
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. గుంటూరు కలెక్టర్గా వివేక్ యాదవ్ నియామకం అయ్యారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా రజిత్ భార్గవ్కు అదనపు బాధ్యతలు చేపట్టగా.. మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీలక్ష్మికి అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా విజయ్కుమార్కు అదనపు బాధ్యతలు చేపట్టారు.