుకుంది, గ్రామస్థాయిలో సంస్థాగతంగా బలపడేందుకు కమలదళం సన్నద్ధమవుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల వ్యవస్థ పటిష్టానికి అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలు నిరాశ పరిచినా, లోక్సభ ఫలితాలు బీజేపీకి కొంతమేర ఊపునిచ్చాయి. గ్రామస్థాయిలో బీజేపీ అంత పటిష్టంగా లేదు. ఈసారి జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలోనూ 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరాలని.. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ తీర్మానించింది, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ రాగా, లోక్సభ ఎన్నికల నాటికి 35 శాతానికి ఓటింగ్ పెరిగింది. త్వరలో జరగబోయే లోకల్బాడీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ను నిలుపుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో అన్నిస్థాయిల్లోని పార్టీ కేడర్కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇంతకాలం ఎంపీలు, ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసిన కార్యకర్తలను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రకటించారు. స్థానికం.. సన్నద్ధం: పార్టీపరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ, వ్యూహాలు సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా 32 జిల్లాస్థాయి, మండలాల నుంచి, గ్రామ పంచాయతీల దాకా స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సామాజిక సమతూకం పాటిస్తూ.. ఓ ఓసీ, ఓ ఎస్సీ, ఓ బీసీ, ఓ మహిళ ఉండేలా కమిటీల కూర్పు ఉండనుంది. ఈ కమిటీలన్ని జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు పర్యటించి వార్డుసభ్యులు మొదలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తిస్తారు. పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు కూడా ఈ కమిటీలకే అప్పగించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. -
కావాల్సిన సింబల్ను కోరలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించింది. దీంతో ‘చపాతీ రోలర్’గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన లు వినిపిస్తూ...గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల్లో పిటిషనర్ పార్టీ అభ్యర్థులు ‘చపాతీ రోలర్’ గుర్తుపై పోటీ చేశారన్నారు. మండల పరిషత్ ప్రాదే శిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియో జకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలి వ్వాలని కోరారు.ఈసీ తరఫు న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అలాంటి వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. -
Mexico 2024 elections: మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ!
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.సోచిల్ గాల్వెజ్61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్ఏపీ, పీఆర్ఐ, పీఏఎన్, ఆర్పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.క్లాడియా షేన్బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్బామ్కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.జార్జే అల్వారిజ్ మైనేజ్ రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు. -
ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. లోక్సభ ఎన్నికలు ముగిశాక.. జూన్లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వపరంగా అడుగులు ముందుకు పడడం లేదనే చెప్పాలి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జనగణన చేపట్టినా.. స్థానికంగా (క్షేత్రస్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్ 6వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వం లేదా బీసీ కమిషన్ పరంగా... స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు. గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిసి ఈ నెలాఖరుకు నాలుగు నెలలు పూర్తికానుండగా... జూలై 4 నాటికి జిల్లా, మండల ప్రజా పరిషత్ పాలకమండళ్ల కాలపరిమితి కూడా ముగియనుంది. అదేవిధంగా వచ్చే ఏడాది మొదట్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చనీయాంశమవుతోంది. బీసీలకు 42% స్థానిక రిజర్వేషన్లపై హామీఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పడంతో పాటు ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచి్చంది. ఈ మేరకు బీసీ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు నిర్దేశించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ విచారణ జరిపి తుది నివేదిక ఇస్తే దాని ఆధారంగానే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తిచేసినట్టు తెలుస్తోంది. కొత్త ఓటర్ల జాబితా (లోక్సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన జాబితా) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి.. ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు కమిషన్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఓటర్ల లిస్ట్కు అనుగుణంగానా? లేక క్షేత్రస్ధాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత కొరవడినట్టు సమాచారం. ఈ కసరత్తు జరిగితే...ఆగస్ట్, సెప్టెంబర్లో ఎన్నికలు? ఓటర్ల జాబితాకు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక కుల సర్వే అయితే ఇంకా సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ద్వారా వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ ఆలోచనకు ప్రభుత్వపెద్దలు ఓకే చెబితే రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు పంపిస్తే ఆగస్ చివర్లో లేదా సెప్టెంబర్లో ముందుగా గ్రామపంచాయతీ ఆ తర్వాత జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించుకోవచ్చుపనని అభిప్రాయపడుతున్నారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారా? ఈ ఆగస్టుతో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ పరిస్థితుల్లో పాత కమిషన్ ఆధ్వర్యంలోనే బీసీ జనగణన కసరత్తును పూర్తిచేసి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళుతుందా ? లేక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే బీసీ కమిషన్ ద్వారానే ఈ కార్యాచరణను నిర్వహిస్తారా అన్నది కూడా అధికారవర్గాల్లో చర్చకు వస్తోంది. ఆగస్ట్లో కొత్తగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాక... బీసీ జనగణనకు సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని భావిస్తే మాత్రం ఈ ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యం కావొచ్చునని భావిస్తున్నారు. దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి ? ముందుగా జీపీ ఎన్నికలుంటాయా లేక జడ్పీటీసీ, ఎంపీటసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే... తొలుత జీపీ ఆ తర్వాత 10, 15 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఊహించని ఎదురుదెబ్బ!
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. బ్రిటన్లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కాగా, బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్ సునాక్పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్లో 107 కౌన్సిల్స్కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. Disaster for Tories. Love to see it. Now @RishiSunak call for general elections. pic.twitter.com/6Bj1ARAUbh— OppaGaymer 🇵🇸 (@RafLee84) May 3, 2024 కాగా, బ్లాక్పూల్ సౌత్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్ తెలిపారు. Local elections in England and Wales have delivered a blow to Prime Minister Rishi Sunak and his governing Conservative Party. The opposition Labour Party is on track to win the next general election which takes place later this year pic.twitter.com/iiHfbaqqUZ— TRT World (@trtworld) May 3, 2024 మరోవైపు.. బ్లాక్పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్పూల్ సౌత్ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. -
జూన్లో లోకల్ వార్.. తెలంగాణ రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్సభ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్లు, పాలకవర్గాల పదవీకాలం జనవరి నెలాఖరులోనే పూర్తికాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. జూలై తొలివారం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో జూన్ రెండో వారం నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఒకే దఫాలో పూర్తిచేయాలని సీఎం రేవంత్ యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా పూర్తిచేయడం ద్వారా గ్రామ స్థాయిలోనూ రాజకీయంగా పట్టు సాధించడానికి, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలతో సీఎం పేర్కొన్నట్టు సమాచారం. మధ్యమధ్యలో ఎన్నికలు వస్తూ ఉంటే ఇబ్బందులు వస్తుంటాయని చెప్పినట్టు తెలిసింది. రేవంత్ ఇచ్చిన సంకేతాల ప్రకారం.. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలివారంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పనితీరు ఆధారంగా చాన్స్ లోక్సభ ఎన్నికల్లో పార్టీపరంగా చూపిన పనితీరు ప్రాతిపదికనే.. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యరి్థత్వాలతోపాటు ఇందిరమ్మ కమిటీల్లో సభ్యుల నియామకం చేపడతామని పార్టీ నేతలతో సీఎం రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని.. ఇప్పటికే నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వలంటీర్గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. -
ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా గెలుపు వైఎస్సార్సీపీదే
-
పూర్వ పశ్చిమ గోదావరి జెడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు
-
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్ఫ్రంట్లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
తమిళనాడును తాకిన హిజాబ్ సెగ.. రియాక్షన్ ఇది
Hijab Row In Tamil Nadu: దాదాపు పదేళ్ల తర్వాత విరామం తర్వాత తమిళనాట స్థానిక సంస్థల హడావుడి నెలకొంది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 640 స్థానాలకు.. 12, 800 పోస్టులకు శనివారం పోలింగ్ జరుగుతోంది. చాలాకాలం తర్వాత జరుగుతుండడంతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో హిజాబ్ సెగ తమిళనాడుకు పాకింది. కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్’ పరిణామం.. దేశంలో పలుచోట్ల రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆమెతో హిజాబ్ తొలగించి.. ఓటు వేయడానికి అనుమతించాలంటూ ఆ బూత్ ఏజెంట్ వీరంగం సృష్టించాడు. అయితే అతన్ని నిలువరించాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యలు కోరగా.. పోలీసుల జోక్యంతో అతను బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్నిధి స్టాలిన్ స్పందించాడు. #TamilNadu Urban Local Body Poll |A BJP booth committee member objected to a woman voter who arrived at a polling booth in Madurai while wearing a hijab;he asked her to take it off. DMK, AIADMK members objected to him following which Police intervened. He was asked to leave booth pic.twitter.com/UEDAG5J0eH — ANI (@ANI) February 19, 2022 బీజేపీ చేష్టలను తమిళనాడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశాడు. ‘‘బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో.. ఇక్కడి జనాలకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించబోదు’’ అంటూ ఉదయ్నిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరిట మనుషుల్ని తిరస్కరించడం బాధాకరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనేది వ్యక్తిగత విషయం, హక్కు కూడా. అది ఎక్కువా.. తక్కువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారామె. தமிழகத்தில் இன்று நடைபெறும் நகர்ப்புற உள்ளாட்சித் தேர்தலை முன்னிட்டு சென்னை,சாலிகிராமத்தில் உள்ள வாக்குச்சாவடியில் எனது வாக்கினை செலுத்தி ஜனநாயக கடமையாற்றினேன். #LocalBodyElection pic.twitter.com/v4ItGVnkdn — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 19, 2022 ఇక తమిళనాట పదకొండేళ్ల తర్వాత అర్బన్ లోకల్ బాడీ పోల్స్ జరుగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే తమ మధ్య పోటీ ఉండాలనే ఉద్దేశంతో.. బీజేపీని ప్రచారంలో ఏకీపడేశాయి. ఉదయం ఏడు గంటలకే మొదలైన పోలింగ్.. చాలా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతోంది. కాకపోతే లాంగ్ క్యూలతో జనం విసిగిపోయి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31, 180 పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించింది పోలీస్ శాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు కమల్ హాసన్ తెయ్నామ్పేట్లో, తెలంగాణ గవర్నర్ తమిళసై, తమిళ స్టార్ హీరో విజయ్ నీలాన్గరైలో, పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగిల్ ఫేజ్లో ముగియనున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 22న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. సంబంధిత వార్త: హిజాబ్ వివాదం.. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు -
ఓటింగ్లో అసౌకర్యం... క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో విజయ్
Thalapthy Vijay Apologised To The Public: చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ సైతం తన ఓటును వినియోగించుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన విజయ్ ఫోటోలు తీసేందుకు మీడియా పెద్ద ఎత్తున గుంపులుగా చేరడంతో అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. పరిస్థితిని గమనించిన విజయ్ తనవల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో దళపతి అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. His Simplicity 😊🖤 #Vijay#TnLocalBodyElection @actorvijayhttps://t.co/sLr7WM2a00 pic.twitter.com/fAAW0voj0S — مادهيسفج (@MADHESVJ1) February 19, 2022 -
‘నీవు చనిపోయావు’ నామినేషన్ ఎలా వేస్తావు?
లాభనష్టాలతో పనిలేదు.. అప్పులై పోతామనే భయంలేదు.. గెలుపుకోసం ఎందాకైనా వెళ్తాం.. అన్నట్లుగా అభ్యర్థులు జోరు చూపిస్తున్నారు. నగరపాలక ఎన్నికల బరిలో విజయలక్ష్మిని వరించడమే తమ ధ్యేయమన్నట్లు ముందుకుసాగుతున్నారు. పైగా వడ్డీ నూటికి పది రూపాయౖలñ నా..∙పర్వలేదంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘కష్టపడి సీటు దక్కించుకున్నా.. తాడోపేడో.. అటోఇటో.. ఏదో ఒకటి తేలిపోవాల్సిందే.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు.. గెలుపుకోసం ఎంత వరకైనా పోరాడుతా.. ఎంత డబ్బయినా పెడతా..’’ ఇదీ ఎన్నికలపై ఓ పార్టీ అభ్యర్థి మనోగతం.. అవును.. నగరపాలక ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో ఇదే అదనుగా అప్పులుస్తాం రండి అంటూ జాతీయస్థాయి రుణదాతలు రాష్ట్రంలో వాలిపోతున్నారు. ఫైనాన్షియర్ల చుట్టూ.. రాష్ట్రంలో 21 కార్పొరేషన్లు, 138 మునిసిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీల్లోని 12,838 వార్డులకు ఈనెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. సీటు దక్కించుకునేందుకు ఆయా పార్టీల అధిష్టానికి భారీగా ముట్టజెప్పిన అభ్యర్థులు ప్రస్తుతం.. ప్రచారపర్వంలో దిగిపోయారు. మరోవైపు ఖర్చుల కోసం ఫైనాన్షియర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక సీటు ఇచ్చేశాం.. విజయం సాధించడం మీ వంతు అని పార్టీల పెద్దలు హుకుం జారీ చేస్తుండడంతో అభ్యర్థులు శాయశక్తులా విజయం కోసం పోరాడుతున్నారు. తిరునెల్వేలి, తూత్తుకూడి జిల్లాల నుంచి పలువురు ఫైనాన్షియర్లు కందువడ్డీపై అప్పులిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సంచరిస్తున్నారు. భూమి, ఇంటి స్థలం, వాహనం ఇలా ఏదైనా తాకట్టుపెట్టుకుని డబ్బులిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. డిమాంబ్ను బట్టి నూటికి 10 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. చెన్నైలోనే రూ. వెయ్యికోట్లకు పైగా? రుణాల వ్యవహారంపై ఒక ఫైనాన్షియర్ మాట్లాడుతూ, చెన్నైలో 200 వార్డులున్నాయి. ఒక్కో అభ్యర్థి రూ.5 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. దీంతో కేవలం చెన్నై కార్పొరేషన్లోనే రూ.1000 కోట్లు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లెక్కకడితే మొత్తం రూ.7వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యర్థుల ఎన్నికల అవసరాలకు ఎన్నికోట్ల రూపాయలు కావాలన్నా ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, లక్నో, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం తదితర మహానగరాల నుంచి 24 గంటల్లో అప్పు ఇస్తామంటూ (మార్వాడీలు, రానా నెట్వర్క్, శర్మ నెట్వర్క్, సురాణా నెట్వర్క్ అనే పేర్లతో) రుణదాతలు ముందుకొస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల జోరు ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా అన్నిపార్టీల అభ్యర్థులు ఎన్నికల కార్యాలయాల వద్ద గురువారం క్యూకట్టారు. పెద్దసంఖ్యలో తరలివచ్చి నామినేషన్లను సమర్పించారు. దాదాపుగా అన్నిచోట్లా ప్రధాన ప్రత్యర్థులు ఒకేసారి రావడంతో ఎన్నికల అధికారులకు దిక్కుతోచలేదు. గత నెల 28వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం వరకు 10,153 మంది నామినేషన్లు వేశారు. చిన్నమ్మ పెద్ద మనసు ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేపై కయ్యానికి కాలుదువ్విన చిన్నమ్మ శశికళ ప్రస్తుతానికి పెద్దమనసు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఆమె మద్దతు పలికారు. అన్నాదురై 53వ వర్ధంతి సందర్భంగా గురువారం చెన్నై టీనగర్లోని ఆమె నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయలలిత బాటలో నడిచేవారు ఎవరైనా సరే విజయం సాధించాలని అన్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆశీస్సులతో కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే త్వరలోనే తన చేతుల్లోకి వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ప్రజల్లోకి వస్తానని, జిల్లాలవారీగా పర్యటిస్తానని ఆమె స్పష్టం చేశారు. తిరువళ్లూరు: జిల్లాలో ఇంత వరకు స్తబ్దుగా ఉన్న నామినేషన్ల ప్రక్రియ గురువారం ఊపందుకుంది. తిరుమళిసైలో డీఎంకే నేతలు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తిరువళ్లూరు, ఆవడి, తిరునిండ్రవూర్, పూందమల్లిలోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది. వేలూరు: వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో గురువారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వేలూరు కార్పొరేషన్లో మొత్తం 60 వార్డులుండగా గురువారం సాయంత్రం నాటికి సుమారు 80 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పలుచోట్ల నగదు స్వాధీనం ► తిరుచ్చిరాపల్లి, తంజావూరు, పుదుక్కోట్టైలో ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.58.35 లక్షలను అధికారులు సీజ్ చేశారు. ► చెన్నైలో బుధవారం వరకు రూ.1.26 కోట్ల విలువైన బహుమతులు, రూ.5.59 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ► కోయంబత్తూరులో అన్నాడీఎంకే ప్రముఖుడు ఉలగనాథన్ (42) ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ప్రత్యేక తహసీల్దారు కల్పన తనిఖీ చేసి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి గెలుపొందాలని అన్నాడీఎంకే, డీఎంకే నేతలు భావిస్తున్నారని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ విమర్శించారు. ప్రాణం తీసిన నిరాశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదనే నిరాశ ఓవ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈరోడ్ జిల్లా గోపీ సమీపం వానిపుత్తూరు పట్టణ పంచాయతీకి చెందిన రామన్ (53), మహేశ్వరి (49) దంపతులు. గతంలో నాలుగుసార్లు జరిగిన పట్టణ పంచాయతీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి రామన్ రెండుసార్లు, మహేశ్వరి రెండుసార్లు అన్నాడీఎంకే సీటుపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం అదే వార్డు నుంచి పోటీచేసేందుకు తనకు లేదా భార్యకు అవకాశం దక్కుతుందనే నమ్మకంతో పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండురోజుల క్రితం అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలకాగా దంపతుల ఇద్దరి పేర్లూ అందులో లేవు. పార్టీ కోసం 40 ఏళ్లు పాటు పడినా శ్రమ వృథాగా మారిందని భార్య వద్ద తీవ్రంగా వాపోయిన రామన్ గురువారం ఉదయం స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు విడిచాడు. అన్నాడీఎంకే అభ్యర్థికి చేదు అనుభవం సాక్షి ప్రతినిధి, చెన్నై : ‘ ఓటర్ల జాబితాలో నీవు చనిపోయినట్లు ఉంది.. నామినేషన్ ఎలా దాఖలు చేస్తావు...’ అంటూ అధికారులు ప్రశ్నించడంతో అన్నాడీఎంకే మహిళా అభ్యర్థి నిర్ఘాంతపోయారు. వివరాలు.. నాగపట్టిన మునిసిపాలిటిలో 4వ వార్డు నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా అమృతవల్లి (33) నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. పత్రాల తనిఖీలో భాగంగా ఓటర్ల జాబితాను తెరిచిచూస్తే ఆమె పేరు లేదు. ఇదేం చోద్యమని ఆమె ప్రశ్నించగా, మీరు చనిపోయినందున పేరు తొలగించారని అధికారులు బదులిచ్చారు. అభ్యర్థుగా తన పేరు ఖరారైనప్పుడు పేరు ఉందని.., నామినేషన్ వేసేటప్పుడు మాత్రం లేకపోవడం, పైగా చనిపోయిన వారి జాబితాలో పేరు చేర్చడం కుట్రే నని ఆమె అధికారులపై ఆమె మండిపడ్డారు. -
రెండాకుల ముసలం.. వేరుపడిన కమలం
పంతం పట్టు వీడనంది.. బంధం బీటలు వారింది..ఫలితం రెండాకుల కూటమి నుంచి కమలం వేరుపడింది. పురిట్చితలైవి జయలలిత మరణానంతరం జోడీ కట్టిన అన్నాడీఎంకే, బీజేపీ నగరపాలక ఎన్నికల్లో తమదారులు వేరంటూ విడిపోయాయి. అయితే రాష్ట్రంలో వేరుపడినా.. కేంద్రంలో దోస్తీలమే అంటూ తమ కటీఫ్ కహానీకి కొత్తఅర్థం చెప్పాయి. సాక్షి, చెన్నై(తమిళనాడు): అన్నాడీఎంకేతో అనుబంధాన్ని బీజేపీ తాత్కాలికంగా తెంచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆ పార్టీతో కటీఫ్ చెబుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోమవారం అధికారికంగా ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ముగించారు. గత కొద్దిరోజులుగా.. తమిళనాడులో ఈనెల 19న నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. యథాప్రకారం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఆ రెండు కూటములు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై గత కొన్నిరోజుల్లో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే–బీజేపీ సైతం సీట్ల పంపకంపై ఎడతెగని చర్చలు జరిపాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అన్నాడీఎంకే–బీజేపీ మధ్య చాపకింది నీరులా పెరిగిపోతున్న అగాధం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బట్టబయలైంది. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, పీఎంకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. డీఎంకే కూటమిలో ఎడతెగని పంచాయితీ ఇదిలా ఉండగా, డీఎంకే కూటమిలో సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. అన్నాడీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డీఎంకే కూటమి భావిస్తూ జాబితా విడుదలలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థల ఖరారులో ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన జాబితాను డీఎంకే కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఈ జాబితాను పరిశీలించి మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా తమ కూటమి నుంచి బీజేపీ దూరం జరగడంతో అన్నాడీఎంకే సోమవారం రెండో, మూడో జాబితాలను విడుదల చేసింది. కాగా సీట్ల సర్దుబాటుపై డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఆ పార్టీ అగ్రనేత రమేష్ చెన్నితాల సోమవారం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న డీఎండీకే 100మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. చర్చలు విఫలం.. కాగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గతనెల 29వ తేదీన సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగినందున 30శాతం సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబట్టగా అన్నాడీఎంకే ఐదు శాతం మాత్రమే ఇస్తామని చెప్పింది. బీజేపీ క్రమేణా 18 శాతానికి దిగిరాగా అన్నాడీఎంకే మాత్రం 8 శాతానికి మించి ఇచ్చేది లేదని తెలిపింది. తుది ఆఫర్గా 11 శాతం అంటూ ద్వితీయశ్రేణి నేతలతో బీజేపీకి అన్నాడీఎంకే ఆదివారం కబురుపంపింది. అయితే 18 శాతం కంటే తగ్గేదిలేదని కమలనాథులు ఖరాఖండీగా బదులిచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయడంతో కమలనాథులు ఖంగుతిన్నారు. బీజేపీతో మళ్లీ చర్చలకు తావులేకుండా ఎడపాడి పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సోమవారం ఎలాంటి పిలుపురాలేదు. తాజా పరిణామంపై అన్నామలై సోమవారం హడావిడిగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అగ్రనేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నామలై మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు దిగుతోందని ప్రకటించారు. తాము కోరినన్ని స్థానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో 2024 పార్లమెంటు ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందని పేర్కొన్నారు. -
మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు. మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు. చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు -
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
హడావుడి చేసి.. హ్యాండిచ్చారు!
సాక్షి, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు రానున్నాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికల పోలింగ్లో కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికే మద్దతు ఇచ్చినట్లు వ్యవహరించినా.. ఓటు వేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారా అన్న చర్చసాగుతోంది. రాష్ట్రంలో జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదైంది. 77 మంది ఓటు వేయకపోగా, అందులో ఐదారుగురు మినహా మిగతా అందరూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయాలని తీర్మానించారు. కానీ ఇరు పార్టీల ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉండి అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తీరే వేరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న సంఖ్యలో రెండో స్థానంలో ఆదిలాబాద్ డివిజన్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఓల్డ్ సమావేశ మందిరంలో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికి పోలింగ్ ఏజెంట్గా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్రెడ్డి వ్యవహరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడు పాయల శరత్ శుక్రవారం పోలింగ్ కేంద్రం వద్ద పుష్పరాణి మద్దతుదారులైన తుడుందెబ్బ నాయకులతో చర్చిస్తూ బిజీబిజీగా కనిపించారు. పోలింగ్ మొదలైన తర్వాత ఉదయం నుంచి బీజేపీ సభ్యులను తీసుకువచ్చి పుష్పరాణికి ఓటు వేయించడంలో తోడ్పాటు అందించినట్లు ప్రత్యక్షంగా చూస్తున్నవారికి అనిపించింది. తీరా పోలింగ్ ముగిసిన తర్వాత ఈ కేంద్రంలో 20 మంది ఓటు వేయలేదని, అందులో 13 మంది బీజేపీ సభ్యులు ఉన్నారని తేలడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. మున్సిపాలిటీలో ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్కు దూరంగా ఉండటం చర్చనీయంగా మారింది. వారు అలకబూనడంతోనే ఓటు వేయలేదనే ప్రచారం సాగుతోంది. ఒకరోజు ముందు జిల్లా నాయకత్వం ఓటు ఎవరికి వేయాలనే అంశంపై చర్చించేందుకు పిలవగా వారు అందులో పాల్గొనలేదని అంటున్నారు. ప్రధానంగా ఒక ముఖ్య నేత ఈ ఎన్నికల పరంగా వ్యవహరించిన తీరుతోనే వారు అసంతృప్తికి లోనయ్యారని చెప్పుకుంటున్నారు. ఇది బీజేపీలో లుకలుకలకు దారితీస్తోంది. కాంగ్రెస్ది వైరి వర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైరి వర్గం మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పెందూర్ పుష్పరాణికి పార్టీ మద్దతు ఇస్తుందని నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ఖాన్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థితో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. పోలింగ్ కేంద్రం వద్ద శుక్రవారం సాజిద్ఖాన్ పెందూర్ పుష్పరాణికి మద్దతుగా పార్టీ సభ్యులను ఓటు వేయాలని చెబుతూ కనిపించారు. అయితే కొన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధికార టీఆర్ఎస్ సభ్యులతో కలిసి రావడం చర్చనీయమైంది. మరోపక్క మంచిర్యాల, బెల్లంపల్లి పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ సభ్యులు 45 మంది ఓటు వేయకపోవడం గమనార్హం. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు ఆదేశాలతోనే వారు ఓటు వేయలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే బెల్లంపల్లిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలిచిందా.. లేదా అనే అయోమయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. -
తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటింగ్ శాతం ఇదే..
04:00 PM ►తెలంగాణలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలోని జెడ్పీటీసీల, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 14న కౌంటింగ్ జరగనుంది. ►కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది కేంద్రాలలో పోలింగ్ పూర్తవగా..మొత్తం ఓట్లు 1324 ఉంటే 1320 ఓట్లు పోలయ్యాయి. అంటే 99.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఓటు వేయలేదు. మరో వ్యక్తి చనిపోగా, సిరిసిల్లలో అనారోగ్యంతో ఓ ఎంపీటీసీ ఓటు వేయలేదు. ► స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ►ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రికార్డ్ స్థాయిలో 91.78% పోలింగ్ నమోదైంది. ►భువనగిరిలో 197 ఓట్లకు 197 ఓట్లు పోల్ అయ్యాయి. ►ముగిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 95 శాతం పోలింగ్ నమోదైంది. ►ఖమ్మం-మొత్తం 348ఓట్లకు గాను 338 ఓట్లు పోలింగ్ ►కల్లూరు-మొత్తం 115 ఓట్లకు గాను 114 ఓట్లు పోలింగ్ ►కొత్తగూడెం-మొత్తం 221ఓట్లకు గాను 209 ఓట్లు పోలింగ్ ►భద్రాచలం-మొత్తం 84ఓట్లకు గాను 79 ఓట్లు పోలింగ్.. ►మొత్తం 768ఓట్లకు గాను 740ఓట్ల పోలింగ్ ►నల్లగొండలో మొత్తం 235 ఓట్లకు గాను 229 ఓట్లు పోలయ్యాయి. ►సూర్యాపేట జిల్లాకేంద్రం లో 186 ఓట్లకు గానుక 183 పోలయ్యాయి. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రల్లో 100శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ మినహా అందరూ ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►మొత్తం 1026 ఓటర్లకు గానూ, 1018 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► సిరిసిల్లలో 99.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్త 201 ఓట్లు ఉండగా.. 200 ఓట్లు పోలయ్యాయి. 03:00 PM ►కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్ఎస్ వైపు ఏకపక్షమే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పదవులు ఇస్తే సీఎం కేసీఆర్ దేవుడు లేకపోతే దయ్యంలా చూస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ శిఖండీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ►ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పని లేదని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కమల రాజ్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో మూడు గంటలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా.. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. 02:00 PM ►కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ 76.06 శాతం పోలింగ్ నమోదు అయ్యింది ►యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ ఎన్నికల కేంద్రంలో 106 మందికి గాను 82 మంది ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ► నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు 83.63 % నమోదదైంది 01:05 PM ► 1 గంట వరకు ఖమ్మంలో 58శాతం పోలింగ్ నమోదు ► మెదక్లో ఎమ్మెల్యే మాణికరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► సంగారెడ్డిలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కేసీఆర్ వరిధాన్యం పేరిట డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపారని విమర్శించారు. 12:05 PM ► ఉమ్మడి మెదక్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 42.1 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► నల్లగొండలో మధ్యాహ్నం వరకు 42.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► సూర్యపేట జిల్లా పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం వరకు 43.28 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో 64.97 శాతం, చౌటుప్పల్లో 66.98 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ► సంగారెడ్డిలో అందోల్ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► సిద్ధిపేటలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా నిధులు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ► నిర్మల్లో 81 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► ఆదిలాబాద్లో 1గంట వరకు 77 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 11:45 AM ► సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► భువనగిరి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ► కరీంనగర్ జడ్పీహాలులో మంత్రి గంగుల కమలాకర్ తన ఓటుహక్కు వినియోంచుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కొంత మంది కళ్లు మండుతున్నాయి. మాకు బలంలేదని బీజేపీ, కాంగ్రెస్లు ఎన్నికల నుంచి తప్పుకున్నాయి. అవి మాకు శుభసూచకమని గంగుల అన్నారు. ► టీఆర్ఎస్ కుటుంబ సభ్యులలో చిచ్చుపెట్టాలని కొందరు ఎన్నికలు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇండిపెండెంట్గా పోటిచేసిన రవీందర్ సింగ్కు ఈటల మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈటల శిఖండి రాజకీయాలు మానుకోవాలని గంగుల హితవు పలికారు. 11: 15 AM ► రాజన్న సిరిసిల్లలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మంచిర్యాల బెల్లంపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి పరిశీలించారు. 10: 48 AM ► ఖమ్మం పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► నల్లగొండలో స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 10: 15 AM ► మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలోని ఎన్నికల కేంద్రాన్ని స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి పరిశీలించారు. ► నల్లగొండలోని బాలికల జూనియర్ కాలేజీలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, చిన్నపరెడ్డి తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. 09: 25 AM ► కోరుట్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ ఓటు హక్కును వినియోంచుకున్నారు. ► మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్లో ఎమ్మెల్యే బాల్క సుమన్, దివాకర్రావు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ►ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్ సందర్శించారు. 09: 15 AM ► యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలేరు, శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► నల్లగొండ జిల్లాలోని బాలికల కాలేజ్లో ఎక్స్ అఫిషియో మెంబర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 08: 25 AM ► కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అభ్యర్థి రవీందర్ సింగ్ ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ► సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ మేయర్ రవీందర్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 08: 15 AM ► నల్లగొండ జిల్లాలో.. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఆయన భార్య ఓటు హక్కును వినియోంచుకున్నారు. ► ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి గాను.. నిర్మల్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 08: 02 AM ► ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్లారు. ► నల్లగొండలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటింగ్ సెంటర్కు చేరుకుంటున్నారు. ► కరీంనగర్ జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: 6 స్థానాలు.. 26 మంది అభ్యర్థులు.. 5326 మంది ఓటర్లు..37 పోలింగ్ కేంద్రాలు. శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం లో ఒక్కో స్థానానికి, కరీంనగర్లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇందులో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. అందరు కోవిడ్ నిబంధనలను పాటించాలని సీఈఓ శశాంక్ గోయల్ కోరారు. -
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్
సాక్షి, తిరుపతి: 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి స్థానిక సంస్థలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వరకు వరుస ఓటములతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో టెన్షన్ వెంటాడుతోంది. కుప్పం ఎన్నికల్లో ఇప్పుడు ఓటమి పాలైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మరోసారి పరాభవం ఖాయమని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కుప్పంపై ఆయన ‘ప్రత్యేక’ దృష్టిపెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చదవండి: Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు కుట్రలు, కుతంత్రాలకు పన్నాగం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. వాటిని పక్కాగా అమలుచేసేందుకు ఆయన, లోకేశ్.. టీడీపీ నేతలు, ఇన్చార్జ్లుగా ఉన్న మాజీమంత్రి అమరనాథ్రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏం చేయాలో ఏ రోజుకా రోజు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంతైనా ఖర్చు చేయండి నిజానికి.. కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఎన్నికలను అధిగమించేందుకు భారీగా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేసేందుకు వెనుకాడొద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బు ఎంతైనా ఖర్చుచేయాలని.. అవసరమైన మొత్తం తాను పంపుతానని ఇన్చార్జ్లకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఖర్చు బాధ్యతలను చంద్రబాబు తన పీఎస్ దొరస్వామినాయుడుకు అప్పగించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోజువారీ ప్రచారం నిమిత్తం ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు, మద్యం, బిర్యాని పంపిణీ కూడా చేయమని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఏపీలో మద్యం కొనుగోలు చేయవద్దని, పక్కనే ఉన్న కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా తెప్పించుకోమని సూచించినట్లు సమాచారం. మద్యం కోసమే ప్రత్యేకంగా ఓ టీంని నియమించారు. ఇక ఓటర్లకు ఎంత ఇవ్వాలో తాను తరువాత చెబుతానని బాబు చెప్పినట్లు తెలిసింది. దాడి చేయండి.. ఎదురు కేసులు పెట్టండి ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వైఎస్సార్సీపీ శ్రేణులే టార్గెట్గా దాడులు చేయమని కూడా చంద్రబాబు సూచనలు చేసినట్లు కుప్పం టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టి.. వారిపైనే తిరిగి కేసు పెట్టాలని ఇన్చార్జ్లకు సూచనలు అందాయి. ఇందులో భాగంగానే శుక్రవారం వీ కోట టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ రంగనాథ్ తన అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తప్ప మిగిలిన వారికి ఇక్కడ ఏం పని అని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గణపతి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రంగనాథ్ అనుచరులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అదే విధంగా ఎన్ఎఫ్సీ కళాశాల వద్ద కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి మునస్వామి, బంధువు వెంకటేష్పై స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు దాడిచేశారు. దాడిచేసిన వారే బాధితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాబు ఆదేశాలకు అద్దంపడుతున్నాయి. కుప్పానికి పరిటాల, జేసీ వర్గీయులు కుప్పంలో అలజడులు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల, జేసీ వర్గీయులను దింపనున్నారు. అల్లర్లలో ఆరితేరిన వారిని కుప్పం ఎన్నికలకు వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. వారంతా ఒకట్రెండు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్నారు. వీరి కోసం కుప్పం శివారుల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని టీడీపీ ప్రచారాల్లో రచ్చచేయాలని.. వీలైతే దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనల ద్వారా తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు కూడా చంద్రబాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిసింది. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడం ఈ బృందం బాధ్యత. -
ఏపీ: ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ►గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ. ►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ►పరిషత్ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. -
AP: మున్సిపోల్స్కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
Updates: ►ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్లో 9వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి అనిల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు, ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) ఈ నెల 15న వీటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుధవారం (నేడు) నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడతారు. పోటీ చేయని అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మహిళా ఓటర్లే అత్యధికం ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 9,58,141 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,67,045 మంది పురుషులు కాగా 4,90,897 మంది మహిళలు. 199 మంది ఇతర ఓటర్లు. మొత్తం ఓటర్లలో 4,77,244 మంది నెల్లూరులో ఉండగా మిగిలినవారు ఇతర మునిసిపాలిటీల్లో ఉన్నారు. 10 చోట్ల తొలిసారి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, వైఎస్సార్ జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుకొండ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు.. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో ఆగిన ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న విషయం విదితమే. మరణించిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మాత్రమే ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అందులో ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో కేవలం టీడీపీ అభ్యర్థులకు మాత్రమే కొత్తగా నామినేషన్ల వేసుకునే వీలుంటుంది. అలాగే రెండేసి చొప్పున జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొత్తగా నామినేషన్లు వేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఒక జెడ్పీటీసీ స్థానంలో బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులకు అవకాశమిచ్చింది. ఈ జెడ్పీటీసీ స్థానాలతో పాటు 81 ఎంపీటీసీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కాకుండా కేవలం ఒక్కొక్క పార్టీ నుంచి మాత్రమే నామినేషన్ల స్వీకరణకు అనుమతిచ్చింది. కాగా, మరో మూడు జెడ్పీటీసీ స్థానాలు, 95 ఎంపీటీసీ స్థానాలు, 69 గ్రామ సర్పంచ్, 533 వార్డు సభ్యులకు అన్ని రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. -
బాబోయ్ మేము పోటీ చేయబోమంటున్న టీడీపీ క్యాడర్
-
ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
యంగెస్ట్ ప్రెసిడెంట్..నీళ్ల కోసం గెలిచింది
‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్గా గెలుపొందింది. తెన్కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది. తమిళనాడులో ‘కరువు’ ఆధార్ కార్డ్ తీసుకుంటే దాని మీద అడ్రస్ ‘తెన్కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్ టీచర్. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ. ఎన్నికలొచ్చాయి తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్లో నిలబడతా అని చెప్పసాగింది. సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్ వేశారు. గట్టి అభ్యర్థి షారుకళ కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు. ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది. ‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు. గెలుపు వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది. ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది. -
‘ప్రజలు సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకున్నారు’
అమరావతి: ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కేసులతో ఎన్నికల రద్దుకోసం ప్రయత్నం చేశాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఈ ఫలితాలే సీఎం వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమని తెలిపారు. కాగా, తాము ఎన్నికలను బహిష్కరించాం అంటున్న నేతలకు సిగ్గుందా.. అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసింది. కానీ, ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి పారిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు టీడీపీ వైపు ఎందుకుంటారు? ఆయా వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్ను గుండెల్లో పెట్టుకుని తీర్పునిస్తున్నారని అన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్లో ఉంటేనే మంచిదని.. ఇక్కడ అడుగుపెడితే కుట్రలు చేస్తారని మండిపడ్డారు. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్ర చేయాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని చెప్పారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేత అచ్చెన్న మాట్లాడుతున్నాడు.. అసలు ఆయా చోట్ల ఆ పార్టీకి ఒక్కరు కూడా నామినేషన్ వేయడానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఫలితాలను చూసి చంద్రబాబు అయ్యన్నతో మాట్లాడిస్తున్నట్టుందని మండిపడ్డారు. తమకు చేతకాదా? తాము తిట్టలేమా? కానీ తమకు సంస్కారం ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: బాబు ఇలాకాలో ఫ్యాన్ హవా -
స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల కాలపరిమితి ముగిసి, నేటికి మూడేళ్లు పూర్తయింది. అయినా ఎన్నికల నిర్వహణకు సర్కారు ఏమాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి, తీరాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం..ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుండడం నుంచి ఈ ‘పంచాయితీ’ నడుస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఓబీసీల ఓటు బ్యాంకు సమకూర్చుకునేందుకు ఎన్నికల్లో వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికార బీజేడీ ప్రకటన జారీ చేసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! ఇప్పుడు మళ్లీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు ఇవ్వకుండా ఫలితాల కోసం ఓ ప్రత్యేక రోజుని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఇదివరకు ఏ పంచాయతీలో జరిగే ఎన్నికల ఫలితాలు.. ఎన్నికలు జరిగిన రోజునే ప్రకటించేవారు. ఇప్పుడు అలా కాకుండా సమితిలోని మొత్తం పంచాయతీల బ్యాలెట్ బాక్సులను సమితి కేంద్రానికి తరలించి, లెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు మార్పుల పట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా ఓట్లను తారుమారు చేసి, గెలిచేందుకే నవీన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలకు పైబడి పంచాయతీలు ఉండగా, 314 సమితులు ఉన్నాయి. 15 రోజుల్లో అభ్యంతరాలు.. పంచాయతీ ఎన్నికల్లో ఇదివరకున్న బూత్ స్థాయి ఓట్ల లెక్కింపునకు తెరపడుతుంది. సమితి ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృత విధానంలో ఈసారి ఓట్లను లెక్కిస్తారు. సమితి వ్యాప్తంగా అంచెలంచెలుగా పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని బూత్లలో పోలైన ఓట్లను ఒకేసారి లెక్కపెడతారు. ఈ నేపథ్యంలో ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–1965 సంస్కరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు జారీ చేసింది. వీటి పట్ల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను 15 రోజుల్లోగా దాఖలు చేయాలని అభ్యర్థించింది. ఈ ప్రక్రియ తర్వాత ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–2021 అమలు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. -
Tamil Nadu: స్టాలిన్తో జతకట్టనున్న నటుడు విజయ్కాంత్!
ఉదయసూర్యుని (డీఎంకే చిహ్నం) కిరణాల ధాటికి రాష్ట్రంలోని రెండాకులు (అన్నాడీఎంకే చిహ్నం) విలవిల్లాడుతున్నాయి. రెండాకుల నీడను వీడి, దినకరన్ పంచన చేరిన విజయకాంత్ ఇకపై ఉదయసూర్యుడి కోసం ఢంకా (డీఎండీకే చిహ్నం) భజాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు విజయకాంత్ అధ్యక్షతన డీఎండీకే ఏర్పడిన తరువాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తరువాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రధాన ప్రతిపక్షస్థానం హోదాను పొందింది. ఆ తరువాత జయలలితతో విబేధించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలుపార్టీలు ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగి అందరూ బోల్తాపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేడీకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్కసీటులో కూడా గెలుపొందలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసినా అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సీఎం స్టాలిన్ అనారోగ్యంతో ఉన్న విజయకాంత్ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.10 లక్షలను విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే, డీఎండీకే కార్యకర్తలు, నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే శ్రేణుల కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఏమీ సాధించలేమని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో చేరాలని భావించాం, అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతోపాటూ డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవిచూడరాదని డీఎండీకే గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరి స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు సమాచారం. అదే సమావేశంలో డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
BJP: స్థానికంలో ఒంటరిపోరు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. కమలం గుర్తును క్షేత్రస్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశంగా మలుచుకోవాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. గడిచిన తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. బీజేపీ 4 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెట్టింది. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం వల్లనే అధికారంలోకి రాలేకపోయామనే భావన అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాబోయే సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అన్నామలై ఇటీవల తరచూ జిల్లాల వారీగా కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తూ పార్టీ స్థితిగతులను, కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశాన్ని చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల్లో స్థానికంగా పార్టీకున్న బలం, పట్టు, అభ్యర్దికి ఉన్న ప్రజాదరణపై గెలుపు ఆధారపడి ఉంటుందని పలువురు నేతలు ఆయన వద్ద అభిప్రాయపడ్డారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అవసరం, అయితే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వాడుకోవడమే మేలని ఎక్కువశాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి లేకుంటే క్షేత్రస్థాయి వరకు కమలం గుర్తుపై పోటీచేసే అవకాశం కలుగుతుంది. ప్రజల్లో కమలం గుర్తును తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మహత్తర అవకాశం. అదే సమయంలో మిత్రపక్ష అన్నాడీఎంకేతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించాలని మరికొందరు సూచించారు. ఈ కొత్త ప్రయత్నానికి మొత్తం మీద ఒంటరి పోటీకే ఎక్కువమంది ఓటేశారు. ఒంటరిగా పోటీ దిగితే డిపాజిట్ కూడా దక్కదేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి వల్లనే ఆసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందారా అని పార్టీ అధిష్టానం మండిపడింది. నాగర్కోవిల్కు చెందిన సీనియర్ నేత ఎంఆర్ గాంధీ అనేకసార్లు ఓటమి పాలయినా అతనిపై ఉన్న మంచి అభిప్రాయమే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిందని హితవు పలికింది. తిరునెల్వేలీలో నయనార్ నాగేంద్రన్ గెలుపుకు వ్యక్తిగత పరపతి, దేవేంద్రకుల సామాజిక సమీకరణ సహకరించింది. కోయంబత్తూరు నియోజకవర్గంలో మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్హాసన్కు పెద్ద సంఖ్యలో ఓట్లు పోలైనా బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసనే గెలుపొందింది. మొట్టకురిచ్చిలో డీఎంకే అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బీజేపీకి గెలుపుబాటలు వేసింది. కూటమి వల్లనే గెలుపు అనే భావన ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సహా పలువురు ఎందుకు ఓటమిపాలయ్యారని కొందరు ప్రశ్నలేవనెత్తారు. కూటమిపై ఆధారపడడం మానుకుని పార్టీ ప్రగతిపై దృష్టిపెట్టండని బీజేపీ అధిష్టానం, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హితవుపలికారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరు దాదాపు ఖాయమైనట్లేనని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం
సాక్షి, అమరావతి: 2021 ఏడాది బడ్జెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
భయం లేకే కోవిడ్ వ్యాప్తి
న్యూఢిల్లీ: కోవిడ్ వైరస్ సోకుతుందన్న భయం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్ వెరసి మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ఆదివారం తెలిపింది. కోవిడ్ కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం గతవారంలో రాష్ట్రంలో పర్యటించింది. చాలా అంశాలున్నాయి.. కోవిడ్ వ్యాప్తికి నిర్ణీత కారణాన్ని చెప్పలేమని, కేసుల పెరుగుదల చాలా అంశాల మిళితం వల్ల జరుగుతోందని చెప్పారు. వాటిలో రోగం పట్ల భయం లేకపోవడం, మహమ్మారి పట్ల ఉదాసీనత, సూపర్ స్ప్రెడర్లను గుర్తించలేకపోవడం, ఎన్నికల్లో సరైన కోవిడ్ నిబంధనలు పాటించలేకపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడం, పాఠశాలలు తెరవడం, గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేయడం వంటి కారణాల వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్రం నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుత కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేని రోగులే ఉంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడంలో విఫలం కావడం కూడా కారణమని చెప్పింది. ఇప్పటికైనా మేలుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. డాక్టర్లలోనూ ఉదాసీనత.. డాక్టర్లలో ప్రత్యేకించి ప్రైవేటు డాక్లర్లు కొన్ని కేసులను కేవలం ఫ్లూగా కొట్టిపారేస్తూ టెస్టుల వరకూ వెళ్లనివ్వట్లేదని.. కోవిడ్ రోగులను జూనియర్ డాక్టర్లకు వదిలేస్తున్నారని దీంతో కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. కోవిడ్ నియంత్రణ కోసం కంటితుడుపు చర్యలు తీసుకోకుండా పని చేయాలని, ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపింది. ఎంత మందికి వ్యాక్సినేషన్ చేస్తామన్నారో, ఎందరికి వ్యాక్సిన్ వేశారో చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని మహారాష్ట్రలో పర్యటించిన బృందం తెలిపింది. కేంద్రం స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈ వివరాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పింది. -
ట్రెండ్ మారింది గురూ; ఏం కావాలో మీరో చెప్పండి!
సాక్షి, తూర్పుగోదావరి: గతంలో ఎన్నికలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవడం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎవరు సరఫరా చేసినా వారి సభ్యత్వం రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వార్డుల్లో సమస్యలు పరిష్కారంపై అభ్యర్తల నుంచి కచ్చతమైన హామీలు రాతపూర్వకంగా తీసుకోవాలని మున్సిపల్ ఓటర్లు భావిస్తున్నారు. మీ వార్డుకు ఏం కావాలో మీరో చెప్పండి’ అని అభ్యర్థులు చెబుతుంటే..ఏదిచ్చినా ముందే అంటున్నారు ఓటర్లు. నెగ్గకపోతే తర్వాత సంగతేమిటని అభ్యర్థులు అడుగుతుంటే ఒప్పంద పత్రాలు రాసుకుందాం అని ఓటర్లు బదులిస్తున్నారు. అభ్యర్థుల్లో ఎవరిని బలపర్యాలనే చర్య జరిగాక, అతడి నుంచి ఏ హామీ తీసుకోవాలి, ఏ పనులు చేయించుకోవాలన్న వాటిపై ఓటర్లు వార్డుల్లో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. తమ ప్రాంతంలో గుడి కట్టాలని కొందరు, కుల సంఘాల భవనాలకు నిధులివ్వాలని మరికొందరు ఇలా తమకు తోచినట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రాతపూర్వక ఒప్పందాలుచేసుకుంటున్నారు. -
కుప్పంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కష్టాల్లో ఉన్న అధినేతకు తెలుగు తమ్ముళ్లు వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైదొలిగారు. కాగా 35 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న చంద్రబాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో ఆ పార్టీ దారుణ ఓటమి చవిచూడటం కార్యకర్తలు, స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి పార్టీ నేత వ్యవహార తీరే కారణమంటూ తిరుగుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆ పార్టీ ఇన్చార్జ్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్లకు స్థానిక కార్యకర్తలు ఎదురుతిరిగారు. ఈ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో ఓటమి చెందామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తల ఆగ్రహానికి తలొగ్గిన మనోహర్ పీఏ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు గురువారం నుంచి కుప్పంలో ఆ పార్టీ అధినేత పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం మండలాల వారీగా టీడీపీ సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మనోహర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముణిరత్నం హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో తాజా పరిణామాలపై కుప్పంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. టీడీపీలో తిరుగుబాటు.. కుప్పంలో ముసలం -
టీడీపీలో తిరుగుబాటు.. కుప్పంలో ముసలం
-
టీడీపీలో తిరుగుబాటు: కుప్పంలో ముసలం
సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీకి మరికొన్ని చికుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ అవే ఫలితాలను పునరావృత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు చిత్తుచిత్తుగా ఓటమి చవిచూశారు. దశాబ్దాల పాటు టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించడం ఆ పార్టీ నేతల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చరిత్రలో లేని విధంగా ప్రతిపక్ష పార్టీ దెబ్బతింది. టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ ఫలితాలను ప్రతిపక్ష నేతను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎవరు చేసిన తప్పిదాలకు వారే బాధ్యత వహించకతప్పదనే రీతిలో చంద్రబాబు ఓటమిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల ఓటమి, కరోనా వైరస్ తెచ్చిన లాక్డౌన్ వంటి క్లిష్టపరిస్థితిల్లోనూ చంద్రబాబు నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. 35 ఏళ్లు రాజకీయ భవిష్యత్ కల్పించిన కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించలేదని విమర్శలు వినిపించాయి. దీంతో ఆయన తీరుపై కుప్పం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో తగిన బుద్దిచెప్పారు. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడించి.. కర్రుకాల్చి వాతపెట్టారు. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. రాజీనామాకు సిద్ధపడ్డ టీడీపీ ఇంచార్జ్..! ఎన్నికల ఫలితాలు టీడీపీలో ముసలానికి కారణం అయ్యాయి. పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు నేతలు విమర్శలకు దిగుతున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న పీఎస్ మునిరత్నంపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం వచ్చిన మునిరత్నం, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్లకు స్థానికంగా చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు నేతలపై కార్యకర్తలు తిరుగుబాటు యత్నించారు. ఈ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో ఓటమి చెందామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రామకుప్పంలో నిర్వహించిన టీడీపీ సమావేశం గందరగోళంగా మారింది. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసేందుకు మునిరత్నం సిద్ధపడ్డారు. నేతలు సముదాయించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు కుప్పం పర్యటన రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రెండు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. -
‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు
-
కుప్పకూలిన చంద్రబాబు సామ్రాజ్యం
సాక్షి, తిరుపతి : మూడు దశాబ్దాలకుపైగా తమకు ఆయువు పట్టు లాంటి కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపొందడం టీడీపీని తీవ్ర నిర్వేదానికి గురిచేసింది. తమ అధినేత నియోజకవర్గంలోనే ప్రజలు పార్టీని తిరస్కరించడం, దారుణంగా పరాజయం పాలవడంతో టీడీపీ నాయకులు, శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. కుప్పంలో 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 75 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించడం, 14 చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు నెగ్గడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. 2013 పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 14, టీడీపీ అనుకూలురు 75 స్థానాల్లో విజయం సాధించగా ఏడేళ్లలో సీన్ రివర్స్ కావడం గమనార్హం. దీంతో మూడు దశాబ్దాల చంద్రబాబు నాయుడు సామ్రాజ్యం కుప్పకూలింది. భ్రమలు బట్టబయలు.. వైఎస్సార్సీపీ మద్దతుదారుల మెజారిటీలను లెక్కగడితే కుప్పంలో 30 వేల ఓట్ల తేడాతో టీడీపీ పరాజయం పాలైనట్లు వెల్లడైంది. 1989 ఎన్నికల నుంచి చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీ 17 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఏకంగా 30 వేల ఓట్ల తేడా రావడంతో సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు ఆదరణ కోల్పోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ పుంజుకుంటున్నట్లు బాబు భ్రమలు కల్పించేందుకు శతవిధాల ప్రయత్నించినా అసలు బండారం ఈ ఎన్నికలతో బయట పడిందనే చర్చ సాగుతోంది. ప్రజా తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ దౌర్జన్యాల వల్లే ఓడామని ప్రజలను నమ్మించేందుకు బాబు తంటాలు పడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సత్తా చాటిన వైఎస్సార్ సీపీ 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి 55 వేల పైచిలుకు ఓట్లు సాధించి పార్టీ సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రమౌళికి 69 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు సుమారు 70 వేల ఓట్లు సాధిస్తే టీడీపీ మద్దతుదారులు కేవలం 36,113 ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి నిత్యం టెలీ కాన్ఫరెన్స్లు, జూమ్ మీటింగ్లు నిర్వహించడం వల్లే ఆ మాత్రం ఓట్లు దక్కాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓటమి నాది కాదంటూ సమీక్షలు.. కుప్పంలో ఓటమి తనది కాదని, ప్రజాస్వామ్యం ఓడిందని బుకాయిస్తూనే రెండు రోజులుగా కుప్పం నేతలతో చంద్రబాబు వరుసగా టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఏం జరిగిందో చెప్పాలని కోరుతున్నారు. ధైర్యంగా ఉండాలంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా తాజా ఫలితాలు ఆయన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామకుప్పంలో 20 పంచాయతీలు కోల్పోవడం ఆయనకు నిద్రపట్టనివ్వడం లేదని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే తాను కుప్పం చేరుకుని రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని చెప్పినట్లు సమాచారం. -
‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు’
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం గెలుపు ఎక్కడ వచ్చిందో చంద్రబాబు చెప్పాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, గెలిచిన 42 శాతం అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని సవాల్ చేశారు. ఆయన్ని టీడీపీ నేతలు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పంపడం ఖాయమని మంత్రి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు కుప్పంలో కూడా చుక్కలు చూపించారు. కుప్పంలోనే మేము 75 స్థానాలు గెలిస్తే ఇక బాబు ఎక్కడ 42 శాతం గెలిచినట్టు. చంద్రబాబు పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలి. ఆయన జూమ్యాప్లో కూర్చుని పగటి కలలు కంటున్నారు. టీడీపీ తమ్ముళ్లకు నాదో సలహా.. బాబు పిచ్చితో తెలంగాణాలో పార్టీని భూస్థాపితం చేశారు. ఇప్పటికైనా ఆయన్ని తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలి. లేదంటే ఏపీలో కూడా పార్టీ భూస్థాపితమే అవుతుంది. గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు సీఎం వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు. ఇక పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదే. రాష్ట్రంలోఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘ఏదో సాధించాలని చతికిలపడ్డారు’ -
పాలిట్రిక్స్: తిమ్మినిబమ్మి చేసిన చంద్రబాబు
నకిలీ రాజకీయం.. ఈ మాట వినడానికి కొత్తగా ఉన్నా, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ఈ మాటను తెరపైకి తెస్తున్నాయి. తిమ్మినిబమ్మి చేయడంలో దిట్ట అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. సాక్షి, అమరావతి : ప్రజా క్షేత్రంలో ప్రతికూల ఫలితాలు తప్పవనుకునే పార్టీలు.. నిజానికి ‘నకిలీ’ ముసుగేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. వాస్తవం ప్రజలకు తెలిసేలోగానే రాకెట్ వేగంతో అవాస్తవాలను తీసుకెళ్తున్నాయి. దీంతో ఓటేసి గెలిపించిన ప్రజలే గందరగోళంలో పడే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఈ తరహా ఎత్తుగడలను నెత్తికెత్తుకోవడంలో ముందు భాగాన నిలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కుప్పం సహా రాష్ట్రం మొత్తం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశానికి పరాభవం తప్పలేదు. వైఎస్సార్సీపీ అభిమానులే గెలుపు గుర్రాలైతే.. తామే విజయ పథంలో దూసుకెళ్లామని టీడీపీ అంకెల గారడీ చేస్తోంది. పార్టీ రహిత.. ప్రజలిచ్చిన విజయాన్ని అధికార పార్టీ రుజువు చేసుకోవాల్సి వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసి, గెలిచిన వాళ్ల ఫొటోలతో సచ్ఛీలతను చాటుకోవడం అనివార్యమైంది. విపక్షం అసత్యాలను తిప్పికొట్టామని ఊపిరి పీల్చుకునే లోపే వైఎస్సార్సీపీ వెబ్సైట్కు నకిలీ వెబ్సైట్ పుట్టుకొచ్చింది. అధికార పార్టీ విజయాన్ని తగ్గిస్తూ, టీడీపీ మెజారిటీ పెంచుతూ సాగిన ఈ నకిలీ ప్రచారం చూసి.. వైఎస్సార్సీపీకి పట్టం గట్టిన ప్రజలే విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రచారంలోనూ ‘నకిలీ’ పంథా! ఎన్నికలకెళ్లే ఏ పార్టీకైనా సిద్ధాంతాలే ప్రాతిపదిక. చేసిన అభివృద్ధిని చెప్పుకుని అధికార పార్టీ.. పాలనలో లోపాలను ఎండగడుతూ విపక్షం ముందుకెళ్లడం సహజం. కానీ ఈసారి టీడీపీ విరుద్ధ వ్యూహాన్ని భుజానికెత్తుకుంది. రెండేళ్లుగా జనం వద్దకే జగన్ తన పాలన తీసుకెళ్లారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటెయ్యని వాళ్లూ ఆయన వైపే మళ్లారు. ఈ నేపథ్యంలో సుపరిపాలనపై విమర్శలు చేస్తే ప్రజలే ఎదురుదాడి చేస్తారని టీడీపీ గుర్తించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపేందుకు ఏ ఒక్క కారణం లేనందున, పక్కదారి పాలిటిక్స్కే టీడీపీ ప్రాధాన్యమిచ్చింది. తాను తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ను అడ్డుపెట్టుకుని వ్యవస్థలతో కుయుక్తులు చేశారనే ఆరోపణలు చంద్రబాబు మూటగట్టుకున్నారు. ఏడాది క్రితం ఆగిన స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన బెట్టి.. పంచాయతీ పోరు తెరమీదకు రావడం చంద్రబాబు ఎత్తుల్లో భాగమనే వాదనలూ విన్పించాయి. గ్రామాల్లో వర్గాలు ఏర్పడితే అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలనే ఆయన వ్యూహం.. ప్రస్తుత ఫలితాలతో బెడిసి కొట్టిందనేది వాస్తవం. ఈ నిజం ప్రజలు గుర్తించేలోగానే అంతకాలం వెనకేసుకొచ్చిన ఎస్ఈసీపైనే ఆయన దండెత్తారు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిందని, ఎస్ఈసీ విఫలమైందని, కేంద్ర బలగాలు రావాలంటూ సరికొత్త నాటకం తెరమీదకు తెచ్చారు. పంచాయతీ ఎన్నికల పరాభవాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయన ముందే ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆఖరుకు సొంత గడ్డ కుప్పంలో ఓటమికి చంద్రబాబు చెప్పిన కారణాలు ఇలాగే ఉన్నాయి. వైఎస్సార్సీపీని ఉత్సాహంగా గెలిపించిన ప్రజలకు.. ప్రజాస్వామ్యం ఓడిందనే కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. నిజానికి కుప్పం పరాభవం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తోంది. పార్టీ మనుగడే డోలాయమానంలో పడిందనేది టీడీపీ వర్గాల మాట. దీన్ని కప్పిపుచ్చుకునే రీతిలో చంద్రబాబు భ్రమలు కల్పించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఏమార్చడమే వ్యూహం ప్రజా క్షేత్రానికి దగ్గరయ్యే వాళ్లనే ప్రజలు ఆదరిస్తారని వైఎస్ జగన్ ప్రతిసారి రుజువు చేస్తున్నారు. ఆ దిశగా వెళ్తున్న వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం అంటే ప్రస్తుతం ప్రయాసే. దీన్ని గుర్తించిన పార్టీలు అవాస్తవాలను రాకెట్ వేగంతో ప్రచారం చేస్తున్నాయి. చరిత్రలో సరికొత్తగా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చిన చంద్రబాబు ఈ తరహా వ్యూహాన్నే అనుసరించారు. అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలనుకున్నారు. ఈ అబద్ధాలను ఎదుర్కోడానికి వైఎస్సార్సీపీ ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. అసత్యాలను తిప్పికొట్టడానికి విలువైన కాలాన్ని వెచ్చించాల్సి వచ్చింది. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ ఇదే తీరు కన్పించింది. కేంద్రానికి చెందిన దీన్ని రాష్ట్రం అమ్మలేదని తెలిసీ, వైఎస్ జగన్ అమ్మేస్తున్నారనే ప్రచారాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. పోస్కో ప్రతినిధుల భేటీ ఫొటోలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీనే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్.. విశాఖ ఉక్కును అమ్మేందుకు అంగీకరిస్తారా? అనే నిజం ప్రజలకు చెప్పేందుకు వైఎస్సార్సీపీ శ్రమించాల్సి వచ్చింది. ప్రభుత్వ సంస్థలను గతంలో అమ్మేసిన చంద్రబాబు తీరును మరోసారి జనానికి తెలియజెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఏదేమైనా ప్రజలు జాగృతమయ్యారు. గత పాలన, ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమాన్ని గమనిస్తున్నారనేది వాస్తవం. తప్పుడు సంకేతాలు కాసేపు గందరగోళం సృష్టించినా, అంతిమంగా ప్రజలతో మమేకమయ్యే వారినే ప్రజలు దగ్గరకు తీస్తారని పంచాయతీ ఫలితాలే రుజువు చేశాయి. -
బీజేపీకి భారీ షాక్.. క్లీన్స్వీప్ దిశగా కాంగ్రెస్
చండీగఢ్: పంజాబ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించింది. మోగా, హోషియార్పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్కోట్, భటిండా మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎనిమిదింటికి గానూ ఆరు మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు కైవసం చేసుకుని క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇక గత 53 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ కంచుకోటగా ఉన్న భాటిండాలో గెలుపు బావుటా ఎగురవేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ ట్విటర్లో షేర్ చేశారు. ‘‘ఈరోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది: 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా భాటిండాకు కాంగ్రెస్ మేయర్ రాబోతున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన భాటిండా ప్రజలకు ధన్యవాదాలు. పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 7న 109 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలతో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇక ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు సుదీర్ఘ కాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ద్వారా కేంద్రంపై తమ అసహనాన్ని ప్రదర్శించేందుకు పంజాబ్ ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో 71.39 పోలింగ్ నమోదైంది. అదే విధంగా అనివార్య కారణాల వల్ల పోలింగ్ నిలిచిపోయన కొన్ని స్థానాల్లో తిరిగి మంగళవారం ఓటింగ్ జరిగింది. వీటి ఫలితాలు నేడే వెలువడనున్నాయి. బీజేపీకి భారీ షాక్ ఇక ఇప్పటికే ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు హస్తం ఖాతాలో పడటంతో బీజేపీకి భారీ షాక్ తగిలినట్లయింది. ఇన్నాళ్లు పార్టీకి బలంగా ఉన్న అర్బన్ ఓటర్ బేస్ ఒక్కసారిగా కోల్పోయినట్లయింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు శిరోమణి అకాలీదళ్కు కూడా భాటిండాలో చేదు అనుభవం ఎదురైంది. చదవండి: సీఎంకు షాకిచ్చేందుకు సిద్ధమౌతున్న పైలట్ వర్గం! -
ప్రారంభమైన మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 4.00 మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,639 సర్పంచ్, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మధ్యాహ్నం 3.30 మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3:00 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జమిగూడ, బొంగరం, లింగేటి తదితర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 2:30 పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంచంగిపుట్టు మండలం వుబ్బంగి నుంచి లక్ష్మీపురం వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ఓటర్లకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అరకులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ మాధవి కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2:00 రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటలకే పోలింగ్ ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పరిధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం. 1.30 రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం. 1.00 మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ 66.48 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ► శ్రీకాకుళం- 64.14 శాతం ►విజయనగరం- 78.5శాతం ►విశాఖపట్నం- 63.23శాతం ►తూర్పు గోదావరి- 67.14శాతం ►పశ్చిమ గోదావరి- 53.51శాతం ►కృష్ణా- 65.88 శాతం ►గుంటూరు- 71.67 శాతం ►ప్రకాశం- 69.95శాతం ►నెల్లూరు- 69.82 శాతం ►చిత్తూరు- 64.82 శాతం ►కడప- 57.34 శాతం ►ర్నూలు- 71 .96 శాతం ►అనంతపురం- 70.23 శాతం మధ్యాహ్నం 12.30 విశాఖపట్నం: జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12.00 ►అనంతపురం డివిజన్లోని 19మండలాల్లో మూడవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ►తూర్పుగోదావరి: రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పుల్లంగి, బొడ్లంక పంచాయతీ గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఉదయం. 11.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి పలు గ్రామాల్లో ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం 11.00 ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 42.65 శాతం ►విజయనగరం- 50.7 శాతం ►విశాఖపట్నం- 43.35 శాతం ►తూర్పు గోదావరి- 33.52 శాతం ►పశ్చిమ గోదావరి- 32 శాతం ►కృష్ణా- 38.35 శాతం ►గుంటూరు 45.90 శాతం ►ప్రకాశం 35.90 శాతం ►నెల్లూరు 42.16 శాతం ►చిత్తూరు 30.59 శాతం ►వైఎస్ఆర్ కడప 31.73 శాతం ►కర్నూలు 48.72 శాతం0 ►అనంతపురం 48.15 శాతం ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం. 10.30 ►గుంటూరు: గురజాల మండలం మాడుగులలో పోలింగ్ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావటంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈనెల 21న రెండు వార్డులకూ ఎలక్షన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ►అనంతపురం: ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోలింగ్ కేంద్రాల వద్ద మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మూడో విడతలో 168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్ తర్వాత ఎవరైనా కక్ష సాధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉదయం 10.00 ►విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్లో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైస్సార్సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►అనంతపురం: ఉరవకొండ మండలం రాకెట్లలో వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా జిల్లాలో ఉదయం 9.30 గంటల వరకు 32.21 శాతం పోలింగ్నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఉదయం. 9.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8:30 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 12.87 శాతం ►విజయనగరం- 15.3 శాతం ►విశాఖపట్నం- 13.75 శాతం ►తూర్పు గోదావరి- 12.6 శాతం ►పశ్చిమ గోదావరి- 11.72 శాతం ►కృష్ణా - 8.14 శాతం ►గుంటూరు 18.83 శాతం ►ప్రకాశం 8.04 శాతం ►నెల్లూరు 9.1 శాతం ►చిత్తూరు 9.34 శాతం ►వైఎస్ఆర్ కడప 7.5 శాతం ►కర్నూలు 15.39 శాతం ►అనంతపురం 9.9 శాతం ఉదయం. 9.00 ►రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోల్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ►రాష్ట్రంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్లకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం. 8.30 ►వైఎస్సార్ కడపలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 7.57 పోలింగ్ శాతం నమోదనట్లు అధికారులు పేర్కొన్నారు. ►విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొంటున్నారు. ఉదయం 7.30 గంటల వరకు 8.7 పోలింగ్ శాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ఆయన కంట్రోల్ రూమ్ నుంచి ఆరా తీస్తున్నారు. ఉదయం.8.00 రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతగా సాగుతోంది. మచిలీపట్నం నియజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి పోలింగ్ పక్రియను పరిశీలిస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు. ఉదయం. 7.30 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అదే విధంగా 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం. 7.02 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ ఉదయం 6.30 గంటలకు మొదలు కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. 7,757 మంది పోటీ: 2,639 సర్పంచ్ పదవులకు మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ కాగా, అందులో 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1,977 పోలింగ్ కేంద్రాలు మూడో విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ప్రక్రియలో 76,019 మంది సిబ్బంది పాల్గొంటుండగా, 4,780 మంది పోలింగ్ పర్యవేక్షణ విధులలో పాల్గొననున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓటర్లను పోలింగ్ ప్రక్రియ ముగిసే చివరి గంటలో ఓటింగ్కు అనుమతించనున్నట్టు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో 63,270 మంది పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోనే కేవలం అరగంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొదట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో 63,270 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. -
ఏపీలో రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
ఇక్కడి పంచాయతీ ఓటు .. ఎమ్మెల్యేకు రూటు
బొండపల్లి: జిల్లాలోని అన్ని గ్రామాలతో పోల్చితే గజపతినగరం మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీగా గుర్తింపుపొందింది పురిటిపెంట గ్రామం. గజపతినగరం నియోజకవర్గంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్ల పరంగా అధికమేకాకుండా ఈ గ్రామంలో ఓటరుగా నమోదైన వారే అధికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ విశేషాలను ఓసారి పరిశీలిస్తే... ప్రసుత్త శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య పదిహేను సంవత్సరాలకుపైగానే పురిటిపెంటలోని మండలవారి కాలనీలో స్ధిరనివాసం ఏర్పరుచుకొని మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. అయనతోపాటు అయన కటుంబ సభ్యులందరి ఓట్లు కూడా ఈ పంచాయతీలోనే ఉన్నాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి పడాల అరుణ కూడా పురిటిపెంటలోని న్యూ కాలనీలో ఎంపీడీఓ కార్యాలయానికి పక్కన స్థిరనివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు కూడా పురిటిపెంటలోని న్యూకాలనీలోనే నివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇలా ఇక్కడ ఓటరుగా నమోదైనవారే ఎమ్మెల్యే పదవులను అలంకరించడం ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు. చదవండి: 82 శాతానికి పైగా సీట్లలో వైఎస్సార్సీపీ అభిమానుల విజయ భేరి -
వివాదాస్పద కొఠియాలో.. పంచాయతీలు ఏకగ్రీవం
జయపురం: ఏఓబీ(ఆంధ్రా–ఒడిశా బోర్డరు) కొఠియాలో ఏపీ నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడి గంజాయి పొదర్, ఫంగుణ సినారి గ్రామపంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ క్రమంలో ఫంగుణ సినారి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కున్నేటి కుసుమ, గంజాయి పొదర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దినకర గమేల్ సర్పంచ్ల ఎంపిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి కొఠియాని ఓ గ్రామపంచాయతీగా ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏపీ ప్రభుత్వం ఇదే ప్రాంతాన్ని 3 గ్రామపంచాయతీలుగా విభజించి, ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ప్రాంతం విషయంలో ఉభయ రాష్ట్రాలు తమ ప్రాంతమంటే తమదని గొడవపడుతున్న విషయం తెలిసిందే. కొఠియా సర్పంచ్ని సత్కరిస్తున్న దృశ్యం ఏపీని అడ్డుకుంటాం.. కొరాపుట్: వివాదాస్పద కొఠియా పంచాయతీలో ఏపీ(ఆంధ్రప్రదేశ్) చొరబాటుని అడ్డుకుంటామని రాష్ట్ర ఔళి శాఖ మంత్రి పద్మినీ దియాన్ తెలిపారు. స్థానిక సద్భావన సమావేశ మందిరంలో కొరాపుట్ జిల్లా సంబాదిక సంఘ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ‘కరోనా పొరే సమాజ్’( కరోనా తర్వాత సమాజం)అనే అంశంపై స్పందిస్తూ కరోనా కట్టడి చర్యల్లో మీడియా ప్రతినిధుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ నేపథ్యంలో వారిని కరోనా యోధులుగా పరిగణించి సత్కరించాలన్నారు. ప్రాణ భయం వీడి, కరోనా వైరస్ వ్యాప్తిపై వార్తలు సంగ్రహిస్తూ ప్రజలను చైతన్యం చేశారని వివరించారు. అలాగే కొఠియా పంచాయతీ బౌగోళిక స్థితిగతులు, అక్కడి ప్రజల భాష, సంస్కృతీ, సంప్రదాయాలన్నీ కొరాపుట్ జిల్లా ఆదివాసులకు చెందినవని, ముఖ్యమంత్రి కొఠియా పంచాయతీని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఆ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి అత్యధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు సన్మానించారు. సమావేశంలో జిల్లా బీజేడీ అధ్యక్షుడు ఈశ్వరచంద్ర పాణిగ్రాహి, ఎమ్మెల్యేలు రఘురాం పడాల్, ప్రభు జని, పీతం పాఢి, తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నారు. చదవండి: ఏకగ్రీవాల నుంచే అదే ట్రెండ్ -
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి
సాక్షి, కాకినాడ : తొలి విడత ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థమైన నాయకుడుకి ఓటు వేయాలి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ► ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పు తప్పనిసరి. ► ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఫొటోలతో ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. ► ఒక వేళ ఎవరికైనా ఓటరు స్లిప్పు అందకపోతే వారు పోలింగ్ కేంద్రం వద్ద పంచాయతీ కార్యాలయ సిబ్బంది అక్కడే ఓటరు స్లిప్పులు అందిస్తారు. ► ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ► ఓటరు కార్డు, ఆధార్, రేషన్, బ్యాంకు పాస్పుస్తకం, పాస్పోర్టు ఇలా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ► కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడాలి. ► తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ఉండాలి. ► క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది రెండు బ్యాలెట్లు ఇస్తారు. ► సర్పంచ్ బ్యాలెట్, వార్డు సభ్యుడి బ్యాలెట్ ఇస్తారు. వాటితోపాటు స్వస్తిక్ గుర్తు సిరాలో ముంచి ఇస్తారు. ► బ్యాలెట్పై తనకు నచ్చిన వ్యక్తి గుర్తుపై స్వస్తిక్ గుర్తు వేయాలి. ► పోలింగ్ సిబ్బంది చెప్పిన ప్రకారం బ్యాలెట్ను మడత పెట్టాలి. ► లేకుంటే మనం ఓటు వేసి సిరా వేరే గుర్తుపై పడే అవకాశం ఉంది. ► ఇలా జరిగితే ఆ బ్యాలెట్ చెల్లదు. ► ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు సహాయకుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంది. ► దీనికి ముందుగా సంబంధింత పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. ► వికలాంగులు, వృద్ధులు వారికి నచ్చిన వ్యక్తులను సహాయకులు ఎంచుకోవచ్చు. ► కరోనా సోకిన వ్యక్తి ఓటు వేయడానికి అవకాశం కలి్పంచారు. ► ఆఖరి గంటలో స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయంతో తగు భద్రతా ప్రమాణాలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ► ఓటు వేసి సెల్ఫీ తీసుకుంటే సంబంధిత ఓటును రద్దు చేసే అధికారం పోలింగ్ అధికారికి ఉంది. ఒక ఓటరు.. రెండు ఓట్లు రాయవరం: గత పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటరు ఓటింగ్ యంత్రాలపై ఓటు వేయగా, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్ పేపరుపై ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థికి, మరో ఓటు బరిలో నిలిచిన వార్డు అభ్యరి్థకి వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపరును ఓటర్లకు అందజేస్తారు. సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉండి, వార్డు పదవి ఏకగ్రీవమైతే ఓటరు ఒక ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సర్పంచ్ పదవి ఏకగ్రీవమై, వార్డు పదవికి పోటీ జరిగితే అప్పుడు కూడా ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఇస్తారు. చదవండి: ఏపీ: ఒకరి ఓటు మరొకరు వేస్తే ఏమవుతుంది? పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. -
పంచాయతీ పోరు: అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే?
సాక్షి, శ్రీకాళహస్తి : సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు సమయంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే మాత్రం లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. స్టేజ్–2 అధికారి సమక్షంలో లాటరీ తీస్తారు. ముందుగా ఆ ఇద్దరు అభ్యర్థుల పేర్లు (ఒక్కొక్క అభ్యర్థి పేరు ఐదు) చీటిల్లో రాస్తారు. అవి ఒకే రంగు, ఒకే సైజు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చీటిల్లో పేర్లు కూడా కనిపించకుండా మొత్తం పది చీటిలను బాగా చుట్టి ఒక డబ్బాలో వేస్తారు. ఆ డబ్బాను అటు ఇటు బాగా తిప్పిన తర్వాత అధికారి ఒక చీటిని బయటకు తీస్తారు. అందులో ఎవరు పేరు వస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకరి ఓటు మరొకరు వేస్తే.. చిత్తూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఒకరి ఓటు మరొకరు వేస్తే, ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు ఓటు వేయడానికి వచ్చే ముందు ఎవరైనా వేరే వ్యక్తి తన ఓటును వేసి ఉంటే, అసలు ఓటరు∙గుర్తింపు నిజమైతే అతనికిచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. అలాంటి పరి స్థితి ఎక్కడైనా తలెత్తితే పీఓ ఫారం –24 పూరించి, ఆ వ్యక్తి దగ్గర సంతకం, వేలిముద్ర తీసుకోవాలి. టెండర్ ఓటు కలి్పంచే వారికి బ్యాలెట్ పేపర్లో చి వరి నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరి బ్యాలెట్ పేపర్లో కౌంటర్ ఫైల్, బ్యాలెట్ పేపర్లో టెండర్ బ్యాలెట్ పేపర్ అని వెనుక వైపు పీఓ రాయాల్సి ఉంటుంది. మార్క్ కాపీలో నోట్ చేయకూడదు. ఆ ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రత్యేకమై న కవర్లో ఉంచి రిటరి్నంగ్ అధికారికి అందజేయాలి. టెండర్ ఓట్లు 2 శాతం మించితే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. చదవండి: పంచాయతీ బరిలో స్పీకర్ సతీమణి పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. -
పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..
సాక్షి, చిత్తూరు : ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్లు సెల్ఫీ దిగితే ఓటును రద్దు చేస్తారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. ఇదే అలవాటు తో పొరపాటుగా మంగళవారం జరిగే పోలింగ్లో ఓటర్లు సెల్ఫీ దిగితే, ఆ వ్యక్తి వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49 (ఎం) ప్రకారం ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి, ఇతరులకు షేర్ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 17 (ఏ) ప్రకారం ఆ ఓటును రద్దు చేస్తారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్ -
పంచాయతీ ఎన్నికలు: ముగిసిన కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,723 పంచాయతీల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచ్లను ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి కాని చోట మరుసటి రోజున ఆ ప్రక్రియ ఉటుంది. కాగా తొలి దశలో ఇప్పటివరకు 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా .. ఇందులో వైఎస్సార్సీపీ నుంచి 518, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్. సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ లైవ్ అప్డేట్స్: బ్యాలెట్ బాక్స్లో నీళ్లు పోసిన సర్పంచ్ అభ్యర్థి చిత్తూరు: ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాలెట్ బాక్స్లో టీడీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్ధి రమేష్ నీళ్లు పోయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. మధ్యాహ్నం 12:30 వరకు 62 శాతం పోలింగ్ నమోదు శ్రీకాకుళం జిల్లా-54.5 శాతం విశాఖ జిల్లా-65 శాతం తూర్పుగోదావరి -62.14 శాతం పశ్చిమ గోదావరి-54.09 శాతం కృష్ణా జిల్లా-67 శాతం గుంటూరు జిల్లా-62 శాతం ప్రకాశం జిల్లా-57 శాతం నెల్లూరు జిల్లా-61 శాతం చిత్తూరు జిల్లా 66.3 శాతం వైఎస్ఆర్ జిల్లా 61.19 శాతం కర్నూలు జిల్లా 70.06 శాతం అనంతపురం జిల్లా 63 శాతం మందకొడిగా పోలింగ్.. ఉదయం 10:30 వరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు ♦తూర్పుగోదావరి-29 శాతం ♦పశ్చిమగోదావరి-24 శాతం ♦కృష్ణా జిల్లా-36 శాతం ♦గుంటూరు జిల్లా-30 శాతం ♦వైఎస్సాఆర్ జిల్లా- 29.21 శాతం ♦అనంతపురం-27 శాతం ♦ప్రకాశం జిల్లా- 28.65 శాతం ♦నెల్లూరు జిల్లా- 26.72 శాతం ♦చిత్తూరు జిల్లా-36.38 శాతం ♦కర్నూలు జిల్లా-49 శాతం ♦విశాఖ జిల్లా 40.78 శాతం ♦శ్రీకాకుళం జిల్లా- 29.15 శాతం గుండెపోటుతో పోలింగ్ ఏజెంట్ మృతి గుంటూరు జిల్లా: కాకుమాను మండలం గరికపాడులో గుండెనొప్పితో ఏజెంట్ నూర్ బాషా మృతి చెందాడు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. సిబ్బంది ఓవరాక్షన్ చిత్తూరు జిల్లా: రామచంద్రాపురం మండలంలో పోలింగ్ సిబ్బంది ఓవరాక్షన్ చేశారు. కమ్మకండ్రిగలో వృద్ధులు చెప్పిన దానికి భిన్నంగా సిబ్బంది ఓటు వేశారు గుర్తించిన ఏజెంట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ రాజశేఖర్రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలకు ముక్కుపుడకలు: పట్టుబడిన టీడీపీ నేతలు.. వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలంలో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఉదయం 8:30 వరకు 18 శాతం పోలింగ్ నమోదు ►శ్రీకాకుళం జిల్లాలో 8.5 శాతం పోలింగ్ నమోదు ►విశాఖ జిల్లాలో 17 శాతం పోలింగ్ నమోదు ►తూ.గో.జిల్లాలో 8.42 శాతం పోలింగ్ నమోదు ►ప.గో.జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదు ►కృష్ణా జిల్లాలో 9 శాతం పోలింగ్ నమోదు ►గుంటూరు జిల్లాలో 15 శాతం పోలింగ్ నమోదు ►ప్రకాశం జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదు ►నెల్లూరు జిల్లాలో 14 శాతం పోలింగ్ నమోదు ►చిత్తూరు జిల్లాలో 15.51 శాతం పోలింగ్ నమోదు ►వైఎస్సార్ జిల్లాలో 6.62 శాతం పోలింగ్ నమోదు ►కర్నూలు జిల్లాలో 10 శాతం పోలింగ్ నమోదు ►అనంతపురం జిల్లాలో 7.25 శాతం పోలింగ్ నమోదు శ్రీకాకుళం: నిమ్మాడలో 23 శాతం పోలింగ్ నమోదయ్యింది. నిమ్మాడలో పోలింగ్ను ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ పరిశీలించారు. తూర్పుగోదావరి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ప్రలోభాలు.. ప్రకాశం: ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలో టీడీపీ ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ నేతలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు: వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ సానుభూతి పరుడు, సర్పంచ్ అభ్యర్థి జుత్తిక శ్రీనివాస్ పోలీసులకు పట్టుబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకున్న మాడుగుల ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి, 20160 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్ను కేటాయించారు. సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. చదవండి: నేడే తొలి సం'గ్రామం' 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ.. తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట ► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం.. ► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు.. ► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి.. ►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ తూర్పు గోదావరి: ►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ►గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు.. ► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు.. ► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. ►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పశ్చిమ గోదావరి: ►నర్సాపురం డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు.. ►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు.. ►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కృష్ణా: విజయవాడ రెవిన్యూ డివిజన్లో తొలి దశ ఎన్నికలు చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల.. కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు.. వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు గుంటూరు: తెనాలి డివిజన్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల.. కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం.. పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు ప్రకాశం: ఒంగోలు డివిజన్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు.. జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు.. ఎస్.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్.మాగులూరు, ఎస్.ఎన్.పాడు, వేటపాలెం.. టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు నెల్లూరు: కావలి రెవెన్యూ డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి.. కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లో తొలిదశ ఎన్నికలు ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ.. గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది.. ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనంతపురం: కదిరి రెవెన్యూ డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి కుంట.. నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి.. తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ వైఎస్ఆర్ జిల్లా: కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు.. అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్.ఎ.కె.ఎన్.. కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చిత్తూరు రెవిన్యూ డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం.. నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు.. పుత్తూరు, ఆర్.సి.పురం, ఎస్.ఆర్ పురం, తవనంపల్లి, వడమాలపేట.. వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్ చిత్తూరు రెవిన్యూ డివిజన్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు 342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్ సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ -
పంచాయితీ బరిలో అక్కా, చెల్లెళ్ల ఢీ
సాక్షి, కారంచేడు(ప్రకాశం) : ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అక్కడే ఇద్దరూ ఇంటర్ వరకు చదువుకున్నారు. అదే ఊరికి చెందిన ఒకే ఇంటి పేరున్న వారిని వివాహమాడారు. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామంలోని ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు. ఇంత వరకు ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేకపోయినప్పటికీ. .ఇప్పుడు ఇద్దరు తమ, తమ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. చదవండి: ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా! బొడ్డు అంకయ్య, బొడ్డు నరసింహం అన్నదమ్ములే ప్రత్యర్థులు.. మిట్టపాలెం(కొండపి): ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామంలో 793 ఓట్లుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 380 దాకా ఉంటాయి. సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్లు వేశారు. 87 ఏళ్ల వయస్సులో పోటీ మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని శేరేపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు 1993లో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001–2006 వరకు సర్పంచ్గా పనిచేశారు. 87 ఏళ్ల వయస్సులోనూ మరోసారి సర్పంచ్గా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి 1995 నుంచి 2001 వరకు సర్పంచ్గా, 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీ సభ్యురాలిగా చేశారు. -
ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా!
ఏమప్పా ...ఊరికొచ్చి ఎన్నిరోజులైంది... అందరూ అడుగుతున్నారు.. ఓ సారి వచ్చిపో.. ఆ మరచిపోయిన రేపు ఊల్లో ఎలచ్చన్లు ఉన్నాయి. పిల్లలను కూడా తీసుకురా... కావాలంటే నేను బస్సు చార్జీ రానుపోను ఇస్తాలే...గుర్తుపెట్టుకో... అందరూ రావాల... ఏం రామన్నా...హైదరాబాద్లో ఏం జేచ్చొండావ్.. సర్పంచ్ ఎన్నికలు... గుర్తున్నాయా... నేనే నిలబడినా... మనకీడ బాగా ప్రిస్టేజీ... మీ ఇంట్లో నాలుగు ఓట్లుండాయి...నువ్వు, వదిన, తమ్ముడు, అమ్మ అందరూ రావాలా... నేనే కారు పంపుతాలే. మళ్లీ ఆడ ఇడ్సబెట్టమంట... తప్పకుండా అందరూ రండి.. నేను సర్పంచ్ అయితే మీరైనట్టే కదా... తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న చాలా పంచాయతీల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఒక్క ఓటు కూడా కీలకం కావడంతో ఓట్లు రాబట్టుకునేందుకు అభ్యర్థులంతా పడరానిపాట్లు పడుతున్నారు. ఓటర్ల లిస్టు తీసుకుని ఉద్యోగ రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేస్తున్నారు. రానుపోను చార్జీలిస్తామని, అవసరమైతే కారే పంపుతామని ఓటర్లకు గాలం వేస్తున్నారు. సాక్షి, అనంతపురం: సాధారణ ఎన్నికల్లో అయితే ఒక్కో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి లక్షల సంఖ్యలో ఓట్లుంటాయి. సొంత ఊళ్ల నుంచి ఉపాధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి అవసరం పెద్దగా ఉండదు. ఆయా పార్టీల నాయకులు కూడా వలస వెళ్లిన ఓటర్ల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితి ఉండదు. పంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నం. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలు సాధ్యమైనంత వరకు బరిలో నిలిచే అభ్యర్థులను బట్టి ఓట్లు వేస్తారు. సేవాభావం కల్గిన వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. పంచాయతీలకు 500 మొదలుకుని వేలల్లో ఓట్లు ఉంటాయి. చాలా పంచాయతీల్లో వార్డు సభ్యులకైతే 200 లోపు ఓట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ చాలా ముఖ్యమే. అందుబాటులో ఉన్న ఓటర్లతో పాటు బయట ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. తొలి విడతలో ఆరు ఏకగ్రీవం జిల్లాలో 1,044 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టు, ఇతరత్రా కారణాలతో 5 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. తక్కిన 1,039 పంచాయతీలకు గాను తొలివిడత జరిగే కదిరి రెవెన్యూ డివిజన్లో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 1,033 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10,744 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసినా వివిధ కారణాల వల్ల 60 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. తక్కిన 10,644 వార్డులకు గాను తొలివిడత పంచాయతీల్లో 715 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 9,929 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2, 3, 4 విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. వినూత్న ప్రచారాలతో సందడి.. గ్రామాల్లో ప్రచార సందడి హోరెత్తుతోంది. తొలివిడత పంచాయతీలకు ఆదివారంతో ప్రచార గడువు ముగిసింది. మూడు రోజుల పాటు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గ్రామాల్లో కలియ తిరిగారు. తమకు కేటాయించిన గుర్తు నమూనాలను ప్రదర్శిస్తూ వినూత్న ప్రచారాలతో ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. బయటి ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు గాలం.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో చాలామంది వివిధ పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదో పెద్దపెద్ద పండులు, శుభ కార్యాలకు మాత్రమే సొంతూళ్లకు రావడం పరిపాటి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడంతో ప్రతి ఓటూ అమూల్యమే. ఈ క్రమంలో ఇలాంటి వారిని రప్పించేందుకు అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. గ్రామస్తులు, బంధువులు, స్నేహితుల ద్వారా సెల్నంబర్లు సేకరించి ఫోన్లు చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా పని చేస్తున్న ప్రాంతాలకు వెళ్లి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రవాణా ఖర్చులు భరిస్తామని హామీ.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పిలిపించే క్రమంలో వచ్చి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం తామే భరిస్తామంటూ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. కొందరికైతే బస్సు, రైలు చార్జీలు చెల్లిస్తుండగా, మరికొందరికి కార్లను సైతం సమకూరుస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు పైసా ఖర్చు లేకుండానే సొంతూళ్లకు వచ్చి బంధువులను చూసి ఓట్లేసి పోవచ్చనే భావనలో ఉన్నారు. -
గ్రేటర్ ఫైట్.. ఎన్నికల కసరత్తు షురూ
సాక్షి ప్రతినిధి, వరంగల్ / వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. పాలకవర్గ పదవీకాలం ముగిసే సమయం సమీపిస్తుండగా అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. మహానగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల పునర్విభజన కీలక ఘట్టం కానుంది. ఆ దిశగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. గత ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్లోనూ ఇదే విధానం కొనసాగనుంది. ఇప్పుడు ఉన్న 58 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తారు. ఈనేపథ్యంలో వార్డులు, కాలనీల తీసివేతలు, కూడికలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేడో, రేపో పునర్వి భజన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి. (చదవండి: చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు) వచ్చే నెల 14 వరకు పాలకవర్గం గడువు గ్రేటర్ వరంగల్ డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా లు, రిజర్వేషన్లు తేల్చేందుకు రెండు నుంచి మూడు నెలల గడువు అవసరమవుతుంది. గ్రేటర్ వరంగల్ ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం మార్చి 14తో ముగియనుంది. ఆలోగా కార్యకలాపాలన్నీ పూర్తి కావు. ఈ మేరకు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కాగానే ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించి ఎన్నికల తతంగం పూర్తయ్యేంత వరకు కొనసాగుతారు. గతంలోనూ 2009 అక్టోబర్ నుంచి 2016 మార్చి 13వ తేదీ వరకు ప్రత్యేకాధికారి పాలన బల్దియాలో కొనసాగింది. అదే తరహాలో మార్చి 14వ తేదీ తర్వాత మళ్లీ ప్రత్యేకాధికారి పాలన రాబోతుందన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్లోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు బల్దియా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం కాగా, పురపాలక శాఖ నుంచి డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ ఉత్తర్వులు రావడమే తరువాయిగా మిగిలింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పునర్విభజన షెడ్యూల్ విడుదల చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ కోసం అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. జూలై 2019 ఆర్డినెన్సే ప్రామాణికం.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం 2019 జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో జనాభాను వెల్లడించడంతో పాటు వార్డుల సంఖ్యను పెంచారు. ఆ ఆర్డినెన్స్లోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8,19,416 మంది జనాభా ఉండగా, 58 వార్డులను 66కు పెంచనున్నట్లు వెల్లడించారు. అదే తరహాలో జనగామ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను సవరించారు. ఆ తర్వాతే గత ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో నిర్వహించాల్సి ఉంది. తద్వారా వార్డుల పునర్విభజన అనివార్యంగా మారింది. గ్రేటర్ వరంగల్లో 2011 నాటి జనాభా, వార్డులు, ప్రభుత్వం 2019 జూలైలో ప్రతిపాదించిన వార్డులు ఇలా... ♦జనాభా- 8,19,406 ♦గతంలో డివిజన్లు- 58 ♦ప్రతిపాదిత డివిజన్లు- 66 -
నిమ్మగడ్డ మరో వివాదాస్పద ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు. మరోవైపు ఎస్ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఇచ్చిన అదేశాలుపై మాట్లాడుతూ.. ఎస్ఈసీ నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామని తెలిపారు. తను రాజకీయాలు మాట్లాడడని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనని స్పష్టం చేశారు. ఎస్ఈసీ ఆదేశాలు వచ్చిన అనంతరం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది? చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్సీపీ -
‘కడిమిశెట్టి’కి మల్ల‘వరం’
పిఠాపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే చాలు.. గ్రామాలు ఒకటే సందడిగా ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం) గ్రామంలో మాత్రం ఏ హడావుడీ ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ గ్రామస్తులందరూ ఒకచోట సమావేశమవుతారు. వచ్చిన రిజర్వేషన్కు అనుకూలంగా ఒక వ్యక్తి పేరు సూచిస్తారు. అందరి ఆమోదంతో ఎన్నిక లేకుండా ఊరంతా ఏకగ్రీవంగా ఆ వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఆ పంచాయతీలో సర్పంచ్లు మారుతుంటారు. వారి పేర్లు మారతాయి. కానీ ఇంటిపేరు మాత్రం ఒకటే ఉంటుంది. అదే ‘కడిమిశెట్టి’. ఆ గ్రామంలో ఎవరిని కదిపినా కడిమిశెట్టి వారి ఇంటి పేరు మార్మోగుతుంది. గడచిన 11 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పది దఫాలు ఇక్కడ ఏకగ్రీవమే. ఒక్కసారి మాత్రమే ఎన్నిక జరిగింది. ఏపీ మల్లవరం గ్రామం పది దఫాల్లోనూ కడిమిశెట్టి వారి కుటుంబసభ్యులు ఐదుసార్లు సర్పంచ్లుగా.. అదీ ఏకగ్రీవం కావడం విశేషం. మిగిలిన ఎన్నికల్లో రిజర్వేషన్ల వలన ఇతరులు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు తప్ప అవకాశం ఉంటే చాలు కడిమిశెట్టి వారికే పట్టం కడతామంటున్నారు ఆ గ్రామస్తులు. ఈ దఫా ఎన్నికల్లోనూ అక్కడ సర్పంచ్తోపాటు 10 మంది వార్డు సభ్యులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామం 1965లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తొలి సర్పంచ్గా గ్రామపెద్ద అయిన కడిమిశెట్టి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కడిమిశెట్టి బుల్లిరాజు, కడిమిశెట్టి పెదరాము, కడిమిశెట్టి వెంకటసత్యనారాయణస్వామి సర్పంచ్లయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కడిమిశెట్టి సుశీలను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలవెల్లి ఎస్టేట్.. 3 పంచాయతీలు గొల్లప్రోలు మండలంలో 1964కు ముందు ఆలవెల్లి ఎస్టేట్ ఒకే గ్రామంగా ఉండేది. ఈ గ్రామాన్ని ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం), ఏకే మల్లవరం (ఆలవెల్లి కొత్త మల్లవరం), ఏ విజయనగరం (ఆలవెల్లి విజయనగరం) అనే మూడు గ్రామాలుగా విభజించారు. 1965 నుంచి ఈ మూడు గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి. -
ఏపీ: పలువురు ఐఏఎస్లు బదిలీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. గుంటూరు కలెక్టర్గా వివేక్ యాదవ్ నియామకం అయ్యారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా రజిత్ భార్గవ్కు అదనపు బాధ్యతలు చేపట్టగా.. మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీలక్ష్మికి అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా విజయ్కుమార్కు అదనపు బాధ్యతలు చేపట్టారు. -
స్థానిక ఎన్నికల్లో బహుజన వాదానిదే విజయం
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన వాదానిదే విజయమని, పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో 126వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో అధిక శాతం ఓట్లు బహుజనులవేనన్నారు. చంద్రబాబు పేదల అభివృద్ధిని అడ్డుకుంటూ కోర్టుల్లో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. చంద్రబాబుపై కోర్టుల్లో ఉన్న స్టేలు తొలగించి విచారణకు స్వీకరించి వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్గా పోటీ చేస్తే చంపేస్తారా అచ్చెన్నా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో వారి కుటుంబ సభ్యులను కాదని ఎవరైనా సర్పంచ్గా పోటీచేస్తే వారిని చంపేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. జనవరి 31న కింజరాపు అప్పన్న నామినేషన్కు వెళితే ఆయన్ను, తనను చంపేందుకు కింజరాపు హరిప్రసాద్, సురేష్లతో పాటు 400 మంది మారణాయుధాలతో వెంటపడ్డారని శ్రీనివాస్ చెప్పారు. పోలీసులు, దేవుడి దయవల్ల బతికి బయటపడినట్టు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవా రం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట వేసిన నామినేషన్ చింపేశారని, ఆ తర్వాత మళ్లీ చివరి క్షణంలో పోలీసుల సమక్షంలో నామినేషన్ వేయించినట్టు చెప్పారు. ఎన్నికల నామినేషన్లలో గానీ, ఏకగ్రీవాల్లో గానీ ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చెప్పారని, మరి అచ్చెన్న కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలన్నారు. ఎంతమంది ప్రాణం తీశారో చూడండి.. నిమ్మాడలో కింజరాపు కుటుంబాన్ని కాదని నామినేషన్లు వేసిన చాలామంది హత్యకు గురైనట్టు శ్రీనివాస్ ఆరోపించారు. కింజరాపు సూరయ్య, ఎచ్చెర్ల సూర్యనారాయణ, కింజరాపు భుజంగరావు(బుజ్జి), కొంచాడ బాలయ్యలను హత్య చేయించినట్టు చెప్పారు. రిగ్గింగ్ను అడ్డుకున్న కూన రామారావుని కత్తితో పొడిచి చంపారని వివరించారు. కోటబొమ్మాళితో పాటు 48 పంచాయతీల్లో ఎప్పుడూ రిగ్గింగ్ జరుగుతోందని, ఈ సారి దానిని అడ్డుకోవాలని అధికారులను కోరారు. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్, సురేష్లను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు గుండా గిరి
సాక్షి, చిత్తూరు : పంచాయతీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. తనకు సంబంధం లేని యాదమర్రి మండలంలో తిష్ట వేసిన దొరబ్బాబు ఆదివారం నాడు హాల్ చల్ చేశారు. నామినేషన్స్ జరుగుతున్న యాదమర్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద తన అనుచరులతో రాద్ధాంతం చేశారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ కారులో వచ్చిన దొరబాబు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దొరబాబు వల్ల పెరియం బాడీకి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు దొరబాబు గుండా గిరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా గుర్తు తెలియని వ్యక్తులు దొరబాబు వాహనం మీద కర్రలతో కొట్టారు. దీంతో దొరబాబు తన కారును వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదికి పోనిచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మీద స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. దొరబాబు దాదా గిరిని ఖండించారు. సంబంధం లేని మండలానికి వాక్కువహిన దొరబాబు రౌడీ ఇజం చేశారన్నారు. ఆయన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొరబాబు ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే యాదమర్రిలో దొరబాబు టీడీపీకి చెందిన ఓ వర్గానికి మాత్రమే మద్దతు తెలుపుతున్నారని, ఇది గిట్టని మరో వర్గం నేతలే ఆయనపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. -
ఏపీ : ఊపందుకున్న ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ మద్దతుదారు పార్వతి భాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండకిందతాండ పంచాయతీకి గిరిజన మహిళ పార్వతి భాయ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. కొండకిందతాండలో ఆలయ నిర్మాణానికి పార్వతీభాయ్ ముందుకు రావటంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డులకి ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ పదవులకు 13 వేలకు పైగా నామినేషన్లు.. వార్డు పదవులకి 35 వేలకి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. -
ఏపీ: ముగిసిన తొలి విడత నామినేషన్లు
సాక్షి, అమరావతి: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆదివారం సా.5 గంటలతో ముగిసింది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొదటి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. మొత్తం నామినేషన్ల సంఖ్యపై స్పష్టత రానందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఇక సోమవారం ఉ.8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనిపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 2వ తేదీ సా.5 గంటల వరకు సంబంధిత ఆర్డీవోల వద్ద తెలియజేయవచ్చు. వాటిపై 3న తుది నిర్ణయం ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4వ తేదీ మ.3 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. ఆ వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల వివరాలతోపాటు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎక్కడికక్కడ సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫిబ్రవరి 9న ఉ.6.30 నుంచి మ.3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. నామినేషన్లు ఆశాజనకం: నిమ్మగడ్డ మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేయడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం నామినేషన్లు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. -
అప్పన్న పోటీ.. అచ్చెన్న బెదిరింపులు
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయడు మరోసారి బెదిరింపులకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఆయన స్వగ్రామం నిమ్మాడ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్నను బరిలో నిలపడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. ఈ క్రమంలోనే నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన అప్పన్నపై అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్ వేయోద్దని.. ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్పన్న ఆయన మాట వినకపోవడంతో అచ్చెన్న అనుచరులు ఏకంగా అప్పన్న నివాసానికి చేరుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. నిమ్మాడలో తనను ఇప్పటి వరకు పట్టించుకోలేదని, టీడీపీ ప్రభుత్వం తప్పిదాల కారణంగానే తన భార్య ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని అప్పన్న అవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి సర్పంచ్గా నిమినేషన్ వేసి తీరుతానని స్పష్టం చేశారు. అయితే మరోసారి అప్పన్నకు ఫోన్ చేసిన అచ్చెన్న.. తన మాట వినాలని సముదాయించే ప్రయత్నం చేశారు. గతంలో అయిపోయింది ఏదో అయిపోయిందని ఇక నుంచి పార్టీలో గౌరవిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్నన్న మాట వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. సర్పంచ్ పదవేమన్నా రాష్ట్రపతి పదవా అంటూ ఎద్దేవా చేశారు. నిమ్మాడలో ఉద్రిక్తత.. అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్నాయుడి అనుచరులు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు నామినేషన్ కేంద్రానికి వచ్చారు. వీరిలో అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ కూడా ఉన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బలవంతంగా బయటకు గెంటేశారు. అప్పన్నపై దాడికి దిగారు. దీంతో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. మేనిఫెస్టో విడుదలపై వివరణ కోరిన ఎస్ఈసీ.. శనివారం టీడీపీకి నోటీసులు జారీచేసింది. ఫిబ్రవరి 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా పార్టీ రహిత ఎన్నికలైన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మేనిఫెస్టో ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోందని కమిషన్ దృష్టికి వారు తీసుకెళ్లారు. మేనిఫెస్టో ప్రతులను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ శనివారం నోటీసులు జారీచేసింది. ‘పల్లె ప్రగతి–పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
‘ఏకగ్రీవం’కు మోకాలడ్డు అనుచితం
‘గౌరవప్రదంగా, ఆనంద జీవనం సాగించ డానికి అవసరమైన వ్యవస్థలను మనిషి సమకూర్చుకోవాలి. అవి అందించే స్వతంత్ర, స్వయంసమృద్ధ గ్రామాలను ఏర్పరచుకున్న పుడే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం లభించినట్టు’ అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ! భారతదేశపు హృదయం పల్లెల్లోనే ఉందన్న బాపూజీ, గ్రామ స్వరాజ్య స్థాపనకు పరస్పర సహకారం, అహింస మూల సూత్రాలు కావాలన్నారు. వాటి ఆధారంగానే దేశ భవిష్యత్ నిర్మాణం జరగాలన్నారు. కానీ, మనం ఎక్కడో దారి తప్పాం. పాలకుల చిన్న చూపు వల్ల స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల్లోనే గ్రామం వెలవెల బోయింది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయం, తగుసాయం లేక చతికిలబడింది. సామాన్యుల బతుకు చల్లగ జూసిన కులవృత్తులు కునారిల్లినాయి. పెరిగిన జనాభాతో అవకాశాలు తగ్గి కక్షలు, కార్ప ణ్యాలు పెచ్చరిల్లాయి. ఉపాధి లేక బతుకు భారమై గ్రామీణభారతం పట్టణాలు, నగరాలకు వలసబాట పట్టిన పరిణామమే గడచిన పాతికేళ్ల నికర చరిత్ర! ముఖ్యంగా ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ తర్వాత ‘మార్కెట్ మాయ’లో చిక్కి గ్రామీణ జీవితం చిద్రమై పోయింది. ఇప్పుడిప్పుడే గ్రామ పునరుజ్జీవన చర్యలు మొదల య్యాయి. తిరుగువలసలు చర్చకు వస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ పైనా ఒత్తిడి పెరిగింది. గ్రామీణంపై శ్రద్ధ చూపితేగాని రాజకీయంగా మనలేని వాతావరణం బలపడుతోంది. గ్రామాలను తీర్చిదిద్దడానికి ఇదే సరైన సమయమని జనహితం ఆలోచించే నవతరం పాలకులు కొందరు నడుం కడుతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఓ ఉదాహరణ! గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు బుడిబుడి అడుగులు పడుతున్నాయి. చిరకాలం అధికారం అనుభవించాలనే రాజకీయ కుయుక్తితో విభజించి పాలించే కొందరి ఎత్తుగడలకు కాలం చెల్లింది. నిజాలు గ్రహిస్తున్న సగటు గ్రామం, ఆయా పెడధోరణులను తిరస్క రిస్తోంది. కొత్త ఆలోచనలు పురుడుపోసుకుంటున్నాయి. గ్రామాల్లో పరస్పర సయోధ్య, సహకార భావన, సమష్టితత్వం బలపడాల్సిన సమయమిది. పాలనా వికేంద్రీకరణలో గ్రామమే తొలి అడుగు. గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ వ్యవస్థల ఏర్పాటు ఆయువుపట్టు! ఇదే అదనుగా, రాజకీయాలకు అతీతంగా ఊరు ఊరంతా ఒక్కట వడం తక్షణ లక్ష్యం. అందుకే, ఏకగ్రీవ ఎన్నికల ద్వారా సమష్టి భావన పెంచే కార్యాచరణ బలపడుతోంది. తద్వారా, తాము కలిసికట్టుగా కోరింది సాధించుకునే (బార్గేయినింగ్) శక్తి పెంచుకోగలమని గ్రామీ ణులు భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ముంద డుగే! అడ్డుకోవడం ప్రగతి వ్యతిరేక చర్యే అవుతుంది. మరిన్ని ముల్కనూర్లు ఎందుకు రాలేదు? కక్షలు, కార్పణ్యాలు విడనాడి, కలిసి ఏకగ్రీవంగా పంచాయతీ పాలక మండలిని ఎన్నుకుంటామంటే వద్దనకూడదు. గుడ్డుపై ఈకలు పీకే తత్వం తప్పు! సదరు గ్రామాలను ప్రోత్సహించాలి. అటువంటి ఊళ్లు ఇరుగుపొరుగునున్న ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి. సహకార స్ఫూర్తిని, ఊరుమ్మడి పాలనా వ్యవస్థలు బలోపేతం చేసుకొని గ్రామ స్వరాజ్య భావనకు, ఈ కార్యాచరణకు నిలువెత్తు నిదర్శనం కావాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంకాపూర్ (నిజామాబాద్), గంగ దేవరపల్లి (వరంగల్), దుద్దెనపల్లి (కరీంనగర్), ముల్కనూర్ (వరంగల్), గుడ్ల వల్లేరు (కృష్ణా) తదితర సహకార సంఘాలు దశాబ్దాల తరబడి విజ యగీతాలై వినిపించాయి. వాటి పరిధిలోని దాదాపు అన్ని గ్రామా ల్లోనూ ఏకగ్రీవ గ్రామపాలక మండల్లే ఏర్పడుతుంటాయి. దేశం నలుమూలల నుంచి జనం వచ్చి చూసివెళ్లేంతగా గ్రామ స్వయం సమృద్ధికవి ప్రయోగశాలలయ్యాయి. సామాజికంగా, సాంస్కృతికం గానే కాక ఆర్థికంగానూ స్వయంసమృద్ధి సాధించిన గ్రామాలవి. సమష్టితత్వం వల్ల రాజకీయ వ్యవస్థల్ని కూడా తమ చెప్పుచేతల్లో ఉంచుకో గలిగాయి. వ్యవసాయ రంగంలోనే కాక పాడి పరిశ్రమ, పెట్రోల్ బంక్, పరపతి సంఘం, బ్యాంకు, మార్కెట్ వంటి వ్యవస్థల్ని సొంతంగా ఏర్పరచుకొని రాజ్యంపైన ఆధారపడాల్సిన అవసరమేలేని ఎదుగుదల సాధించారు. బయటి మార్కెట్తో పోల్చి చూస్తే, ఆయా సంఘాల పరిధిలోని ఉత్పత్తిదారుకు రూపాయి ఎక్కువ లాభం, వినియోగదారులకు రూపాయి తక్కువ వ్యయం సాధించిన ఘనత వారికి దక్కింది. నేరాలు చాలా తగ్గిపోయాయి. జీవనానంద సూచీ రమారమి పెరిగింది. స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాల కాలంలో ఆ నాలుగయిదు పేర్లే తప్ప కొత్తవి రాలేదు, ఎందుకని? సహకార స్ఫూర్తిని పెంచేందుకు వేరే గ్రామాల్లో తగినంత ప్రోత్సాహం లభిం చలేదు. స్వప్రయోజనాల కోసం తపించే రాజకీయపక్షాలు కూడా పెద్దగా సహకరించలేదు. రాష్ట్ర విభజన తర్వాత గుడ్లవల్లేరు తప్ప సదరు గ్రామాలు తెలంగాణలో మిగిలిపోయాయి. విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్లో పాండురంగపురం (కర్నూలు), నిమ్మకూరు (కృష్ణా), చిన్నపరిమి (గుంటూరు) వంటి గ్రామాల్లో కొంత సహకార భావన మొగ్గతొడిగింది. ఊరంతా కలిసికట్టుగా అభివృద్ది పనులు చేపట్టి ఇటీవల విజయవంతంగా పూర్తి చేశారు. అదే ఒరవడి కొనసాగించడా నికి అవసరమైన ప్రోత్సాహం వారికి లభించలేదు. ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దు! ఆంధ్రప్రదేశ్లో గ్రామసచివాలయాలు, అనుబంధంగా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటయ్యాక పాలనా వికేంద్రీకరణ ఆచరణలోకి వచ్చింది. పౌరసదుపాయాల కల్పన తేలికయింది. ఇదే సమయంలో పంచా యతీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. అవెలాగూ చట్టబద్ధంగానే పార్టీ రహితంగా జరుగుతున్నాయి. కనుక గ్రామాల్లో అనవసర స్పర్ధలు వీడి ఏకగ్రీవంగా పాలకమండళ్లను ఎన్నుకోవాలనే భావనలు బలపడు తున్నాయి. కోవిడ్ వల్ల అర్ధంతంగా ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ ఒరవడి పంచా యతీ ఎన్నికల్లోనూ సాగితే, గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, వ్యతిరేక భావనలు తొలగి పోతాయని ప్రజాస్వామ్య కాముకులు భావించారు. గాంధీజీ ఆశించిన అహింస సాధ్యమయ్యేది ఇలానే! పైగా, ఇరుపక్షాల వైపు నుంచి అనవసర ఎన్నికలు, ప్రచార వ్యయాలు ఉండవు. పార్టీ లకు అతీతంగా అన్న మాటే గాని, నిజానికి పోటీ ఓ రకంగా రాజకీయ పక్షాల బలప్రదర్శనగా సాగుతోంది. ఇది హర్షణీయం కాదు. ఎన్నికల్లో పెద్ద మొత్తాలు డబ్బు ఖర్చు చేసే అభ్యర్థులు, గెలిచాక ఏదో రూపంలో లాభాలతో సహా పెట్టుబడి రాబట్టుకోవడం తేటతెల్లం. ఫలితంగా అవినీతికి ఆస్కారం ఉంటుందనేది సామాజికవేత్తల విశ్లేషణ! అలా కాకుండా... ఒకవంక పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ–మరోవంక ఏక గ్రీవాలతో పాలకమండలి ఏర్పాటుతో వచ్చే గ్రామ సమష్టితత్వం వల్ల బాపూజీ కలలుకన్న గ్రామస్వరాజ్య స్థాపన సాకారమౌతుంది. ప్రభుత్వ ప్రోత్సాహక నగదుతో గ్రామాభివృద్ధికొక అవకాశం! ఎవర మైనా ఇది ప్రోత్సహించాల్సిన పరిణామం. కానీ, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ధోరణి ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ‘ఏకగ్రీవాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఏదైనా పరిమితికి మించి జరిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది, కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది’ అని కలెక్టర్ల సమావేశంలో ఎన్నికల కమిషనర్ చేసిన హెచ్చరిక తప్పుడు సంకేతాలిచ్చేదే! ఏకగ్రీవాలను ఇది నిరు త్సాహపరిచే చర్య. పైగా నిర్హేతుక బదిలీలు, అర్థంలేని అభిశంసనలు ఉద్యోగవర్గాన్ని భయోత్పాతానికి గురిచేయడమే అవుతుంది. ఒక జిల్లాలో, లేదా ఒక మండలంలో ఇన్నే పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి అన్న పరిమితేం లేదు! ఇక పరిమితికి మించి... అన డంలో అర్థమేముంది? ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుందన్న మీడియా వ్యాపార ప్రకటన, దాని విడుదల పట్ల ఎస్ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పౌరసంబంధాల కమిషనర్ను సంజాయిషీ కోరినట్టు వార్తలొచ్చాయి. ఇది సమర్థ నీయం కాదు. ప్రోత్సాహకాలు కొత్త విషయమేమీ కాదు. దేశంలో గుజ రాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో ఉన్నదే! అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 2001లోనే, నాటి చంద్ర బాబు సర్కారు నిర్ణయం తర్వాత అధికారిక ఉత్తర్వు (జీవో నం: 1154) వెలువడింది. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. తర్వాత పలుమార్లు ప్రోత్సాహక నగదు పెంచుతూ వేర్వేరు ప్రభు త్వాలు ఉత్తర్వులిచ్చాయి. ఎలా చూసినా తప్పుబట్టాల్సిన పనికాదు. కానీ, ఏకగ్రీవాలు కాకుండా చూడండి అని పార్టీ యంత్రాంగానికి విపక్షనేత చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం, దానికి దన్నుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికార యంత్రాంగానికి హెచ్చరికలు చేయడం యాదృచ్ఛికమేం కాదు! ఇప్పుడింకో విచిత్రం, పార్టీరహితంగా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రతిపక్షపార్టీ అధినేత ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. దీన్ని ఎస్ఈసీ ఎలా పరిగణిస్తుందో చూడాలి. శతాబ్దాల ఉమ్మడి స్ఫూర్తిచరిత మనది! గ్రామపాలనలో ప్రజాతంత్ర విధానాలకు భారతీయ సంస్కృతిలోనూ మూలాలున్నాయి. రెండున్నర వేల సంవత్సరాల కిందటి గణ రాజ్యాల్లో గ్రామీణ ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందనడానికి వైశాలి ఓ నిదర్శనం. క్రీ.శ 920లోనే తమిళనాడులోని ఓ మారుమూల పల్లెలో గ్రామస్వరాజ్య భావన ఎంత బలంగా ఉండిందో ఇటీవల వెలుగు చూసిన చరిత్ర చెబుతోంది. ఉతిరామెరూర్ (మధురాంతకం కు 25 కి.మీ. దూరం)లోని ఓ గ్రామ సభామండపం గోడలపై రాతలే ఇందుకు సాక్ష్యం. గ్రామసభ ఎలా ఏర్పడాలి? సభ్యులుగా ఎవరు అర్హులు? అర్హత కోల్పోతే వెనక్కి రప్పించడమెలా? ఊరుమ్మడి భావన లెలా ఉండాలి? ఇలాంటివన్నీ ఆ రాతల్లో ఉన్నాయి. భారతీయ గ్రామీణ సమాజాలు ఎంత గొప్ప స్వతంత్ర, స్వయంసమృద్ధ, గణ తంత్ర వ్యవస్థలో 1830లోనే, నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ సర్ చార్లెస్ మెట్కాఫ్ నొక్కి చెప్పారు. ‘ఒక్కో గ్రామ సమాజం, ఏ కొరతా లేని ఒక్కో స్వాతంత్య్ర బుల్లి రాజ్యంగా పరిఢవిల్లుతున్నాయ’ని ఆయన పేర్కొన్నారు. అందుకే, గ్రామాలను రాజకీయాలకు అతీ తంగా ఎదగనివ్వాలి. స్వార్థప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు, రాజ్యాంగ వ్యవస్థలు కూడబలుక్కొని స్ఫూర్తిని నిర్వీర్యపరచడం దారుణ పరిణామం. ఏ పదవులు అలంకరించినా... వ్యక్తులు ముఖ్యం కానేకాదు. అదీ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భాన్ని వాడుకుంటున్న తీరు అభ్యంతరకరం. ఎన్నికల ప్రక్రియ ముగిసి, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా అధినేతల వైఖరే పాలనకు గీటు రాయి. సంక్షేమ ఫలాలు అందించడంలో కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, పార్టీలు చూడం... తరతమ భేదాలు లేకుండా అర్హులందరినీ ఏకరీతిన చూస్తామని సీఎం బహిరంగంగా ప్రక టిస్తున్న రాష్ట్రంలో... సంకుచిత ఎత్తుగడలకు పాల్పడటం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే! ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏక గ్రీవంగా పాలకమండలిని ఎన్నుకునే ఊరుమ్మడి భావన గొప్పది. గ్రామస్వరాజ్య సాధనలో అభినందించి, ఆహ్వానించాల్సిన తొలిమెట్టు! పి. ప్రభాకర్రెడ్డి వ్యాసకర్త ఐఏఎస్ (రిటైర్డ్) -
ఎలక్షన్ ఎక్సర్సైజ్ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు!
సాక్షి, అమరావతి బ్యూరో: పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్చించారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో మంగళవారం విస్తృతస్థాయిలో సమీక్షించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని, పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఇన్చార్జి మంత్రి దిశా నిర్దేశంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు రంగంలోకి దిగారు. (చదవండి: నిమ్మగడ్డకు కంగారెందుకు? ) కసరత్తు మొదలు.. జిల్లాలో విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 977 పంచాయతీలు ఉండగా ఇందులో 958 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ నాయకులు పంచాయతీల వారీగా అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయాచోట్ల రిజర్వేషన్ల మేరకు పేర్లు ఎంపిక చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు నాయకులు మంగళ, బుధవారాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను నమోదు చేస్తుండగా.. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురు ఆశావహులు అభ్యరి్థత్వాన్ని ఆశిస్తుండటం నాయకులకు సమస్యగా మారింది. ఏకగ్రీవాలకే మొగ్గు.. అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నారు. తద్వారా తమ అభ్యర్థులకు విజయం చేకూర్చి పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా ఆ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాభివృద్ధిని కాంక్షించి కొంత మంది రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అన్ని వర్గాలతో చర్చించి ఏకగ్రీవానికి ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఎన్నికలు రావడంతో సర్పంచి కుర్చీని దక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తమ్మీద జిల్లాలో కీలకమైన నాయకులు తమ సొంత పంచాయతీల్లో పోటీ లేకుండా చేసుకొనే యత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నిచోట్ల ఎన్నికలు జరుగుతాయి? ఎన్నిచోట్ల ఏకగ్రీవమవుతాయి? అని గ్రామీణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పల్లెసీమలను అభివృద్ధిబాట పట్టించే నాయకుడిని ఎన్నిక చేసుకునే ప్రక్రియకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అన్నదమ్ముల్లా మెలిగే పచ్చని సీమల్లో మనుషులు/మనసుల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావివ్వకుండా పంచాయతీ పదవులు ఏకగ్రీవం చేసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందంటూ పెద్దలు సూచిస్తున్నారు. ఎలక్షన్ ఎక్సర్సైజ్ షురూ! సాక్షి, అమరావతి బ్యూరో: పంచాయతీ ఎన్నికల తొలి దశ సమీపిస్తున వేళ జిల్లా అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. అందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది. రెండ్రోజుల క్రితం ఎన్నికల కమిషన్ రీషెడ్యూల్ను ప్రకటించింది. అయితే మంగళవారం రిపబ్లిక్ డే సెలవు కావడంతో ఆ రోజు ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు వీలు పడలేదు. బుధవారం నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. జిల్లాలో 958 గ్రామ పంచాయతీలకు, 9,652 వార్డులకు ఎన్నికలు జరగ నున్నాయి. నాలుగు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు ఈనెల 29న తొలి దశ ప్రారంభం కానుంది. మొదటి విడతలో... మొదటి విడతలో విజయవాడ రెవెన్యూ డివిజన్కు షెడ్యూ లు ప్రకటించారు. ఆ ప్రకారం ఈ డివిజన్లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూ రు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుల పాడు, విజయవాడ రూర ల్ మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి 29 (శుక్రవారం) నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణ చేపడతారు. జిల్లాలో 9980 పోలింగ్ స్టేషన్లను సన్నద్ధం చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పత్రాల ముద్రణను ఇప్పటికే పూర్తి చేయగా, బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో ఉండే వారికి కోవిడ్ వ్యాక్సిన్ ముందుగానే వేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు.. ఉద్యోగులు, పోలీసులకు అవసరమైన వసతి సదుపాయాల కల్పనపైనా దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి గురువారం నుంచి ఫిబ్రవరి 7 వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో ఎన్నికల విధి విధానాలను, ఎన్నికల కమిషన్ నిబంధనలపై తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చే యాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియ ఇలా.. ఎన్నికల ప్రక్రియ విజయవాడ గుడివాడ మచిలీపట్నం నూజివీడు తొలి దశ రెండో దశ మూడో దశ నాలుగో దశ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 29.01.21 02.02.21 06.02.21 10.02.21 నామినేషన్ల స్వీకరణ ఆఖరు 31.01.21 04.02.21 08.02.21 12.02.21 నామినేషన్ల పరిశీలన 01.02.21 05.02.21 09.02.21 13.02.21 తిరస్కరణపై అప్పీలు 02.02.21 06.02.21 10.02.21 14.02.21 నామినేషన్ల ఉపసంహరణ 04.02.21 08.02.21 12.02.21 16.02.21 అభ్యర్థుల తుది జాబితా 04.02.21 08.02.21 12.02.21 16.02.21 పోలింగ్ తేదీ 09.02.21 13.02.21 17.02.21 21.02.21 (ఉ.6.30–సా.3.30 వరకు) ఓట్ల లెక్కింపు,ఫలితాల ప్రకటన 09.02.21 13.02.21 17.02.21 21.02.21 (సా.4 నుంచి) ఉపసర్పంచ్ ఎన్నిక 09.02.21 13.02.21 17.02.21 21.02.21 (ఫలితాల ప్రకటన తర్వాత) -
'చంద్రబాబు.. నిమ్మగడ్డల డీఎన్ఏ ఒక్కటే'
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది.చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారు. సీనియర్ అధికారుల పట్ల ఎస్ఈసీ వాడిన భాష సరికాదు. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ లేఖ రాశారు.అధికార యంత్రాంగాన్ని అస్థిరపరచాలని ఎస్ఈసీ చూస్తున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ డీఎన్ఏ ఒక్కటే. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండటం రాష్ట్రం ఖర్మ. దేశవ్యాప్తంగా జనవరి 16న సీఈసీ ఓటర్ల జాబితా విడుదల చేసింది..గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే కనీసం 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత కానీ ఎన్నికలు జరపలేమని నిమ్మగడ్డకు కూడా తెలుసు.. అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: రాజుకుంటున్న వేడి! అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్ను అమలు చేయలేం.. ఉద్యోగులు, అధికారుల్లో నిమ్మగడ్డ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు. ఎస్ఈసీ కేవలం సిఫారసు మాత్రమే చేయగలరు... అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్ను ప్రభుత్వం అమలు చేయదు. అధికారులెవరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. అధికారుల విషయంలో నిమ్మగడ్డ చేసిన దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మా అధికారులను రక్షించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహా అయితే ఈ కొద్దీ రోజులు డ్యూటీ నుంచి పక్కన పెట్టొచ్చు. ఆ రోజు ఇదే చంద్రబాబు.. ఇదే ద్వివేదిని ఛాంబర్ లోకి వెళ్లి ఈసీ అంటే పెద్దాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: ఎన్నికలకు ఏమాత్రం భయపడం: సజ్జల ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా? ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి...ఒక్క ఓటు ఉన్నా నామినేషన్ వేయాలి అని చంద్రబాబు అనడం దేనికి సంకేతం? పార్టీ రహితంగా ఉన్న ఎన్నికల్లో ఆయన ఎందుకు అంత ఘీంకరించడం? ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా? గతంలో కూడా జరిగాయి కదా.. ఎప్పుడైతే నిమ్మగడ్డ పక్షపాతంగా వ్యవహరిస్తున్నపుడే ఆయనపై గౌరవం పోయింది. ఎప్పుడు ఈ పీడ వదులుతుందో తెలియదు కానీ... అద్దంలో ముఖం చూసుకుంటే దెయ్యం కనపడుతుంది. 20 రోజుల తర్వాత ఆ పార్టీ సమాధి కావడం ఖాయం. ఈలోగా ఉద్యోగులు, అధికారుల్లో అభద్రత పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ వెంట ప్రభుత్వం ఉంది..ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు పంపనున్నాం.. అధికారులను క్రిమినల్ పరువు నష్టం వేయాల్సిందిగా సూచిస్తున్నామంటూ' తెలిపారు. -
స్థానికం: రాజుకుంటున్న రాజకీయ వేడి!
సాక్షి, అమరావతి బ్యూరో: పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటనతో గ్రామాల్లో సందడి నెలకొంటోంది. బరిలో నిలిచే అభ్యర్థులు, నిలిపే నాయకులు, ఆశావహులతో పల్లెలన్నీ హడా విడిగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగనున్నాయి. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పారీ్టలు స్థానికంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందువల్ల గ్రామాల్లో ఆయా పార్టీల నాయకుల సమీకరణలు, సమావేశాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులను ఆశిస్తున్న వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇంకా ఖరారు కాని చోట్ల ఆశావహులు తమ పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఈనెల 29 నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. దీంతో నేడు, రేపట్లో తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో పెండింగులో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల పేర్ల జాబితా కొలిక్కి వస్తుంది. మరోవైపు ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని రప్పించే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి రెండున్నరేళ్లవుతోంది. అప్పట్నుంచి పంచాయతీలకు పాలక వర్గాల్లేకుండా ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీలకు ఎన్నికల జరగనుండడంతో ప్రధాన పార్టీల మద్దతుదార్లు, కార్యకర్తలు అందుకవసరమైన సన్నద్ధతలో ఉన్నారు.(చదవండి: ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ ) వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం! ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వంకంటే ఈ ప్రభుత్వం సత్వరమే సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటోంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పథకాల ఫలాలు అందడంతో ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తి తమ పార్టీ మద్దతుదార్లు సునాయా సంగా గెలుస్తారన్న ధీమా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గెలుపు బాట వేస్తాయన్న విశ్వాసం ఆ క్యాడరులో వ్యక్తమవుతోంది. (చదవండి: ఏకగ్రీవంతో పల్లెలు ప్రశాంతం) ఎన్నికల ఏర్పాట్లతో యంత్రాంగం.. మరోవైపు తొలివిడత పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండ్రోజుల సమయమే ఉండడంతో సంబంధిత అధికారులు తొలివిడత ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ కె. మాధవీలత ‘సాక్షి’కి చెప్పారు. కాగా మంగళవారం గణతంత్ర దినోత్సవం సెలవు కావడంతో బుధవారం నుంచి పూర్తి స్థాయి ఎన్నికల పక్రియ మొదలుకానుంది. -
ఏకగ్రీవాలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి : జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. గతేడాదే ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానా ప్రకటించగా.. తాజాగా 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? -
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తుందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని.. ప్రజారోగ్యం దృష్ట్యా తాము కోర్టుకు వెళ్లామని తెలిపారు. చదవండి: సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి: సీఎం జగన్ ‘‘ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలన్న విషయాన్ని గమనించలేదు. ఈ సమస్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి.. పంచాయతీ ఎన్నికలు తీసుకురావడంలోనే కుట్ర కోణం ఉంది. తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడం సరికాదు. ప్రభుత్వంతో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్ఈసీకి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం.. గెలవడం మా పార్టీకి కొత్త కాదు. చంద్రబాబులా ఎన్నికలకు భయపడి వెనకడుగు వేయం. ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడం అర్ధం లేని చర్య. ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా ఇదే ఇబ్బంది ఉంటుంది. సిబ్బందికి ఏదైనా జరిగితే ఎస్ఈసీదే పూర్తి బాధ్యత.వ్యాక్సినేషన్పై ఎలా ముందుకెళ్లాలనేది కేంద్రంతో చర్చిస్తామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ -
ఏపీ: పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ♦జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ ♦జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు ♦ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన ♦ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ♦ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం ♦ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ♦ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ♦ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ♦ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ ♦ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు ♦ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన ♦ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ♦ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం ♦ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ♦ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ♦ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు 3వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ♦ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ♦ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు ♦ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన ♦ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ♦ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం ♦ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ♦ఫిబ్రవరి 17న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ♦ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు 4వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ♦ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ♦ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు ♦ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన ♦ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ♦ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం ♦ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ♦ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ♦ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ►పంచాయితీ ఎన్నికలు జరిగే మొత్తం మండలాలు- 659 ►తొలిదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 173 ►రెండవ దశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 169 ►మూడవదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 171 ►నాలుగవ దశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 146 -
ఎస్ఈసీ నిర్ణయాల్లో తలదూర్చలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. కాగా ఏపీలో స్థానిక సంస్థలను నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ హృషీకేష్రాయ్లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లక్షలమంది ఫ్రంట్లైన్ వారియర్స్కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 5లక్షల ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని, వారి సహకారం లేనిది ఎన్నికలు నిర్వహించలేమని ధర్మాసనం ముందు వాదించారు. ఎన్నికలు జరగాలంటే పోలీసుల సహకారం చాలా అవసరమని, పోలీసులకు కూడా వాక్సిన్ ఇవ్వాలన్నారు. కరోనా దృష్ట్యా ఇప్పటికే గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మార్చి 1 నుంచి ఎన్నికలు నిర్వహించడానికి అభ్యంతరం లేదన్నారు. జనవరి 28కల్లా ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వడం పూర్తిఅవుతుందని వివరించారు. వాక్సిన్, ఎలక్షన్ ఒకేసారి నిర్వహించాలని హైకోర్టు చెప్పడం సరికాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. -
ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న వేళ గోవా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేసింది. వ్యాక్సిన్ ప్రక్రియ నేపథ్యంలో అధికారులంతా ఆ పనుల్లోనే నిమగ్నం అవుతారని, వారికి భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున ఏప్రిల్ తర్వాత భవిష్యత్ ప్రణాళిక వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎస్ఈసీ చోఖా రామ్గార్గ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 18న ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేసింది. దీంతో 11 మున్సిపల్ కౌన్సిళ్లు, పనాజి కార్పొరేషన్ సహా, వివిధ గ్రామపంచాయతీల్లోని ఉప ఎన్నికలు, దక్షిణ గోవాలోని నవేలిమ్ జిల్లా పంచాయతీ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల కమిషనర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేంత వరకు పాల్గొనమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి గోవా ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఎన్నికల సంఘం ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆయన... ‘‘గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేశారు. వ్యాక్సినేషన్ సమయంలో అధికారులు నిమగ్నమై ఉంటారని కాబట్టి వారిపై అదనపు భారం వేయడం సరికాదు అని భావిస్తూ మూడు నెలలపాటు గోవా ఎన్నికల కమిషన్ ఎలక్షన్ వాయిదా వేసింది. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడే ఏపీ ఎన్నికల కమిషనర్ ఈ విషయం తెలుసుకుని అయినా మారతారని ఆశిస్తున్నాం. ఫ్రంట్లైన్ వారియర్లకు టీకా వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’’ అని వెంకట్రామిరెడ్డి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు విజ్ఞప్తి చేశారు. -
ఎస్ఈసీ మరోసారి ఆలోచించాలి: పోలీసులు
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మరోసారి ఆలోచించాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖలో కరోనాతో 109 మంది ప్రాణాలు కోల్పోయారని.. పోలీసు శాఖలో 14 వేల మంది కరోనా బారిన పడ్డారన్నారు. ఎన్నికల్లో పోలీసులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని.. పోలీసు శాఖలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు. వ్యాక్సినేషన్.. బందోబస్తు ఒకేసారి చేయాలంటే ఇబ్బందికరమని తెలిపారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ.. ‘‘ఎస్ఈసీకి చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎన్నికలు అవసరమే కానీ.. కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుంది. కరోనా నేపథ్యంలో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. మనం ప్రాణాలతో ఉంటేనే కదా.. ఏదైనా చేయగలుగుతాం. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ మరోసారి ఆలోచించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని పోలీసులు ఎస్ఈసీని కోరారు. చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని -
ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ..
సాక్షి, నెల్లూరు: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు అధికారం తప్ప.. బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎస్ఈసీకీ అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని.. అధికారాన్ని, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ తప్పనిసరని ప్రధాని చెప్పారు. ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని.. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదు.. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు.(చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని ఎవరి మెప్పు కోసం..? ‘‘గతంలో గోపాల కృష్ణ ద్వివేది ఎంత పకడ్బందిగా ఎన్నికలు నిర్వహించారో మీకు తెలుసు. నిమ్మగడ్డ రమేష్ వ్యక్తిగత స్వార్థం, పరిచయాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరి కోసం ఈ ఎన్నికలు. గతంలో మేము ఎన్నికలు నిర్వహించమంటే ఎందుకు పెట్టలేదు. చంద్రబాబు మీ స్నేహితుడని, సామాజిక వర్గమని ఎన్నికలు పెట్టలేదా.. ఇప్పుడు ఈ ఎన్నికలు మీకు పదవిచ్చిన చంద్రబాబు మెప్పు పొందడానికా..? చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ లాలూచి పడ్డారు. ఎన్నికలు మూడు నెలల వాయిదా వేయడం వల్ల ఏలాంటి నష్టం లేదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేయడం ఎంత వరకు కరెక్టు. రాజ్యంగ వ్యవస్థలో నిమ్మగడ్డ వంటి వ్యక్తులు ఉండటం చాలా దురదృష్టం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి విషయానికి చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని’’ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. -
ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రెస్ మీట్ కేవలం పొలిటికల్ సమావేశంలా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు.. 2021లో జరగడానికి కారకులు ఎవరని ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం, రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మీరు చుట్టూ అద్దాలు బిగించుకుని ప్రెస్ మీట్ పెట్టారు. రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల నిర్వహిస్తే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పొతే ఎవరు బాధ్యత తీసుకుంటారు. మీరు ఫాల్స్ ప్రెస్టేజ్కు పోతున్నారు. మీరు కుర్చీలో ఉండగా ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా.. ఎందుకంత నియంతృత్వ పోకడ’’ అంటూ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. ప్రంట్ లైన్ వారియర్స్ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి బెదిరింపు ధోరణిలో వెళ్లడం సబబేనా.. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా అంటూ స్పీకర్ ప్రశ్నలు గుప్పించారు. చదవండి: నిమ్మగడ్డ.. ఎందుకంత మొండి వైఖరి.. ‘‘రాజ్యాంగంలో పొందు పరచిన ఫోర్స్ మెజర్ కేసు క్రింద పరిగణించి ఎన్నికలను ఆపాల్సిన అవసరం ఉంది. ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరించారు. రేపో మాపో పోలీసులు కూడా ఎన్నికలను బహిష్కరిస్తారు. అప్పుడు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు వద్దని ఉద్యోగులు, ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. దాన్ని కాలరాస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీకు రైట్ టూ లివ్ ఆర్టికల్ మీకు తెలియదా..?. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం వాటిల్లుతుంది. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం ఏం చెబుతుందో వేచి చూడాలి. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే దీనిపై ప్రజల్లోకి రెఫరెండం(ఎన్నికల నిర్వహణ పై ప్రజాభిప్రాయ సేకరణ )కు వెళ్లాలని’’ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..! -
నిమ్మగడ్డ.. ఎందుకంత మొండి వైఖరి..
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు, ప్రజల ప్రాణానికో న్యాయం.. మీ ప్రాణానికి మరొక న్యాయమా?. ఉద్యోగులంతా ఫ్రంట్లైన్ వారియర్స్ అని తెలియదా?. ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పింది. కేంద్రం రూల్స్ అంటే నిమ్మగడ్డకు లెక్కలేదా?. దీనిపై వివరణ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారంటూ’’ బాలశౌరి విమర్శలు గుప్పించారు. చదవండి: నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు కరోనా సమయంలో ఎన్నికలు వద్దని ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారని.. వారి అభ్యర్థనను నిమ్మగడ్డ పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందన్నారు. కోర్టులు కూడా వర్చువల్గానే పనిచేస్తున్నాయని.. నిమ్మగడ్డ కూడా ఎస్ఈసీ తరఫున వర్చువల్గా హాజరయ్యారని’’ ఎంపీ బాలశౌరి తెలిపారు. చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..! -
టీడీపీకి తొత్తులా నిమ్మగడ్డ : పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి : సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాక్సినేషన్ పూర్తి కాకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రబుత్వ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని, ఆలయాలపై దాడుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఏడాదిలోగా రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు. హిందువుల గురించి మాట్లాడే అర్హత పవన్కళ్యాణ్కు లేదన్నారు. ప్రజలు, అధికారుల ప్రయోజనాలను నిమ్మగడ్డ పక్కన పెట్టారని, చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. (అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్) వ్యాక్సిన్ పూర్తయ్యే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. నిమ్మగడ్డ కేవలం చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని, రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్షాలు నీచంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సూచనలు, ఉద్యోగుల అభ్యర్థనలు తోసిపుచ్చి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని మంత్రి శంకర్నారాయణ అన్నారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం నిరంకుశత్వానికి అద్దం పడుతోందని, వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. (నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు) -
నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయంటూనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు పలు విజ్ఞప్తులు చేసినప్పటికి.. పరిగణలోనికి తీసుకోని ఆయన.. హైకోర్టు తీర్పుననుసరించి ఎన్నికల నోటిఫికేషన్ శనివారం వెలువరించారు. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ తీసుకున్న కోవిడ్ జాగ్రత్తలు చర్చనీయాంశమయ్యాయి. సమావేశం సందర్భంగా ఆయన మాస్క్ ధరించి.. గ్లాస్ షీల్డ్ కవర్ వెనుక కూర్చుని నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. ఇక సమావేశానికి ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేయించారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశానికే నిమ్మగడ్డ తన రక్షణ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. మరి లక్షల మంది ప్రజలతో ముడిపడ్డ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఎన్నికల సిబ్బంది.. ఓట్లు వేసే ప్రజల ఆరోగ్యం గురించి ఆయనకు ఎలాంటి బాధ్యత లేదా.. ఆయన ఒక్కరిదే ప్రాణం.. జనాలది కాదా అని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న నిమ్మగడ్డ.. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సమయంలో ఇంత మొండిగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆడుతున్న నిమ్మగడ్డకు ప్రజల రక్షణ గురించి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్..) మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని నిమ్మగడ్డ ఎన్నికలప్రక్రియకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేశ్కుమార్ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అరగంట సేపు ప్రసంగం చేసి మీడియా సందేహాలను.. నివృత్తి చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. మీడియా సందేహాలను నివృత్తి చేయటం ఆనవాయితి. ఇందుకు భిన్నంగా నిమ్మగడ్డ తాను రాసుకొచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని కాదని ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తున్నారు. ఇక మీడియా సమావేశం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖపై నిమ్మగడ్డ పలు ఆరోపణలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఇంకా మెరుగైన పనితీరు కనబరచాలని.. తన పనుల్లో పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు. మూడేళ్ల కాలయాపన తర్వాత ఇప్పుడు అకస్మికంగా 2018 ఆగస్టులోనే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల కాల పరమితి ముగిసింది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్న నిమ్మగడ్డ.. అప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా మూడేళ్లుగా కాలయాపన చేశారు. 2019లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయ్యింది. గతేడాది మార్చిలో స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీని ప్రభుత్వం కోరినా.. ఓటర్ల జాబితా తయారు కాలేదంటూ ఎస్ఈసీ అప్పట్లో మెలిక పెట్టింది. కరోనా సాకుతో కేవలం ఆరు కేసులు నమోదైన సమయంలో ఎస్ఈసీ గతేడాది ఆకస్మికంగా జడ్పీ ఎన్నికలు వాయిదా వేసింది. మూడేళ్లగా ఎన్నికలు నిర్వహించకుండా తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఉద్యోగ సంఘాల అభ్యర్ధనలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్టించుకోకుండా.. ఎస్ఈసీ ఏకపక్షంగా ముందుకెళ్తోంది అంటూ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!
సాక్షి, తాడేపల్లి: మూడేళ్ల పాటు నిద్రపోయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో..ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్ ప్రెస్మీట్లా అనిపించింది. 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఎన్నికల నిర్వహణలో మూడేళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైంది?.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయింది?.ఎన్నికల నిర్వహణ ఒక విధి అనే భావన ఎక్కడా కనిపించట్లేదు. అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని’’ అంబటి దుయ్యబట్టారు. చదవండి: బెదిరించేలా నిమ్మగడ్డ వ్యవహార శైలి: మల్లాది విష్ణు తమకు ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం సాధ్యం కాదని.. వ్యాక్సినేషన్ చేస్తే కోవిడ్ తగ్గుతుంది. ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ పెరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా?. ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకూడదా? అని ప్రశ్నించారు. ‘‘ఏకగ్రీవాలు జరిగిన చోట స్పెషల్ మోనటరింగ్ పెడతారంట. ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిగితే అభివృద్ధి సాధ్యం’’ అని తెలిపారు. నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికలు సజావుగా సాగకపోతే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి -
పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నిమ్మగడ్డ మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ క్షేమంగా ఉండాలి.. ఉద్యోగులు మాత్రం ప్రాణాలు బలి పెట్టాలా. అధికారులపై చర్యలు తీసుకుంటామని.. నిమ్మగడ్డ బెదిరించడం న్యాయం కాదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. అద్దం చాటున దాక్కుని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారు’’ అని చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. (చదవండి: ఒంటెత్తు పోకడలకు చెంపపెట్టు) ‘‘ఆయన ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తాం. నిమ్మగడ్డ వ్యవహించిన తీరు, మాట్లాడిన విధానం.. బాధ కలిగించింది. ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరుతామనే నిమ్మగడ్డ మొండివైఖరి సరికాదు. మా ప్రాణాలకు ష్యూరిటీ ఎవరు ఇస్తారు.. నిమ్మగడ్డ గ్యారెంటీ ఇస్తారా. 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నాం. ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడం’’ అని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
ఒంటెత్తు పోకడలకు చెంపపెట్టు
వ్యాక్సినేషన్ ప్రక్రియపై షెడ్యూల్ ఖరారు అయ్యాక, స్థానిక ఎన్నికలపై చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినా, వినకుండా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ కన్నా ముందుగానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో కూడా దురుద్దేశం కనిపిస్తుంది. ఈ నెల పదహారు నుంచి వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతుందని తెలిసి కూడా నిమ్మగడ్డ ఇలా చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. పదవీకాలంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి కానీ, ఇలాంటి అప్రతిష్టను మూటకట్టుకోకూడదు. అయినా నిమ్మగడ్డ ఏమీ ఫీల్ కావడం లేదంటే అంతకంటే అధిక ప్రయోజనం ఎక్కడి నుంచో వస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తన బురదను అందరికీ అంటించాలనే భావిస్తున్నారా.. ఏపీ హైకోర్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మెచ్చదగినదే. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేయడం కానీ, ఆ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి జస్టిస్ గంగారావు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ అర్ధవంతంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రజలకు జీవించే హక్కు ఉందని, ప్రజల ప్రాణాలతో ఎవరూ చెలగాటమాడకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం హర్షణీయం. కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాక్సినేషన్కు దేశం అంతా సిద్ధమవుతున్న తరుణంలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు అంటూ హడావుడి చేయడం, ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే యత్నం చేయడం ఇవన్నీ చర్చనీయాంశం అయ్యాయి. కొందరు బొడ్డుకు మసి రాసుకు కూర్చుంటారు. మరికొందరు బురదలో దిగుతారు. వారికి ఒక ఉద్దేశం ఉంటుంది. అదేమిటంటే ఆ మసి కానీ, ఆ బురద కానీ ఇతరులకు కూడా అంటించాలని. అప్పుడు వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీరు అలాగే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఆయన ప్రభుత్వానికి తన మసి అంటిం చాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వానికి బురద అంటించడం ఎలా అని ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు పెట్టడం కోసం జనవరి తొమ్మిది నుంచే ఎన్నికల కోడ్ అంటూ చిత్రమైన నియమావళిని తీసుకువచ్చారు. అసలు ప్రస్తుతానికి ఎన్నికలే వద్దు.. ముందు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముఖ్యం, ప్రజల జీవితాలకు ప్రమాదం తేకూడదు అని ఏపీ ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, మరో ఇద్దరు సీనియర్ అధికారులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు చెప్పివచ్చిన కొద్దిసేపటికే ఎన్నికలు పెడుతున్నట్లు ప్రభుత్వానికి చెప్పకుండా ప్రకటన జారీ చేశారు. ఆ మాటకు వస్తే 2020 మార్చి 15న కరోనా పేరుతో నిమ్మగడ్డ కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఏపీలో 25 కేసులు కూడా లేవు. అప్పుడు ఆయన ఏపీని రక్షించారని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మీడియావారు ఊదరకొట్టారు. తదుపరి కరోనా ప్రపంచం అంతా విజృంభించింది. ఎనిమిది లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏడువేల మందికి పైగా మరణించారు. ఇప్పటికీ మూడువేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. రోజూ ఇంకా 200 నుంచి 300 కేసులు వస్తున్నాయి. అయినా నిమ్మగడ్డ అదేమీ పెద్ద ఇష్యూ కానట్లు ఎన్నికలు పెడతానంటూ ఏకపక్షంగా నిర్ణయం ప్రకటిం చడం, దానిని ప్రభుత్వం వ్యతిరేకించి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. నిమ్మగడ్డ అక్కడితో ఆగలేదు. అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటివాటిని కూడా నిలుపుదల చేయడానికి యత్నించారని వార్తలు వచ్చాయి. సాధారణంగా ఆన్ గోయింగ్ స్కీములకు ఎన్నికల కోడ్ వర్తించదు. అమ్మ ఒడి స్కీమ్ గత ఏడాది అమలు అయింది. ఈ ఏడాది నెల్లూరులో జనవరి పదకొం డున అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో నిమ్మగడ్డ నిలుపుదల చేస్తున్నట్లు సర్క్యులర్ ఇచ్చారు. అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ కూడా గత ఏడాది డిసెంబర్ 25 నుంచి అమలు అవుతోంది. దీనిని కూడా నిలిపివేయాలన్నారు. వీటిని ఏపీ ప్రభుత్వం ఆపలేదు. అది వేరే విషయం. నిజమేదంటే ఈ స్కీములు పేదల గుండెల్లో నిలిచిపోయాయి. దానిని ఎలాగైనా దెబ్బకొట్టే లక్ష్యంతో ఎన్నికల కమిషనర్ ఈ దిక్కుమాలిన సర్క్యులర్ ఇచ్చారని అర్థం అవుతుంది. టీడీపీకి, చంద్రబాబుకు ఎలాగైనా ఉపయోగపడాలన్న కాంక్షతో ఈ పని చేసినట్లుంది కానీ, పద్ధతి ప్రకారం చేసినట్లు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. నిజానికి టీడీపీకి స్థానిక ఎన్నికల కన్నా, తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ముఖ్యం. అక్కడ గణనీయంగా ఓట్లు రాకపోతే, వైఎస్సార్సీపీ మెజార్టీని తగ్గించకపోతే, టీడీపీ మరింత దెబ్బతింటుంది. అందుకే ఎన్నికల కోడ్ పెడుతున్నట్లు ప్రకటించారా అన్న సంశయం కలుగుతుంది. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతారు కాబట్టి అప్పటివరకు ఒక ఎన్నికల కోడ్, ఆ తర్వాత మండల, జడ్పీ, మున్సిపల్ ఎన్నికలకు మరో షెడ్యూల్ విడుదల చేసి, తిరిగి ఎన్నికల కోడ్ కొనసాగించవచ్చన్న ఉద్దేశం కనిపిస్తుంది. అంతలో కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నిక ప్రకటిస్తే, ఆ కోడ్ నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు వర్తింపచేసే అవకాశం ఉంటుంది. అంటే రెండున్నర నెలలు ప్రభుత్వం ఏ పని చేయకుండా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా జరిపిన కుట్రలాగా అనిపిస్తుంది. పైగా, ప్రభుత్వపరంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా దానిపై పనిచేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ పని మాని నిమ్మగడ్డ ఎన్నికల ఆదేశాలను పాటించాలన్నమాట. అయితే ఎన్జీఓ సంఘం, ఉపాధ్యాయ సంఘం, పోలీసు అధికారుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం ఇలా అన్ని సంఘాలు ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించాయి. వారు కూడా కోర్టును ఆశ్రయించారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న గౌరవ హైకోర్టు స్థానిక ఎన్నికల షెడ్యూల్ను నిలుపుదల చేయడమే కాకుండా, ఎన్నికల ఏకపక్షంగా ప్రకటించారని అభిప్రాయపడింది. వారి షెడ్యూల్ వ్యాక్సినేషన్కు ఆటంకం అవుతుందని కూడా స్పష్టంగా భావించింది. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు జీవించే హక్కు ఉంటుం దని వ్యాఖ్యానించింది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి విజ్ఞతతో తీర్పు ఇచ్చినందుకు వారిని అభినందించాలి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఆయన పెంచారని చెప్పాలి. నిమ్మగడ్డ ఎంత అహంతో ఉన్నారన్నది మరోసారి ధ్రువపడుతుంది. ఒక కోర్టువారు ప్రజలకు జీవించే హక్కు ఉన్నదని చెబితే, మరో కోర్టు అందుకు భిన్నంగా చెబుతుందా అన్న ప్రశ్న వస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోరాదన్నది నిమ్మగడ్డ వాదన. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 23న వస్తుంది. అంటే అప్పటివరకు ఎన్నికల ప్రక్రియ ఆరంభం కానట్లేనని, అందువల్ల హైకోర్టువారు జోక్యం చేసుకోవచ్చని మరో వాదన కూడా ఉంది. ఉద్యోగులు, ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలలో ఎలా పాల్గొంటారన్నది అన్నిటికి మించిన లాజిక్ అని చెప్పాలి. నిజంగానే స్థానిక ఎన్నికలపై అంత శ్రద్ధ ఉంటే 2018లోనే ఎందుకు నిర్వహించలేదన్న దానికి నిమ్మగడ్డ రమేష్ గానీ, చంద్రబాబు కానీ సమాధానం ఇవ్వలేదు. కరోనా సాకు చూపుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా గత మార్చిలో ఎలా వాయిదా వేశారన్న ప్రశ్నకు ఆయన వద్ద జవాబు లేదు. గతంలో ఇలా ఎన్నికలు వాయిదా పడలేదా? పడ్డాయి. స్వయంగా నిమ్మగడ్డే ఎన్నికలను వాయిదా వేశారు కదా. అలాం టప్పుడు అత్యవసర సమయాలలో హైకోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయాలలో జోక్యం చేసుకోకూడదని లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై షెడ్యూల్ ఖరారు అయ్యాక, స్థానిక ఎన్నికలపై చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినా, వినకుండా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ కన్నా ముందుగానే నిమ్మగడ్డ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో కూడా దురుద్దేశం కనిపిస్తుంది. ఈ నెల పదహారు నుంచి వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతుందని తెలిసి కూడా నిమ్మగడ్డ ఇలా చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. మార్చి 31 నాటికి రమేష్ కుమార్ రిటైర్ అవుతారు. ఈలోగా తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి, టీడీపీ నేతలను సంతోషపరచడానికి ఇలా పనిచేస్తున్నారన్న భావన ఏర్పడింది. మరో అంశం ప్రస్తావించాలి. న్యాయవ్యవస్థలో అయినా, ఇలాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలో అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వం చెబితే వెంటనే ఆ కేసులను విచారించకపోవడం, ఇతరత్రా నిర్ణయం తీసుకోకుండా ఉండడం అనే ఒక మర్యాద ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థలో కూడా కొందరు ఆ ఎథిక్స్ను పాటిం చడం లేదు. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా అదే రకంగా ఎవరు ఏమని అనుకున్నా పర్వాలేదు.. తాను మాత్రం ఇలాగే చేస్తాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదికాదు. అయినా ఈ మూడు నెలల్లోనే ఏదో చేసేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. దానివల్ల టీడీపీకి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ చేయగలిగేది ఏమీ ఉండదన్న సంగతిని కూడా ఆయన గుర్తు ఉంచుకోవాలి. పదవీకాలంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి కాని, ఇలాంటి అప్రతిష్టను మూటకట్టుకోకూడదు. అయినా ఆయన ఏమీ ఫీల్ కావడం లేదంటే అంతకంటే అధిక ప్రయోజనం ఎక్కడి నుంచో వస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఎస్ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ కృష్ణ మోహన్లతో కూడిన ధర్మాసనం.. ఎస్ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకై ఎలక్షన్ కమిషన్, ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమన్న న్యాయస్థానం... ఎస్ఈసీ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది.(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం) అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ.. ఎస్ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హౌస్ మోషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సెక్రటరీగా వ్యవహరిస్తున్న వాణీమోహన్ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాణీమోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల ఉత్తర్వులను కొట్టేసినా ఎస్ఈసీ నిమ్మగడ్డ తన వైఖరి మార్చుకోకపోవడం గమనార్హం. కాగా, పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం తప్పుపట్టింది. ఎన్నికల కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపేసింది. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది. (చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం) సంప్రదింపుల సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన స్వీయ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్ను జారీ చేసిందని ఆక్షేపించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సాయిప్రసాద్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిమ్మగడ్డ సోమవారం వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్) -
హైకోర్టు తీర్పు శుభపరిణామం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేయడం శుభపరిణామమని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో హోంలో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్కు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ధర్మం వైపు న్యాయం హైకోర్టు తీర్పుపై ఏపీ అమరావతి జేఏసీ సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ను హైకోర్టు రద్దు చేయడంపట్ల ఏపీ అమరావతి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ధర్మం వైపే న్యాయం ఉంటుందని ఈ తీర్పు ఋజువు చేసింది అని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ ఇకనైనా మొండి వైఖరి విడనాడాలి
విజయవాడ : ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మా ఆవేదనను న్యాయస్థానం ఆలకించి న్యాయం చేసిందని, ప్రజారోగ్య పరిరక్షణకే న్యాయమూర్తి మొగ్గు చూపారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన మొండి వైఖరి విడనాడాలని, కోర్టు తీర్పును గౌరవించి ఎన్నికల ప్రక్రియకు పులుస్టాప్ పెట్టాలని చెప్పారు. (నిమ్మగడ్డకు షాక్! పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు ) వాక్సినేషన్ పంపిణీ అనేది చాలా పెద్ద ప్రక్రియ అని, అందరికీ వాక్సినేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాల్సిందిగా కోరారు. అధే విధంగా విధుల నుంచి తొలగించిన జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఉద్యోగుల జోలికొస్తే నామరూపాల్లేకుండా పోతారని, ఎస్ఈసీ మళ్ళీ మొదటికొస్తే సమ్మెకు దిగేందుకు కూడా వెనకాడమని సవాల్ విసిరారు. (నిమ్మగడ్డ రాజీనామాకు మంత్రి కొడాలి నాని డిమాండ్ ) -
నిమ్మగడ్డ రాజీనామా చేయాల్సిందే: కొడాలి నాని
కృష్ణ : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్చునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అధికారులు వెళ్లి చెప్పినా పట్టించుకోలేదని, ప్రజలు ఏమైపోయినా తన పదవి అయిపోయే లోపు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూశారని మండిపడ్డారు. ఇప్పుడు 'హైకోర్టు తీర్పు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా, నిమ్మగడ్డ మూతి పళ్లు రాలేలా తీర్పు వచ్చింది' అని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. (నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం ) కోవిడ్ ప్రబలి ప్రజలు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలు అమలు చేసిన వ్యక్తి నిమ్మగడ్డ అని.. రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ అని కొడాలి నాని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నైతిక బాధ్యతతో నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ క్యార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్కి వ్యాక్సిన్ ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ: ఎన్నికల షెడ్యూల్ను హై కోర్టు సస్పెండ్ చేయటం ప్రజా విజయం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇది నియంతృత్వ పోకడలకు పోయే రాజ్యాంగేతర శక్తులకు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ప్రజావిశ్వాసం పొందిన సీఎం జగన్ని కుట్రలతో ఎదుర్కొవాలనుకోవాలనుకోవడం మూర్కత్వం అని తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం అని, ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేయటాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికైనా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. (నిమ్మగడ్డకు షాక్! పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు ) -
నిమ్మగడ్డకు షాక్! ఎన్నికల షెడ్యూల్ రద్దు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేసింది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతకు క్రితం అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు... ‘‘ ఎస్ఈసీ నిర్ణయాలన్నీ ఉద్దేశ పూర్వకమైనవి. ఎస్ఈసీ తనకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. 2020 మార్చిలో వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వదిలేసి.. పంచాయతీ ఎన్నికలు ప్రారంభించడంలోనే ఎస్ఈసీ ధోరణేంటో స్పష్టమౌతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రభుత్వంలోని పెద్దలపై ఎస్ఈసీ నిరంతరాయంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది. ఒక రాజకీయ పార్టీ ప్రస్తుతమున్న ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. ఆ పార్టీ కోరుకుంటుందనే ఎస్ఈసీ వెంటనే ఎన్నికలు జరపాలని చూస్తోంది. వ్యాక్సినేషన్ కోసం ఏ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుందో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఊహించలేకపోతుంది. ప్రజారోగ్యం కాపాడేందుకు పెద్దఎత్తున ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగులను.. మొహరించాల్సి ఉంటుందనే విషయాన్ని ఎస్ఈసీ విస్మరిస్తుంది. నిజాయితీగా, సహేతుకంగా విధులు నిర్వహించడమనేది ఎస్ఈసీకి వర్తిస్తుంద’’ని పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి
గుంటూరు మెడికల్: ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. స్థానిక ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహా తీసుకోకుండా.. ఉద్యోగుల్ని సంప్రదించకుండా విడుదల చేసిన షెడ్యూల్ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ను డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్వేవ్, బర్డ్ ఫ్లూ భయాందోళనల్లో ప్రజలున్నారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని.. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మొండిగా వ్యవహరిస్తే.. ఎన్నికలను బహిష్కరించి కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని.. ఉద్యోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సీపీఎస్ రద్దుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కరోనా వల్ల రెవెన్యూ తగ్గి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సీపీఎస్ రద్దుతో పాటు పీఆర్సీ విషయంలో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే అవి పరిష్కారమవుతాయని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షుడు బండి చంద్రశేఖరరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వి.కృపావరం, రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.రంగారావు, నాయకులు ఘంటసాల శ్రీనివాసరావు, సీహెచ్.రాంబాబు, ఎం.ఎన్.మూర్తి, కె.ఎన్.సుకుమార్, సీహెచ్.అనిల్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నిర్వహించాలి: వైఎస్సార్ టీఎఫ్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వేసవి సెలవుల్లో నిర్వహించాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జాలిరెడ్డి, జి సుదీర్ ఓ ప్రకటనలో కోరారు. కరోనాతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయాందోళనతో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని, ముందుగా వారికి వ్యాక్సిన్ అందించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత వేసవి సెలవుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని ప్రకటనలో తెలిపారు. -
ఎస్ఈసీ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
అమరావతి: స్థానిక ఎన్నికలకు ఏకపక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పినా కూడా శుక్రవారం ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం వివాదం రేపుతోంది. ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. గతంలో కరోనా వ్యాప్తి తక్కువ ఉన్న సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణకు ముందుకువెళ్లడం వివాదానికి దారి తీస్తోంది. ఏకపక్ష నిర్ణయం సరికాదు: ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో తక్కువ కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో పంతానికి పోయి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని చెప్పారు. ఇది సరికాదని ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరి డైరెక్షన్లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారో అందరికీ తెలుసని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం పంతాలకు పోయి తమను ఇబ్బంది పెట్టొద్దని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పూర్తిస్థాయిలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశాయి. ప్రజల ప్రాణాలతో ఎస్ఈసీ చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా?
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం, ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం దేశానికి గర్వించే క్షణమని చెప్పారు. ఆయన శనివారం జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక్కడ మూడంచెల పంచాయతీ వ్యవస్థ పూర్తిరూపం సంతరించుకుందని మోదీ తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కొద్ది కాలంలోనే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం(కాంగ్రెస్) స్థానిక ఎన్నికలు ఇంకా నిర్వహించలేదని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం ఇదేనా? ‘‘ఢిల్లీలో కూర్చున్న కొందరు వ్యక్తులు నన్ను నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. అభ్యంతరకర పదజాలం వాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నాకు రోజూ పాఠాలు చెబుతున్నారు. వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతా. ప్రజాస్వామ్యం గురించి నాకు బోధిస్తున్న పార్టీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది. ఆ పార్టీ అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. పుదుచ్చేరిలో చివరిసారిగా 2006లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం 2011లోనే ముగిసింది. అయినా ఎన్నికలే జరపడం లేదు. అంటే వారు చెప్పేదానికి, చేసేదానికి ఏమాత్రం పొంతన లేదని దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల వారికున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కొత్త నాయకత్వానికి శ్రీకారం జమ్మూకశ్మీర్లో డీడీసీ ఎన్నికలు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. ప్రతికూల వాతావరణం, కరోనా భయం ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేశారు. నాకెంతో గర్వంగా ఉంది. దేశానికి ఇదొక గర్వించే క్షణం. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అహోరాత్రులు శ్రమించారు. ప్రజల కోసం పని చేసినవారు ఎన్నికల్లో గెలిచారు. కొత్త దశాబ్దంలో కొత్త నాయకత్వానికి ఇది శ్రీకారం. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో ప్రజలు వారి హక్కులను వారు పొందారు. పాత చరిత్రను వెనక్కి నెట్టేసి, కొత్త భవిష్యత్తు కోసం ఓటేశారు.’’ ‘ఫెరాన్’ ధరించిన మోదీ జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను గత ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు. కశ్మీర్ పర్యటనలో ఈ వస్త్రాలు ధరించాలని మోదీ భావించినప్పటికీ కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇది చరిత్రాత్మక దినం ‘‘ఆయుష్మాన్ భారత్ పథకంతో జమ్మూకశ్మీర్లో ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాకు అర్హులవుతారు. ఈ ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన నేతలు సరిహద్దు రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారు. ఆ తప్పిదాన్ని మేము సరిచేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జమ్మూకశ్మీర్లో 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మోదీ పాలనలో జమ్మూకశ్మీర్లో శాంతి: అమిత్ షా ప్రధానమంత్రి మోదీ ఆరేళ్ల పాలనాకాలం జమ్మూకశ్మీర్లో చరిత్రలో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభోత్సవం లో ఆయన ప్రధాని మోదీతోపాటు గువాహటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ప్రజలతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. ఆయనను తాను ఎప్పుడు కలిసినా జమ్మూకశ్మీర్లో చేపట్టాల్సిన అభివృద్ధి, ప్రజల బాగోగులు, శాంతి భద్రతల గురించి కచ్చితంగా ప్రస్తావిస్తుంటారని గుర్తుచేశారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్మూకశ్మీర్లో ప్రతిరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. యువత కలలు నిజం కావాలంటే శాంతి చాలా ముఖ్యమని చెప్పారు. జమ్మూకశ్మీర్కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారని ఉద్ఘాటించారు. -
21 ఏళ్లకే విజయం: దేశంలో తొలి మేయర్
తిరువనంతపురం\: వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్గా ఆర్య రాజేంద్రన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతున్నారు. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీపీఎం చిన్నారుల విభాగమైన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్ముగళ్ వార్డు కౌన్సిలర్గా సీపీఎం టికెట్పై పోటీ చేశారు. కేరళలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. అయితే, మేయర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. ఆర్య రాజేంద్రన్ పేరును సీపీఎం జిల్లా నేతలు తెరపైకి తీసుకు రాగా అగ్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని తెలిపారు. ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్, తల్లి ఎల్ఐసీ ఏజెంట్. ఇప్పటిదాకా రికార్డు తెలుగమ్మాయి పేరిటే.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్గా రికార్డు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉంది. ఆమె 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్టిక్కెట్పై పోటీ చేశారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్గా ఎన్నికయ్యారు. -
అభ్యంతరాలను తెలుపుతూ లేఖ రాయండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈక్రమంలో ఎన్నికల నిర్వహణపై తాము నివేదించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు తెలిపారు. ఎన్నికల తేదీ పైనే కాదు ఎన్నికలు జరగాల్సిన నెల పైన కూడా చర్చించాలని అన్నారు. దీంతో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ మూడు రోజుల్లో ఎన్నికల కమిషనర్కు ఒక లేఖ రాయమని హైకోర్టు ఏజీని ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులంతా ఎన్నికల కమిషన్తో చర్చించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక ఎన్నికల నిర్వహణా వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంకాగా.. కరోనా పరిస్థితులు, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు..
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోగా, ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నామని.. పోలీసులు, సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఎస్ఈసీ పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని కూడా ఏపీ ప్రభుత్వం.. హైకోర్టుకు వాదనలు వినిపించింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విధితమే. -
ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడైనా.. ఇంతటి కరోనా విపత్తులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకింత పట్టుదల కనబరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపనంత మాత్రాన స్థానిక సంస్థల స్థాయిలో ప్రస్తుతం సాగుతున్న పాలన కుంటుపడుతోందా అని నిలదీసింది. పాలన సజావుగా సాగుతున్నప్పుడు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ (మేధావుల) ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు నేతృత్వంలోని పలువురు ప్రతినిధులు సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే కరోనాకు భయపడి మూడొంతుల మంది ఓటర్లు ఓటేయడానికే రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అంత తక్కువ స్థాయి ఓటింగ్తో ఎన్నికలు నిర్వహిస్తే ‘ఫ్రీ అండ్ ఫెయిర్ (స్వేచ్ఛ, పారదర్శకం)’గా ఎన్నికల నిర్వహించినట్టా అని విజయబాబు ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై నిమ్మగడ్డతో ఏ చర్చకైనా సిద్ధమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ మంచిది కాదని తమ ఫోరం తరఫున గవర్నర్కు లేఖ రాస్తామని చెప్పారు. ప్రభుత్వంపై అక్కసు.. ప్రతిపక్షంపై ప్రేమా? నిమ్మగడ్డ వ్యవహారశైలి ప్రభుత్వంపై అక్కసు, ప్రతిపక్షంపై అవ్యాజ్యమైన ప్రేమ చూపుతున్నట్టు ఉందని విజయబాబు విమర్శించారు. ఇందుకు ఆయన కొందరు నేతలతో స్టార్ హోటళ్లలో జరిపిన రహస్య చర్చలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు మల్లికార్జునమూర్తి, పిళ్లా రవి, సాయిరాం పాల్గొన్నారు. -
సరైన సమయంలో ‘స్థానిక’ ఎన్నికలు
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితులు లేవని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పడు వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన నిబంధనలు ఉండేలా ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్–1994లో మార్పులు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో ఇంకా కరోనా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడే నిర్వహించడం ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉందని నిపుణులు, మీడియా ప్రతినిధులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా సెకండ్ వేవ్ను అడ్డుకోవడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల వివరాలను అడుగుతోందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు మరికొందరు చేస్తున్న వాదనలు సరికాదన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుంది.. ఇప్పటికే కరోనా వల్ల రాష్ట్రంలో 7,014 మంది మరణించారని ఆళ్ల నాని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలో ప్రాణాలు విడిచిన ఫ్రంట్లైన్ వారియర్స్ త్యాగాలను వృథా కానీయరాదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టిందని, ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని శాసనసభ భావిస్తోందన్నారు. తీర్మానంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ నాయకత్వంలో అధికారులందరూ కరోనాపై పోరాడుతున్నారని, ఏ పాలకుడికైనా ప్రజల ధన, మాన, ప్రాణాలే ముఖ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సరైన సమయంలో నిర్వహిస్తామని.. దీనికోసం పంచాయతీరాజ్ యాక్ట్లో నిబంధనలను మారుస్తున్నామని తెలిపారు. -
మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో దశ పోలింగ్లో 48.62 శాతం ఓటింగ్ నమోదైంది. జమ్మూ ప్రాంతంలో 65.54 శాతం, కశ్మీర్ లోయలో సగటున 33.34 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ మీడియాతో తెలిపారు. 43 స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. అందులో కశ్మీర్లో 25, జమ్మూ డివిజన్లో 18 ఉన్నాయి. బందిపురా జిల్లాలో అత్యధికంగా 69.66 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఓటింగ్తో కేంద్రపాలిత ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉంది. నవంబర్ 28న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 51.76 శాతం ఓట్లు నమోదయ్యాయి. ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టులో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఇది మొదటి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. పూంచ్లో అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదవ్వగా, పుల్వామా మొదటి దశలో మాదిరిగానే 8.67 శాతం ఓటింగ్తో చివర స్థానాన్ని నిలుపుకుంది. మొదటి దశలో కశ్మీర్లో 25, జమ్మూ ప్రాంతంలో 18 సహా 43 స్థానిక సంస్థ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కడా సమస్యలు రాకుండా శాంతియుతంగా ఎన్నికలు ముగిశాయి. లోయలో పోల్ శాతం తగ్గినప్పటికీ కొంతమేరకు ప్రజలు ఓట్లు వేశారని శర్మ పేర్కొన్నారు. 'జిల్లా స్థాయిలో అభివృద్ధికి అభ్యర్థులను ఎన్నుకోవడంలో ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి స్థానిక ఎన్నికలలో ఓటు వేయమని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మేము అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. కానీ చివరికి ప్రజలు చేయవలసినది ఓటు వేయడం' అని ఆయన తెలిపారు. చదవండి: (పార్కింగ్ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం) -
కేరళ కోడలు
కేరళలో డిసెంబర్ 10న స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి వార్డుల్లో జరుగుతున్న హోరాహోరీలో ఒక అస్సాం మహిళ న్యూస్ క్రియేట్ చేస్తోంది. ఆరేళ్ల క్రితం మలయాళ భర్తను పెళ్లి చేసుకుని కేరళకు చేరుకున్న ‘మున్మి షాజీ’ ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా వార్డులో పోటీ చేస్తోంది. చక్కగా మలయాళం మాట్లాడుతున్న ఈ అస్సామీని కేరళీయులు ఆదరిస్తున్నారు. ‘నేను మీ కోడలిని’ అంటే సరే అంటున్నారు. నటుడు సురేష్ గోపి ఆమెను చూసి సంతోషించి ఒక ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. కేరళలోని కన్నూరు జిల్లా ఇరిట్టీ మునిసిపాలిటీ ఇప్పుడు అక్కడ వార్తల్లో ఉంది. ఆ మునిసిపాలిటీలోని వికాస్ నగర్ వార్డులో ఒక అస్సాం మహిళ కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉండటమే దీనికి కారణం. అవతల వైపు ఉన్నది సిపిఎంకు చెందిన తల పండిన నాయకుడు. ఆయనప్పటికీ ‘మున్మి షాజీ’ అనే ఆ మహిళ వెరవక బీజేపీ తరపున నిలబడింది. మున్మిది అస్సాం. భర్త షాజి అక్కడ పని చేస్తూ ఉండగా ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకొని కేరళ వచ్చేసింది. మరి అస్సాం ముఖం చూళ్లేదు. బీజేపీ అభిమాని అయిన షాజీ ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భార్యను రంగంలోకి దించాడు. స్థానికులు పాల్గొనే ఈ ఎన్నికలలో ‘నాన్ లోకల్’ అయిన మున్మి రంగంలో దిగడం అందరినీ ఆకర్షించింది. ‘నేను మీ కోడలిని’ అంటూ ఇంటింటికి తిరుగుతున్న మున్మికి మెల్లగా ఆదరణ మొదలైంది. మున్మి మలయాళం నేర్చుకుని అస్సామీ యాసతో అయితేనేమి బాగా మాట్లాడుతోంది. న్యూస్లో వచ్చిన ఈమె విశేషాలు బీజేపీ ఎంపి, నటుడు అయిన సురేశ్ గోపిని ఆకర్షించాయి. ఆమె గురించి తెలుసుకుంటే భర్యాభర్తలు ఇద్దరూ చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతారని తెలిసింది. ‘ఆమెకు నేను ఇల్లు కట్టిస్తాను’ అని సురేశ్ గోపి ట్వీట్ చేశారు. సురేశ్ గోపి గతంలో ఇలా చాలామందికి సాయం చేశారు కనుక అస్సాం నుంచి వచ్చిన అభ్యర్థికి కేరళలో చెదరని నీడ దొరికినట్టే. -
స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు: జేసీ
అనంతపురం క్రైం : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం అనంతపురంలోని డీపీవోలో గన్మెన్ల కోసం ఎస్పీ బి.సత్యయేసు బాబును కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని, అయితే ఎస్ఈసీపదవీ కాలం వచ్చే ఏడాది మార్చికి అయిపోతుందని, కానీ సీఎం వైఎస్ జగన్ పాలన మరో మూడేళ్లు ఉంటుందన్నారు. సీఎం వైఎస్ జగన్, ఆయన మంత్రులు, అనుచరులు ఎన్నికలపై కోర్టుకెళ్తారన్నారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు రాజకీయ రంగు పులమొద్దని జేసీ అన్నారు. -
బల్దియా పోరు: గెలుపు గుర్రాల కోసం భారీ కసరత్తు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి అంకమూ,కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం ముగియనుంది. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయని వారందరూ వేయనుండటంతో చివరి రోజు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల నుంచే కాకుండా ఇండిపెండెంట్లు సైతం భారీగా నామినేషన్లు వేయనున్నారు. పార్టీలు ప్రకటించిన జాబితాల్లో పేర్లు లేనివారు సైతం నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో ఆయా పార్టీల్లో చివరికి ఏం జరగనుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒక పార్టీలో టికెట్ రాకపోతే మరో పార్టీనుంచి పొందేందుకు సిద్ధమైన వారు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ఈనేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారినామినేషన్లకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వడం, ఊహించని విధంగా తక్కువ వ్యవధిలో పోలింగ్ తేదీ ప్రకటన వెలువడటంతోనేతలంతా హడావుడిలో మునిగారు. టీఆర్ఎస్లో కంటే ఇతర పార్టీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు సమయం ఉండటంతో చాలామందిలో ఆందోళన నెలకొంది. సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు భారీ కసరత్తు చేశాయి. పార్టీ శ్రేణులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల్లో టికెట్ల కేటాయింపుపై చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వివిధ ఆరోపణలున్న సిట్టింగ్లను మళ్లీ బరిలో దింపే విషయంలో అని పార్టీలూ తర్జనభర్జన పడ్డాయి. చివరి క్షణం వరకు సమర్థుల కోసం వేచి చూశాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు కొనసాగింది. నోటిఫికేషన్ విడుదలైన రోజే 105 మందితో తొలి జాబితా ప్రకటించి సగానికి పైగా సిట్టింగ్లకు అవకాశం కల్పించింది. చదవండి: అల రాజకీయ ప్రయాణంలో.. గురువారం మధ్యాహ్నానికి రెండో జాబితాలో 20 మందికి సీట్లు ఇచ్చారు. మిగిలిన 25 డివిజన్ల కోసం మాత్రం రాత్రి వరకు కసరత్తు చేసింది. కొంత మంది సిట్టింగ్లకు సైతం మొండిచేయి చూపించింది. ముఖ్యంగా బల్దియా పీఠం చేజారకుండా ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని అడ్డుకునేందుకు సమర్ధులైన సిట్టింగ్లతోపాటు మెరికల్లాంటి కొత్త ముఖాలను మాత్రమే బరిలో దింపింది. మజ్లిస్ పార్టీతో దోస్తీ ఉన్నప్పటికీ రాజీ పడకుండా పాతబస్తీ స్థానాల్లో సైతం అభ్యర్థులను పోటీకి పెట్టింది. సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ‘మీట్ ది ప్రెస్’లో ఈసారి కనీసం పది స్థానాల్లో మజ్లిస్ను ఓడించి తమ ఖాతాలో వేసుకుంటామని ప్రకటించడం పోటీ తీవ్రతను బహిర్గత పరుస్తోంది. చదవండి: ఎలాంటి తెలంగాణ కావాలో తేల్చుకోండి వ్యూహాత్మకంగా బీజేపీ బల్దియా పీఠం కోసం బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించింది. ప్రతి డివిజన్ను సీరియస్గా తీసుకొని అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. పార్టీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి వలసలు సాగుతున్నప్పటికీ కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా పార్టీని నమ్ముకున్న వారిలోనే సమర్థులు, మెరికల్లాంటి వారిని ఎంపిక కోసం రోజంతా కసరత్తు చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన రోజే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ మిగిలిన డివిజన్ల అభ్యర్థిత్వాల కోసం రోజంతా దరఖాస్తులను వడబోసి రాత్రి పదకొండు గంటల వరకు 52 మంది అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. చివరకు పార్టీ టికెట్ల కోసం ఆశావాహులు ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేసింది. చివరకు అందరూ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్..సీరియస్ కాంగ్రెస్ పార్టీ బల్దియా ఎన్నికలను సీరియస్గా తీసుకొని అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. గాంధీభవన్లో ఎంపిక కోసం రోజంతా ఆశావహుల దరఖాస్తుల్ని వడబోసి సమర్ధతను పరిశీలించి ఆచితూచి నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్నింటా సమర్ధతను పరిశీలించింది. మొదటి రోజే రెండు విడతలుగా 45 మందితో కూడిన జాబితాను ఖరారు చేయగా, గురువారం మొత్తం 36 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గెలుపు గుర్రాల కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించే «ధోరణి కాంగ్రెస్లో వ్యక్తమైంది. మజ్లిస్..సిట్టింగ్లు సైతం ఔట్ పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ కొందరు సిట్టింగ్లను సైతం పక్కకు పెట్టింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉన్న స్థానాలు చేజారకుండా జనంలో మంచి పేరులేని సిట్టింగ్ల స్థానంలో అభ్యర్థిత్వాలను మార్చివేసింది. అధికారికంగా జాబితా ప్రకటించనప్పటికీ మెజార్టీ సిట్టింగ్లతో పాటు కొత్తవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ పోటీతో మైనార్టీ ఓట్లు చీలి కమలనాథులు గట్టెక్కకుండా బలమైన స్థానాల్లోనే పోటీ చేసేలా ప్రణాళిక రూపొందించింది. అధికార టీఆర్ఎస్లోనూ ఇక ప్రచార పర్వం.. నామినేషన్ల అంకం పూర్తయ్యాక ప్రచారానికి మిగిలింది వారం రోజులే కావడంతో ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితి. ప్రచారంలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు, లోపాయికారీ ఒప్పందాలు, ఇతరత్రా కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. అన్ని పార్టీల్లోనూ హేమాహేమీల ప్రచార యాత్రలూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ, స్వతంత్రులూ సర్వసన్నాహకాల్లో మునిగారు. ఓట్ల వేట కోసం ఇంటింటి ప్రచారాలు, సోషల్మీడియా వేదికగానే కాక ఇతరత్రా మార్గాలూ యోచిస్తున్నారు. ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించాలని భావిస్తున్నవారితోపాటు గుంభనంగా చేయాలని భావిస్తున్నవారూ ఉన్నారు. ఇక అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ఆయుధంగా చేసుకోనుండగా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. రెండో రోజు 608 నామినేషన్లు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల రెండోరోజైన గురువారం 522 మంది అభ్యర్థులు 608 నామినేషన్లను దాఖలు చేశారు. మంచి రోజు కావడంతో ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 537 మంది అభ్యర్థులు 628 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఎం నుండి నలుగురు, కాంగ్రెస్ నుండి 68 మంది, ఎంఐఎం నుండి 27 మంది, టీఆర్ఎస్ నుండి 195 మంది, టీడీపీ నుండి 47 మంది, వైఎస్సార్సీపీ నుండి ఒకరు, గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు
గుడివాడ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ప్రజలను చంపే ప్రయత్నం చేయవద్దని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ హైదరాబాద్లో కూర్చుని ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారని చెప్పారు. ఒక్క పోలీస్శాఖలోనే 12 వేల మంది కరోనా బారిన పడ్డారని, ఎన్నికల విధుల్లో పాల్గొనే రెవెన్యూ, విద్యాశాఖలో వేల మందికి వైరస్ సోకిందన్నారు. వీరిలో చాలా మంది అనారోగ్య సమస్యలతో విధులకు దూరంగా ఉన్నారని తెలిపారు. బ్యాలెట్తో మరింత ముప్పు..: వచ్చే ఏడాది మార్చిలో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను తప్పుడు మార్గంలో నిర్వహించి ఉనికి చాటుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీల ముసుగులో ఉంటున్న నిమ్మగడ్డ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చెబుతున్నట్లుగా బ్యాలెట్ విధానంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో రెండు మూడు కేసులు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన నిమ్మగడ్డ ప్రస్తుతం వెయ్యి నుంచి 1,500 వరకు కేసులు నమోదవుతుంటే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరని, దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పామని నాని తెలిపారు. -
‘నిమ్మగడ్డకు ఆ హోదాలో ఉండే హక్కు లేదు’
సాక్షి, విశాఖపట్నం: స్వామిజీ కూడా రాజకీయ రంగు పులుముతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ జరిగిన శారదపీఠం స్వామిజీ పుట్టిన రోజు వేడుకల్లో బుధవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనుల్లో స్వామిజీ భక్తిభావం ఎక్కువగా తీసుకువచ్చారని, భక్తి వల్లే సమాజంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునేది స్వామిజీలే అన్నారు. అలాంటి వారిని రాజాకీయాల్లోకి లాగొద్దన్నారు. శారదా పీఠం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఎట్టినా విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గల్లీ రాజకీయాల కోసం రాజ్యాంగ పదవిని తాకట్టు పెట్టోద్దని హితవు మంత్రి పలికారు. ఇసుక అక్రమాల్ని గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అదే నిమ్మగడ్డ తాపత్రయ: మంత్రి ఆదిమూలపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల కమిషనర్కు ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న విషయం తెలియదా అని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ తన పదవి ముగుస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు పెట్టాలన్నది నిమ్మగడ్డ తాపత్రయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల రక్షణ పట్టదా అని, సీఎస్ ఇచ్చిన నివేదికను నిమ్మగడ్డ పరిగణలోకి తీసుకోవాలి అన్నారు. ఎవరికో ప్రయోజనం చేయాలనుకునే నిమ్మగడ్డకు కమిషనర్ హోదాలో కొనసాగే నైతిక హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు. -
రాష్ట్రంలో దురదృష్టకర పరిణామాలు..
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన రాజ్యాంగ వ్యవస్థకు అధిపతి అని లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం అభిప్రాయం తీసుకుని సమన్వయంతో వెళ్లాల్సిన బాధ్యత నిమ్మగడ్డపై ఉందన్నారు. ఎన్నకలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. మొన్నేమో ఎన్నికలు వాయిదా వేయాలని, ఇవాళేమో ఎన్నికలు పెట్టాలని తాపత్రయం చూపిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ తీరు చూస్తుంటే ఆయనను వెనకుండి తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. గతంలో హఠాత్తుగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేశారని, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెట్టాలి అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్న అనంతరం, కలెక్టర్ల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కానీ నిమ్మగడ్డ ఇష్టానుసారం వ్యవహరించడం చట్ట వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరైనది కాదని, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తే తప్పు అవుతుందన్నారు. న్యాయస్థానాలు కూడా దీనిని ఖండిస్తాయన్నారు. ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఎన్నికలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్నికలను చూసి పారిపోవలసిన కర్మ తమకు పట్టలేదన్నారు. చంద్రబాబు చెప్పినట్టు ఎలక్షన్ కమిషనర్ ఆడటం చాలా దురదృష్టకరమైన పరిణామంగా తాము భావిస్తున్నామని, ఇది సరైన విధానం కాదని అంబటి వ్యాఖ్యానించారు. -
స్థానిక ఎన్నికలు: రమేష్కు తొందరెందుకు?
సాక్షి, తాడేపల్లి : ఒక ప్రభుత్వంగా ప్రజలందరి బాధ్యత తమపై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దంటున్నామని.. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అన్నది అందరికీ తెలిసిందేనని, 90 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒకటీ రెండు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, వేల కేసులు ఉన్నపుడు ఎన్నికలు ఎలా పెడతారు?. అసలు ఎన్నికల నిర్వహణకు ప్రాతిపదిక ఏమిటి?. ఒక పక్క చీఫ్ సెక్రటరీ ఎన్నికలు నిర్వహించలేము అని అంటుంటే.. రమేష్ కుమార్ గారికి తొందరెందుకు?. (నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని) కోవిడ్ అంతా తగ్గిన తర్వాత ఎన్నికలు జరగాలని మేము ప్రభుత్వం తరపున భావిస్తున్నాం. ఆ రోజే ఎన్నికలు పూర్తి చేసి ఉంటే సరిపోయేది. వాయిదా వెనుక ఉద్దేశాలు, నిమ్మగడ్డ వ్యవహార శైలీ ఆ తర్వాత మాకు అవగతం అయ్యింది. ఒక ప్రభుత్వంగా ప్రజలు, ఉద్యోగుల బాధ్యత మాపై ఉంది. ఒక రాజకీయ పార్టీని ఫ్యాక్షనిస్టు పార్టీ అని మాట్లాడిన వ్యక్తి నిష్పక్షపాతంగా ఉంటాడని మేము భావించడం లేద’’ని పేర్కొన్నారు. (తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్) -
‘గ్రేటర్’వ్యూహంపై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
‘గ్రేటర్’నగారా మోగడంతో టీఆర్ఎస్ తమ శ్రేణులను కదనరంగానికి కార్యోన్ముఖుల్ని చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఇప్పటికే ఖరారు చేసిన టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మోహరించడంపై దృష్టి సారించింది. ‘మినీ అసెంబ్లీ’ని తలపించే గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ యంత్రాంగానికి బుధవారం మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ భవన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సందేశం పంపించారు. అభ్యర్థులు, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం, విపక్ష పార్టీల ఎత్తుగడలు, సభలు, సమావేశాలు, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. – సాక్షి, హైదరాబాద్ నేడు అభ్యర్థుల తొలి జాబితా? పార్టీ కార్పొరేటర్ల పనితీరుపై పలు దఫాలుగా అంతర్గత సర్వేలు నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు పూర్తి చేసింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్లు యధాతథంగా కొనసాగుతుండటంతో అభ్యర్థుల పనితీరు, విపక్ష పార్టీల అభ్యర్థులు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని గెలుపు గుర్రాలను గుర్తించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ‘వార్ రూమ్’గతంలోనే మంతనాలు జరిపి అభిప్రాయాన్ని సేకరించింది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుండటం, నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో బుధవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. చదవండి: ట్రెండ్ చేంజ్.. కాదేదీ గుర్తుకు అనర్హం..! సుమారు 85 శాతం మంది సిట్టింగ్ కార్పోరేటర్లకే మళ్లీ టికెట్ దక్కే అవకాశముందనే వార్తల నేపథ్యంలో... 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల తరహాలో అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. డివిజన్ల వారీగా ఆశావహులు, టికెట్ దక్కకుంటే పార్టీని వీడే అవకాశమున్న వారి జాబితాను కూడా ఇప్పటికే సిద్దం చేశారు. వీరు పార్టీని వీడకుండా చూడాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేతో పాటు డివిజన్ ఇన్చార్జిలకు అప్పగిస్తారు. అవసరమైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్లో లొల్లి, అలిగిన అంజన్కుమార్?! డివిజన్ల వారీగా ఇన్చార్జిలకు బాధ్యతలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం తదితరాలపై ఇప్పటికే టీఆర్ఎస్ అంతర్గతంగా మదింపు పూర్తి చేసింది. పార్టీ, ప్రభుత్వం కోణంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడే కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 9న జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు భేటీలో ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుకు ఎన్నికల బాధ్యతను అప్పగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా జీహెచ్ఎంసీ డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బీజేపీలో ముసలం.. ప్లాన్ మార్చిన కేసీఆర్ బుధవారం ఎవరెక్కడ ఇన్చార్జిగా ఉంటారో వెల్లడిస్తారు. ఇన్చార్జిలుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పం చ్లు, సహకార సంఘాల చైర్మన్లతో పాటు చురుకైన కార్యకర్తలతో కలిసి తమ కు కేటాయించిన డివిజన్లో ప్రచారం చేస్తారు. ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో చురుకైన నాయకులు, కార్య కర్తలను గుర్తించి ప్రచారానికి రావాలని ఆదేశించారు. వీరి వసతి సదుపాయాల కోసం కూడా ఆయా డివిజన్ పరిధిలో ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించారు. -
నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కోవిడ్ కేసుల తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమని విమర్శించారు. హైదరాబాద్లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ అని సెటైర్ వేశారు. జూమ్ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా, ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చదవండి: (ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ప్రజాహితం కాదు: ఏపీ సీఎస్) -
ఆశావహులకు బీజేపీ ఎర.. కాంగ్రెస్ దూకుడు!
సాక్షి, కూకట్పల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పోటీపడే నాయకుల్లో టెన్షన్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కూకట్పల్లి నియోజకవర్గంలో రెండు, మూడు చోట్ల తప్ప మిగిలిన వాటిల్లో పాతవారికే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. డైలమాలో ఉన్న ఆ సీట్లను కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే కొత్త కొత్త నాయకులు పార్టీలో చేరుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలాబలాలను బేరీజు వేసుకొని బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుండగా కొన్ని డివిజన్లలో ఆర్థికబలం ఉన్నవారు, ముందుస్తుగా అగ్రనాయకులను సంప్రదించి మద్దతు కోసం యత్నాలు చేస్తున్నారు. చదవండి:బల్దియా పోరు; అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త! కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు సీట్లలో ఆర్థికంగా, ఉన్న నలుగురు అభ్యర్థులు ఇప్పటికే బీజేపీ అధిష్ఠానాన్ని సంప్రదించగా వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. కేపీహెచ్బీ డివిజన్లో పోటీ చేసే అభ్యర్థి, బలహీనంగా ఉన్న అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలాజీనగర్ డివిజన్లో కూడా పవన్ కల్యాణ్ సన్నిహితంగా ఉండే ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడి మేనకోడలు పేరును అధిష్ఠానం వద్ద ప్రతిపాదించగా ఆమె ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బోయినపల్లిలో మాజీ వైస్ చైర్మన్ తనయుడిని బీజేపీ నుంచి నిలబెట్టేందుకు అధిష్ఠానం ఆలోచిస్తోంది. టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడిగా పనిచేసిన ఆయనను నిరాశ పరచడంతో బీజేపీ నుంచి బరిలో దింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కూకట్పల్లి డివిజన్లో కూడా టీఆర్ఎస్ నగర పార్టీ మాజీ అధ్యక్షుడు సుదర్శన్రావు బంధువులైన ఓ వ్యక్తికి టికెట్ కేటాయించేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లిలో ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి ఆశలు పెట్టుకున్న నాయకులు, కొత్త చుట్టాలు రంగంలోకి రావటంతో డోలాయమానంలో పడిపోయారు. కొన్ని చోట్ల అసంతృప్తి సెగలు రేగే అవకాశం కూడా కన్పిస్తోంది. మరికొన్ని చోట్ల స్వతంత్య్ర అభ్యర్థులుగా కూడా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారు. జేపీ టికెట్ల విషయంలో కొత్త, పాత నాయకుల మధ్య మనస్పర్థాలు వచ్చే అవకాశం పుష్కలంగా కన్పిస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ప్రతి నాయకుడు మొదటగా డివిజన్కు పోటీ చేయాలని సూచించటంతో ఆ పార్టీలో పోటీ చేసేందుకు ముందుకురాని నాయకులే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఎంపీ పట్టుపట్టి ఓ నలుగురైదుగురిని డివిజన్లు కేటాయించినా వారు ఇప్పటికీ కార్యాచరణ మొదలు పెట్టకపోవటం గమనార్హం. కాంగ్రెస్ టికెట్ ఆశించే వారిలో అంత పలుకుబడి లేకపోవడంతో ఈ సారీ టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలను నియమించింది. అదేవిధంగా ఎన్నికల కమిటీలను సైతం ప్రకటించింది. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఐదుగురు చొప్పున, రెండు పార్లమెంట్లకు ఆరుగురు సభ్యుల చొప్పున ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ ప్రచార కమిటీని సైతం ప్రకటించింది. బుధవారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించి గురువారం అభ్యర్థులకు బీ ఫామ్ అందజేయనుంది. 21న కాంగ్రెస్ జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జి, ఎంపీ మాణిక్యం ఠాకూర్ విడుదల చేయనున్నారు. -
బల్దియా పోరు; అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ..ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధికారులను బాధ్యులుగా నియమించారు. ప్రధాన కమిషనరేట్లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్ చౌహాన్ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. బందోబస్తు సంబంధిత చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు: అధికారుల కొరడా ఎలక్షన్ సెల్ రెడీ! ‘గ్రేటర్’ ఎన్నికల సైరన్ మోగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో భాగంగా నగరంలోని పరిస్థితులు బేరీజు వేడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కమిషనరేట్లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్ చౌహాన్ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. ఎన్నికల బందోబస్తుకు అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: ‘గ్రేటర్’ వార్ 1న ► నగరంలోని అయిదు జోన్లలో ఎన్నికల విధి నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలను ఏర్పాటు చేయడం తదితర విధులు కూడా ఎన్నికల సెల్ నిర్వహిస్తుంది. డీజీపీ కార్యాలయంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఏర్పాటైన ఎలక్షన్ సెల్కు సంబంధించిన హాట్లైన్ దీనికి అనుసంధానించి ఉంటాయి. ► జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధులకు సంబంధించిన పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం ఈ సెల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ అమలు, ప్రవర్తన నియమావళి తదితరాలకు సంబంధించి కొత్వాల్ అంజనీకుమార్ అన్ని స్థాయిన అధికారులను సమాయత్తం చేస్తున్నారు. దీనికోసం ఆయన మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరాయ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ►ఇందులో గత ఎన్నికల్లో జరిగిన ఉదంతాలు, ఆ కేసుల స్థితిగతులు, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలోని లైసెన్డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారంతా వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ►స్థానిక పోలీసుస్టేషన్లు లేదా అధీకృత ఆయుధ డీలర్ల దగ్గర డిపాజిట్ చేయాలి. కౌంటింగ్ తదితర ప్రక్రియలు పూర్తయ్యాక మాత్రమే తమ ఆయుధాలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం సైతం ఊపందుకోనుంది. ఈ ప్రక్రియలో భాగంగా సభలు, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని భావించే రాజకీయ పార్టీలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ► కోవిడ్ నేపథ్యంలో బహిరంగ సభల్ని ఎస్ఈసీ నిషేధించింది. మిగిలినవీ పరిమిత సంఖ్యలో, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరగనున్నాయి. దీనికోసం ఆయా అభ్యర్థులు, పార్టీలు సంబంధిత జోనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని ఈ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అనువుగా నిర్ణీత గడువుకు ముందే డీసీపీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ►రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం ఏర్పాటు చేసే సంచార వాహనాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సైబరాబాద్.. రాచకొండ పరిధిలోనూ.. బల్దియా ఎన్నికలకు నగారా మోగడంతో సైబరాబాద్, రాచకొండ పోలీసులు భద్రతా విధుల్లో తలమునకలయ్యారు. ఆయా కమిషనరేట్లలో ఉన్న 66 డివిజన్లలో అభ్యర్థుల నామినేషన్ దగ్గరి నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు దాదాపు 14,500 మందికిపైగా పోలీసు సిబ్బంది సేవలను వినియోగించనున్నారు. సైబరాబాద్లో 38 డివిజన్లు, రాచకొండలో 28 డివిజన్లు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసి ఫ్లయింగ్ స్క్వాడ్లతో ఇటు నగదు, అటు మద్యం సరఫరాపై ప్రధానంగా నిఘా వేసి ఉంచుతామని ఇరు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు మహేష్ భగవత్, వీసీ సజ్జనార్ తెలిపారు. పక్కా ప్రణాళికతో ముందుకు.. ఎన్నికల వంటి కీలక ఘట్టాల్లో ఎంత పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామో.. అంత సజావుగా ఆ ఘట్టాలను పూర్తి చేసి విజయం సాధించగలం. సిటీ పోలీసులకు ఎన్నికల నిర్వహణలో మంచి అనుభవం ఉంది. 2018, 2019ల్లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్ని సజావుగా పూర్తి చేసి ఈసీ మన్ననలు పొందాం. మరోసారి నాటి విధివిధానాలను మననం చేసుకోవాలి. సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పు చేర్పులతో కొత్త పంథాలో ముందుకు వెళ్లాలి. – పోలీసు అధికారులతో కొత్వాల్ అంజనీకుమార్ కోడ్ కూసింది గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఇక కొత్త పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్ కానున్నాయి. ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్న పనుల్ని మాత్రం యధాతథంగా కొనసాగించనున్నారు. అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకుని తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. కోడ్ను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త! -
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు సీఎస్ నీలంసాహ్ని లేఖ
-
గుజరాత్లో వాయిదా .. రాష్ట్రంలో బేఖాతరు
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేసులు కొంత తగ్గుముఖం పట్టినా ఢిల్లీ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు. గుజరాత్తో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్లో ప్రస్తుతం రోజుకు వెయ్యిలోపు కేసులు నమోదవుతుంటే, మన రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు మూడు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇది పట్టించుకోకుండా స్థానిక ఎన్నికల విషయంలో మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవలంభిస్తున్న వైఖరిపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అప్పుడు వాయిదావేసి ఇప్పుడు పట్టించుకోకుండా.. గుజరాత్లో 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలు, 55 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రస్తుత సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంతో ముగుస్తోంది. అయినప్పటికీ కరోనా వల్ల ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసింది. 20 రోజుల క్రితమే అక్కడి ఎన్నికల కమిషనర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2018 ఆగస్టు 1 నాటికే (రెండేళ్ల మూడు నెలల క్రితమే) గ్రామ పంచాయతీలు, జూలై 5వ తేదీ (ఏడాది నాలుగు నెలల కిత్రమే) నాటికే మండల, జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా చంద్రబాబు, ప్రసుత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హయాంలో ఇన్నాళ్లూ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఇన్చార్జిల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్లు కూడా ముగిశాయి. అయితే కరోనా పేరుచెప్పి నిమ్మగడ్డ అర్ధంతరంగా ఎన్నికలు వాయిదా వేశారు. రోజుకు 2, 3కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేశారు. అలాంటిది ఇప్పుడు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు కమిషనర్ ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వలస వెళ్లిన వారితో ముప్పు! రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగితే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లు గ్రామాలకు వస్తే, ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కరోనా విజృంభణకు అవకాశాలు ఉంటాయనే ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు తిరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఒకట్రెండు ఓట్లపై కూడా గెలుపోటములు ఆధారపడి ఉండే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు.. తమ ఓటర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా వారిని పోలింగ్ రోజుకల్లా రప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే జరిగితే ఉత్పమన్నమయ్యే పరిస్థితులను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
కరోనా తగ్గే వరకు స్థానిక ఎన్నికలు వద్దు
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా అవతరిస్తున్నందున తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
ఇప్పట్లో ఎన్నికలు కష్టం
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో మార్చిలో రాష్ట్రంలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా తాజాగా 26,622 యాక్టివ్ కేసులున్నాయని మొత్తం 8,14,774 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం వైరస్ నియంత్రణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రోజుకు సగటున 20 వరకు మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను ఆయన కార్యాలయంలో కలసి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని, విధి నిర్వహణలో ఉన్న 11 వేల మందికి పైగా పోలీస్లకు కోవిడ్ సోకిందని సీఎస్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోవిడ్ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఎన్నికల కమిషన్కు తెలియచేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని తాజాగా నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో దాదాపు అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ముందు ఎస్ఈసీ తేల్చి చెప్పాకే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని పార్టీలు పేర్కొన్నాయి. టీడీపీ మినహా ఎవరూ ఈ సమయంలో ఎన్నికలకు మొగ్గు చూపలేదు. ఉనికిలో లేని పార్టీలతో... గుర్తింపు పొందిన పార్టీలంటూ రాష్ట్రంలో ఏమాత్రం ఉనికిలో లేని రాజకీయ పక్షాలను పిలిచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ సమావేశాలను నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భేటీకి ఆహ్వానించిన 19 పార్టీల్లో 10 పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్కో పార్టీ ప్రతినిధితో విడివిడిగా ఏకాంతంగా సమావేశాన్ని నిర్వహించిన ఎస్ఈసీ వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడేందుకు అవకాశం ఉన్న స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు నవంబర్లో కరోనా రెండో దశ వ్యాప్తి మొదలు కానుందనే భయాందోళనలున్నాయి. ఈ సమయంలో తక్షణమే ఎన్నికలంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఏకపక్షమే.. సంప్రదాయం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి సంప్రదింపుల అనంతరం ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొక్కుబడి తంతుగా పార్టీలతో ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకున్నాక అవసరమైన పక్షంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాల్సి ఉండగా నిమ్మగడ్డ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అంతకుముందు స్థానిక ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసే సమయంలో కూడా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈసారి కూడా ఆయన అదే ధోరణిలో వ్యవహరించారు. చదవండి: అది చంద్రబాబు.. నిమ్మగడ్డ జాయింట్ కమిషన్ -
ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమే: బొత్స
సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత ఉండటంతో ఎన్నికల విషమమై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ర్టంలో కరోనా కేసులు లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారని ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం అప్పుడు ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరింది. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి టీడీపీ నాయకులను కలిసిన దశలో ఎలా నమ్ముతామంటూ ప్రశ్నించారు. ఓ వ్యక్తి నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు వెనక్కి వెళ్లాయి. దీనిపై ఎవరు మాట్లాడరెందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. (రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించే పరిస్థితి లేదు: నీలం సాహ్ని ) -
ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం తగదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ)తో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీ ముగిసింది. మొత్తం 19 పార్టీలకు గాను 11 పార్టీలు హాజరయ్యాయి. ఇక ఎస్ఈసీ సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరు కాలేదు. ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం కుదరదని పార్టీలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. టీడీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించాయి. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ‘గతంలో కరోనా లేకపోయినా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సమావేశాలు పెట్టడం సరికాదు. నిమ్మగడ్డ రమేష్కుమార్ సమావేశాల నిర్వహణతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టుంది. ప్రైవేట్ హోటల్లో బీజేపీ-టీడీపీ నేతలను కలిసినప్పుడే నమ్మకం కోల్పోయారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు’ అని తెలిపారు. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం) నవతరం పార్టీ నేతల అరెస్ట్ ఇక ఈసీ సమావేశానికి ఆహ్వానించక పోవడంపై నవతరం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డకు వినతిపత్రం ఇచ్చేందుకు నవతరం పార్టీ నేతలు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. -
స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు అభిప్రాయ సేకరణ
సాక్షి, అమరావతి: కరోనా పేరిట వాయిదా వేయడంతో మధ్యలో నిలిచిపోయిన స్థానిక ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ బుధవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మొత్తం 19 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగిన పార్టీలైన అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, అలాగే టీఆర్ఎస్, దేశంలో జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన పార్టీలుగా పేర్కొనే బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలుగా ఉన్న ఏఐఏడీఎంకే, ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం, ముస్లింలీగ్, జనతాదళ్ (ఎస్), జనతాదళ్ –యూ, సమాజ్వాదీ, ఆర్ఎల్డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజర్వుడు చిహ్నం కలిగిన రిజిస్టర్డ్ పార్టీగా జనసేనను కూడా ఆహ్వానించారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరితో వేర్వేరుగా బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి విజయవాడ బందర్ రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగే అభిప్రాయ సేకరణకు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు చొప్పున మాత్రమే హాజరు కావాలని సూచించారు. ఒక్కొక్కరితో ఎన్నికల కమిషనర్ పది నిమిషాల చొప్పున వేర్వేరుగా సమావేశమవుతారని కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బీఎïస్పీ ప్రతినిధితో మొదలుపెట్టి, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతినిధుల అభిప్రాయాలను వరుసగా తెలుసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్సీపీ.. చివరగా జనసేన పార్టీ అభిప్రాయాలు తీసుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోని రాష్ట్ర ఎన్నికల కమిషన్.. తిరిగి నిర్వహించే అంశంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోకముందే రాజకీయ పార్టీలతో సమావేశం కానుండటం చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో నేడు సీఎస్ భేటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని కోరుతూ సీఎస్కు ఎన్నికల కమిషనర్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీ స్థానాలు 7,329 మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. 10,047 ఎంపీటీసీ స్థానాలకు 355 చోట్ల వివిధ కారణాలతో ప్రక్రియ మొదలు కాకముందే ఎన్నికలు నిలిచిపోయాయి. 2,363 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 7,329 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 8 చోట్ల వివిధ కారణాలతో నోటిఫికేషన్కు ముందే ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి. 526 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. -
స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు
గుడ్లవల్లేరు (గుడివాడ): రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని మంత్రి కొడాలి నాని తెలిపారు. రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్కు ప్రత్యేక హక్కులేమీ ఇవ్వలేదన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం కృష్ణా జిల్లా వేమవరంలోని కొండలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తాను చెప్పిందే వేదమనే దృక్పథంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను ఆపేస్తే ఎన్నికలు ఆగిపోతాయని ఆయన అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నుంచి ఆరు నెలల్లో ఆయన పదవీ విరమణ చేసి హైదరాబాద్లోని ఇంటికి వెళ్లిపోతారని.. అప్పుడు నచ్చినవారికి చెక్కభజన చేసుకోవచ్చన్నారు. కరోనా విపత్తు సమయంలో వెయ్యి, 1,500 మందిని ఒక్కో బూత్కు కేటాయించకుండా కుదించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం
సాక్షి, విశాఖపట్నం: భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీ, టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎటువంటి కక్షలు లేవన్నారు. విద్యాసంస్థలు ఉన్నవారు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నా ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమకూ విద్యాసంస్థలు ఉన్నాయని.. అంతమాత్రాన తాము ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నామా అని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారని గీతం యాజమాన్యానికి చెందిన వ్యక్తులు, టీడీపీ నేతలు మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గీతం యాజమాన్యానికి సంబంధించిన సర్వేయర్లు, ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఉమ్మడిగా, పూర్తిగా సర్వే చేసి గీతం కాలేజీ కాంపౌండ్ వాల్ పరిధిలో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు నోటిఫై చేశారన్నారు. గీతం ఆధీనంలో మరో 18 ఎకరాలు కాంపౌండ్కు ఆనుకుని ఉందని, మొత్తం 40 ఎకరాల భూమి ఆక్రమించారని వివరించారు. 5 నెలల క్రితమే వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశముందనే విషయం వారికి తెలుసన్నారు. దీనిపై గీతం యాజమాన్యానికి పూర్తి సమాచారం ఉందన్నారు. నోటీసులు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆక్రమించిన స్థలాన్ని తమకు కేటాయించాలని 2014లో గీతం యాజమాన్యం అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, చంద్రబాబుకు భరత్పై, గీతం సంస్థలపై ప్రేమ ఉంటే గడచిన ఐదేళ్లలోనే రెగ్యులరైజ్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడమే తప్పు. తప్పును సరిదిద్దుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడం, ముందస్తు నోటీసు ఇవ్వలేదు అనడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారెవరైనా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అప్పగించాలి’ అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకే.. ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు కె.కోటపాడు: విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్టు ఆర్డీవో నివేదికలోనే వెల్లడైందని.. అందుకే ప్రభుత్వ యంత్రాంగం ఆక్రమణల తొలగింపునకు పూనుకుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు చెప్పారు. కె.కోటపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇటీవల విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగించినప్పుడు.. తొలుత అధికారులను ఆక్షేపించిన హరి మరుసటి రోజున తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయాన్ని బూడి ప్రస్తావించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను రెవెన్యూ చట్టానికి లోబడి తొలగిస్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ వచ్చాకే ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీ కాలం ముగిసే సమయం సమీపిస్తోందనే ‘స్థానిక’ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. కరోనా కాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం అంత మంచిది కాదని, వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని చెప్పారు. కరోనా ప్రభావం లేనప్పుడు చంద్రబాబు మాటలు విని స్థానిక ఎన్నికలను కావాలనే ఆపి.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు మేలు చేయడం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఎన్నికల కమిషనర్కు మంత్రి హితవు పలికారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజ్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు..
-
‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు..
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. నవంబర్, డిసెంబర్లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన్నారు. దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ( బాబేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు..! ) గతంలోలాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదన్నారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఉందని, వాటితో స్థానిక సంస్థల ఎన్నికలు పోల్చకూడదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. -
అప్పుడలా.. ఇప్పుడిలా!?
రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలైన సమయంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ ముందుకు రాలేదు. ఎవరినీ సంప్రదించకుండా వాయిదా వేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమపడి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించినప్పటికీ ప్రస్తుతం రోజుకు 4 వేల కేసులు నమోదవుతున్నాయి. 31 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళుతూ పోలింగ్కు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాయిదా పడ్డ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈవీఎం మిషన్లతో జరిగే బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను.. బ్యాలెట్ పేపరుతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెట్టి.. కరోనా విపత్కర పరిస్థితుల్లో తిరిగి ఎన్నికల ఆలోచన చేయడం విడ్డూరమే. ఈవీఎం.. బ్యాలెట్కు ఎంతో తేడా ► ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో పోలింగ్ సమయంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకునే వీలుంటుంది. బ్యాలెట్ ఎన్నికలలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు మొదలు పోలింగ్, కౌంటింగ్ వరకు వివిధ దశల్లో ఒక్కో బ్యాలెట్ పేపరు అనేక మంది చేతులు మారే అవకాశం ఉంటుంది. ► ఈ నేపథ్యంలో ఆ పేపరుకు ఏ దశలోనూ శానిటైజ్ చేసే అవకాశం ఉండదు. పైపెచ్చు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోల్చితే గ్రామ, వార్డు స్థాయిలో జరిగే మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇంటింటి ప్రచారం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ► ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియతో పోల్చితే స్థానిక ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అటు ఓటర్లతో పాటు ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మార్చి 15వ తేదీన ఎన్నికలు వాయిదా వేస్తూ.. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నికల రద్దుకు అవకాశమే లేదు ► ఎన్నికలు వాయిదా పడ్డ మార్చి 15వ తేదీ నాటికి.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ తర్వాత మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాల్లో 126 స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,363 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా అభ్యర్థులకు ఎన్నికల్లో గెలిచినట్టు జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. ► గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇచ్చాక, సదరు అభ్యర్థి అధికారికంగా గెలుపొందినట్టు లెక్క. గెలిచిన అభ్యర్థిని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. ► గెలిచిన అభ్యర్థిని ఎన్నికల ట్రిబ్యునల్ ద్వారా లేక అనర్హత వేటు ద్వారా మాత్రమే ఆయా పదవుల నుంచి తొలగించవచ్చు. ► ఏవైనా బలమైన కారణాలు ఉంటే ఒకటి, రెండు చోట్ల ఎన్నికలను రద్దు చేసే అధికారం ఉండొచ్చు కానీ, జెడ్పీటీసీ సభ్యుల్లో 19 శాతం మంది, ఎంపీటీసీ సభ్యుల్లో 23 శాతం మంది గెలిచిన తర్వాత ఆ ఎన్నికలన్నింటినీ మూకుమ్మడిగా రద్దు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉండదు. ► ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఏకగ్రీవమైనవి కాకుండా మిగిలిన చోట్ల ఎన్నికలు రద్దు చేయాలంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్.. పోటీ చేసే అభ్యర్థులందరి అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా ఏ నిర్ణయం తీసుకున్నా, అభ్యర్థులు కోర్టుకు వెళితే న్యాయం వారి వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయి ఆంక్షలు ► రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడినప్పడు దేశంలోనే ఎక్కడా లాక్డౌన్ అమలు కాలేదు. మార్చి 15న ఎన్నికలను వాయిదా వేస్తే.. మార్చి 23వ తేదీ నుంచి దేశంలో లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దేశమంతటా అన్లాక్ కార్యక్రమం కొనసాగుతున్నా, కరోనా కేసులు నమోదవుతున్న కంటైన్మెంట్ జోన్లలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ► అక్టోబర్ 22వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,244 కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ జోన్ల పరిధిలో స్థానిక ఎన్నికలు జరపడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ► రాష్ట్రంలో 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పుడు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసి, ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలంటూ త్వరపడటం గమనార్హం. -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: గౌతమ్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్లో నిర్వహించే పరిస్థితి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి అన్నారు. కోవిడ్ కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందని తెలిపారు. తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం గౌతమ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. నవంబర్ నెలలో కోవిడ్ కేసులు పెరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. -
ఏపీ : అసత్య ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలో గల సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.(చదవండి: వ్యవస్థల మధ్య ఘర్షణ సబబేనా?) -
స్థానిక సంస్థల పాలనపై కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలకశాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది. నిజానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్లో, జూన్ 30న మున్సిపాలిటీలలో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. (ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రభుత్వం.. శ్రీకాకుళంలోని కార్పొరేషన్లో అక్టోబర్ 10 వరకు మాత్రమే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించగా మిగతా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలో డిసెంబర్ 31 వరకు పొడిగించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు నొటిఫికేషన్లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. (పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు) -
ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విప్లవాత్మక సంస్కరణల అమలులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా హైకోర్టు రిటైర్డు జడ్జి వి.కనగరాజ్ను సర్కారు నియమించింది. హైకోర్టు రిటైర్డు జడ్జి పర్యవేక్షణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంవల్ల పోటీచేసే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రశంసించారు. కానీ.. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను కొనసాగించాలని శుక్రవారం హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై వివిధ పార్టీల ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాలు తెలిపారు. టీడీపీకి అనుకూలంగా నిమ్మగడ్డ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించే క్రమంలో నిమ్మగడ్డ రమేశ్కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, వాటికి సంబంధించి పలు ఆధారాలు కూడా ఉన్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. రాజ్యాంగ పదవిని నిర్వహించే వారికి రాజ్యాంగ విధులు తెలిసి ఉండాలనే అంశాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధమే: ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్థూలంగా నిర్ణయం తీసుకుందని.. హైకోర్టు తీర్పులోని పూర్వాపరాలను న్యాయనిపుణులు అధ్యయనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమ పార్టీకి, ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. న్యాయస్థానాలిచ్చే తీర్పుల్లో కొన్ని సందర్భాలలో న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉండటం సహజమని, అలాంటపుడు పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునే రాజ్యాంగ హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్థానంలో ఉండి రమేశ్కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు ఆయన రాసిన లేఖ అందుకు ఓ ఉదాహరణని అభిప్రాయపడ్డారు. పాలనా వ్యవస్థను అదుపుచేయడం సరికాదు: స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. రాజ్యాంగ వ్యవస్థలు హద్దులు పాటించాలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మరో వ్యవస్థ నియంత్రించాలనుకోవడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా పాలనా వ్యవస్థను అదుపు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా నిర్వహించేందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నూతన జవసత్వాలు చేకూర్చడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1993లో సెక్షన్–200కు సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏప్రిల్ 10న ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పదవీకాలం ముగిసింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డు హైకోర్టు జడ్జి వి.కనగరాజ్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా గవర్నర్ నియమిస్తూ గత ఏప్రిల్ 11న ఉత్తర్వులు జారీచేశారు. -
అనుకూల పరిస్థితులు తర్వాతే నిర్ణయం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదాను పొడిగిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించేంతవరకూ వాయిదా కొనసాగుతుందని ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తెలిపారు. కాగా కరోనా వైరస్ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం
సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ హైకోర్టుకు నివేదించారు. తననే లక్ష్యంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసిందన్న నిమ్మగడ్డ ఆరోపణల్లో వాస్తవంలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ఏ చట్టం చేసినా అది కమిషనర్కే వర్తిస్తుందని, అలాంటప్పుడు దానిని ఓ వ్యక్తి లక్ష్యంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్గా చెప్పడానికి వీల్లేదన్నారు. గవర్నర్కు దురుద్దేశాలు అంటగట్టడం, ఆయన వివేచనను ప్రశ్నించడం వంటివి చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యాజ్యం దాఖలు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆయన కౌంటర్లోని ముఖ్యాంశాలు.. ► బాధిత వ్యక్తిగా నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి, ఇదే అంశంపై మిగిలిన వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్ పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదు. ఇటువంటి వ్యాజ్యాలపై సాధారణంగా హైకోర్టు విచారణ చేపట్టదు. ► ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాల పరిమితిని సవరిస్తూ ఏప్రిల్ 10న ప్రభుత్వం జారీచేసిన జీఓ 617 వల్ల ఎన్నికల కమిషనర్గా సర్వీసు నిలిచిపోయిందని నిమ్మగడ్డ రమేశ్ చెబుతున్నారు. వాస్తవానికి ఇది తప్పు. ► ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లోని క్లాజ్ 5 ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల కమిషనర్గా నియమితులైన వ్యక్తి సర్వీసు నిలిచిపోతుంది. అంతే తప్ప జీఓ 617 వల్ల కాదు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చేసే ఏ చట్టమైనా ఎన్నికల కమిషనర్ను ఉద్దేశించే చేయబడుతుంది. కాబట్టి ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకునే ఆర్డినెన్స్ను తీసుకువచ్చిందన్న నిమ్మగడ్డ వాదన అర్థరహితం. ► అలాగే, గవర్నర్కు దురుద్దేశాలు అంటగట్టడానికి వీల్లేదు. ఆయన వివేచనను కూడా ప్రశ్నించజాలరు. ఆ పిటిషన్ మొత్తం కాపీ పేస్టే.. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డకు మద్దతుగా మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లోని 13 పేరాలను కామినేని యథాతథంగా తన పిటిషన్లో వాడారు. నిమ్మగడ్డ ఏప్రిల్ 11న కామినేని ఏప్రిల్ 12న పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బట్టి నిమ్మగడ్డ రమేశ్ తన పిటిషన్ను కామినేని శ్రీనివాస్కు పంపారని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక.. కామినేని తన వృత్తిని మెడికల్ ప్రాక్టీషనర్గా, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీగా పిటిషన్లో పేర్కొన్నారు. ఇది కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే. ఫిర్యాదులు పరిశీలించి విచారణ జరపాలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 54,594 నామినేషన్లు వచ్చాయి. ఈ స్థానాల విషయంలో వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.078 శాతం మాత్రమే. అలాగే, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 15,185 నామినేషన్లు వచ్చాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.092 శాతం మాత్రమేనని జస్టిస్ వి.కనగరాజ్ తన కౌంటర్లో ప్రస్తావించారు. అంతేకాక.. ► ఫిర్యాదులన్నింటినీ కలిపి చూడకుండా, ఆ ఫిర్యాదులు ఏమిటో పరిశీలించి, వాటిపై విచారణ జరిపితేనే వాటిలో ఎంత వాస్తవం ఉందో తెలుస్తుంది. ► మార్చి 15కు ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు, సలహాలు జారీచేయలేదు. అయినప్పటికీ అదేరోజు నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ► దీనిని బట్టి ఎన్నికల కమిషనర్గా ఆయన ఎటువంటి సంప్రదింపుల ప్రక్రియను చేపట్టలేదని అర్థమవుతోంది. కాబట్టి ఆయన నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. ► ఎన్నికల కమిషనర్గా తొలగించేందుకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని నిమ్మగడ్డ చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవంలేదు. ఎన్నికల సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, న్యాయంగా జరపడమే ఈ ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశం. ► ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం నేను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయంలో నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతున్నా. ► వాస్తవానికి ఏ చట్టాన్నైనా తెచ్చే శాసనపరమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీనిని ఎవ్వరూ తప్పుపట్టజాలరు. ఈ విషయంలో పిటిషనర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ► నిమ్మగడ్డ రమేశ్నే ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని సుప్రీంకోర్టు లేదా ఇతర ఏ కోర్టు కూడా ఎక్కడా చెప్పలేదు. ► ఇక వడ్డే శోభనాద్రీశ్వరరావు, గండూరు మహేశ్లు తమ వ్యాజ్యాల్లో నిమ్మగడ్డ రమేశ్ తనకు రక్షణ కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారంటూ ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నోట్ ఫైళ్లు లేవు. ఎవరినీ సంప్రదించక్కర్లేదు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే విషయంలో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరంలేదని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల సంఘం కార్యదర్శితో కూడా మాట్లాడాల్సిన అవసరంలేదని తన రిప్లై కౌంటర్లో పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యమైనదని తెలిపారు. తన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వాధికారులతో సంప్రదించలేదని చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్రెడ్డిలు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు నిమ్మగడ్డ తిరుగు సమాధానాలు (రిప్లై కౌంటర్) ఇచ్చారు. -
నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు
-
పదవీకాలాన్నీ ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదింపు
-
రాజ్యాంగ పదవిలో ఉన్నారు.. రాజకీయం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ స్థానిక ఎన్నికల విషయంలో రాజకీయం చేయడం తగదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అధికారాలే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఆయన విస్మరించకూడదని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని లేక్వ్యూ అతిథిగృహంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డపై నిప్పులు చెరిగారు. మంత్రి ఏమన్నారంటే.. - ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేసే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), ఆరోగ్య శాఖ అధికారులతో కనీసం సంప్రదించలేదు. పద్ధతి ప్రకారం.. కమిషనర్ ఎవరితోనైనా సంప్రదించాలని నిబంధనలున్నాయి. ఇలా చేయకుండా అనధికారికంగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి వాయిదా వేశానని చెప్పడం సరైన పద్ధతేనా? - కోవిడ్పై ప్రభుత్వం పూర్తి జాగ్రత్తతో అన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ ప్రమాదకరమైంది కాబట్టి ఎన్నికలు వాయిదా వేశామని సీఎస్కి రమేష్కుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి నియంత్రణ చర్యలపై సీఎస్ను ఆయన ఎందుకు సంప్రదించలేదు? - కోవిడ్ను నివారించే సందర్భంలో ఎన్నికల నియమావళి (కోడ్) వల్ల ప్రభుత్వ పరిపాలన, నిర్ణయాలకు ఇబ్బంది ఏర్పడదా? - ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిసి రమేష్కుమార్ కేవియట్ను ఎందుకు వేయించారు? ఇదేమైనా వ్యక్తిగత తగాదానా? - ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలను సుప్రీంకోర్టు సమర్థించింది. - కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రమేష్కుమార్ లేఖ రాయడం బాధ్యతారాహిత్యం. ఆ లేఖ ఆసాంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా ఉంది. - ఎక్కువ సీట్లు గెల్చుకోవాలని లేకుంటే పదవులు పోతాయని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలిచ్చినట్లుగా లేఖ రాశారు. ఎవరు చెప్పారు మీకిదంతా.. మీరేమైనా సాక్షులా? ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేశారు? - అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం స్థానాలు గెల్చుకున్నాం కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలు గెల్చుకోవాలని సీఎం సాధారణంగా అంటారు. దాన్ని రాద్ధాంతం చేస్తారా? చంద్రబాబు తన కార్యకర్తల సమావేశాల్లో నూటికి నూరు శాతం మనమే గెలవాలి అని అనడం లేదా? - అలాగే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే అనర్హతకు గురవుతారనే ఆర్డినెన్స్ను రమేష్కుమార్ తన లేఖలో తప్పుపట్టడం గర్హనీయం. జ్వరం వస్తే పారాసెటిమాల్ వాడరా? ఎల్లో మీడియాకు మంత్రి బుగ్గన సూటి ప్రశ్న ‘జ్వరం వస్తే పారాసెటిమాల్ కాక ఇంకేం వాడతారు? ఎవరైనా డాక్టర్లను అడగండి ఏం చెబుతారో! మీడియా పవర్ ఉందని చెప్పి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తారా?’ అని ఎల్లో మీడియాపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం అరగంటకు పైగా వివరిస్తే అదంతా వదిలి ఎల్లో మీడియా సీఎం పారాసెటిమాల్పై మాట్లాడిన మాటలను ప్రసారం చేసిందని దుయ్యబట్టారు. -
ఇరుగు వైరస్... పొరుగు వైరస్!
ఈ సకల చరాచర జగత్తులోని సమస్త జీవకోటిలో మానవుడే మొనగాడని మనకొక గట్టి నమ్మకం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించామనీ, సమస్త విశ్వాన్ని పాదాక్రాంతం చేసుకోగల తెలివి తేటలు మానవజాతికి ఉన్నాయనుకునే వెర్రి విశ్వాసాన్ని కరోనా వైరస్ వెక్కిరిస్తున్నది. కంటికి కనిపించని ఒక సూక్ష్మప్రాణి. పూర్తి ప్రాణి కూడా కాదు. సగం ప్రాణే. ఒక డీఎన్ఏ పోగు. మనిషి జీవకణాల్లోకి దూరి, వాటిని నిర్వీర్యం చేస్తూ తనలాంటి పోగుల్ని వేల సంఖ్యలో పునరుత్పత్తి చేసుకుంటూ కబళించేస్తున్నది. ‘నా ఒక్కొక్క రక్తపు బొట్టులోంచి వేలమంది పుట్టుకొస్తారన్న’ డైలాగ్ చందంగా మానవ శరీరాల్లో కరోనా చెలరేగిపోతున్నది. ఈ వైరస్ చైనా సరిహద్దులు దాటి గ్లోబలైజేషన్ ప్రారం భించగానే ఇరవయ్యేళ్ల సిరియా అంతర్యుద్ధం ఖామోష్ అన్నట్టుగా ఆగిపోయింది. అమెరికాతో ఒప్పందం కుదు ర్చుకొని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి సన్నద్ధమైన తాలిబాన్లు మంత్రించినట్టుగా స్తంభించిపోయారు. ట్రంప్ ఎన్నికల సన్నాహాలు ఆపేసి ‘ఐసోలేషన్’ను ఆశ్ర యించాడు. అలవికాని అహంకారంతో ఆకాశం వైపు మాత్రమే చూసే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు గజగజ వణికి పోతూ మోకాళ్లపై వంగి కూర్చొని చేతులు జోడించి కరోనాను ప్రాధేయపడుతున్నాయి. జెఫ్ బిజోస్, బిల్ గేట్స్, అంబానీ, జుకర్ బర్గ్లు కూడా ఒక రిక్షావాలా, గని కార్మికుడూ, వ్యవసాయ కూలీలాగానే కరోనాను చూసి ఝడుసుకుంటున్నారు. సర్వత్రా షట్డౌన్, లాక్డౌన్. కాలిఫోర్నియాకు తాళం, ఊపిరి స్తంభించిన యూరప్, ఇండియాలో జనతా కర్ఫ్యూ. ఊరంతా ఒకదారి, ఉలిపికట్టెదొక దారి. ఆంధ్రప్రదే శ్లో ఎల్లో వైరస్గా ఇప్పటికే అపఖ్యాతిపాలై వున్న పొలిటికల్ వైరస్ కరోనాకు సమాంతరంగా చురుగ్గా కదులు తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా కరోనా వ్యాప్తిని బాగానే నియంత్రించగలిగింది కానీ, ఏపీ ఎల్లో వైరస్ మాత్రం హైదరాబాద్ మీదుగా ఢిల్లీ దాకా పాకింది. ప్రాథమికంగా ఇది పొలిటికల్ వైరస్ గానే ప్రారంభ మైనా, క్రమంగా రాజకీయ పార్టీలతో పాటు, మీడియా రంగంలోకి, రాజ్యాంగ వ్యవస్థల్లోకి చొరబడుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికి ప్రమాదకరంగా పరిణమిస్తు న్నది. ఎల్లో వైరస్ లక్షణాలున్న వారిని కూడా జనజీవన స్రవంతి నుంచి ఇప్పటికే ప్రజలు దూరంగా ఐసోలేషన్లో ఉంచారు. అయినా సత్ఫలితాలు కనిపించడం లేదు. త్వరలో కొందరిని క్వారంటైన్ చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఎల్లో వైరస్ పాత నిర్వాకాలను కాస్సేపు పక్కనబెట్టి తాజాగా తలకెత్తుకున్న అఘాయిత్యాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి బాగా వివాదాస్పదమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేంత వరకు అంతా బాగానే వుంది. మార్చి 9వ తేదీ నాడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు ప్రారంభ మయ్యాయి. 11 నుంచి 13 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం నడిచింది. 11 నాడు ఎంపీటీసీ, జెడ్పీ టీసీలకు, 13వ తేదీ నాడు మునిసిపాలిటీలకు నామినే షన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరునెలలు ముందుగానే ఈ ఉగాది రోజున మహిళల పేరుతో దాదాపు 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం గడిచిన కొన్ని నెల లుగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అదికూడా బహిరంగంగా, పారదర్శకంగా జరిగింది. లబ్ధిదారుల పేర్లను గ్రామ సచివాలయాల్లో నోటీస్ బోర్డుపై ఉంచారు. ఎంపిక కానివారు ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి, అందులో అర్హతలున్న వారిని లబ్ధిదారులుగా గుర్తించి, మరోసారి నోటీసు బోర్డుల్లోకి ఎక్కించారు. ఈరకంగా లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన వారెవరో ఊరందరికీ తెలుసు. కేవలం లాంఛనంగా ఉగాదినాడు వారికి పట్టాల ప్రదానం చేయవలసి ఉన్నది. తర్వాత వచ్చే నాలుగేళ్లలో వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించి ఇవ్వవలసి ఉన్నది. తీరా 14వ తేదీనాడు ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన తాఖీదు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా పూర్తయిన తర్వాత ఎన్ని స్థానాలు ఏకగ్రీవమైనాయో కూడా తెలిసి పోయిన తర్వాత హఠాత్తుగా పదిహేనో తేదీ ఆదివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ముందుగానే సిద్ధం చేసుకున్న నోట్ను చదివి వినిపించారు. ఇందులో మొదటి అంశం కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తేదీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ యథాతథంగా వుంటుందన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో వుంటుందన్నారు. నామి నేషన్ల సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా రెండు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, మరికొందరు అధికారు లనూ బదిలీ చేయడం రెండో అంశం. ఈ ఆదేశాలను చూసిన వారికి సహజంగానే కొన్ని అనుమానాలు కలుగుతాయి. 1) కరోనా వైరస్ కారణంగానే ఎన్నికల వాయి దాకు నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే, ఆ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారు లతో గానీ, ఆరోగ్య శాఖ అధికారులతో గానీ ఎందుకు సమీక్షా సమావేశం నిర్వహించలేదు?. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రశ్నను సంధించింది. 2) కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ మాత్రం కొనసాగుతుందని చెప్పడమేమిటి?. ప్రజాభి మానంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఎటు వంటి నిర్ణయమూ తీసుకోనీయకుండా నిరవధికంగా ఎలా నిరోధిస్తారు?. దీనివెనుక రాజకీయ కుట్ర దాగుం దని అధికార పక్షం ఆరోపిస్తున్నది. కుట్ర లేదని ఏ రకంగా సమర్థించగలరు? ఈ చర్యను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి కోడ్ ఎత్తి వేయాలని ఆదేశించిందంటే అర్థం ఏమిటి?. సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా అల్లర్లు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తే ఎన్నికల సంఘం అదే రోజు ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. లేదంటే మరుసటి రోజు. పైగా ఏ ఎన్నికల్లోనైనా సర్వసాధారణంగానే జరిగే చెదురు మదురు ఘటనల కంటే తక్కువగా ఈసారి గొడవలు రికార్డయ్యాయి. అయినా కేవలం తెలుగుదేశం పార్టీ ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకొని ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసిన తర్వాత అధికారుల బదిలీకి ఆదేశించడం వెనుక కూడా ఏదో ‘రాజకీయం’ వుందని వైఎస్సార్సీపీ ఆరోపణ. కరోనా విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహ రించింది. యాభై ఇళ్లకు ఒకరు చొప్పున విస్తరించిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన 12 వేల మందిని గుర్తించగలిగారు. వీరిలో 90 శాతం మందికి వైద్య పరీ క్షలను కూడా పూర్తి చేయించారు. అనుమానిత కేసులను వైద్యుల పర్యవేక్షణలో వుంచారు. మిగతా వారిని ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. ఎన్నికల కమిషనర్ వివాదాస్పద వాయిదా నిర్ణయం తర్వాత మూడు రోజులకు అంటే 18వ తేదీనాడు ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఎన్నడూ ఎక్కడా కనీవినీ ఎరు గని హైడ్రామా చోటు చేసుకున్నది. కేంద్రం హోంశాఖ కార్యదర్శిని సంబోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక మెయిల్ పంపించారనీ, అందులో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన తీవ్ర ఆరోపణలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్లుగా వ్యవహరించే ఒక ఐదు చానళ్లు బ్రేకింగ్ న్యూస్లతో హడావుడి చేశాయి. టీడీపీకి తలగా, తోకగా వ్యవహరించే రెండు ప్రధాన పత్రికలు ఆ లేఖాంశాలను సంపూర్ణంగా కవర్ చేస్తూ బ్యానర్ స్టోరీగా వేశాయి. తల పత్రిక వార్త తోకలో ఈ వార్తను సదరు ఎన్నికల కమిషనర్ ధ్రువీకరించనే లేదని ఏకవాక్యాన్ని మురిపెంగా రాసుకు న్నది. ఆ రోజున ధ్రువీకరించని కమిషనర్ ఈరోజు దాకా ఖండించనూ లేదు. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవీ, బాధ్యతా రహితమైనవి కూడా. వాడిన భాష అభ్యంతకరమైనదీ, జుగుప్సాకరమై నది కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి కలలోనైనా ఊహించలేని లేఖ అది. రాష్ట్ర నాయకత్వానికి ఫ్యాక్షన్ నేపథ్యం వుందనీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అలవాటు వుందనీ, తనకు కేంద్రం రక్షణ కల్పించాలని ఆ లేఖలో రాశారు. దీనిపై కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరణ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక ప్రజాదరణతో ఎన్నికైన ముఖ్యమంత్రిపై నిరాధారంగా చేసిన ఈ ఆరోపణ ఆయన పరువుప్రతిష్టలకు భంగకర మైనది. ఆయన వ్యక్తిత్వంపై జరిగిన ఘోరమైన హత్యా ప్రయత్నం లాంటిది. పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నిక కావడంపై ఆయన ఆశ్చర్యాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు వీలైనంతవరకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితేనే మంచిదన్న ఉద్దేశంతో 73, 74 రాజ్యాంగ సవరణల్లోనే ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ప్రత్యేకంగా చేర్చారు. ఇక రాజకీయంగా చూస్తే జెడ్పీ టీసీలు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవం కావడం కూడా అంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. 1972 అసెంబ్లీ ఎన్నికలో మన రాష్ట్రంలోనే 17 శాసనసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరా గాంధీ ప్రభ వెలిగిపోతున్న తరుణంలో ఆ ఎన్నికలు జరిగాయి. బలహీన ప్రతిపక్షం చేతులెత్తేయ డంతో సహజంగానే ఎమ్మెల్యే స్థానాలు కూడా ఏకగ్రీవ మయ్యాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా డ్రాకో నియన్ ఆర్డినెన్స్గా అభివర్ణించడాన్ని ఎలా అర్థం చేసు కోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇలా రెండు మూడు అంశాలే కాదు. లేఖ మొత్తం ఒక రాజకీయ పార్టీ చౌకబారు ఆరోపణలు చేసిన చందంగానే సాగిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలో నంబర్ టూగా చలామణి అవుతున్న యువనేత ఆధ్వ ర్యంలోనే ఆ లేఖ తయారైందని, ఆయన ఆదేశాల ప్రకా రమే ఆ లేఖను ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారంలో పెట్టిందని తెలుస్తున్నది. ఇటువంటి రాజకీయ జిత్తులకు రాజ్యాంగబద్ధ సంస్థ వేదిక కావడం అత్యంత ప్రమాద కరమైన పరిణామం. ఐఏఎస్ అధికారిగా పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ పదవిని తనకిచ్చిన చంద్రబాబు పట్ల కృతజ్ఞతతోనే ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహ రిస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తున్నది. అంతే కాకుండా ఆయన కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో ఒక కీలక పదవిని కూడా కట్టబెట్టారని తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా అమరావతి ప్రాంతంలోని ఐనవోలులో 500 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించిందట. గత ఏడాది మార్చి 13న ఆయన తన పేరు మీదనే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని సమాచారం. ఈ ట్రిపుల్ బొనాంజా ఫలితంగానే ఇలాంటి అనారోగ్యకర సంప్రదాయం తలె త్తిందా? స్వయంగా ఆయన వివరణ ఇవ్వకపోతే జనం తప్పనిసరిగా ఔననే అనుకుంటారు. దేశ ప్రజలందరికీ కలవరం కలిగిస్తున్న కరోనా వైరస్పై పోరాడుతున్న ప్రభుత్వ వైద్యులకు, నర్సులకు, ప్రభుత్వ ఆరోగ్యశాఖ సిబ్బందికి జేజేలు చెప్పాల్సిందే. విదేశాల్లో చిక్కుకొనిపోయిన వారిని చేరవేయడానికి శ్రమిస్తున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికీ అభినందనలు. సవాల్ను ఎదు ర్కొని తెగించి పోరాడుతున్న ప్రభుత్వ పారిశుద్ధ్య సిబ్బం దికి ప్రణామాలు. సంక్షోభ సమయంలో నిద్రాహారాలు మాని పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులకు, అధికారులకు, పోలీసులకు వందనం. ప్రభుత్వరంగ సంస్థలను కించప రిచే వారికీ, ప్రైవేటీకరణ ప్రవక్తలకూ ఈ సందర్భం ఓ గుణపాఠం కావాలి. సమాజ సమష్టి ప్రయోజనం కోసం పనిచేస్తున్న కర్మవీరుల సేవలకు కృతజ్ఞతగా ఈ రోజు సాయంత్రం చప్పట్లు కొడదామని ప్రధాని పిలుపుని చ్చారు. కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్ర పాపులర్ డైలాగ్ ‘ఆ చప్పట్లే కదరా... ఆకలిగొన్న కళాజీవికి పంచ భక్ష పరమాన్నాలు.’ ఆ విధంగానే ఆ చప్పట్లే అలసిపో యిన మన సేవా జీవులను సేదదీర్చేవి. చప్పట్లు కొడితే పోయేదేమీ లేదు మన చేతులకున్న ధూళి తప్ప. ఇరుగు వైరస్, పొరుగు వైరస్, ఇంట్లో వైరస్, కంట్లో వైరస్ పారి పోయేలా కొడదాం చప్పట్లు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘అందులో తప్పేముంది’
సాక్షి, అమరావతి: ‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ఈసీకి సీఎస్ లేఖ రాసిన తర్వాత కూడా సీఎస్తో ఎందుకు మాట్లాడలేదు? కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారు’’ అని పలు ప్రశ్నలను మంత్రి రాజేంద్రనాథ్ సంధించారు. (ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం) దురుద్దేశం అర్థమవుతుంది.. క్యావియేట్ పిటిషన్ దాఖలు చేయడంతో మీ దురుద్దేశం అర్థమవుతుందని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నామినేషన్లు ఎలా వేసాయన్నారు. టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకుంటే దానికి అధికారపార్టీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు చర్యలకు ఆదేశించారని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. (‘కరోనాపై పోరాటం టెస్టు క్రికెట్లాంటిది’) ఏకగ్రీవం కావడంలో తప్పేముంది.. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ వంద శాతం సీట్లు గెలిచిందని.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు. ప్రజా మద్దతు తమకుంది కాబట్టే మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. సీఎంను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. -
బాబు మరో డ్రామాకు తెరలేపారు : సజ్జల
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గెలిస్తే దేశంలో ప్రజస్వామ్యం ఉన్నట్టుగా, గెలవకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎల్లో మీడియాలో చూపించడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పు, ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా ఉంటాయనేదే చంద్రబాబు భయమని సజ్జల తెలిపారు. అందుకే చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగని ఘటనలు జరిగినట్టుగా సృష్టించి, పచ్చ ఫిర్యాదుల కట్టను తన మనిషైనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్కు పంపించాలని చంద్రబాబు టీడీపీ కేడర్ను ఆదేశించారని సజ్జల విమర్శించారు. వాటికి నంబరింగ్ ఇచ్చి మరో రచ్చకు సిద్దం కావాలన్నదే చంద్రబాబు పథకమని ఆయన అన్నారు. -
'లేఖలు, లీకులు అందులో భాగమే'
సాక్షి, అమరావతి: కరోనా వ్యాధి నియంత్రణ కోసమే ముందస్తు చర్యగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని ఈసీ చెప్తున్న నేపథ్యంలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల సాయంతో నిర్వహించాలంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేస్తున్న డిమాండ్పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. 'స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలంటూ యనమల గారు డిమాండ్ చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. సీబీఐని నిషేధించినవాళ్లు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు అంటూ విమర్శించారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం, అనవసర ఖర్చులు తప్ప' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘ఆ విద్యార్ధులను తీసుకురండి’ కాగా మరో ట్వీట్లో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడ కలలు కనడంలో వింతేమీ లేదు. తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమే' అని చెప్పారు. చదవండి: ఏప్రిల్ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ -
కరోనా: రాష్ట్రంలో పటిష్టమైన వాలంటరీ వ్యవస్థ ఉంది’
సాక్షి. తూర్పు గోదావరి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని మంచి వాలంటరీ వ్యవస్థను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సీఎం జగన్ ప్రభుత్వం పటిష్టమైన ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇంట్లో ఏ కష్టమొచ్చిన వాలంటరీ వ్యవస్థ పరిష్కరిస్తుందన్నారు. అటువంటి వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం తప్పు అన్నారు. చంద్రబాబు ఒత్తిడితో కరోనా సాకు చూపించి ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ‘బాబు అలా చేస్తే బాగుంటుంది: ఎమ్మెల్యే ద్వారంపూడి -
దీని వెనకాల ఏ కుట్ర జరిగిందో బయటకు రావాలి
-
ఈసీ లేఖ బాధ్యతాయుతమైన వ్యక్తి రాసినట్టు లేదు