Political News
-
సైఫ్పై నిజంగానే దాడి జరిగిందా? యాక్టింగా?
నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరకు నిందితుడు పట్టుబడడంతో ప్రతిపక్షాల విమర్శలకు పుల్స్టాప్ పడింది. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఘటన జరిగాక ఐదు రోజులకు నటుడు సైఫ్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ పరిణామం ఆధారంగా నితేష్ రాణే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా? లేక ఆయన నటించారా? అని ప్రశ్నించారాయన. పనిలో పనిగా ప్రతిపక్షాలను ఆయన తిట్టిపోశారు.పుణేలో జరిగిన ఓ ఈవెంట్లో రాణే మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు చూశా. ఆయన్ని నిజంగానే పొడిచారా? లేకుంటే నటిస్తున్నారా? అనే అనుమానం కలిగింది నాకు అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం కూడా నాకు అలాగే అనిపించింది. కేవలం ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు స్పందిస్తారా?.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై స్పందించరా? అని ప్రశ్నించారాయన.సుప్రియా సూలే.. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. షారూక్ కొడుకు గురించి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గురించి బాధపడ్డారు. కానీ, ఓ హిందూ నటుడి కష్టాల గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా?. అన్నారు.గతంలో బంగ్లాదేశీయులు ముంబై ఎయిర్పోర్టు వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలో చొరబడుతున్నారు. బహుశా వాళ్లు ఆయన్ని(సైఫ్)ను తీసుకెళ్లడానికే వచ్చి ఉంటారేమో! అని రాణే సెటైర్ వేశారు.మహా మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తనయుడే ఈ నితీశ్ నారాయణ రాణే. శివసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్, ఆపై బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనకవల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాటట్రిక్ ఎమ్మెల్యే ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.నితీశ్ నారాయణ రాణేకు వివాదాలూ కొత్తేం కాదు. 2009లో మరాఠీ చిత్రం ‘జెండా’లో తన తండ్రి నారాయణ రాణే పాత్రను అభ్యంతరకంగా చూపించారంటూ నిరసనలకు దిగి తొలిసారి ఆయన మీడియాకు ఎక్కారు. ఆపై ఓ చిరువ్యాపారిపై హత్యాయత్నం చేశారనే కేసు నమోదు అయ్యింది. 2013లో ముంబైని గుజరాతీలు విడిచివెళ్లిపోవాలంటూ మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అదే ఏడాదిలో గోవాలో ఓ టోల్బూత్ను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయ్యారు. 2017లో ఓ ప్రభుత్వ అధికారిపైకి చేపను విసిరిన కేసులో, 2019లో ఓ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. తాజాగా.. కిందటి నెలలో కశ్మీర్ను మినీ పాకిస్థాన్గా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై కేరళ అంటే అందరికీ ఇష్టమేనంటూ మాట మార్చారు. -
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్కుమార్లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్భవన్లో లోక్స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. .. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. -
Editor Comment: డిసెంబర్ లాస్ట్ వీక్.. కాంగ్రెస్, బీజేపీకి పాఠాలు చెబుతున్న వందేళ్ల చరిత్ర
-
Omar Abdullah: బీజేపీకి దగ్గరవుతున్నారా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది బాగా వాడుకలో ఉన్న నానుడి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తాజా ప్రకటనలు ఇదే తరహాలో ఉన్నాయి. కాషాయ పార్టీకి ఆయన దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వాఖ్యలు బీజేపీతో సామీప్యతను సంతరించుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదన్న అభిప్రాయాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత రోజే ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. అయితే స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకుని, అపజయాలను మాత్రం ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదన్న చందంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సరిగ్గా అమిత్ షా ఏదైతే అన్నారో అలాగే కశ్మీర్ సీఎం స్పందించారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారని, ఈ దశాబ్దంలోనే ఉత్తమ పనితీరు కనబరిచామని పొంగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా కమెంట్ చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో తాను గెలిచాను కాబట్టి ఈవీఎంలు బాగా పనిచేశాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. జార్కండ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈవీఎంలు కరెక్ట్గానే పనిచేస్తున్నాయని అనుకున్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఓడించేసరికి ఈవీఎంలు వారికి చెడుగా కన్పిస్తున్నాయి. పని చేతగానివాడు పనిముట్లను నిందించిట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంద’ని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్ను తప్పుబట్టిన ఒమర్ అబ్దుల్లామరుసటి రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే లైన్లో మాట్లాడారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈవీఎంలతోనే లోక్సభ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాట మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాతీర్పుపై విశ్వాసం లేనట్టుగా మాట్లాడం మానుకోవాలని, ఓటమికి ఈవీఎంలను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం అయ్యాక ఆయన ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో అంటూ ప్రశ్నించింది.చదవండి: EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?బీజేపీపై సీఎం అబ్దుల్లా ప్రశంసలుఅయితే ఇక్కడితో ఆగిపోకుండా బీజేపీపై ప్రశంసలు కురిపించారు కశ్మీర్ సీఎం అబ్దుల్లా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంతో మంచిదని, కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం అద్భుతమైన ఆలోచన అంటూ కాషాయపార్టీని పొగిడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్న వాదనను ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. జమ్మూకశ్మీర్కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం అమిత్షాను బుధవారం ఢిల్లీలో సీఎం అబ్దుల్లా కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. -
తెరపైకి ‘హమ్ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్
ఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్మార్కెట్ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.‘మోదాని’ స్కామ్స్పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే.. The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024न्यूयॉर्क के पूर्वी ज़िले के अमेरिकी अटॉर्नी कार्यालय द्वारा गौतम अडानी और उनसे जुड़े अन्य लोगों पर गंभीर आरोप लगाना उस मांग को सही ठहराता है जो भारतीय राष्ट्रीय कांग्रेस जनवरी 2023 से विभिन्न मोदानी घोटालों की संयुक्त संसदीय समिति (JPC) जांच के लिए कर रही है। कांग्रेस ने हम…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024 ‘హమ్ అదానీ కె హై’ సిరీస్లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్ విమర్శ గుప్పించారు.గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మార్కెట్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లోనూ డిమాండ్ చేశాయి.అదానీపై తాజా అభియోగాలివే..ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అలాగే..తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు. న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. -
హీరో విజయ్కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్డైరెక్ట్గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
ఇద్దరూ ఇద్దరే..! తగ్గేదేలే..!!
తెలంగాణలో విగ్రహాల పేరుతో సాగుతున్న రగడ చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాని... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతిగా లేదు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం తలపెట్టింది. దానిని కేటీఆర్ వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు స్పందించారు. మిగతా వారి సంగతి ఏలా ఉన్నా సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాటలు మరి దురుసుగా ఉన్నాయి. 'నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసివేస్తావా... నీకు అధికారం అనేది కలలో మాట. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపడు అయితది. రాజీవ్ గాంధీ విగ్రహం తీయాడానికి తారిఖు చెప్పు. మా జగ్గన్నకు చెబుతా. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తది అంటూ అక్కడ ఆగకూండా రాజీవ్ గాంధీ విగ్రహంను ముట్టుకుంటే.. చెప్పు తెగకపోతే చూస్తా" అని హెచ్చరించారు.కేటీఆర్ అసలు ఈ వివాదాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు. ఒక వేళ అభ్యంతరం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టవద్దని... తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. ఇప్పటికే మేధావులు పలువురు ఆ సూచన చేసారు. అంత వరకు ఆగకుండా కేటీఆర్ ఏకంగా రాజీవ్ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని అంటూ... కాంగ్రెస్ను రెచ్చగోట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరి అన్యాయంగా కేసీఆర్ ప్రస్తావన తెచ్చి అవమానించిన తీరు బాగాలేదు. "పోద్దున్న నుంచి రాత్రి వరకు తాగి ఫార్మ్ హౌస్ లో పోర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా అంటూ దారుణంగా మాట్లాడారు". అంతే కాక వాళ్ల అయ్య పోయేది ఎప్పుడు... వీడు పెట్టేది ఏప్పుుడు అంటూ పరుష భాషను వాడడం ఏ మాత్రం సరికాదు. ఇది ఆయన హోదాకు ఏ మాత్రం తగదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఏట్లాపడితే అట్లా మాట్లాడి హైలైట్ అయ్యేవారు. ఇప్పటికి అలాంటి పంథాను కొనసాగించాలని అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా కేసీఆర్ పేరు బయటకు తీసుకువచ్చి అది కూడా పిల్లల ముందు మాట్లడడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎంత కాదు అన్న కేసీఆర్... పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అనే విషయం మర్చిపోకుడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నడిపి దేశం అంతటి దృష్టిని కేసీఆర్ ఆకర్షించారు. ఈ రోజు రేవంత్ సీఎంగా ఉన్నారంటే అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఫలితమే కదా! ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ విలువ తగ్గుతుందా! కేసీఆర్ కూడా గతంలో కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లడిన సందర్భరాలు లేకపోలేదు. అయినప్పటికి రేవంత్ కామెంట్స్ శ్రుతిమించాయని చెప్పకతప్పదు.ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకా నాలుగేళ్ల వరకు ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి ఎవరు వెళ్లరు. అలాంటిది రాజీవ్ విగ్రహంను టచ్ చేయి... చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ మాట్లడాల్సిన అవసరమే లేదు. ఒక పక్క బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదు అంటునే... రేవంత్ ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే కేటీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అని రేవంత్ సర్కార్కు ఒక ఐడియా వచ్చినట్టు అయ్యింది. వెంటనే సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని... స్థలాన్ని కూడా పరిశీలించారు.డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ఇంత కాలం క్రెడిట్ అంతా కేసీఆర్దే అని చెప్పాలి. తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయించి అనేక చోట్ల ప్రతిష్టించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆఫీసులో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఎందువల్లో కాని సచివాలయంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ వాడుకుంటున్నారు.ఇక రేవంత్ కామెంట్స్పై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందులోను అధ్వాన్నపు భాషా మాట్లడడం మర్యాదగా లేదు. తాము అధికారంలోకి రాగానే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తామని కేటీఆర్ అనడం పద్దతి కాదు. రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని అన్నది గుర్తించుకోవాలి. రేవంత్, కేటీఆర్ రగడలో సంబంధం లేని రాజీవ్ గాంధీ, కేసీఆర్ల పేర్లు తీసుకుని వారిద్దరిని అవమానిస్తూ మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చీఫ్ మినిస్టర్ బధులు.. చీప్ మినిష్టర్ అని అనడం, డిల్లీ గులాం అనడం రేవంత్ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కామెంట్ చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చెత్త అన్న పదాన్ని వాడడం కేటీఆర్ తప్పు అయితే... కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ తప్పు అని చెప్పాలి.అధికారం కొల్పోయిన బాధ కేటీఆర్కు ఉండవచ్చు. అయినా ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే... వివాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు. అదే టైంలో ఛాన్స్ దోరికింది కదా అని మాజీ సీఎం కేసీఆర్ను బూతులు తిట్టిన మాదిరిగా రేవంత్ మాట్లడడం ఆయన అధికార అహంకారాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు అన్నిటిని గమనిస్తే రేవంత్, కేటీఆర్ ఇద్దరూ మానసిక రుగ్మతతో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. తెలంగాణ సమాజానికి కాని, తెలుగు ప్రజలకు కాని వీరి వ్యాఖ్యలు ఏ మాత్రం అదర్శవంతం కాదు. నేతలు తమను ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి కాని... ఆసహ్యించుకునేలా మాట్లడితే వారికే నష్టం. కాకపోతే బీజేపీకి చోటు ఇవ్వకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుపుతుండడమే కొసమెరుపు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వదిలిపెట్టం, అవసరమైతే ఢిల్లీకి..: అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: గత రెండు రోజుల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్తేం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అన్నారాయన. పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలతో సహా సందేశం ఉంచారాయన.పోరాటం మాకు కొత్త కాదు ✊ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతంవదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0— KTR (@KTRBRS) August 3, 2024నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. -
వంధ్యత్వం కాదు.. అంధత్వం!
ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది. :::సరస్వతి రమ -
విక్రవాండికి.. ఉదయనిధి!
సాక్షి, చైన్నె: విక్రవాండి ఉప ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే యువజన నేత, మంత్రి ఉదయ నిధి రెండు రోజుల పాటుగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈవీఎంలలో చిహ్నాలను పొందు పరిచే కార్యక్రమంతో పాటు, పోలీసుల తపాల్ ఓట్ల నమోదు ప్రక్రియను గురువారం ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పళణి పర్యవేక్షించారు.వివరాలు.. విక్రవాండి అసెంబ్లీ స్థానానికి ఈనెల 10వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివాకు మద్దతుగా మంత్రులు ఆ నియోజకవర్గంలో తిష్ట వేశారు. గ్రామగ్రామానా తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. పీఎంకే అభ్యర్థి సి. అన్బుమణికి మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి అభినయకు మద్దతుగా ఆ పార్టీ నేత సీమాన్ ఓట్ల వేటలో ఉన్నారు.ఈ పరిస్థితుల్లో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచార ప్రయాణానికి డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఈనెల 7,8 తేదీలలో ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 8 గ్రామాలలో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించే విధంగా డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి.పోస్టల్ ఓట్ల నమోదు..ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతుంటే, మరోవైపు ఎన్నికల సమయం సమీపించడంతో ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పళణి మాట్లాడుతూ, పోలీసులకు తపాల (పోస్టల్) ఓట్ల నమోదు తాలుకా కార్యాలయంలో శనివారం వరకు జరగనున్నట్లు వివరించారు. 370 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 574 మంది తమ తపాల్ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. ఈవీఎంలలో చిహ్నాలు, అభ్యర్థుల పేర్లను పొందు పరిచే పనులు శరవేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 276 పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 140 పోలింగ్ బూత్లలో వెలుపలు, పరిసరాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.44 సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించామని, ఇక్కడ పారా మిలటరీ భద్రతకు నిర్ణయించామన్నారు. ఈనెల 10 వ తేదీ విక్రవాండికి లోక్ల్ హాలిడే ప్రకటించనున్నామని, రెండు రోజులు టాస్మాక్ దుకాణాల మూతకు ఆదేశాలు ఇవ్వానున్నామన్నారు. తమకు ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
వామపక్షాలకు నూతనోత్తేజం!
పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్లోని అరా, కరాకట్ లోక్సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్కు పంపింది.1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218. -
టీడీపీకి గవర్నర్?.. రేసులో యనమల, అశోక్ గజపతి
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి సీనియర్లు ఎన్డీఎ కోటాలో గవర్నర్ పదవివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు...యనమల, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లు గవర్నర్ పదవి కోసం రేసులో ఉన్నారు...ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకం కావడంతో సీనియర్లలో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందనే వార్తలు వస్తున్నాయి...గవర్నర్ రేసులో రేసులో ఎవరున్నారు...తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది..సీనియర్లలో ఒకరికి గవర్నర్ వస్తుందంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీఎలో కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రంలో టిడిపి సీనియర్లు కీలక పదవులను ఆశిస్తున్నారు..ముఖ్యంగా కొందరు సీనియర్లైతే గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు అయితే గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టిడిపిలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే యనమల, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు.యాదవ సామాజకి వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983 లో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. లా పూర్తి చేసిన యనమల తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. స్పీకర్ గా వ్యవహరించిన యనమల 1994 టిడిపి సంక్షోభంలో ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబు వైపు నిలిచి చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆ సమయంలో యనమల తీసుకున్న నిర్ణయమే చంద్రబాబుని ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. అప్పటి నుంచి కూడా చంద్రబాబుకి యనమల అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కూడా యనమలకి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ ఇస్తూ వచ్చారు.1999 నుంచి 2004 వరకు టిడిపి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ మంత్రిగా వ్యవహరించిన యనమల తొలిసారి వైఎస్సార్ హవాలో 2009 లో తొలిసారి ఓటమి చవి చూశారు.ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా 2014 లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు క్యాబినెట్ లో రెండవ సారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ దక్కకపోవడంతో ఆయన నిరాశ పడ్డారు. మళ్లీ ఈ ఎన్నికలలో తుని నియోజకవర్గంలో తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దింపారు. యనమల కృష్ణుడు వైఎస్సార్ సిపిలో చేరినప్పటికీ కూడా యనమల తన కూతురు దివ్యను తుని నియోజకవర్గంలో నెగ్గించుకున్నారు. టిడిపి అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ క్యాబినెట్ లో కీలక అమాత్య పదవి ఉంటుందని టిడిపి వర్గాలు భావించాయి. అయితే యనమల ఆలోచనలకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలని గవర్నర్ గా ఏదో ఒక రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టిడిపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా ఈసారైనా గవర్నర్ పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఉత్తరాంద్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు 1978లో తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి జనతాపార్టీ అభ్యర్థిగా విజయనగరం విధాన సభనుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీ లో 1983, 1985, 1989, 1994, 1999, 2009 వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇక 2014 లో విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎన్డీఎ ప్రభుత్వంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సారి ఎన్నికలలో ఆయన నేరుగా పోటీ చేయకుండా తన కుమార్తె ఆదితి గజపతిరాజుని రంగంలోకి దింపి ప్రత్యక్ష రాజకీయాలకి దూరమయ్యారు. తొలిసారి తన వారసురాలిని రంగంలోకి దింపిన అశోక్ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపించుకోగలిగారు. దీంతో ఆయన కూడా కేంద్రంలో కీలక పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.చంద్రబాబుకి ఉత్తరాంద్రలో అత్యంత సన్నిహితుడిగా అశోక్ గజపతి రాజు ఉండటంతో గవర్నర్ పదవి రేసులో ఆయన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అటు యనమల...ఇటు అశోక్ గజపతిరాజులలో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే సిఎం చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఉత్తరాంద్రకి చెందిన రామ్మోహననాయుడికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ పదవి దక్కింది. ఇక తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి గుంటూరు ఎంపిగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి లబించింది. టిడిపి నుంచి 16 మంది ఎంపిలగా గెలుపొందడంతో మూడు పదవులు ఆశించినప్పటికీ కూడా తాజా క్యాబినెట్ లో రెండే పదవులు దక్కాయి. విస్తరణలో మరో కేంద్ర సహాయమంత్రి పదవి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ల కోసం ఒక గవర్నర్ పదవి ప్రతిపాధన కూడా మోదీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది..మరి టిడిపి సీనియర్ల ఆశలు నెరవేరతాయా...గవర్నర్ దక్కుతుందా...చూడాలి... -
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
సాక్షి,కృష్ణా జిల్లా : ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైస్సాఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైస్సాఆర్సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైఎస్సాఆర్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. -
మరో ఆరు రోజులే!
సాక్షి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ముగియడంతో ఇప్పుడు అందరితోపాటు అధికారుల చూపు లోక్సభ ఎన్నికల ఫలితాల వైపు మళ్లింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్ల స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలో నిక్షిప్తమైన వరంగల్ ఎంపీ అభ్యర్థుల భవితవ్యం మరో ఆరు రోజుల్లో తేలనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం పనులు చేయాలి, రోజువారీగా ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు.ఈవీఎంలలో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో సిబ్బందికి వివరించారు. అదేసమయంలో స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. సాయుధ బలగాల పహారాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. తరచూ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్యతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా స్ట్రాంగ్ రూంలను సందర్శిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.కౌంటింగ్ సజావుగా సాగేలా..న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, డాక్టర్ సుక్భీర్సింగ్సంధుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతతోపాటు కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంటర్నెట్ కనెక్షన్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రత్యేక కౌంటింగ్హాల్ ఉండేలా ఏర్పాట్లు ఉండాలని ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్ట్రాంగ్రూం నుంచి కౌంటింగ్హాల్కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన మేర సిబ్బంది ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దష్ట్యా ఉదయం 6 గంటలకే టేబుళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ శాతం ఆధారంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 28 టేబుళ్లు, కనిష్టంగా 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. పోలైన ఓట్లు, ఈవీఎంల ఆధారంగా టేబుళ్ల సంఖ్య పెంచనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి.కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్యకాళోజీ సెంటర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కౌంటింగ్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు.ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కౌంటింగ్ హాల్లో అవసరమైన మేరకు టేబుళ్లు, సిబ్బందిని నియమించనున్నట్లు వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమతుందని, అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల ఫలి తాలు ప్రకటించిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ, ఎన్నికల నోడల్ అధి కారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా అభ్యర్థుల్లో గుబులు..ఈ నెల 13న ఎన్నికలు ముగిసినా ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం లోలోన గుబులు ఉంది. పైకి గెలుస్తామని అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రోజుకో యుగంలా ఫీలవుతున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చేసరికి కాస్త మనస్సు అటువైపు మళ్లింది. సోమవారం ఆ ఎన్నిక కూడా ముగియడంతో తమ భవితవ్యం ఏమిటి అనే దిశగా ఆలోచన చేస్తున్నారు.ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఇంకోవైపు ఆయా స్ట్రాంగ్ రూంల వద్ద తమకు నమ్మకమైన అనుచరులను పంపించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అక్కడి దృశ్యాలను తిలకిస్తూ షిఫ్ట్ల వారీగా అక్కడే ఉంటున్నారు. ఏదేమైనా మరో ఆరు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. -
మోదీజీ మాటలకు అర్థాలు వేరులే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకో ఆయన స్థాయికి తగినట్లు ఉండడం లేదు. తాజాగా ఇండియా టివీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్కు నిదర్శనమా? లేక అత్యాశకు ప్రతిబింబమా? అనే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. 2047 వరకు ఆయన వికసిత్ భారత్ కోసం పాటుపడుతూ.. ఆ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందని ఆయన అన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు.⇒ ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఆయన మాట్లాడినట్లు అనిపించదు. నియంతల రాజ్యంలోనో, చక్రవర్గుల పాలనలోనో, లేక మతపరమైన నమ్మకాలు అధికంగా ఉన్న దేశాలలోనో ఇలాంటి ప్రసంగాలు చేస్తే తప్పక జనం వినాల్సి ఉంటుంది. కానీ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో అలా సాధ్యపడకపోవచ్చు. ఆయన వందేళ్లు పైబడి జీవించవచ్చు. 2047 సంవత్సరం అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అయ్యే ఏడాది అన్నమాట. తప్పు లేదు. దేశం అభివృద్ది కోసం ఆయన అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. కానీ తొంభై ఏళ్లు దాటిన తర్వాత కూడా అంత శక్తితో ఉంటారా? అనే సంశయం వస్తుంది.⇒ భారతీయ జనతా పార్టీలో అనుసరిస్తున్న ఒక విధానం ప్రకారం డెబ్బై ఐదేళ్లు దాటితే క్రియాశీలక పదవులలో ఉండరాదని చెబుతారు. అందువల్లే ఎల్.కె. అద్వాని, మురళీ మనోహర్ జోషి వంటివారు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది. కేవలం మర్యాదపూర్వక నేతలుగానే ఉన్నారు. ప్రస్తుతం మోదీ వయసు డెబ్బైనాలుగేళ్లు. ఈసారి గెలిస్తే టరమ్ పూర్తి అయ్యేసరికి ఆయన వయసు డెబ్బైతొమ్మిదేళ్లు అవుతుంది. ఒకపక్క ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డెబ్బైఏడు ఏళ్ల వయసు వచ్చిందని విమర్శలు చేస్తున్న బీజేపీ పెద్దలు అదే మోదీ విషయంలో భిన్నంగా ఎలా మాట్లాడతారో తెలియదు. ఆయన ఆశిస్తున్నట్లు 2047 వరకు పదవులలో ఉంటే అప్పటికీ తొంభై ఏడేళ్ల వయసు వస్తుందన్నమాట. అప్పటివరకు ఆయన అధికారంలో ఉండడం సాధ్యమా అంటే ఏమి చెబుదాం. అలా జరిగితే అద్బుతమే అని అనాలి.⇒ కొంతమంది బాగా వయసు వచ్చేవరకు పదవులలో ఉన్న సందర్భాలు లేకపోలేదు. సీనియర్ నేత మొరార్జీ దేశాయ్ 81 ఏళ్ల వయసులో జనతా పార్టీ పక్షాన దేశ ప్రధాని అయ్యారు. మూడేళ్లపాటు ఆయన పదవి నిర్వహించిన తర్వాత రాజకీయాలకు దాదాపు దూరం అయ్యారని చెప్పాలి. ఎల్.కె. అద్వాని ప్రస్తుతం 90 ఏళ్ల పైబడి జీవిస్తున్నారు. కానీ ఆయన పదేళ్ల క్రితమే యాక్టివ్ పాలిటిక్స్కు దూరం అయ్యారని చెప్పవచ్చు. అమెరికా దేశ అధ్యక్షుడు బిడైన్ ప్రస్తుత వయసు 82 ఏళ్లు. మరో సారి ఆయన పోటీలో ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత వయసు 78 ఏళ్లు. ఆయన కూడా పోటీ పడుతున్నారు. ఒకవేళ గెలిస్తే 82 ఏళ్ల వరకు అధికారంలో ఉండవచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి రెండు టరమ్లకే పరిమితం. మన దేశంలో అలాంటి నిబంధన ఏమీ లేదు. అందువల్ల ఒకసారి అత్యున్నత పదవిలోకి వచ్చినవారు దానిని వదలిపెట్టడానికి అంతగా ఇష్టపడరని జనం భావన.⇒ ప్రధాని మోదీ కూడా అదే తరహాలో ఉన్నారా అనే భావన వస్తుంది. ఆయన 2047 వరకు ప్రధానిగా ఉంటానని నేరుగా చెప్పకపోయినా, వికసిత్ భారత్ లక్ష్యం కోసం తనను దేవుడు పంపించాడని ఆయన ఫీల్ అవుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే, నిజంగా ఆయన ఆ వయసు వరకు జీవించి ఉండి, దేశ ప్రధానిగా కొనసాగి, అభివృద్దికి దోహదపడితే అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మోదీ చేస్తున్న ప్రకటనలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయనలో తడబాటుతోపాటు పొరబడుతున్నారా అనే డౌటు వస్తుంది.⇒ ఉదాహరణకు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంపై బుల్ డోజర్ నడుపుతారని అనడం అత్యంత వివాదాస్పదం అయింది. మోదీ స్థాయికి అలా మాట్లాడకూడదని చెప్పాలి. అలాగే అవినీతి పరులను పార్టీలో చేర్చుకుంటూ, అవినీతిపరులని తానే ప్రకటించి మళ్లీ వారితో తానే పొత్తు పెట్టుకున్న తీరు గమనించిన తర్వాత మోదీ చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే ముస్లింలకు సంబంధించి ఆయన ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికలలలో ఆశించినన్ని సీట్లు రావని మోదీ భయపడుతున్నారని, అందుకే హోదాకు తగ్గట్లు మాట్లాడడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.⇒ మోదీ చెప్పినవాటిలో ఒక్కటి మాత్రం పూర్తి నిజం. ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవని ఆయన చెప్పారు. భారత దేశంలో ప్రధానమంత్రి పదవిని మించి మరొకటి లేదన్నది తెలిసిందే. మోదీ చరిత్ర చూస్తే ఇది ఒకరకంగా అనూహ్యమైన రీతిలో అసాధారణమైన తీరుగా ఎదిగారని చెప్పవచ్చు. కేవలం ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ విధంగా ఎదుగుతారని అనుకోలేం. కానీ మోదీ చేసి చూపించారు. ఇంత ఘనత సాధించిన మోదీ అంటే గౌరవమే కానీ, ఈసారి ఆయన ప్రసంగాలలో అభ్యంతర విషయాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 400 సీట్లు వస్తాయని పదే, పదే చెబుతున్నా, అది ఎంతవరకు సాధ్యమన్నది సంశయంగా ఉంది.⇒ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, బీహారు వంటి రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు వస్తాయా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు జాతీయ స్థాయి సెఫాలిజిస్టులు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీకి కాస్త అటు, ఇటుగా సీట్లు సంపాదించవచ్చేమో కానీ, 400 సీట్లు వస్తాయని అంచనాలు వేయడం లేదు. నిజానికి మోదీకి కాంగ్రెస్ కూటమిలో సరైన ప్రత్యర్ధి లేకపోవడం ఆయనకు కలిసి వస్తున్న అంశం. రాహుల్ గాంధీ ఉన్నంతలో పోటీ ఇస్తున్నా, ఆయనలో మెచ్యూరిటీపై అనుమానాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాలలో కూడా వెనకబడి ఉంటున్నారు. కొన్నిసార్లు తెలివితక్కువగా కూడా ఉంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాస్త సఖ్యత కోసం ప్రయత్నించవలసిన రాహుల్ పనికట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం విస్తుపరుస్తోంది.⇒ తెలంగాణ రాజకీయాలలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను ఏపీకి తీసుకువచ్చి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఇంకా కుట్రలు చేస్తున్నారన్న భావన కల్పించారు. అలాగే కర్నాటక, తెలంగాణలలో అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో కూడా పాత్ర పోషించారు. జాతీయ స్థాయి మానిపెస్టోలో ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం వంటి అంశాలవల్ల వారిపై నమ్మకం కుదరడం లేదు. ఇవన్ని మోదీకి కలిసివచ్చే పాయింట్లుగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వాటిని అందిపుచ్చుకోలేకపోతోందని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీని ప్రయోగించి జైలుకు పంపించిన వైనం ప్రజలలో విమర్శలకు దారి తీసిందని చెప్పాలి.⇒ యూపీఏ పదేళ్ల పాలనలో ఈడీ 34 లక్షల రూపాయలు పట్టుకుందని, అవి పిల్లాడి స్కూల్ బ్యాగులోకి కూడా రావని అన్నారు. అదే, తన పదేళ్ల పాలనలో ఈడీ 2200 కోట్ల రూపాయలు పట్టుకుందని, వాటిని తరలించడానికి 70 టెంపోలు కావాలని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో లక్షల కోట్ల భారత సొమ్ము స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఉన్నాయని, దానిని తెస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇవ్వవచ్చని మోదీ అన్నారు. ఆ సంగతి పక్కనబెట్టి మోదీ కొత్తరాగం అందుకున్నట్లుగా ఉంది. పైగా బ్యాంకులలో వేల కోట్లు ఎగవేసినవారికి పార్టీ టిక్కెట్లు ఇస్తూ, తాను అవినీతి పార్టీ అని చెప్పిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వంటివి చూస్తే మోదీ మాటలకు అర్థాలు వేరులే అనే అభిప్రాయం కలుగుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
-
ఆ గట్టూ నాదే..! ఈ గట్టూ నాదే..!!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
-
నరసాపురం సిద్ధం.. సీఎం జగన్ కోసం జన ప్రభంజనం (ఫొటోలు)
-
నారాసురుడిది ఆదినుంచీ రక్త చరిత్రే
రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే..జనంతో మమేకమవుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకోవడం ఒక మార్గం. పూటకో కుట్ర, రోజుకో కుతంత్రం పన్నుతూ.. రాజకీయంగా నీడనిచ్చిన వారికి వెన్నుపోటు పొడుస్తూ.. ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి మట్టుబెడుతూ రక్తపుటేరులు పారించడం రెండో మార్గం.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం కలగలిసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నరెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత ఎస్వీ యూనివర్సిటీని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు.విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక.. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్గా మారారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే! సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పేదల పక్షాన నిలబడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బస్సు యాత్రలో సంఘీభావం తెలిపేందుకు ఊరూరా వాడవాడన మేమంతా సిద్ధం అంటూ ప్రజలు తండోపతండాలుగా కదలివస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా క్షేత్రంలో ఒంటరిగా వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి భయపడి జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేక.. రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో శనివారం తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సాయంత్రం 5.20 గంటలకు ప్రసంగిస్తూ రాళ్లు, చేతికి ఏది దొరికితే దాంతో సీఎం జగన్పై దాడి చేయాలని చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో కరుడుగట్టిన టీడీపీ మూకల ముఠా విజయవాడ సింగ్నగర్లో డాబా కొట్ల సెంటర్ వద్ద బస్సు యాత్రలో సీఎం జగన్ రోడ్షో నిర్వహిస్తారని ముందే గ్రహించి.. పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ హత్యాయత్నంపై చంద్రబాబు తనయుడు లోకే‹శ్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఇందులో బాబు హస్తం ఉందని సీఎం జగన్ అభిమానులే కాదు పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ స్కాంలో అడ్డంగా సీఐడీ పోలీసులకు పట్టుబడి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచి్చనప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి రీతిలో సీఎం జగన్ను దారుణంగా శిక్షిస్తానంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్రలో జనం నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో హత్యాయత్నానికి తెగబడేలా కుట్ర చేశారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని పలు ఘటనలను ఉదహరిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో.. నాదెండ్ల భాస్కర్రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. 1984 జనవరి 9 నాటికి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్టీఆర్పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి.. ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు. కానీ.. ఎన్టీఆర్కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఒక చరిత్ర–కొన్ని నిజాలు’ పేరుతో రాసిన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ దన్నుతో కర్షక పరిషత్ చైర్మన్గా దొడ్డిదారిన పదవి పొంది.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు. తన దోపిడీ గుట్టంతా నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావుకు తెలిసినందున పక్కా ప్రణాళికతో ఆయన్ను మట్టుబెట్టించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని అప్పట్లో టీడీపీ నేతలే ఆరోపించారు. అప్పట్లోనే ఓ వర్గం నేతలను చంద్రబాబు చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని ఎన్టీఆర్కు సీనియర్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. మహానేత సహకారంతో మంత్రి పదవి దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థ పరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో ఏరులై పారిన రక్తం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యకమమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తార స్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య తమ అక్రమాలు, ఆగడాలను ప్రశి్నంచిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్కౌంటర్’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అవినీతి, అక్రమాలను తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్ 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్ను గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య చేయించింది చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు. వెన్నుపోటుతో ఎన్టీఆర్ కన్నుమూత కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగది్వదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు. చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి. వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. మహానేత కుటుంబంపై ఎప్పుడూ కక్షే ► రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆ కుటుంబాన్ని కడతేర్చితే రాజకీయంగా తనకు తిరుగుండదని చంద్రబాబు భావించారని.. అందువల్లే వైఎస్ కుటుంబంపై కక్ష కట్టి.. మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ► 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. కడప జిల్లాపై వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి ముద్ర బలమైంది. ఆయన్ను హత్య చేస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని కడప జిల్లాకే పరిమితం చేయవచ్చునని.. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవచ్చునని నాటి సీఎం చంద్రబాబు భావించారని చెబుతున్నారు. వైఎస్ రాజారెడ్డిని 1998 మే 23న పులివెందులకు సమీపంలో హత్య చేశారు. హత్య చేసిన వారికి నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికారిక నివాసంలోనే ఆశ్రయం కల్పించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్రెడ్డిని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్షమాభిక్షపై విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతోంది. ► 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరూ ప్రవేశించలేని వీఐపీ లాంజ్లో.. తనకు అత్యంత సన్నిహితుడైన నేతకు చెందిన రెస్టారెంట్లో పని చేసే ఉద్యోగి ద్వారా వైఎస్ జగన్ను కడతేర్చేందుకు 2018 అక్టోబర్ 25న కుట్ర చేశారు. హత్యాయత్నం నుంచి వైఎస్ జగన్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అనేలా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ► 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వేరుపడిన చంద్రబాబు.. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారు. ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాతో కాళ్లబేరానికి దిగి.. మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. తాజాగా దుష్టచతుష్టయంతో కలిసి చెలరేగిపోతున్నారు. 2014–19 మధ్య అధికారం అండతో హత్యాకాండ ► రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచి్చంది. 2014–19 మధ్య టీడీపీ పాలనలో సాగిన హత్యాకాండలో 30 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలను మట్టుబెట్టారు. ► 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు మండల వైఎస్సార్సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు. ► 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ► 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు. ► 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు. ► 2014 సెపె్టంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ప్రాణం తీశారు. ► 2014 సెపె్టంబర్ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త గోవింద్రెడ్డి హత్యకు గురయ్యాడు. ► 2014 నవంబర్ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్సీపీ నేత ప్రభాకర్నాయుడు హత్యకు గురయ్యారు. ► 2014 డిసెంబర్ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్రను హత్య చేశారు. ► 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డిని సింగిల్ విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి. ► 2015 ఏప్రిల్ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ మండల మాజీ కనీ్వనర్ ప్రసాద్రెడ్డిని రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగాయి. ► 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు. ► 2015 అక్టోబర్ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు. ► 2016 డిసెంబర్ 9న వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. ► 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్సీపీ నేత ఇందూరి ప్రభాకర్రెడ్డి, ఆయన బావ మరిదిని దారుణంగా హత్య చేశారు. ► 2017 మే 21న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద హత్య చేశారు. -
కటకటాల్లోకే అవినీతి పరులు..మోదీ ఘాటు విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ మీరట్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం కాదని ‘వికసిత్ భారత్’ కోసమని అని అన్నారు. ►‘గత 10 ఏళ్లలో అవినీతికి వ్యతిరేకంగా మేం తీసుకున్న చర్యల్ని దేశం మొత్తం చూసింది. పేదల సొమ్మును దోచుకోకుండా మేం భరోసా ఇచ్చాం. అందుకే అవినీతిపరులు ఈ రోజు కటకటాల వెనుక ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ►రాబోయే ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీయేకు అవినీతిపరులను కాపాడే ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని సూచించారు. ► నేను అవినీతిపరులను మాత్రమే విచారించడం లేదు. నా దేశ ప్రజలను ఎవరు దోచుకున్నారో, నా ప్రజల దోచుకున్న సంపదను తిరిగి వారికి చెందేలా చూడడమే అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ► బీజేపీ ఇప్పటికే మూడోసారి గెలుపు కోసం సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఐదేళ్ల కోసం మేము రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నాము. మొదటి 100 రోజుల్లో మనం ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై వేగంగా పని జరుగుతోంది’ అని మోదీ అన్నారు. ►గత 10 సంవత్సరాలలో, మీరు అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారు. అసలు అభివృద్ది ముందున్నదన్న మోదీ.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. -
‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్
ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 లోక్సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్మార్క్ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు. #InPics | West Bengal chief minister Mamata Banerjee, along with TMC leader Mahua Moitra, holds a poll rally in Krishnanagar.#ElectionsWithNDTV #LokSabhaElection2024 pic.twitter.com/4iuTTL203Q — NDTV (@ndtv) March 31, 2024 సీఏఏని అనుమతించబోం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించినందునే టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బీజేపీ ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు. -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్కుమార్ -
‘సందేశ్ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితురాలు, బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆమెతో ఫోన్లో స్వయంగా మాట్లాడారు. సందేశ్ఖాలీలో షాజహాన్ షేక్ ఆకృత్యాలను బయటపెట్టిన రేఖా పత్రను శక్తి స్వరూపిణి ( శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతల) తో పోల్చారు. ప్రధాని మోదీ: సందేశ్ఖాలీ ప్రజలు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది? రేఖ పత్ర : తృణమూల్ కాంగ్రెస్ షాజహాన్ షేక్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి. ప్రధాని మోదీ : బసిర్హట్ నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యతను మీకే అప్పగించాం. రేఖపత్ర : సందేశ్ఖాలీ మహిళల పట్ల మీరు దేవుడిలాంటి వారు. ఆ రాముడే మాతో ఉన్నట్లు భావిస్తున్నాం. ప్రధాని మోదీ: వారి ఆశీసులు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళామణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపిక పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? రేఖ పత్ర : మొదట మీరు నన్ను లోక్సభ అభ్యర్ధిగా ప్రకటించడంపై పలువురు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే వాళ్లల్లో చైతన్యం కలిగింది. తృణముల్ కాంగ్రెస్ నేతల సూచనల మేరకే తాము ఇలా ఆందోళన చేశామని, ఇకపై ఇలా చేయబోమని హామీ ఇచ్చారు. వారితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తా. ప్రధాని మోదీ : మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి బాగు కోసం పని చేప్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం. రేఖ పత్ర : నాకు ప్రజా మద్దతు లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ‘నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పనిచేస్తున్నారు. మేం బతకడానికి చాలా కష్టపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు పని లభించేలా, వారు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ : మీ గెలుపు ఖాయం. ‘మీరు శక్తి స్వరూపిణి. శక్తివంతమైన నేతను జైలుకే పంపారు. బసిర్హట్లోనే కాదు, వెస్ట్ బెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడుదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంది’. ‘బెంగాల్ దుర్గా మాత నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్ఖాలీ మహిళలు గొంతు ఎత్తడం అంత సులభం కాదు. ఈసారి బెంగాల్లోని నారీశక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం’ అంటూ ప్రధాని మోదీ బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో సంభాషణ ముగించారు. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరంటే
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. తాజాగా రాజస్థాన్, తమిళనాడు ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్ధుల్ని ఖరారు చేస్తూ ఆరో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్లో అజ్మీర్ లోక్సభ స్థానం నుండి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుండి సుదర్శన్ రావత్, భిల్వారా నుండి దామోదర్ గుర్జార్, కోటా నియోజకవర్గంలో ప్రహ్లాద్ గుంజాల్కు చోటు కల్పించింది. గుంజాల్ బీజేపీ అభ్యర్ధి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో తలపడనున్నారు. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1 (ఏప్రిల్ 19) 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో (ఏప్రిల్ 26న) పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో తిరునెల్వేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై సి రాబర్ట్ బ్రూస్కు చోటు కల్పించింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87 — Congress (@INCIndia) March 25, 2024 -
‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’
దిస్పూర్, సాక్షి : లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రచారంలో ఒకేసారి రెండు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురు పడితే ఎలా ఉంటుంది. అచ్చం ఇక్కడా అదే జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది. అస్సాం దిబ్రూఘర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ‘ఇండియా’ బ్లాక్ కూటమి అభ్యర్థిగా లూరింజ్యోతి గొగోయ్ పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అస్సాం దిబ్రూఘర్ జిల్లా హల్దీబారి నగర్ థాన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖోవాంగ్లోని హల్దీబారి నఘర్ థాన్ అనే ప్రార్థనా స్థలంలో కలిసి కనిపించారు. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఇరువురు నేతలు ఆశ్చర్యపోయినా అతని మోముపై చిరునవ్వు చిందించారు. ‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’ రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి హద్దుల్లోనే ఉన్నాయనే సంకేతాలిచ్చారు ఇరు పార్టీల లోక్సభ అభ్యర్థులు. నిత్యం నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజకీయ నాయకులు కాస్త ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్తే అన్నా అంటే.. బాగున్నావా తమ్మీ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకుంటూ క్షేమ సమాచారం గురించి తెలుసుకున్నారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చుని టీ తాగుకుంటూ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందంటూ మాట్లాడుకోవడం ఎన్నికల సిత్రాలు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి. విద్యార్ధి సంఘానికి అధ్యక్షులుగా బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అధ్యక్షుడు లూరింజ్యోతి గొగోయ్లు సీనియర్, జూనియర్. వారిద్దరూ గతంలో అస్సాంలోని పురాతన విద్యార్థి సంఘమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యూ) అధ్యక్షులుగా పనిచేశారు. సోనావాల్ మా సీనియరే ‘ఈ సందర్భంగా లూరింజ్యోతి గొగోయ్ మాట్లాడుతూ.. మేం ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రత్యర్ధులమే అయినా మేం విద్యార్ధి సంఘంలో కలిసి పనిచేశాం. అతను (సోనావాల్ని ఉద్దేశిస్తూ) మా సీనియర్ అంటూ సంభాషించారు. కాగా, డిబ్రూగఢ్ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. -
నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది
బెంగళూరు, సాక్షి : రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్సభ స్థానంలో తిరుగులేని నేత. వరుసగా నాలుగు లోక్సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటకలోనే కాదు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్సభ సీటును హెగ్డేకి ఇవ్వలేదు. ఆయనకు బదులు మరో నేతకు ఇచ్చింది. ఇటీవల బీజేపీ అధిష్టానం ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలంటూ అభ్యర్ధులకు దిశా నిర్ధేశం చేసింది. ఆ తర్వాతే కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన.. ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కమలం అధిష్టానం హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా లోక్సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్ధులతో ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. అందులో అనంతకుమార్ హెగ్డేకు స్థానం కల్పించలేదు. ఉత్తర కన్నడ లోక్సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. ఇలా అనంత్ కుమార్ హెగ్డేతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నేతలకు లోక్సభ సీటును తిరస్కరించింది. అలాంటి వారిలో ప్రగ్యాసింగ్ ఠాకూర్, దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ఈ సారైనా తమిళసైకి అదృష్టం వరించేనా?
సాక్షి, చెన్నై : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ...ఈసారి భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయ బావుటా ఎగుర వేసేలా నిర్దేశించుకుంది. ఇందుకోసం వివాదాల్లేని నేతల్ని లోక్సభ అభ్యర్ధులుగా బరిలోకి దించుతుంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్లా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం గవర్నర్లుగా పనిచేస్తున్న ప్రముఖుల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంది. తాజాగా తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్కు చెన్నై సౌత్ సీటును కేటాయించింది. ఈ మేరకు 9 మందితో తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో బీజేపీ అధిష్టానం తమిళిసైకి చోటు కల్పించింది. దీంతో తమిళసై సౌందరరాజన్ ఎవరు? అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళిసై సౌందరరాజన్ ఎవరు? నగర్ కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమారి అనంతన్ కుమార్తే తమిళిసై సౌందరరాజన్. వ్యాపారవేత్త..రాజకీయవేత్త హెచ్ వసంతకుమార్ మేనకోడలు. తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె గైనకాలజిస్ట్గా తన వృత్తిని ప్రారంభించారు. సోనాలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో మెడికల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (దక్షిణాది రాష్ట్రాల వైద్య విభాగం)గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బీజేపీ రాష్ట్ర శాఖలో తమిళసై పనిచేశారు. 2007, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, 2013లో జాతీయ కార్యదర్శిగా ఉన్నత బాధ్యలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై 2006, 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. సెప్టెంబర్ 2019లో తెలంగాణ గవర్నర్గా సౌందరరాజన్ నియమితులయ్యారు. కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకు పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు తర్వలో జరగబోయే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తమిళసై. -
గెలుపెవరిది : లోక్సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేదెవరు
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగరా మోగడంతో దేశం ఇక పార్టీల ప్రచారాలతో హోరెత్తుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య మినహ పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా ఎన్డీయే, ఇండియా కుటముల మధ్య పోరు జరగనుంది. ఉత్తరాది ఇండియా కూటమికి, దక్షిణాదాది ఎన్డీయే కూటమికి పరీక్షగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు, ఆయా పార్టీల కీలక నేతలు? గెలుపు - ఓటముల్ని ప్రభావితం చేసే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే.. మహరాష్ట్ర మహరాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్), శివసేన (శిందే వర్గం), శివసేన (యూబీటీ)లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆయా పార్టీల్లో ఏక్నాథ్ షిండే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్లు ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అత్యంత కీలక నియోజక వర్గాలుగా నాగ్పూర్, బారమతిలు ఉన్నాయి. మహరాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి -41 సీట్లు, యూపీఏ కూటమికి - 5 సీట్లు, ఇతరులు -2 సీట్లను కైవసం చేసుకోగా రానున్న లోక్సభ ఎన్నికల్లో హిందూత్వావాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితతో పాటు, ఎన్సీపీ, శివసేనల్లో చీలికలు ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఏ పార్టీలో ఎంత మంది అభ్యర్ధులు గెలుస్తారో వేచి చూడాల్సి ఉంది. తమిళనాడు తమిళనాడులో గవర్నర్ అర్ఎన్ రవి వర్సెస్ అధికార పార్టీ డీఎంకేల మధ్య వివాదం కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ సారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తుండగా.. తూత్తుకూడి, శివగంగ నియోజకవర్గాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు, 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత లోక్సభ ఎన్నికల్లో డీఎంకే - 24, కాంగ్రెస్- 8, అన్నాడీఎంకే -1లు గెలుపొందగా.. ఈ సారి స్టాలిన్ సంక్షేమ పథకాలు మోదీ కరిష్మా లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్,బీజేపీ, జేడీ(ఎస్)లు ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తుండగా.. సిద్ధరామయ్య, బీఎస్,యడియూరప్ప, డి.కే, శివకుమార్, హెచ్డీ దేవెగౌడలు కీలక నేతలుగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో గుల్బర్గా, హసన్, మాండ్య నియోజకవర్గాలపై ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-25, కాంగ్రెస్-1,ఇతరులు-2 లోక్సభ స్థానాల్లో దక్కించుకుంది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందా? అనేది ఆయా పార్టీల అభ్యర్ధుల పనితీరు, అభివృద్దిపై ఆధారపడింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మోదీ చరిష్మా ఎన్నికల్లో కీలకం కానున్నాయి. కేరళ కేరళలలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలకంగా వ్యవహరిస్తుండగా.. కీలక నేతలుగా పినరయి విజయన్, కె.సురేంద్రన్లు ఉన్నారు. కీలక నియోజక వర్గాలుగా తిరువనంతపురం, వయనాడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 లోక్సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత లోక్సభ ఎన్నికల్లో యూడీఎఫ్ - 19, ఎల్డీఎఫ్ -1 సీట్లు గెలిచాయి. సహకార రంగంలో అవకతవకలు, రైతుల సమస్యలు, సీఎం విజయన్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ప్రభావితం చూపనున్నాయి. గోవా గోవాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్లు ప్రధాన పార్టీలుగా కొనసాగుతుండగా కీలక నేతలుగా ప్రమోద్ సావంత్, అమిత్ పాట్కర్లు కీలక నేతలుగా.. ఉత్తర గోవా.. దక్షిణ గోవాలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. గోవాలో మొత్తం లోక్సభ స్థానాలు-2, అసెంబ్లీ స్థానాలు -40 ఉండగా.. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-1, కాంగ్రెస్-1 సీటును దక్కించుకున్నాయి. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, జీఎఫ్బీ, శివసేన ఐక్యంగా పోటీ చేస్తుండడం, మోదీ కరిష్మా ఏ విధంగా ప్రభావితం చూపనున్నాయనేది తెలియాల్సి ఉంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాన పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్లు ఉన్నాయి. భూపేంద్ర పటేల్, సీ.ఆర్. పాటిల్, శక్తి సిన్హ్ గోహిల్లు కీలక నేతలుగా రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాలు, 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తం లోక్సభ స్థానాల్లో విజయదుందుభి మోగిచింది. ప్రధాని మోదీ కరిష్మా, కాంగ్రెస్-ఆప్ కూటమిగా ఏర్పడడంతో ఈ సారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్, చండీగడ్, దమణ్ దీవ్, లక్ష్య దీప్, పాండిచ్చేరిలలో ఒకటి మాత్రమే లోక్సభ స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో అండమాన్ నికోబార్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. చండీగఢ్లో బీజేపీ, దమణ్ దీప్ బీజేపీ,లక్ష్య ద్వీప్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలు ఒక్కోస్థానంలో గెలిచాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. మరి ఈ సారి లోక్సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేదెవరనేది అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంది. -
ఈసారైనా గెలిచేనా?, ప్రధాని మోదీ హోరు.. బీజేపీ జోరు
సాక్షి, తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పాలక్కాడ్లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ అభిమానులు, మద్దతు దారులు భారీ ఎత్తున తరలించారు. ఈ రోడ్ షోలో బీజేపీ పాలక్కాడ్ లోక్సభ అభ్యర్థి సీ కృష్ణకుమార్, పొన్నాని నియోజకవర్గం లోక్సభ అభ్యర్థి నివేదత సుబ్రమణియన్లు సైతం ప్రధాని వెంటే ఉన్నారు. బీజేపీ ఆశలు నెరవేరేనా కేరళ బీజేపీ ఆశలు పెట్టుకున్న లోక్సభ స్థానాల్లో పాలక్కాడ్ ఒకటి. 2019లో లోక్ సభ ఎన్నికల్లో పాలక్కాడ్ నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.కృష్ణకుమార్కు 21 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది 2014లో సాధించిన ఓట్ల కంటే ఆరు శాతం ఎక్కువ. ఇదే స్థానం నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 'మెట్రో మ్యాన్' ఇ. శ్రీధరన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. 2016లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా శోభా సురేంద్రన్కు ఓటమి తప్పలేదు. మోదీ హోరో..బీజేపీ జోరు కానీ ఈ సారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ ప్రజలు బీజేపీకి పట్టం కడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. మోదీ పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ కేరళలో బీజేపీకి విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మరోమారు ఎన్నికల ప్రచారానికి కేరళకు వస్తారని ఆయన పేర్కొన్నారు. మరోసారి పర్యటన జనవరి నుండి మోదీ ఐదోసారి కేరళ పర్యటిస్తున్నారు. ప్రధాని వరుస పర్యటనలతో కేరళలో లోక్సభ ఎంపీలు లేని బీజేపీ ఈసారి ‘రెండంకెల’ స్థానాలను గెలుచుకుంటుందని సురేంద్రన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీతో కటీఫ్.. కేంద్ర మంత్రి పదవికి పరాస్ రాజీనామా
సాక్షి, పాట్నా : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా పరాస్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర కేబినెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యావాదాలు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ, బీహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలున్నారు. అయినా పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఎన్డీయే మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పరాస్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్ ఎన్డీయే నుంచి బయటకు రాగా.. కూటమిలో ఉన్న పశుపతి పరాస్కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్ మళ్లీ కూటమిలో చేరగా.. తాజా సర్దుబాటులో వారికి సీట్లు కేటాయించారు. అయితే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తెలిపారు. -
YSRCP MP Candidates List: వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థులు వీరే.. (ఫొటోలు)
-
ఎన్నికల బాండ్లు: ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
సాక్షి, ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం కోర్టు మరోసారి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కన్నెర్ర జేసింది. మార్చి 21 లోపు ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత నిధులు ఇచ్చిందో ఆల్ఫాన్యూమరిక్ సీరియల్ కోడ్తో సహా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. . ఎంపిక చేసిన సంస్థల వివరాలు మాత్రమే కాకుండా.. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారందరి మొత్తం వివరాల్ని బహిర్ఘతం చేయాలని స్పష్టం చేసింది. దీపాటు తమ వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను బ్యాంక్ బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖేరాను అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. ‘‘బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా ఎస్బీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఎలక్టోరల్ బాండ్ల సీరియల్ కోడ్ను సైతం ఎస్బీఐ అందిస్తుందని కోర్టుకు తెలిపారు. ‘మేం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మా వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి డేటాను ఎస్బీఐ తన వద్ద ఉంచుకోదు’ అని సాల్వే చెప్పారు. -
2019 లోక్ సభ ఎన్నికల్లో మోదీకి పోలైన ఓట్లు ఎన్నో తెలుసా?
సాక్షి, లక్నో : ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని 10 లక్షల పై చీలూకు మెజార్టీ ఓట్లతో గెలిపించాలని బీజేపీ పిలుపు నిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న మోదీ తరుపున బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఆప్కి బార్ 10 లాక్స్ పార్’ ఎన్నికల నినాదంతో మోదీని 10లక్షలకు పై మెజార్టీతో గెలిపించాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ‘ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో ఓట్లు పోలయ్యేలా ప్రచారం చేస్తున్నాం. ఆప్కి బార్ 10 ల్యాక్స్ పార్ అనే నినాదంతో కార్యకర్తలు మోదీకి అండగా నిలుస్తున్నారని వారణాసి నగర బీజేపీ అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నాటి 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రం వడోదరా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మోదీకి దాదాపు 581,000 ఓట్లు పోలయ్యాయి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పోలింగ్ శాతం 7.25 శాతం పెరిగింది. మొత్తం 64 శాతంతో మోదీ దాదాపు 675,000 ఓట్లను సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సమాజ్వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్పై 4,80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు, నవ్సారి నియోజక వర్గం ఎంపీ సీఆర్ పాటిల్ దాదాపు 973,000 ఓట్లను పొందారు. అత్యధికంగా 689,000 ఓట్ల తేడాతో లోక్ సభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించారు 10లక్షలకు పైన ఓట్లు సాధించేలా 2024లోక్ సభ ఎన్నికల్లో 10 లక్షల పైన ఓట్లను సాధించేలా క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలో మార్చి 31 న కార్మికుల ‘టిఫిన్ మీట్’ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన విద్యాసాగర్ రాయ్ కార్మికులకు మార్గనిర్దేశం చేయడానికి పీఎం మోదీ వర్చువల్గా పాల్గొననున్నట్లు వెల్లడించారు. -
బీజేపీలో చేరిన ప్రముఖ గాయని పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్
ప్రముఖ గాయని, పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనూరాధ పౌడ్వాల్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఆయన నేతృత్వంలోని బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరిన ఆమె , బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, పౌడ్వాల్ తనకు ఇంకా తెలియదని, పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తప్పకుండా చేస్తానని అన్నారు. -
మధ్య ప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి,భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు షాకిస్తున్నారు. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్సింగ్ రాబోయే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతాప్ సింగ్.. ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజీనామాకు నిర్దిష్ట కారణాన్ని సింగ్ లేఖలో వెల్లడించనప్పటికీ, పార్టీ నామినేషన్ ప్రక్రియపై తన అసంతృప్తిని ఎత్తిచూపారు. ‘బీజేపీ చెప్పేదానికి, చేసేదానికి తేడా ఉంది’ అని ఉదహరించారు. मैं भारतीय जनता पार्टी की प्राथमिक सदस्यता से त्याग पत्र देता हूँ। pic.twitter.com/g9De9pSzga — Ajay Pratap Singh (@mpajaypratap) March 16, 2024 మార్చి 2018లో బీజేపీ తరుపున రాజ్యసభలో అడుగు పెట్టిన ప్రతాప్ సింగ్ పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. కాగా, బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్ధుల జాబితాలో తనపేరు లేకపోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
50కి పైగా కంపెనీలు..1600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు
సాక్షి, కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 50కి పైగా కంపెనీలు రూ.1,600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు తేలింది. రూ.1,600 కోట్లలో మదన్లాల్ లిమిటెడ్,ఎంకేజీ ఎంటర్ప్రైజెస్, కెవెంటర్స్ ఫుడ్ పార్క్ వంటి సంస్థలు రూ. 600 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, వాటిల్లో కెవెంటర్ గ్రూప్ భారీ మొత్తంలో బాండ్ల రూపంలో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. కెవెంటర్ గ్రూప్ తర్వాత ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ హల్దియా ఎనర్జీ, ధరివాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కంపెనీలు దాదాపు రూ.500 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆయా పార్టీలకు విరాళం ఇచ్చాయి. ఈ కంపెనీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చాయి. వాటిల్లో ఐటీసీ, రుంగ్తా గ్రూప్, రష్మీ గ్రూప్, అంబుజా, శ్యామ్ స్టీల్, ఐఎఫ్బీ గ్రూప్, రిప్లే, శ్రీ సిమెంట్, ధున్సేరి గ్రూప్, ఉత్కర్ష్ గ్రూప్, స్టార్ సిమెంట్, డబ్ల్యూపీఐఎల్, టెగా ఇండస్ట్రీస్, అక్రోపోలిస్ మెయింటెనెన్స్, ఎస్కేపీ మర్చంట్స్, ఆస్టిన్ ప్లైవుడ్స్ ఉన్నాయి. ఇక, ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో సుమారు 1,260 కంపెనీలు, వ్యక్తులు సుమారు రూ.12,155.51 కోట్ల విలువైన 22,217 బాండ్లను కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ డేటా చూపించింది. ఈ కాలంలో రూ.12,769.09 కోట్ల విలువైన 20,421 బాండ్లను 23 రాజకీయ పార్టీలు రీడీమ్ చేశాయి. బీజేపీ రీడమ్ చేసి రూ.6,061 కోట్లను పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవగా రూ.1,610 కోట్లను తృణమూల్ కాంగ్రెస్, రూ.1,422 కోట్లను కాంగ్రెస్ రీడమ్ చేసుకుంది. -
ఒడిశా అధికార పార్టీ బీజేడీకి ఎదురు దెబ్బ
సాక్షి, భువనేశ్వర్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు, బీజేడీ నేత అరిందమ్ రాయ్ బీజేపీలో చేరారు. ‘బీజేడీలో ఉన్నప్పుడు నేను సీఎం నవీన్ పట్నాయక్ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయితే, పార్టీ రాజకీయాల కారణంగా నేను సీఎంను కలిసే అవకాశం పొందలేకపోయాను. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ పార్టీ మారడానికి గల కారణాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం చుబా అవో ఒడిశా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ తన పరిపాలనలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రవేశ పెట్టినట్లు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం అన్న ఆయన..ఈ సారి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికలలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేడీ 12 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 23 స్థానాల్లో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 9, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1, స్వతంత్ర అభ్యర్థి మరో సీటుతో రెండో స్థానంలో నిలిచారు. -
63 మంది సిట్టింగ్లకు నో టికెట్.. బీజేపీ వ్యూహం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ.. ‘అబ్కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది. 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా లోక్ సభ అభ్యర్ధులను ఎంచుకుంటోంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా భారీ ఎత్తున 63 లోక్ సభ సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఢిల్లీ ఏకంగా ఏడు లోక్ సభ స్థానాల్లో ఆరు సిట్టింగ్ అభ్యర్ధులను మార్చేసింది. ఏడుకి ఏడు స్థానాల్లో కైవసం చేసుకునేలా వ్యూహా, ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల అభ్యర్ధుల మొదటి, రెండు జాబితాలలో 63 మంది సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం కల్పిచ్చింది. మార్చి 2న విడుదల చేసిన 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో 33 మంది కొత్త నేతలకు టికెట్లు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది. మార్చి 13న విడుదల చేసిన రెండో జాబితాలో 30 మంది ఎంపీలను భర్తీ చేసింది. ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్కు చెక్ పెట్టేలా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ లోక్ సభ స్థానాల్లో నేతల ఎంపికపై తీవ్ర కసరత్తే చేసింది. ఢిల్లీ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వరుస విజయాల్ని సొంతం చేసుకున్నప్పటికీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో ఈ మొత్తం స్థానాల్లో గెలుపొందేలా ఏడుగురు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులలో ఆరుగురిని మార్చింది. సిట్టింగ్ ఎంపీలలో మనోజ్ తివారీ మాత్రమే మరోసారి సీటు దక్కించుకున్నారు. గెలుపే ముఖ్యం అభ్యర్థుల ఎంపికలో గెలుపే కీలకమని భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్న బిధురి, వర్మలకు టికెట్ నిరాకరించింది. క్రికెట్ పై దృష్టిసారించేందుకు అవకాశం కల్పించేలా తనని రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరడంతో గౌతమ్ గంభీర్ స్థానంలో మరో కొత్త నేతని ఎంపిక చేసింది. అభ్యర్ధుల జాబితా విడుదల చేసిన తరుణంలో హర్ష్ వర్ధన్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 6 మంది కొత్త అభ్యర్ధులు ఎవరంటే? ఢిల్లీ లోక్సభ స్థానాల్లో బీజేపీ అగ్రనాయకత్వం ఎంపిక చేసిన ఆరుగురు కొత్త నేతల్లో బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, యోగేంద్ర చందోలియా, హర్ష్ మల్హోత్రా, రాంవీర్ సింగ్ బిధూరి, ప్రవీణ్ ఖండేల్వాల్, కమల్జీత్ శరావత్లు ఉన్నారు. బన్సూరి స్వరాజ్ మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు. గట్కెక్కిన మనోజ్ తివారీ భోజ్పురి చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో తివారీ ఒకరు. బీజేపీలో చేరకముందు సమాజ్వాదీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో ఈశాన్య ఢిల్లీ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో అదే స్థానం నుంచి మరోమారు విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన తివారీకి తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్లో విస్తరించి ఉన్న పూర్వాంచల్ ప్రాంతాలలో తివారీ ఫాలోవర్స్ ఎక్కువమంది ఉన్నారు. గెలుపు తద్యమని భావించింది కాబట్టే బీజేపీ ఆయనకు మరోసారి సీటును అప్పగించింది. -
ONOE: హంగ్ వస్తే?
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది. ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మరోమాట. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం తొలిదశ కాగా,ఈ ఎన్నికలు జరిగిన 100రోజుల లోపే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం రెండో దశలో జరగాల్సిన కార్యాచరణగా ఉండాలని ఈ కమిటీ బలంగా చెబుతోంది. కాకపోతే,దీనికోసం ఆర్టికల్ 325ను సవరించాలి. ఈ సవరణకు రాష్ట్రాల సహకారం అవసరం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ,ఆ యా పార్టీల బలాబలాలు తెలియరావు. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ మధ్య వివరణ ఇచ్చారు.జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత కమిటీ తుది నివేదిక అందించడానికి నిర్దిష్టమైన గడువేమీలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే,ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలదని అర్థం చేసుకోవచ్చు.2024 లోపే జమిలి ఎన్నికలు జరుగవచ్చని గతంలో కొందరు జోస్యం చెప్పారు. దానికి తెరపడిందన్నది సత్యం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేలాదిగా ఈ -మెయిల్స్ వచ్చాయి. కేంద్రం మొన్నామధ్యనే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటివరకూ 35 పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు.అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలువివిధ కారణాలతో తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తునే వున్నారు.ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు.అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి.ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది.ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు.ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యంతో బిజెపి కదనరంగంలో దిగుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా చాలా బలంగా వున్నాయి. ఇండియా కూటమి మధ్య ఐక్యత ఆశించిన స్థాయిలో లేదన్నది నేటి మాట.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే? ప్రణాళిక చాలా అవసరం.ఈవిఎంలు, వీవీప్యాట్ లు,భద్రతా సిబ్బంది మొదలైన అనేక అంశాలలో పకడ్బందీ ప్రణాళికలు రచించుకోవాల్సివుంటుంది. :::మాశర్మ -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
అమిత్ షా ఎంట్రీతో ‘మహా’ పంచాయితీ కొలిక్కి
సాక్షి, ముంబై : ఇకపై బలాబలాలు నిరూపించుకోవడాల్లేవ్..ఎన్నికల బరిలోకి దిగి మెజార్టీ స్థానాల్లో గెలవడమే తరువాయి అంటూ మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇన్ని రోజులు సీట్ల పంపకంలో నాన్చుతూ వస్తున్న అంశాన్ని ట్రబుల్ షూటర్ అమిత్ షా యూటర్న్ తిప్పారు. చర్చలు సఫలం కావడంతో కూటమిలో ఇతర భాగస్వాములు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారనేది త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. రోజుల తరబడి సాగిన చర్చల తర్వాత, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం పురోగతి సాధించింది. ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మహరాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా.. తమకు క్షేత్రస్థాలు బలం ఎక్కువగా ఉందంటూ ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం 11 స్థానాలు, శివసేన-ఏక్ నాథ్ షిండే వర్గం 22 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబట్టాయి. అయితే షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్పవార్కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది’ అని బీజేపీ నేతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సీట్ల పంపకంపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రంగంలో దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు. తాజాగా, ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం బారామతి, రాయ్గఢ్, షిరూర్, పర్భాని.. ఈ నాలుగు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు అంగీకరించింది. ఇక శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 13 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఆయా స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక? ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనే అంశాలపై మహాయుతి కూటమి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. -
ఈసీ కసరత్తులు చివరికి.. ఎల్లుండే షెడ్యూల్?!
సాక్షి, శ్రీనగర్ : లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇవాళ జమ్ము కశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించనున్నారు. దీంతో.. ఎన్నికల సన్నాహాక సమీక్షలు దాదాపు పూర్తి అయినట్లే. ఈ లెక్కన ఎల్లుండి(శుక్రవారం) లోక్సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఈసీలో రెండు కమిషనర్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే అన్ని సమీక్షలు ముగిడయంతో షెడ్యూల్ విడుదలకే ఈసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక.. జమ్ము కశ్మీర్లో ఇవాళ జరగబోయే ఈసీ సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పాల్గొంటాయి. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఎన్నికల సంఘం అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లతో ఎన్నికల సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం రివ్వ్యూ నేపథ్యంలో.. జమ్ములో లోక్సభ ఎన్నికలతో పాటే.. కుదరకుంటే ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా ఈసీపై రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు గత రెండు వారాలుగా మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్లు ఈ డిమాండ్ను లేవనెత్తుతున్నారు. -
లోక్సభ ఎన్నికల్లో సీనియర్ల పోటీపై ఖర్గే క్లారిటీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేయడం లేదంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. కార్యకర్తలు తనను ఎన్నికల్లో పోటీ చేయమని కోరితే తాను పోటీ చేయవచ్చని అన్నారు. అయితే వయోభారం కారణంగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగకపోవచ్చనే సంకేతాలిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీనియర్ నేతలు లోక్సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదంటూ మీడియా ప్రతినిధులు ఖర్గేని ప్రశ్నించారు. మేం పోటీకి దూరంగా లేము. వయస్సు రిత్యా ఇంతకుముందులా రాజకీయాలు చేయాలంటే కుదరదు. మీరు (జర్నలిస్ట్) 65ఏళ్లకే రిటైర్ అవుతారు. మరి నా వయస్సు 83ఏళ్లు. కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటే తప్పకుండా అదే చేస్తా అని స్పష్టం చేశారు. ఇక మల్లికార్జున్ ఖర్గే 2009, 2014లో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే, 2019లో ఓటమి పాలవ్వడంతో తిరిగి రాజ్యసభకు ఎంపికయ్యారు. -
బీజేపీ సెకండ్ లిస్ట్.. వీళ్లకు నో టికెట్!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల లోక్సభ అభ్యర్ధలను ప్రకటించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కర్ణాటక లోక్సభ స్థానాల్లో భారీ మార్పులు చేయడంతో పాటు పలువురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇటీవల, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించుకుంటే అది సాధ్యమవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహంతో ఉంది. ఫలితంగా హెగ్డే కర్ణాటక ఉత్తర కన్నడ లోక్సభ స్థానాన్ని మరో అభ్యర్ధికి కేటాయించాలని భావిస్తోంది. పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హవేరీ-గడగ్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.హెడ్గేతో పాటు మరికొంత మంది నేతలను కర్ణాటక నుంచి తప్పించే అవకాశం ఉంది. మైసూరు నుంచి ప్రతాప్ సింహా, దావణగెరె నుంచి కేంద్ర మాజీ మంత్రి జీఎం సిద్దేశ్వర, బళ్లారి నుంచి యరబాసి దేవేంద్రప్ప, కొప్పల్ నుంచి కారడి సంగన్న అమరప్ప, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మంగళూరు ఎంపీ నళిన్ కుమార్ కటీల్కు సీట్లు ఇవ్వకపోవచ్చని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉడిపి చిక్మంగళూరు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బెంగళూరు నార్త్ సీటుకు మారే అవకాశం ఉంది. ఆమెకు టికెట్ ఇవ్వవద్దని కోరుతూ కొందరు పార్టీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు సమాచారం. స్పష్టత వచ్చేది అప్పుడే లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం రెండోసారి సమావేశం నిర్వహించింది. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చండీగఢ్ రాష్ట్రాల్లోని 99 సీట్లపై చర్చ జరిగింది. చర్చల అనంతరం లోక్సభ అభ్యర్ధుల ఎంపికపై కొలిక్కి రాగా.. తర్వలోనే అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేయనుంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాతే.. కర్ణాటక బీజేపీలో మార్పులు, చేర్పులు గురించి స్పష్టత రానుంది. -
లోక్సభ ఎన్నికలపై ప్రతిపక్షాల కూటమి కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA bloc) కీలక నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే ప్రచార వ్యూహం, క్యాడర్ నిర్వహణ, ఉమ్మడి ర్యాలీలు నిర్వహించేలా ప్రతిపక్షాల కూటమి పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల వ్యూహాలను అమలు చేయనున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రత్యర్ధి పార్టీల ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఎన్నికల్లో గెలించేందుకు సమన్వయ కమిటీలు చాలా అవసరం. సమన్వయ కమిటీలు ఎన్నికల వ్యూహం, ఎన్నికల సందేశాలను ప్రజల్లో చేరవేసేందుకు సహాయ పడతాయి. కమిటీలలో వివిధ పార్టీల నుండి సమాన సంఖ్యలో సభ్యులు ఉంటారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రాల్లోని పార్టీ క్యాడర్ల సమన్వయం దిశగా మొదటి అడుగు ఇండియా కూటమి అభ్యర్థులు తీసుకుంటారు. వివిధ పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఎన్నికల్లో గెలవడానికి కీలకమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన త్వరలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీ, హర్యానాలలో సమన్వయ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే సమన్వయ కమిటీ సభ్యుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు ఆప్ నేతలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. పొత్తులు ఎంత వరకు వచ్చాయంటే? ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, గోవాలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మహా వికాస్ అఘాడీ నియోజకవర్గాలైన శివసేన (యూబీటీ), మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), తమిళనాడులోని డీఎంకే, లెఫ్ట్ ఫ్రంట్, జార్ఖండ్లోని జార్ఖండ్ ముక్తి మోర్చా, బీహార్లోని రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలతో సీట్ల పంపకాల ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. -
LS 2024: సీనియర్ల దూరం వెనుక మతలబు ఇదే!
సాక్షి,న్యూఢిల్లీ: ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్లు పోటీ చేయరా?.. వాళ్లే ఆసక్తి చూపించడం లేదా? లేదంటే కొత్త రక్తం ప్రొత్సహించే క్రమంలో అధిష్టానమే వాళ్లను దూరం పెడుతోందా?. కనీసం అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ వాళ్ల ప్రస్తావన మచ్చుకు కూడా రాకపోవడానికి కారణం ఏంటి?.. మార్చి 11న (సోమవారం) మిగిలిన స్థానాల్లో లోక్సభ ఎన్నికల అభ్యర్థుల కోసం.. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) రెండోసారి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గుజరాత్ (14), రాజస్థాన్ (13), మధ్యప్రదేశ్ (16), అస్సాం (14), ఉత్తరాఖండ్ (5) ఇలా మొత్తం 62 లోక్సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల పేర్లు లేకపోవడంతో ఈ లోక్సభ ఎన్నికలకు వాళ్లు పోటీ చేయడం లేదనే ఉహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక గుల్బర్గా లోక్సభ సీటును అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటాయించింది. కానీ ఈ సారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించడం లేదు. తనకు బదులుగా తన అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణికి సీటు ఇవ్వాలని ఆయన ఒక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఖర్గేతో పాటు నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్ , కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్, హరీష్ రావత్ పాటు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ సైతం ఉండే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. 2. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్కు బదులు ఆయన కుమారుడు వైభవ్ గహ్లోత్ లోక్సభ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సెంట్రల్ ప్యానల్ జలోర్ లోక్సభ సీటు కేటాయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 3. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు, ప్రస్తుత చింద్వారా లోక్సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ అదే స్థానం నుంచి రెండో సారి సుముఖంగా ఉన్నారు. 4. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అనారోగ్య కారణాలతో హరిద్వార్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో తన కుమారుడు వీరేంద్ర రావత్కు టికెట్ ఇవ్వాలని కోరారు. 5. ఛత్తీస్గఢ్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సచిన్ పైలట్ కూడా ఈసారి బరిలో నిల్చోవడం లేదని సమాచారం. ఇప్పటికే ఆయన ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి బాధ్యతల్లో ఉన్నారు. అక్కడ పార్టీ పరిస్థితిని మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారాయన. అలాగే.. రాజస్థాన్లోని నాలుగు లోక్సభ స్థానాల గెలుపు బాధ్యతల్ని పార్టీ పైలట్కే అప్పజెప్పింది. 6. నియోజకవర్గ పునవ్యవస్థీకరణతో.. గౌరవ్ గొగోయ్ తన మునుపటి సీటు కలియాబోర్లో పోటీకి దూరం కావొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తన తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ సొంతగడ్డ జోర్హాట్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని గౌరవ్ అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కీలకమైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై చర్చించేందుకు మార్చి 15న సమావేశం నిర్వహించనుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పలువురు సీనియర్లకు టికెట్ ఉండకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
ఈ ఎన్నికల యుద్ధంలో మోదీదే విజయం
సాక్షి, కోల్కతా : రాబోయే లోక్సభ ఎన్నికలకు, మహాభారతానికి మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఎన్నికలు మంచి - చెడు, ధర్మం - అన్యాయం మధ్య జరిగే యుద్ధం అంటూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశ భద్రత, శ్రేయస్సు, అందరి సాధికారత కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధంలో విజయం సాధిస్తారని పునరుద్ఘాటించారు. మోదీ పాండవుల మాదిరిగానే న్యాయం, నైతికత, ధర్మం కోసం పాటుపడుతుంటే ..ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశిస్తూ కౌరవులు దేశ ప్రపంచ కీర్తిని మసకబారడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రగతి పథంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ప్రధాని మోదీ దేశ దైవత్వాన్ని, గౌరవాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ప్రజాస్వామ్య వైభవాన్ని హైజాక్ చేయలేవని తెలిపారు. మైనార్టీలు బీజేపీ వెంటే ఉన్నారని, అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ తమ పట్ల వివక్ష చూపనప్పుడు, బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించాలని మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. -
కొనసాగుతున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
సాక్షి, న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఇతర లోక్సభ స్థానాలకు మరికొంతమంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అంతకుముందు, బీజేపీ మార్చి 2న ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా, కాంగ్రెస్ గత వారం 39 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది. మరోవైపు, రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) కూడా ఈరోజు సమావేశమైంది. గత వారం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మెగా బహిరంగ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ లోక్సభ అభ్యర్థి జాబితాను కూడా ప్రకటించింది. -
కాంగ్రెస్కు లోక్సభ అభ్యర్థులు కరువు.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్లో వింత పరిస్థితి చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరువయ్యారు. దీంతో చేసేది లేక పలువురు మంత్రులనే లోక్సభ ఎన్నికల బరిలోకి దించేలా వారిని బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగిందంటూ పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలని పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు. స్క్రీనింగ్ కమిటీ తర్వాతే క్లారిటీ అయితే లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది పార్టీ అంతిమంగా నిర్ణయిస్తుందని ఆయన..మంత్రుల్లో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలనే చర్చలు జరుగుతున్నాయని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే అంగీకరిస్తారో వారినే లోక్సభ ఎన్నికల బరిలోకి దింపుతామని, నేటి సమావేశం (స్క్రీనింగ్ కమిటీ) తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరమేశ్వర చెప్పారు. ఢిల్లీకి జాబితా కాగా, అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.‘మేము సాయంత్రం సమావేశం అవుతున్నాం. అభ్యర్థిని ప్రకటించే హక్కు మాకు లేదు. ప్రతిపాదనల్ని ఢిల్లీకి పంపుతాం. కేంద్ర ఎన్నికల కమిటీ అక్కడ సమావేశమవుతుంది.మా సిఫార్సును ఆమోదించొచ్చు. లేదంటే తిరస్కరించొచ్చు. జాబితాలో కొత్త పేర్లను చేర్చొచ్చు’ అని చెప్పారు. తొలిజాబితాలో ఏడు స్థానాలకు కాంగ్రెస్ తొలి జాబితాలో కర్ణాటకలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ తొలి జాబితాలో మంత్రులు,ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించలేదు. -
‘ఈ ఎన్నికల్లో గెలుపు నాదే’.. శశి థరూర్ ‘ఇంగ్లీష్’పై కేంద్రమంత్రి సెటైర్లు
సాక్షి, తిరువనంతపురం : ఈ సారి జరిగే లోక్సభ ఎన్నికలు..‘పాలిటిక్స్ ఆఫ్ ఫర్మామెన్స్..15 ఇయర్స్ ఆఫ్ నాన్ - పర్మార్మెన్స్’ మధ్య జరుగుతున్నాయంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి తిరువనంతపురం బీజేపీ లోక్సభ అభ్యర్ధి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్ధి, తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నేత శశి థరూర్పై విరుచుకు పడ్డారు. ఈ ఎన్నికలు ‘పనితీరు రాజకీయాలకు..15 సంవత్సరాల పనితీరు లేని రాజకీయాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ ఇంగ్లీష్ వాక్చాతుర్యంపై సెటైర్లు వేశారు. ‘ఇది థరూర్, ఎన్డీఏల మధ్య జరిగే పోరాటం కాదు. ఇది కొంత వ్యక్తిత్వానికి సంబంధించినదని నేను అనుకోను. ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం గురించి లేదా మరేదైనా అని నేను అనుకోను. ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈ ఎన్నికలు గెలుపు కూడా నాదేనంటూ.. ‘‘తిరువనంతపురం ప్రజలకు దీని గురించి బాగా తెలుసు. నేనుకూడా అదే నమ్ముతున్నాను. ఆ ఫలితం ఎన్నికల జయాపజయాల్ని నిర్ధేశించేలా ఉంటుంది. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య పోరుగా భావించడం లేదు. ఈ ఎన్నికలు గత 10ఏళ్లలో జరిగిన అభివృద్ది రాబోయే ఐదేళ్లలో కొనసాగించడమే’ అని పునరుద్ఘాటించారు. నో విజన్ ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజన్ లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపక్షం అంటే ‘అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు నరేంద్ర మోదీని ఓడించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కలిసి రావడమే’ అని వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎక్కడి వాడినో ఎన్నికల ఫలితాలు వచ్చాక తేలిపోతుందన్నారు. ఆ విషయం నేను చెప్పనవసరం లేదు. (మీడియాను ఉద్దేశిస్తూ) మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇది ఖచ్చితంగా తెలుసు’ అని చంద్రశేఖర్ అన్నారు. తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. -
బీజేపీకి ‘సపోర్టింగ్ పార్టీ’ ఈడీ : శరద్ పవార్
ఎన్సీపీ(ఎస్పి) అధినేత శరద్ పవార్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీల సాయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులలో భయాన్ని పుట్టించేందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ఈడీ ‘సపోర్టింగ్ పార్టీ’ అని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ పూణేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీ..ఈడీ వంటి ఏజెన్సీల సహాయంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిపక్షం నుండి పోటీ చేయవద్దని అభ్యర్థులను బెదిరిస్తుందని వాపోయారు. ఈ సందర్భంగా 2005 - 2023 మధ్య ఈడీ తీసుకున్న చర్యలను ఉదహరిస్తూ.. 5,806 కేసులు నమోదు చేసిందని, వాటిల్లో కేవలం 25 మాత్రమే పరిష్కరించిందని తెలిపారు. ‘2005- 2023 మధ్య రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. యూపీఏ హయాంలో ఈడీ 26 మంది నాయకులను విచారించింది. వారిలో ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీకి చెందిన నేతలున్నారు. కానీ 2014 తర్వాత ఒక్క బీజేపీ నాయకుడిని కూడా ప్రశ్నించలేదన్న ఆయన... ఈడీ చర్యల గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసు. బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కనిపిస్తోంది’ అని పవార్ పేర్కొన్నారు. -
ఎలక్టోరల్ బాండ్పై సుప్రీం కీలక తీర్పు, జయఠాకూర్.. ఇంతకీ ఎవరీమె?
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. బాండ్లు కొన్నదెవరు? ఆ మొత్తాలు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12 తేదీ (మంగళవారం)లోపు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేసింది కూడా. ఈ వివరాలను బహిరంగ పరచాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన జయ ఠాకూర్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషంగా ఉన్నట్లు సోమవారం తెలిపారు. ఇంతకీ ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు? ఎలక్టోరల్ బాండ్ అంటే? రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 6లోగా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు అసహనం తాజాగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్బీఐ మరింత సమయం కోరడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటిలోగా విరాళాల వివరాల్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పిటిషన్ జయఠాకూర్ స్పందించారు. జయ ఠాకూర్ ఎవరు? జాతీయ మీడియా కథనాల ప్రకారం..మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన జయ ఠాకూర్కు కాంగ్రెస్తో అనుబంధం ఉంది. ఆమె వృత్తి రీత్యా డాక్టర్. మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు. పారదర్శకత లేదు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఎన్నికల నిధులలో పారదర్శకత తగ్గిపోయిందని జయ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.“డబ్బు విరాళాలు ఇస్తున్న వ్యక్తులు, వారి పేర్లు వెల్లడించడం లేదు. ఇది మన ప్రజాస్వామ్యానికి భవిష్యత్తులో సమస్యను సృష్టిస్తుందని నేను ఆ సమయంలో (2018) గ్రహించాను. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులే పెద్ద సమస్య’. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని తాను అనుకోవడం లేదు. ఏ పార్టీ, ఏ కార్పొరేట్ గ్రూప్ నుండి నిధులు పొందుతుందో, వారు తప్పనిసరిగా కార్పొరేట్ గ్రూప్ పేరును బహిర్గతం చేయాలని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు -
‘మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు.. ఒంటరిపోరే’ : బీజేపీ
భువనేశ్వర్ : ‘మేం ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు. 147 అసెంబ్లీ, 21 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఒడిశా రాష్ట్ర బీజేపీ అధికారంగా ప్రకటించింది. త్వరలో జరగనున్న పార్లమెంట్, అంసెబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పలు పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. సీట్లను పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో ఒడిశా అధికార పార్టీ బిజు జనతా దళ్ - బీజేపీల మధ్య పొత్తు ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఆ ప్రచారంపై ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. అనంతరం, రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్నికల గురించి మాట్లాడారు. కేంద్రం పెద్దలతో జరిగిన సమావేశంలో ఒడిసా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా చర్చించామే తప్పా అలయన్స్ గురించి, లేదంటే సీట్ల పంపకం గురించి ప్రస్తావించ లేదని అన్నారు. #BJP will fight alone in both #LokSabha and #Odisha assembly polls: State BJP president Manmohan Samal Does that mean talks derailed ? pic.twitter.com/4N7qxH4jDA — Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2024 అంతేకాదు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా గెలిచి సామర్ధ్యం ఉందని స్పష్టం చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెల్లడించారు. కుదరని సయోధ్య పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీజేపీ-బీజేడీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదలేదని తెలిపాయి. ఎన్నికలకు ముందు పొత్తుకు ఇరు పార్టీలు పరస్పరం అంగీకరించినప్పటికీ సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా..అందులో 100 సీట్లకు పైగా పోటీ చేయాలని అధికార పార్టీ బీజేడీ ప్రయత్నించగా, అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. రాష్ట్ర బీజేపీకే తీవ్ర నష్టం ప్రస్తుతం అధికార బీజేడీ 114 అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్య వహిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు అంగీకరించిన బీజేడీ మొత్తం 112 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అందుకు కమలం నేతలు అంగీకరించలేదు. ‘బీజేడీ మాకు ఆమోదయోగ్యం కాని విధంగా 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీ నిర్ణయం మా పార్టీ భవిష్యత్పై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతుందని’ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతిపాదన తిరస్కరించిన బీజేడీ మరోవైపు, పొత్తులో భాగంగా ఒడిశాలోని 21 లోక్సభ స్థానాల్లో 14 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ.. బీజేడీతో చర్చలు జరిపింది. అందుకు బీజేడీ తిరస్కరించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఢిల్లీలో మూడు రోజుల మకాం ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ఒడిశా బీజేపీ నేతలు మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయ్ పాల్ సింగ్ తోమర్ నివాసంలో పలువురు కేంద్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జుయల్ ఓరమ్, తోమర్ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత, బీజేడీతో పొత్తుపై చర్చ జరిగిందని, అయితే ఏమీ ఖరారు కాలేదని తేలింది. మోదీ పర్యటనతో మారిన రాజకీయం ఒడిశా బీజేపీ నాయకులు బీజేడీతో పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ మార్చి 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత రాష్ట్ర రాజకీయం పూర్తిగా మారిపోయింది. మోదీ పర్యటన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగాయి. అదే సమయంలో రాష్ట్ర, ప్రజల ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేడీ సూచించింది. 11ఏళ్ల పొత్తులో గతంలో ఒడిశాలో బీజేపీ-బీజేడీలు (1998 - 2009) సుమారు 11 ఏళ్ల పాటు పొత్తులో ఉన్నాయి. మూడు లోక్సభ, రెండు అసెంబ్లీ ఎన్నికలలో కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. 1998లో జనతాదళ్ విడిపోయినప్పుడు, పట్నాయక్ తన సొంత పార్టీని స్థాపించి, ఉక్కు, గనుల మంత్రిగా వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరారు. 2000లో తొలిసారి 2000లో తొలిసారి, 2004లో రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అంతకుముందు బీజేడీ, బీజేపీల మధ్య సీట్ల షేరింగ్ రేషియో 4:3గా ఉంది. బీజేడీ 84 అసెంబ్లీ, 12 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 63 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో 48.7 శాతం ఓట్లతో 21 సీట్లలో 17 స్థానాలను కూటమి గెలుచుకుంది. కూటమి మళ్లీ 1999లో 19 స్థానాలకు మెరుగైంది. ఇది 2004లో 18కి కొద్దిగా తగ్గింది. మళ్లీ ఇప్పుడు బీజేడీ- బీజేపీల మధ్య పొత్తు అంశం తెరపైకి వచ్చింది. -
‘మోదీ కా పరివార్’ పేరుతో పోస్టర్ల కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ యువ కాంగ్రెస్ పేరుతో విడుదలైన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీని కించపరుస్తూ ‘మోదీ కా అస్లీ పరివార్’ క్యాప్షన్ జోడిస్తూ పలువురు ఫోటోలతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా.. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పోస్టర్లను తొలగించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆ పోస్టర్లలో పబ్లిషర్ పేరు, వాటిని ఎవరు విడుదల చేశారో తెలియాల్సి ఉందని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ‘జన విశ్వాస యాత్ర’ చేపట్టారు. ఆ యాత్రలో ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి కుటుంబం లేదని అన్నారు. లాలూ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటంబమే అని వ్యాఖ్యానించారు. ‘మోదీ కా పరివార్’ లాలుప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ బీజేపీ అగ్రనేతలు స్పందించారు. ఎక్స్. కామ్ వేదికగా ఆ పార్టీ అగ్ర నేతలు తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అని పెట్టుకున్నారు. -
అమేథీ నుంచే లోక్సభ బరిలో రాహుల్ గాంధీ?
రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం దాదాపూ ఖరారైంది. తాజాగా, ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశం నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ మాట్లాడుతూ.. అమేథీ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారని అన్నారు. త్వరలో రాహుల్ గాంధీ పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వర్సెస్ స్మృతి ఇరానీ ప్రదీప్ సింఘాల్ చెప్పినట్లుగానే రాహుల్ ఎన్నికల బరిలోకి దిగితే అమేథీలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీపడనున్నారు. తన అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజక వర్గంలో గెలుపొంది రాహుల్ గాంధీ లోక్సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయితే, ఆమె ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. -
నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీలు..త్వరలో రాహుల్ గాంధీ ప్రకటన
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని యువత, నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీ 10 ఎన్నికల వాగ్ధానాలను ప్రకటించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లోని బద్నావర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి జరిగే ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది. గతవారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని మోహనాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని అన్నారు. పాకిస్తాన్ లాంటి దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నది అని చెప్పారు. ఈ తరుణంలో ఉజ్జయినిలో భారత్ న్యాయ్ యాత్రలో నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీలను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వాగ్ధానాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కాగా, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజవర్గాలను మీదిగా దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే యాత్ర ..మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ర్యాలీ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొనసాగుతుంది. -
కొంప ముంచిన అక్షర దోషం.. డీఎంకే నేతలపై ట్రోలింగ్..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై ప్రశంసలు తెలుపుతూ వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే.. ఈ పోస్టర్లలో ఎంకే స్టాలిన్ చిత్రంపై ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని రాసి ఉండటమే. ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ టైమ్స్ నౌ ప్రకారం, ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అనే పదాలతో పోస్టర్ను ముద్రించాలని ప్లాన్ చేశారు. అయితే, అక్షర దోషంతో అది ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ గా మారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ పోస్టర్ను ఎవరు వేశారు? ఎక్కడ పెట్టారు? అనేది తెలియరాలేదు. అయితే, ఈ పోస్టర్ ఉన్న వీడియోను తీసిన పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఆ వీడియోని 1.2లక్షల మంది వీక్షించారు. "Bride of Tamil Nadu" 🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/6HunaWC3Lw — Facts (@BefittingFacts) March 4, 2024 ఇదిలా ఉంటే తమిళనాడులోని కులశేఖ పట్టణంలో నిర్మిస్తోన్న ఇస్రో లాంచ్ప్యాడ్ను ఉద్దేశించి డీఎంకే మంత్రి అనిత ఆర్ రాధాక్రిష్ణన్ ప్రకటన ఇచ్చారు. అందులో ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ ఫోటోలతో పాటు వెనకవైపున రాకెట్పై చైనా జెండా ఉండటం వివాదానికి కేంద్ర బిందువయ్యారు. మాండరిన్లో శుభాకాంక్షలు మార్చి 1న బీజేపీ మాండరిన్లో ముఖ్యమంత్రి స్టాలిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మాండరిన్ ఆయనకు నచ్చిన భాష అంటూ విష్ చేసి, విమర్శించింది. మాండరిన్.. చైనా అధికారిక భాష. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చారు. ప్రకటనలో తప్పిదం దొర్లింది. దాని వెనుక దురుద్దేశం లేదు. భారత్పై ప్రేమ ఉంది అని అన్నారు. -
త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్..?
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2024 లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది. 2019లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఈ సారి ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం మొదటి దశ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో జరగనుండగా.. మార్చి 14 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. టార్గెట్ 400 కాగా, 2019లో ఏడు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ సారి బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్డేట్ అయ్యిందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం 40 సీట్లైనా రావాలని పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. -
‘మూడోసారీ మోదీనే’.. దేశవ్యాప్తంగా దద్దరిల్లుతున్న ప్రధాని ప్రచారం
రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని స్థాపించి, ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలు..ఎత్తుకు, పైఎత్తులతో ముందుకెళ్లేందుకు సిద్ధమైనట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ పంపులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల హోర్డింగ్లను తొలగించి వాటి స్థానంలో ప్రధాని మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల హోర్డింగ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తేలింది. హోర్డింగుల్లో ‘మోదీ కి గ్యారెంటీ’ నినాదం పేరుతో హోర్డింగ్లు వెలుస్తున్నాయని, వాటిల్లో మోదీ కి గ్యారెంటీ అంటే ‘మెరుగైన జీవితం’ అని తెలిపేలా ప్రభుత్వ ప్రధాన పథకం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రధానమంత్రి సిలిండర్ ఇస్తున్న ఫోటోలు ఉన్నట్లు పలు మీడియా ఔట్లెట్లు చెబుతున్నాయి. హోర్డింగ్లు ప్రత్యక్షం పెట్రోలియం - సహజవాయువు మంత్రిత్వ శాఖ నుండి అనధికారిక సమాచారం అంటూ పలు జాతీయ మీడియా సంస్థలు.. ‘మోదీ కి గ్యారెంటీ’ హోర్డింగ్లను ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల హోర్డింగ్లలో మోదీ కి గ్యారెంటీ హోర్డింగ్లను డిస్ప్లే చేయనుంది. అయితే, ఎన్నికల సంఘం (ECI) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే ఆ హోర్డింగ్లు తొలగించనుంది ప్రభుత్వం. టీఎంసీ ఫిర్యాదు 2021 మార్చిలో, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తృణమూల్ కాంగ్రెస్ నుండి వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పెట్రోల్ బంకుల్లో మోదీ చిత్రం ఉన్న అన్నీ హోర్డింగ్లను తొలగించాలని పెట్రోల్ బంకుల నిర్వహకులను కోరింది. మోదీ కి గ్యారెంటీ బంపర్ హిట్ ఇటీవల జరిగిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ‘మోదీ కి గ్యారెంటీ’ అనే ఎన్నికల నినాదంతో ముందుకు వచ్చింది. ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. -
ఇరకాటంలో సుష్మా స్వరాజ్ కుమార్తె..
న్యూఢిల్లీ : బన్సూరి స్వరాజ్ను న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడంపై బీజేపీపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా ఆమె కోర్టులో దేశ ద్రోహులకు అండగా నిలిచారని ఆరోపిస్తోంది. బన్సూరి టికెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్ధుల జాబితాలో బన్సూరి స్వరాజ్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీడియా సమావేశంలో ఆప్ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ బన్సూరి న్యాయవాదిగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, అలాంటి వారికి బీజేపీ లోక్సభ సీటు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోక్సభ అభ్యర్ధిగా ప్రజల్ని ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బన్సూరికి టికెట్ ఇచ్చే అంశంపై బీజేపీ పునరాలోచించానలి డిమాండ్ చేశారు. అయితే ఆప్ విమర్శలపై స్పందించిన బన్సూరి న్యూఢిల్లీ లోక్సభ ఆమ్ ఆద్మీ అభ్యర్ధి సోమనాథ్ భారతిపై మండిపడ్డారు. సోమనాథ్ భారతీ ఢిల్లీ రాజేంద్రనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ క్యాడర్ ఆయనపై దాడికి దిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. AAP candidate from New Delhi Loksabha Somnath Bharti who's accused of assaulting his own wife is beaten by his own Karyakartas... 💀 pic.twitter.com/cGkwarcNIr — Mr Sinha (Modi's family) (@MrSinha_) March 2, 2024 ఆ వీడియోలపై బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ ‘నేను ఆప్ని అడగాలనుకుంటున్నాను. రాజేంద్ర నగర్లో తన సొంత క్యాడర్తో కొట్టించుకున్న అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ఎందుకు నిలబెట్టింది. సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్ధిని ఎలా ఎంపిక చేసుకున్నారు. అలాంటి వారి మాపై ఆరోపణలు చేయోచ్చా? అని అడిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సూచించారు. -
‘10 రోజుల్లో 12 రాష్ట్రాలు’, దేశంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు..
ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మార్చి 4 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూల్లో భాగంగా నేడు నాగపూర్ నుంచి తెలంగాణలోకి ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. తెలంగాణ తర్వాత తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ - కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ పర్యటించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మకంగా 29 కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ విభిన్న ప్రాంతాలు వర్గాలతో అనుసంధానం అయ్యేలా, కీలకమైన సమస్యలను పరిష్కరిష్కరించనున్నారు. ఇక ఎన్నికలకు ముందు ప్రజల్ని ఆకట్టుకునేందుకు మోదీ పర్యటన దోహదం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
గెలుపు వ్యూహాలపై మాజీ సీఎం కేసీఆర్ సమాలోచన..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నుంచే పార్లమెంట్ ఎన్నికల కదనభేరి మోగించబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా.. లోక్సభ ఎన్నికల కసరత్తును ప్రారంభించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగసభను వేదికగా చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జనవరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణభవన్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాల ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల వలసలు ఆపేలా.. అలాగే ఈనెల 12న కరీంనగర్లో నిర్వహించబోయే బహిరంగసభను సక్సెస్ చేయడంపై నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దశమిరోజు ఇద్దరు అభ్యర్థుల ప్రకటన.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి ముగ్గురు పేర్లతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కు పంపింది. కాంగ్రెస్, బీజేపీకి ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పార్టీ ముఖ్యనేతల నుంచే ఇప్పటికే అభిప్రాయాలు సేకరించింది. ఇక తెలంగాణభవన్లో నిర్వహించిన సమావేశంలోనే ఎంపీ అభ్యర్థులుగా కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించాలనుకున్నా.. ఆదివారం అష్టమి, సోమవారం నవమి కావడంతో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దశమి రోజు అధికారికంగా మొదట జాబితాలో కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని నేతలు చెబుతున్నారు. లేదంటే ఈనెల 12న కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగసభలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధిష్టానం వీరిద్దరికీ జనవరిలోనే టికెట్పై గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో వీరు తమ నియోజకవర్గం పరిధిలో వాల్రైటింగ్స్, ఫ్లెక్సీలతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అధికారికంగా అభ్యర్థుల ఖరారు చేసిన తరువాత పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగేందుకు నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇవి చదవండి: పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్కు తెలుసు : మంత్రి సీతక్క -
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్పూర్(యూపీ): గత లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్చేయాలని అక్కడి రామ్పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
భ్రమరావతిని వీడి.. కళ్లు తెరిచి నిజాలు చూడండి
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదనేవారికి, సంపద సృష్టించడం లేదనేవారికి, పరిశ్రమలపై అబద్దాలు రాసే వారికి ఇది పెద్ద సమాధానమే అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక కధనం ప్రకారం గత మూడేళ్లలో ఆదాయపన్ను రిటర్న్ లు ఫైల్ చేస్తున్న వారిలో పెరుగుదల వివరాలు చూస్తే ఏపీ దేశంలోనే మొదటిస్థానం సాధించింది. ఈ మూడేళ్లలో ఏపీలో 18 లక్షల మంది అదనంగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారు. ఇదేదో ఊహాగానం కాదు. కల్పిత విషయం అంతకన్నా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ITRలపై ఇచ్చిన తాజా నివేదిక వెల్లడించిన సంగతి. ఆదాయపన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రలో గడిచిన మూడేళ్లలో 13.9 లక్షల మంది కొత్త అస్సెసీలు పెరిగితే, ఉత్తరప్రదేశ్ లో 12.7 లక్షలు, గుజరాత్ లో 8.8 లక్షల మంది కొత్త అస్సెసీలు వచ్చారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో విచిత్రంగా ఆదాయపన్ను మదింపుదార్లు పెరగకపోగా తగ్గిందని SBI నివేదిక చెబుతోంది. మొత్తం అన్ని రాష్ట్రాల ర్యాంకింగ్ లలో తెలంగాణ 20వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళలలో సగటున 3.4 లక్షల మందే కొత్త ఆదాయపన్ను అసెసీలు వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. దీనికి కారణాలు కూడా ఈ నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్ లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు బాగా పెరగడం వల్లే అని అందులో స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం మీద పదిన్నర లక్షల MSME రిజిస్ట్రేషన్ లు జరిగాయని నివేదికలో తెలిపారు. ఏతావాతా చూస్తే AP ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ఇందుకు బాగా దోహదపడ్డాయని అర్ధం అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను సుమారు వెయ్యి కోట్లకు పైగా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన రాయితీలను చాలావరకు ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. దాంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో ఉపాది పొందేవారికి రక్షణ కల్పించినట్లయింది. ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి వేల కోట్లు అవసరం అవుతాయి. పరిశ్రమను నెలకొల్పడానికి సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూనే చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షల మదికి ఉపాధి కలుగుతుందన్నది ఆర్దిక రంగ నిపుణులు చెబుతారు. దానికి అనుగుణంగా YSRCP ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసే స్థాయికి పద్దెనిమిది లక్షల మంది వెళ్లారంటే వారి ఆర్దిక స్తోమత పెరిగిందన్నమాట. దీనిని ఒక రకంగా సంపద సృష్టించడం అన్నమాట. అందులోను కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే స్థితికి వచ్చారని అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నిత్యం ఏపీలో అసలు ఏమీ జరగడం లేదని విషం చిమ్ముతుంటుంది. వారు ఇలాంటి వార్తలను, అసలు నిజాలను కప్పిపుచ్చుతుంటారు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో సంపద అంటే రియల్ ఎస్టేట్ సంపదే అనే అభిప్రాయం కల్పించారు. అందులో ధనవంతులు మరింత ధనికులు అవడమే ఆ విదానం. కేవలం దళారులు బాగుపడడం అందులో జరుగుతుంది. కాని చిన్న పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల పేద, మద్య తరగతివారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే GSDPలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి నాలుగు స్థానాలలో ఉంటోంది. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అన్న విశ్లేషణ వస్తుంది. RBI మాజీ గవర్నర్ రఘురామరాజన్ దీనిని సమర్ధిస్తుంటారు. ఇందులో ఆయా స్కీముల కింద ప్రజల చేతులలోకి నేరుగా డబ్బు వెళ్లేటట్లు చేయడం, దీనివల్ల అవినీతి పూర్తిగా లేకుండా పోయి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో సొమ్ము జమ అవుతుంది. ఈ డబ్బు పొందినవారంతా పేదలు, మధ్య తరగతి వారే కనుక దానిని పొదుపు చేసుకునే పరిస్థితి ఉండదు. వెంటనే వారు తమ అవసరాల కోసం మార్కెట్ లో వెచ్చిస్తారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుంది. వ్యాపారాలు అధికం అవుతాయి. తద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. పైకి చూస్తే డబ్బు పంపిణీనే అనుకుంటారు. కాని ఇందులో లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. జగన్ చేపట్టిన మరో స్కీమ్ చేయూత కింద నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున ఆర్దిక సాయం చేశారు. ఈ డబ్బును తీసుకున్నవారు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా బ్యాంకులతో టై అప్ చేశారు. వారి ఉత్పత్తుల విక్రయానికి గాను రిలయన్స్, ఐటిసి తదితర మల్టి నేషనల్ సంస్థలతో టై అప్ చేశారు. తద్వారా సుమారు నాలుగు లక్షల మంది యూనిట్లు నెలకొల్పుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆర్ధిక అభివృద్దికి దోహదం చేసేదే. మరో అంశం చూద్దాం. జగన్ ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చింది. అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. సగటున గ్రామం, పట్టణం,నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆస్తి సమకూరింది. దీనిని లెక్క వేస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టించింది తెలుసుకోవచ్చు. చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి ఒక్కటైనా చేసి తాను సంపద సృష్టించానని చెప్పగలరా? లేదా ఆయన తరపున ప్రచారం చేసే రామోజీరావు ,రాధాకృష్ణ వంటివారు టీడీపీ తెచ్చిన సంపద ఏమిటో వివరించగలుగుతారా? ఇవే కాదు. స్కూళ్లు బాగు చేయడం, అక్కడ డిజిటల్ క్లాస్ లు పెట్టడం తదితర చర్యల వల్ల ఎన్ని లక్షల టీవీలు,ఇతర పరికరాలు కొనుగోలు చేశారో అంచనా వేసుకోండి. అలాగే వేలాది స్కూళ్లను బాగు చేయడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు. గ్రామ,వార్డు సచివాలయాలను వేల సంఖ్యలో నిర్మించారు. రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్స్ ను కొత్త భవనాలు ఏర్పాటు చేసి నెలకొల్పారు. మరి అదంతా సంపద కింద రాదా? కేవలం అమరావతిలో ఒక ఏభై అంతస్థుల భవనం కడతామని, అది కట్టలేకపోయిన చంద్రబాబు ఏమో సంపద సృష్టించినట్లు ప్రచారం చేస్తుంటారు. ప్రాక్టికల్గా గ్రామాలలో, నగరాలలో ప్రత్యక్షంగా కనిపించేలా సంపదను ప్రజలకు అందిస్తేనేమో జగన్ పై దుర్మార్గపు విష ప్రచారం చేస్తుంటారు. అదంతా విధ్వంసం అని అబద్దపు రాతలు రాస్తారు. అభివృద్ది పరంగా చూస్తే చంద్రబాబు టైమ్ లో నిర్మించలేకపోయిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ బాదితులకు ఆస్పత్రి, భారీ నీటి పధకం , విశాఖ అభివృద్ది , ఇన్ ఫోసిస్, అదాని డేటా సెంటర్, నక్కపల్లి ఫార్మాహబ్ మొదలైనవి జగన్ చేపట్టిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తాయి. విద్యుత్ రంగంలో లక్ష మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తికి గాను మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యక్షంగా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వల్ల ఏపీ అభివృద్ది పధంలో సాగుతోందని చెప్పవచ్చు. అందుకే ఏపీలో ఆదాయపన్నుశాఖ చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వాస్తవాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఏపీ వ్యతిరేక మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ, ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతోషం కలిగించే విషయమే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
Suman: వైఎస్సార్సీపీదే గెలుపు: సినీనటుడు సుమన్
తిరుపతి కల్చరల్ (తిరుపతి జిల్లా): సామాజిక న్యాయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందని ప్రముఖ నటుడు సుమన్ స్పష్టం చేశారు. తన వీరాభిమాని బుజ్జమ్మ కుమార్తె వివాహం కోసం తిరుపతికి వచ్చిన ఆయన ఆదివారం తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం సుమన్ను ఆలయ చైర్మన్ కట్టా గోనీయాదవ్ శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక ఏ పార్టీకైనా మద్దతు పలుకుతారా అని మీడియా ప్రశ్నించగా రాజకీయ పరంగా పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్స్కు ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టో అందించే పార్టీకి తన సంపూర్ణ సహకారం ఉంటుందని సుమన్ చెప్పారు. రాజకీయం అంటే పదవులు చేపట్టడం కాదని, ప్రజల సంక్షేమం దిశగా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందినప్పుడే ప్రజా నాయకులు అవుతారని, ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల కోసం శ్రమించే వారికే పట్టం కడతారని పేర్కొన్నారు. -
గృహజ్యోతి పథకానికి అర్హుల గుర్తించే ప్రక్రియ పూర్తైంది
సాక్షి, సిటీబ్యూరో: ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా త్వరలో అమలు చేయబోతున్న గృహజ్యోతి పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తైంది. గ్రేటర్ జిల్లాల పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో 48,03,963 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులు 19.80 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరంతా ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. గృహ జ్యోతి పథకానికి ప్రభుత్వం రేషన్కార్డు/ ఆధార్కార్డు/ ఫోన్ నంబర్ల అనుసంధానం తప్పనిసరి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 17.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారుల్లో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో వీరు తమ కనెక్షన్లను ఉచిత పథకానికి అనుసంధానం చేసుకోలేక పోయారు. ఫిబ్రవరి 15 వరకు 9,96,807 లక్షల కనెక్షన్లను మాత్రమే ఈ పథకానికి అనుసంధానించినట్లు తెలిసింది. మీటర్ రీడర్ల సమ్మె కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వివరాలు నమోదు చేయలేక పోయారు. అనుసంధానం ఇప్పటితో ఆగిపోలేదని, ఇది నిరంతర ప్రక్రియ అని.. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిస్కం అధికారులు చెప్పుతున్నారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు తమ కరెంట్ బిల్లుతో పాటు ఆధార్, రేషన్ కార్డులను వెంట తీసుకెళ్లి.. సమీపంలోని ఈఆర్ఓ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నా రు. కాగా.. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఇంటి యజమానుల నుంచి అభ్యంతరాలు తప్పడం లేదు. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించి కొంత మంది యజమానులు తమ ఇంట్లోని విద్యుత్ మీటర్లపై అద్దెదారుల రేషన్కార్డు, ఆధార్కార్డులను అప్డేట్ చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. -
మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’
జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. బాబు మార్కు ఎక్కడైనా ఉందా? ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా? మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్ ఉందా చంద్రబాబూ? పథకాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వాగ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మనుషుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్గా బయటకు రావాలి. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. ఏ గ్రామానికైనా వెళదాం.. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్ బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే. డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్ మాత్రమే. మొదటి చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. మీ జగన్ పేరు చెబితే.. మీ జగన్ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్ కంటెంట్, బైలింగ్యువల్ బుక్స్, ట్యాబ్లు, డిజిటల్ బోధనతో ఐఎఫ్పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్గా కరిక్యులమ్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే, పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్లో పెరగాలన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్? కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి.. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ. జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్. మన టార్గెట్ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు. మరో 55 రోజుల్లో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. మీకెందుకు ఓటేయాలి బాబూ? జగన్ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, కాసేపటికే..
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్ ఆరోపించారు. 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. .. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయి. అకౌంట్ల ఫ్రీజ్తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. .. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు. #WATCH | Congress Treasurer Ajay Maken says "We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d — ANI (@ANI) February 16, 2024 మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన. ఎక్స్ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు. सत्ता के नशे में चूर, मोदी सरकार ने लोक सभा चुनाव के ठीक पहले देश की सबसे बड़ी विपक्षी पार्टी - भारतीय राष्ट्रीय कांग्रेस - के Accounts Frozen कर दिए है। ये लोकतंत्र पर गहरा आघात है। भाजपा ने जो असंवैधानिक धन इकट्ठा किया है, उसका इस्तेमाल वे चुनाव में करेंगे, लेकिन हमने… — Mallikarjun Kharge (@kharge) February 16, 2024 ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి. -
వాళ్లది విద్వేషం! ఆ ఒక్కమాటతో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్నమాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా గట్టిగా మొహమాటం లేకుండా వెల్లడించారు. వచ్చే రెండు నెలలు ప్రజలకు అందించవలసిన సేవలను, చెప్పవలసిన విషయాలను వలంటీర్లకు వివరించి వచ్చే ఎన్నికల యుద్దానికి సన్నద్దం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఒకరకంగా ఇది ధైర్యంతో కూడిన విషయం. విపక్షాలు చేసే విమర్శలతో నిమిత్తం లేకుండా ఆయన.. పేదల తరపున పనిచేసే ప్రభుత్వానికి వలంటీర్లు వారధులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్లు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేవలం స్వచ్చంద కార్యకర్తలు. వారు తమ అభిప్రాయాల ప్రకారం రాజకీయంగా నడుచుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రపంచంలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన జగన్ దాని వల్ల కూడా తన ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పకనే చెప్పేశారు. సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లకు అభివందనం పేరుతో వారి సేవలను దృష్టిలో ఉంచుకుని అవార్డులను ప్రకటించారు. వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైనవో ప్రజలకు తెలియచెప్పవలసిన బాద్యత వలంటీర్లపై ఉందని అన్నారు. ఈ అభినందన సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకు విశేష స్పందన కనిపించింది. సీఎం., సీఎం. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ జరిగిన తీరు చూస్తే వలంటీర్లు ఎంత కమిటెడ్గా ఉన్నది, జగన్ పట్ల ఎంత అభిమానంతో ఉంది అర్ధమవుతుంది. వారిని చూడగానే ప్రభుత్వ స్కీములు పొందిన పేదలంతా ముఖ్యమంత్రి జగన్ ను చూసినట్లు సంతోషపడుతున్నారు. ప్రత్యేకించి వృద్దులైతే వారి సంతోషానికి అవధులు ఉండడం లేదు. గతంలో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గంటల తరబడి వేచి చూసి పెన్షన్ పొందడానికి నానా కష్టాలు పడవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వలంటర్ ప్రతి నెల మొదటి తేదీన ఇంటికి వచ్చి మూడువేల పెన్షన్ ఇస్తుండడంతో వారికి ఎంతో గౌరవం, సంతృప్తి ఇస్తోంది. ఇదే విషయాన్ని జగన్ తన స్పీచ్ లో కూడా ప్రస్తావిస్తూ, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని హెచ్చరించారు. గతంలో వలంటీర్ల వ్యవస్తను ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వలంటీర్లు అంటే మూటలు మూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారని టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వ్యక్తులంటూ తీవ్రంగా అవమానించారు. ఎన్నికలు దగ్గరబడుతున్న తరుణంలో వారు తమ వైఖరి మార్చుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నా, వారిలో ఈ వలంటీర్లపై పేరుకున్న విద్వేషాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నారు. ఈనాడు రామోజీరావు ఈ అల్పజీవులపై విషం చిమ్ముతూ టీడీపీ, జనసేన ఎజెండాను మోస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ వారందరిని తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ వారి సేవలను అభినందిస్తూ మాట్లాడారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కల వంటివైతే, వలంటీర్లుతో కూడిన ప్రస్తుత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తులసి మొక్క వంటివని సీఎం జగన్ కొనియాడారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో నిరుపేదలకు వలంటీర్లకు అండగా నిలవాలని ఆయన కోరారు. మేనిఫెస్టోల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి తాము ఎంతో కష్టపడి నవరత్నాల అమలుకు 70 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, అలాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా 1.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నారని, అది ప్రజలను మోసం చేయడమేనని, ఈ విషయం ప్రజలకు వలంటీర్లు తెలియచెప్పాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతన్నది ప్రజలకు అర్ధం కావాలని అన్నారు. తాము బటన్ నొక్కుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అంతకు మించి పంచుతామని అంటున్నారని, దీనిన ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ బిడ్డ పై చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా,మరో జాతీయ పార్టీ పరోక్షంగా ఏకం అవుతున్నాయని, కాని నాకు మాత్రం రెండున్నరలక్షల మంది సైన్యం ఉన్నారని జగన్ అన్నప్పుడు వలంటీర్లు అంతా హర్షద్వానాలతో హోరెత్తించారు.వలంటీర్ల సేవలకు తాను సాల్యూట్ చేస్తున్నానని అంటూ, పెత్తందార్లకు,పేదలకు మద్య జరుగుతున్న యుద్దంలో పేదలే గెలవాలని జగన్ అన్నారు. ఒకవైపు పోరాట పటిమను ప్రదర్శించడానికి వలంటీర్లలో స్పూర్తి నింపే విధంగా, మరో వైపు ప్రత్యర్ధి రాజకీయ పక్షాల డొల్లతనాన్ని ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. రెండు నెలల్లో జరిగే యుద్దానికి అంతా సిద్దం కావాలని , సిద్దం సభ తరహాలో ఆయన నినదించారు.తన ప్రభుత్వం ఎక్కడా అవినీతి లేకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర వివిధ స్కీముల కింద నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో వేసిందని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు టైమ్ లో అంతా అవినీతిమయంగా ఉండేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా టైమ్ చూసి దెబ్బగొట్టడం అంటే ఇదేనేమో!. వలంటీర్లపై టీడీపీ,జనసేన తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందుకు భిన్నంగా వలంటీర్లను గౌరవించి వారి ఆదరణను చురగొనే యత్నం జగన్ చేశారని అనుకోవచ్చు!!. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. గతంలో జన్మభూమి కమిటీలను రాజకీయ లక్ష్యంతోనే చంద్రబాబు ఏర్పాటు చేశారు.కాకపోతే వారు పూర్తిగా అవినీతి మయం అయి టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారు.కాని వలంటీర్లు ఎక్కడా అవినీతి లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. దాంతో విపక్షాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి. అంతేకాక.. చంద్రబాబు ఒకసారి తాను వేసిన రోడ్డు మీద నడుస్తూ వేరే వాళ్లకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.చివరికి తాను మంజూరు చేసిన మరుగు దొడ్డిని వాడుతూ వేరే వారికి ఓటు వేయరాదని ఆయన వాదించారు. ఈ పరిస్థితిలో జగన్ ఎక్కడా ప్రజలను బెదించడం లేదు. తాను చేసిన సేవలను ప్రజలకుగుర్తు చేయాలని మాత్రమే కోరుతున్నారు. తద్వారా ఆయన తనవాదన రెడీ చేసుకుని వలంటీర్ల అభినందన సభలో ఇంత స్పష్టంగా వారిని ఆకట్టుకునే రీతిలో స్పీచ్ ఇచ్చారని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికలలో వలంటీర్ల ప్రభావం ప్రజలపై బాగా ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ ,జనసేన భయపడుతున్నాయి. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా వారిపై కక్షపూరిత ప్రచారం చేశాయి. తద్వారా జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా వారిని రెచ్చగొట్టారని అనుకోవచ్చు. దాని ఫలితమే అభినందన సభలో జగన్ పట్ల వలంటీర్లు అంత అభిమానాన్ని కనబరుచుకున్నారని భావించవచ్చు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
కాంగ్రెస్ దెబ్బకు కూటమి అబ్బా!
'ఇండియా కూటమి' మధ్య ఐక్యత పెరగకపోగా, కూటమి విచ్ఛిన్నం దిశగా పయనం చేస్తోంది. రేపటి సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్ని పార్టీలు కలిసివుంటాయో? చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏదో ఒకటి రెండు పార్టీలు తప్ప, ఎవరూ కాంగ్రెస్ వెంట నడవడానికి ఇష్టపడడం లేదని ఈ పరిణామాలు బలంగా చెబుతున్నాయి. తాజాగా మరో పార్టీ బయటకు వచ్చేసింది. కూటమితో సంబంధం లేకుండా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా ప్రకటించారు. లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఏకకాలంలో ఎన్నికలు జరుగవచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో బలమైన ఓటుబ్యాంక్ వున్న ప్రధాన పార్టీలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి. కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే ఫారూక్ బయటకు వచ్చేశారు. ఇదే అంశంతో పాటు మరికొన్ని విభేదాలతో ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకు వస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్,కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్ లోని జెడీయు కూడా అదే బాట పట్టాయి. జెడీయు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎన్డీఏ గూటికి తిరిగి చేరింది.మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్,ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్ ది కూడా దాదాపు అదే పరిస్థితి. 2019 ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి కాంగ్రెస్ ను బలపరిచి,మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు పలికి,సహకారం అందించారని పేరుతెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ఇండియా కూటమిలోకి చేరడానికి ఆసక్తి చూపడం లేదు.రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ,మోదీ వైరిపక్షంలో చేరడానికి బాబు భయపడుతున్నారని అనుకోవాలి. ప్రస్తుతం తమకున్న అవసరాల దృష్ట్యా ఎలాగైనా మళ్ళీ నరేంద్రమోదీతో జతకట్టడానికి బాబు వీరప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. బీజేపీ పెద్దలే బాబు పొత్తును కోరుకుంటున్నారని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా,జనం నమ్మడం లేదని, రేపటి ఎన్నికల అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ - టిడిపి పొత్తుకట్టినా,అది ధృతరాష్ట్రుడి కౌగిలింత వంటిదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ యాత్రల పేరుతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ,ఇండియా కూటమిలో ఐక్యతను నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, కూటమి శక్తివంతంగా నిర్మాణమవుతుందని గాంధీ త్రయం ( సోనియా, రాహుల్, ప్రియాంక) బలంగా విశ్వసించింది.కానీ, కర్ణాటక,హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్ గడ్,రాజస్థాన్ లో అధికారం కోల్పోయింది.మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుపును ఆపలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ లో గిడుగు రుద్రరాజును మార్చి షర్మిలకు పగ్గాలు అప్పగించింది. గిడుగు రుద్రరాజు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వ్యక్తి. కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి,పల్లంరాజు వంటి అనేకమంది సీనియర్ నాయకులు ఉండగా,వారందరినీ పక్కన పెట్టి, వై ఎస్ తనయ షర్మిలకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీకి జవసత్వాలు పెరుగుతాయని కాంగ్రెస్ అధిష్టానం పెట్టుకున్న విశ్వాసం ఎంతవరకూ ఫలవంతమవుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి తేరుకోలేదు. కేవలం రెండు మూడు నెలల వ్యవధి ముందు పార్టీ బాధ్యులను మార్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పైకి లేస్తుందన్నది ఒట్టిమాటే. ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన ప్రయోగాలు ఎక్కువ శాతం బెడిసికొట్టాయి. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు పార్టీకి ఎదురుదెబ్బలుగా మిగిలాయి. ఈరోజు ఇండియా కూటమి బలోపేతం కాకపోవడం, విచ్ఛినం దిశగా ప్రయాణం చేయడానికి మూలం కాంగ్రెస్ విధానాలే.పంజాబ్ లో అమరేంద్ర సింగ్ ను తప్పించి,నవజ్యోత్ సింగ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం మొదలు ప్రతి రాష్ట్రంలో తప్పటడుగులు వేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను అడ్డం పెట్టుకొని పంజాబ్ లో ఆమ్ అద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఢిల్లీలోనూ పాగా వేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, శ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుదేలైపోయింది. నిన్న మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీ విషయంలో కాంగ్రెస్ మళ్ళీ అదే తప్పు చేసింది. కాంగ్రెస్ విధానాల వల్లనే మేం నష్టపోయామని ఆ నాయకులు పదే పదే వాపోయారు. కేజ్రీవాల్ మొదటి నుంచీ కాంగ్రెస్ తో జతకట్టడానికి పెద్దగా ఇష్టపడడంలేదు. ఇండియా కూటమి నిర్వహించిన అనేక సమావేశాలకు ఆయన ఎగ్గొట్టారు కూడా. రాహుల్ గాంధీ తీరు పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి గుర్రుమని వున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ ది కూడా ఇంచుమించు అదే తీరు. కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో లోక్ సభ లో బలాన్ని పెంచుకోక పోగా, ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని, పొత్తులను కూడా కోల్పోతూ వచ్చింది. పాండిచ్చేరి వంటి చిన్న రాష్ట్రంలో కూడా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పాండిచ్చేరిలో కూటమిలో ముసలం పుట్టిన వేళ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడే వున్నారు. తమిళనాడులో స్టాలిన్ తో స్నేహం కొనసాగుతూ ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో ఆయన కేటాయించిన అరకొర సీట్లతో సర్దుకోవాల్సిన దుస్థితి అప్పట్లో కాంగ్రెస్ కు పట్టింది. ఇప్పటికీ అదే పరిస్థితి.మొత్తంగా చూస్తే,ఇండియా కూటమి వైఫల్యానికి వున్న ప్రధాన కారణాలలో కాంగ్రెస్ విధానమే ముఖ్యమైన కారణం. ఇంకొక పక్క ఎన్డీఏ తన కూటమిని బలోపేతం చేసే పనిలో పడిపోయింది. నితీశ్ కుమార్ మొదలు అకాలీదళ్ బీజేపీ పంచకు చేరాయి. లాభనష్టాలు, పరిణామాలు ఎలా వున్నా, టీడీపీ కూడా అదే బాట పట్టింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మోదీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి తటస్థంగానే వున్నారు. 370-400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామంటూ బీజేపీ మంచి ఊపులో వుంది. ఇండియా కూటమిని నిలుపుకోడం సంగతి అటుంచి,కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తనకున్న లోక్ సభ స్థానాలను సైతం ఏ మాత్రం నిలబెట్టుకుంటుందో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాయకత్వ పటిమను పెంచుకొని, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించుకుంటేనే? ఏ పార్టీకైనా, నాయకుడుకైనా ఉనికి, భవిష్యత్తు వుంటాయి.-మాశర్మ -మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
టీడీపీకి కొత్త టెన్షన్.. అక్కడ అభ్యర్థి కరువు?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ నాయకత్వంపై ఆ పార్టీకి నమ్మకంలేక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎర్రతివాచీ పరిచింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు కంచుకోట కావడంతో పోటీ చేసినా ఓటమి తప్పదనే సంకేతాలు ఆనంకు అందాయి. దీంతో పార్టీ కండువా కప్పుకోకముందే ఈ సీటు తనకొద్దంటూ తెగేసి చెప్పి మరోసారి వెంకటగిరి వైపు చూస్తున్నారు. నో చెప్పలేక వెంకటగిరి సీటును ఆనంకే ఖరారు చేశారని సమాచారం. ఈ పరిణామాలతో ఆత్మకూరులో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట ఇంకా కొలిక్కి రాలేదు. వైఎస్సార్సీపీ గ్రాఫ్పైపైకి.. ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి విద్యావంతుడు కావడంతో అభివృద్ధి విషయంలో ఓ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనదైన శైలిలో విక్రమ్రెడ్డి దూసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు.. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పలు పనులను చేపడుతూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఆత్మకూరా.. నాకొద్దు..! టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఆత్మకూరులో చేపట్టిన సమయంలో అన్నీతానై ఆనం రామనారాయణరెడ్డి నడిపించారు. ఆత్మకూరు బాధ్యత ఇక ఆయనదేనని లోకేశ్ ప్రకటించారు. దీంతో నెల పాటు నియోజకవర్గంలో హడావుడి చేసిన ఆనం ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకొని ముఖం చాటేశారు. పార్టీతో పాటు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం ఓటమి తప్పదని తేలడంతో ఆత్మకూరు అంటేనే హడలిపోతున్నారు. దూరమైన సీనియర్ నేతలు స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆనం రామనారాయణరెడ్డికి సహకరించడంలేదు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్యనాయుడు, గూటూరు కన్నబాబు లాంటి నేతలూ దూరంగా ఉన్నారు. అటు కేడర్ కలిసిరాక.. ఇటు నేతలు సహకరించక ఆయన మీమాంసలో పడ్డారు. ఆత్మకూరు టు వెంకటగిరి వయా నెల్లూరు సిటీ ఆత్మకూరు కలిసి రాకపోవడంతో నెల్లూరు సిటీ వైపు ఆనం మొదట్లో కన్నేశారు. నగరంలో తన కుటుంబానికి రాజకీయ బలంతో పాటు అభిమాన గణం ఉండటంతో నెల్లూరు సిటీ సీటును ఇవ్వాలని చంద్రబాబును ప్రాధేయపడ్డారని సమాచారం. అయితే నారాయణకు ఖరారు చేశామని స్పష్టం చేసిన బాబు.. సర్వేపల్లిలో ఛాన్స్ ఇస్తామని చెప్పినా సిట్టింగ్ సీటు కావాలని పట్టుబట్టడంతో ఓకే చేశారని తెలుస్తోంది. సిట్టింగ్ స్థానంలోనూ తప్పని కుస్తీ ఆనం రామనారాయణరెడ్డి తన సిట్టింగ్ సీటు వెంకటగిరిని మరోసారి దక్కించుకునేందుకు కుస్తీ పడాల్సి వస్తోందనే వాదనా వినిపిస్తోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండుసార్లు విజయం సాధించి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి సై అంటున్న క్రమంలో తన ప్రత్యర్థి ఆనం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి సీటు తనదేనంటూ ప్రకటనలు చేయడంపై కురుగొండ్ల తీవ్రంగా మండిపడుతున్నారు. సీటు విషయంలో వీరిద్దరూ కుస్తీ పడాల్సి వస్తోంది. మరోవైపు వెంకటగిరి సీటును బీసీలకు కేటాయించాలని మరో నేత యత్నాలు ప్రారంభించారు. కాగా ఈ ముగ్గురిలో సీటు ఎవరికొచ్చినా మిగిలిన ఇద్దరూ హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలొస్తున్నాయంటే సాధారణంగా ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడతారు. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడి తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆది నుంచి ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ అక్కున చేర్చుకుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణతో ఇక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని తెలియడంతో ఆనం విముఖత చూపుతున్నారు. ఈ పరిణామాలతో రండి బాబూ రండీ అనే రీతిలో కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణను ప్రారంభించింది. -
చంద్రబాబు డబుల్ గేమ్.. రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్!
ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సభ్యులు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియచేస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే తన భార్యను ఏదో అన్నారని లేని సాకును చూపి సభకు రావడం మానుకున్నారు. పోనీ తనతో పాటే మిగిలినవారిని కూడా బహిష్కరింపచేశారా అంటే ఆ పని చేయలేదు. వారిని అసెంబ్లీలోకి పంపి అల్లరి చేయించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చేది కొద్ది మందే అయినా, గొడవ చేయడానికి మాత్రం సిగ్గుపడలేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సభలో నిరసనలు చెబుతుంటారు. అది తెలిసిన విషయమే. దానికి కొన్ని హద్దులు ఉంటాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో అరాచకంగా ప్రవర్తించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వస్తాయన్న భావనతో రెచ్చిపోయి వ్యవహరించారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి సెషన్గా జరిగిన సమావేశాలలో ప్రచారం కోసం వారు చేసిన హడావుడి తెలిసిపోయింది. ఏదో ఒక కారణం చెబుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం పొడియంలోకి దూసుకురావడం, ఆ తర్వాత కాగితాలు చించడం, వాటిని స్పీకర్పైకి విసరడం, ఆయన ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి, నినాదాలు చేయడం వంటి అల్లరి చేష్టలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని యత్నించారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ యథా ప్రకారం తన పిచ్చి పనులతో సభలో ఏ మాత్రం హుందాగా లేకుండా వ్యవహరించారు. గతసారి మాదిరే ఈ సెషన్లో కూడా ఆయన విజిల్స్ తీసుకువచ్చి ఈలలు వేయడం చూసి అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సినిమాకు, అసెంబ్లీకి తేడా లేకుండా వ్యవహరించారు. ఆయన అంటే మానసికంగా అంత స్థిరత్వం లేని మనిషి కనుక అలా చేశారులే అనుకుంటే కాస్త పద్దతిగా ఉంటారనుకునే సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వంటివారు కూడా అదే బాటలో నడిచారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరచిందన్న సామెతను తలపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిని చూసి మరొకరు అల్లరి చేశారు. దీనికి ఎస్సీ ఎమ్మెల్యే వీరాంజనేయులును ముందు పెట్టారు. తద్వారా ఏదైనా చర్య తీసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేని సభ నుంచి బయటకు పంపుతారా? అన్న ప్రచారం చేయడమే వారి లక్ష్యం అని తెలుస్తూనే ఉంది. గవర్నర్ స్పీచ్ జరిగిన రోజు నుంచీ ఇదే తంతు. దీనికంతటికి డైరెక్షన్ చంద్రబాబుదే అని వేరే చెప్పనవసరం లేదు. అందులోనూ టిక్కెట్లు మళ్లీ కావాలంటే ఏదో ఒక అల్లరి చేసి చంద్రబాబు దృష్టిలో పడాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తారు. వీరి ప్రవర్తనను ఈసారి స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా ఒపికగా భరించి, కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత సస్పెండ్ చేసి బయటకు పంపించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిరసనలు చేయలేదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ, వారు మరీ ఇంత మితిమీరి ప్రవర్తించలేదని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికార పక్షం నానా మాటలన్నా ఆయన భరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ను దూషిస్తుంటే నవ్వుతూ ఎంజాయ్ చేసేవారు. అదే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏదైనా నిరసనకు దిగి పోడియం వైపు వెళితే ఇంకేముంది విలువలు పాటించలేదని విమర్శించేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షం విలువలు పాటించాలి. నిరసనలు చెప్పకూడదు. సభ గురించి ఆయన క్లాస్ తీసుకుంటారు. అదే తాను ప్రతిపక్షంలో ఉంటే టీడీపీ సభ్యులను రెచ్చగొడతారు. ఇది గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు ఉన్న అలవాటే. ఒక విషయం జ్ఞప్తి చేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి సీటు నుంచి లాగేసి, తాను ఆ సీటులోకి ఎక్కిన తర్వాత చంద్రబాబు సుద్దులు చెప్పడం ఆరంభించారు. ఈనాడు అధినేత రామోజీతో కలిసి తన ఇమేజీ పెంచుకోవడం కోసం రకరకాల వ్యూహాలు అనుసరించారు. శాసనసభలో వ్యవహరించాల్సిన పద్దతులు, పాటించవలసిన విలువలు అంటూ ప్రత్యేక సదస్సులు పెట్టారు. దానికి రామోజీ కూడా ఒక స్పీకర్గా వచ్చినట్లు గుర్తు. అప్పట్లో యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉండేవారు. ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు. దాని ప్రకారం అనుమతి లేకుండా స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు ఆటోమాటిక్గా సస్పెండ్ అవుతారంటూ ఒక ఎర్రగీతను పెట్టారు. గవర్నర్ స్పీచ్ జరుగుతుంటే ప్రసంగ పుస్తకం విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడానికి ప్రత్యేకంగా ఎథిక్స్ కమిటీని సృష్టించారు. ఇలా ప్రతిపక్షంపై పలు ఆంక్షలు పెట్టిన తెలుగుదేశం పార్టీ తాను విపక్షంలోకి రాగానే మొత్తం రివర్స్ అయింది. ప్రతి నిత్యం ఏదో ఒక వివాదం పెట్టుకుని సభలో రచ్చ చేయడానికి యత్నించేది. కొన్నిసార్లు గొడవలు చేస్తూ సభలోనే ఉండిపోవడానికి యత్నించేది. ఒకసారి అయితే శాసనసభ కారిడార్లోనే చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాత్రి అంతా ఉండడానికి ప్లాన్ చేస్తే పోలీసులు వచ్చి వారిని టీడీపీ ఆఫీస్కు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. ఆయన మాట ఎవరైనా విపక్ష సభ్యుడు వినకపోతే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దానిని ఈనాడు పత్రిక పెద్ద అక్షరాలతో అచ్చేసేది. అదేదో వైఎస్సార్సీపీ చేయకూడనిది చేసినట్లు ప్రచారం చేసేది. చిత్రం ఏమిటంటే ప్రస్తుత సభలో తెలుగుదేశం పార్టీ నానా అరాచకాలకు పాల్పడుతున్నా, దానిని సమర్ధించే రీతిలో ఈనాడు రామోజీరావు కథనాలు ఇస్తున్నారు. టీడీపీ చేసిన అల్లరిని తప్పు అని రాయయకుండా, దద్దరిల్లిన సభ అని ఈనాడు హెడింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. అది శాసనసభ సమావేశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడమే అవుతుంది. నిజమే.. శాసనసభలో తమ వాదనలు వినిపించడం ద్వారా రాజకీయంగా ప్రజల ఆదరణ పొందడానికి కృషి చేయవచ్చు. అంతవరకుతప్పు లేదు. కానీ, అల్లర్లు చేయడం ద్వారానే ప్రజలను ఆకర్షించవచ్చనే పాత ఆలోచనలతోనే టీడీపీ రాజకీయం చేసింది. గత టర్మ్లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురిని మంత్రులుగా చేశారు. ఇందుకు నిరసనగా జగన్ మొత్తం సభనే బహిష్కరించారు. తనతో పాటు మిగిలిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలందరిని బయటకు తీసుకువెళ్లారు. అప్పుడు ఇదే టీడీపీ.. వైఎస్సార్సీపీని తప్పుపడుతూ విమర్శలు చేసేది. ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ సభకు రారా అని ప్రశ్నించేది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చే జీతం ,సదుపాయాలు పొందుతూ సభకు రాలేదు. పోనీ తనకు ఇష్టం లేకపోతే పదవికి రాజీనామా చేయవచ్చు. కానీ అన్నిటిలోను డబుల్ గేమ్ ఆడడం చంద్రబాబుకు అలవాటే. 1989-94 మధ్య కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని అప్పటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు రెండేళ్లపాటు సభకు రాలేదు. ఆ సమయంలో చంద్రబాబు సభలో నానా రచ్చ చేస్తుండేవారు. పలుమార్లు ఆనాటి మంత్రి రోశయ్య సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండేవారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై పెద్ద అవినీతి ఆరోపణ చేశారు. తన చాంబర్లో ఉండి అది విన్న కోట్ల వెంటనే సభలోకి వచ్చి చంద్రబాబుపై మండిపడ్డారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో టెండర్లో అధిక రేటు వేశారంటూ ఈనాడు ఒక కథనం రాసింది. దాని ఆధారంగా టీడీపీ, ఇతర విపక్షాలు కలిసి చర్చను కోరాయి. అందుకు వైఎస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే సంబంధిత నోటీసులో ఒక అంకెను మార్చి రాసినట్లు అధికారపక్షం గుర్తించింది. దానిని అప్పటి ఛీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించితే, చంద్రబాబు తాను కావాలనే అలా మార్చానని చెప్పారు. దాంతో అధికారపక్షం చంద్రబాబుపై విరుచుకుపడింది. అప్పుడు ఆయన పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ ఉదాహరణలన్నిటిని ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే టీడీపీపై చంద్రబాబు నీడ పడినప్పటి నుంచి, ముఖ్యంగా చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చినప్పటి నుంచి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఆనవాయితీ అయింది. ఇప్పుడు కూడా అదే మోస్తరుగా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుంటే, దానిని ఖండించవలసిన రామోజీరావు వంటివారు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది. పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది. పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది. ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు. పోటీలో తల్లా.. కొడుకా? రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గ్రూపులు వెంటాడుతున్నాయి పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. -
మళ్లీ సెంటిమెంట్ వైపు తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి, ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జరిగిన వాగ్యుద్దం చూస్తే గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా కనిపించింది. ఇరుపక్షాలు ఒకదానిపై మరొకటి అప్పర్ హ్యండ్ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎమ్ఐఎమ్లు కొంత ప్రాక్టికల్గా మాట్లాడారు. సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్కు మద్దతుగా బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా, తెలంగాణ రాజకీయ పక్షాలు అకనాలెడ్జ్ చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తలపెట్టారు. కాని కొందరు ఎన్జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలో విపక్ష తెలుగుదేశం పరోక్ష పాత్ర ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కనబెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్ఎస్ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో నల్గొండలో సభ జరపతల పెట్టిన నేపధ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టి శాసనసభలో ఏభై శాతం నీటి వాటా ఇచ్చేవరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి బీఆర్ఎస్తో సహా వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి. బీఆర్ఎస్ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎమ్బీ) కు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, దానికి ముందు తెలంగాణకు కూడా కృష్ణా జలాలలో ఏభై శాతం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎమ్సీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎమ్సీలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎమ్సీలు నీటిని వాడుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన ముఖ్యం అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయ లబ్ది పొందడానికి యత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఈ సెంటిమెంటును వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంటే, ఆ మొత్తం తప్పంతా బీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లవేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడూ ఏమి జరిగింది? చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎమ్సీలు వాటానీటికి, ఏపీకి 511 టీఎమ్సీలు నీరు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ తెలిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దానిని ఆమోదించడం లేదని, ఏభై శాతం నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖను కేసీఆర్ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్ఎస్దే తప్పు అని రుజువు చేయడానికి మంత్రి వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కులకు పెంచుకోగలిగారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎమ్సీలు తీసుకువెళ్లే స్కీమ్ను చేపట్టారని ఆయన అన్నారు. కాగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన వచ్చి ఇంతటి ముఖ్యమైన విషయంపై మాట్లాడాలి కదా అని అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎమ్బీకి అప్పగించడానికి అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని ఇటీవలవరకు ఉన్న ఈఎన్సీ మురళీదర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు. దానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు, మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎమ్సీల కేటాయింపు తమకు సంబంధం లేనిదని, గతంలో ట్రిబ్యునల్ చేసిందని వివరించే యత్నం చేశారు. మంత్రి ఉత్తమ్ ఆ విషయాన్ని దాటవేస్తూ మాట్లాడడం విశేషం. అలాగే కేసీఆర్ సభకు రాని అంశాన్ని హరీష్రావు సమాదానం చెప్పకుండా దాటవేశారు. నిజానికి తెలంగాణకు కేటాయించిన 299 టీఎమ్సీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే ముప్పై లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కాని ఇంకా ఆ పరిస్తితి రాలేదు. అంతేకాక కృష్ణానదికి నీరురావడం ఆరంభం అయిన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటినీ విస్మరించి, కేఆర్ఎమ్బీ ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు చర్చను జరిపారయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్ కూడా ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభలో మాట్లాడబోతున్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారుప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీనిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజీపీ సభ్యుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్తితి ఉన్నప్పుడు కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని అభిప్రాయపడ్డారు. బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? లాభం ఏమిటన్న దానిపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రస్, బీఆర్ఎస్లు ఈ కోణంలో కాకుండా పరస్పరం నిందలు మోపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో, అంతమేర నీటిని పొందడానికి యత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్లో ఈ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఏభై శాతం కృష్ణానది జలాలలో వాటా ఇవ్వాలన్న డిమాండ్కే పరిమితం అయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు దీనిని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సభలు, ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. దానిని తిప్పి కొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. కర్నాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై కడుతున్న కొత్త ప్రాజెక్టు, వర్షాభావ పరిస్థితిలో కృష్ణానదికి నీటి కొరత ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఆయా సభ్యులు ప్రస్తావించారు. ఇంకో సంగతి చెప్పాలి. కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు గతంలో భేటీ అయిన సందర్భాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పట్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించే ఒక స్కీమును కేసీఆర్ ప్రతిపాదించారు. దానికి తొలుత వైఎస్ జగన్మోహన్రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీ శాసనసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారని అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఒక వీడియోని ప్రదర్శించారు. నిజానికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా దానిని చూపారు. ఆ తర్వాత రోజులలో ఏపీ ప్రభుత్వం ఆ స్కీముపై వెనక్కి తగ్గింది. నిజానికి దానివల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం.దానిని గుర్తించే ఏపీ వెనక్కి తగ్గింది. కానీ ఉత్తమ్ మాత్రం అదేదో ఏపీకి కేసీఆర్ మేలు చేసేసినట్లు పిక్చర్ ఇచ్చారు. అలాగే ఒకసారి కుటుంబంతో సహా కంచి వెళుతూ కేసీఆర్ మధ్యలో నగరిలో ప్రస్తుత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి భోజనం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని రాయలసీమకు తరలించగలిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. దానిని వక్రీకరిస్తూ కేసీఆర్ ఏదో రాయలసీమకు నీళ్లు ఇస్తానని అన్నట్లు ఉత్తమ్, తదితర కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విశేషం. తెలంగాణతో పోల్చితే ఏపీలో విస్తీర్ణం ఎక్కువ సాగు భూమి ఎక్కువ. జనాభా ఎక్కువ. నది దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదలివేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణాపై పది అనుమతి లేని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నా లిప్ట్ ద్వారా నీటిని తీసుకువెళతారు. అదే ఏపీ వైపు నీటి మట్టం 854 ఉంటేనే అది కూడా వరద నీటినే తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామని ఏపీ వాదన. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమ్ను చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చలు జరిపారు. చివరికి దీనిని ఎంత సెంటిమెంటుగా మార్చుతారో తెలియదు కానీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది. – కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
మళ్లీ గెలిపిస్తే ఎములాడను అభివృద్ధి చేస్తా.. : బండి సంజయ్
కరీంనగర్: మళ్లీ ఎంపీగా గెలిపిస్తే వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కరీంనగర్ ఎంపీ, బీజేపీజాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాలలో సోమవారం ప్రజాహితయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయోధ్య అక్షింతలను కూడా రేషన్ బియ్యమంటూ హేళన చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. వేములవాడకు రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండని, మూలవాగుపై బ్రిడ్జి రెండుసార్లు కూలిందన్నారు. బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం, బద్ది పోచమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.575.95 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు. రెండోసారి ఎంపీగా గెలిపిస్తే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం పోయినా కేసీఆర్ మంది కొంపలు ఎట్లా ముంచాలనేదానిపైనే కుట్రలు చేస్తున్నాడన్నారు. నిరుద్యోగులు, రైతుల కోసం పోరా డితే తనపై వంద కేసులు బనాయించి, రెండు సా ర్లు జైలుకు పంపారని గుర్తు చేశారు. బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు చెన్నమనేని వికాస్రావు, తిరుపతి, రవికిశోర్ పాల్గొన్నారు. కరెంట్ సౌకర్యం కల్పించండి శాత్రాజుపల్లిలో ఆయుష్మాన్ సెంటర్ను బండి సంజయ్ తనిఖీ చేశారు. సెంటర్లో కరెంట్ సౌకర్యం, ఫ్యాన్లు, టేబుళ్లు లేకపోవడంతో వెంటనే విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేసి 24 గంటల్లో కరెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. టాయిలెట్లు కూడా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలకు బెంచీలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: 25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తే..: రాజగోపాల్ రెడ్డి -
చిహ్నం మార్పు చేస్తే ఊరుకోం.. : బోయినపల్లి వినోద్కుమార్
కరీంనగర్: తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణ చిహ్నంలో 8వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయని, కేబినెట్లో తీర్మాణం చేసి తొలగిస్తామని, తెలంగాణ చిహ్నం రాచరిక పోకడలకు సూచికగా ఉందని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ సీమాంధ్ర పాలకుల మైకంలో ఉన్నారని అర్థం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వం 7వేల స్టాప్నర్సు, 15వేల కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, ద్యావ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్ -
అపాయింట్మెంట్ కోసం 25 సార్లు రిక్వెస్ట్ ఎందుకు?
-
పిఠాపురంలో రెక్కీ పాలిటిక్స్
-
ఛీకొట్టిన చంద్రబాబు.. దయనీయ స్థితిలో బుచ్చయ్య!
-
ఇదేం ఖర్మ బాబూ!?
ఒంటరిగా వెళ్తే గెలవలేమని తేలిపోయింది. కనీసం ఓ వర్గం ఓట్లయినా లాక్కుందామనే దూరాశతో రోజుకో మాట మాట్లాడే ఆయన్ను పక్కన తెచ్చుకున్నారు. ఇంకా భయం పోలేదు. ‘‘ఆవేశం రాదా అండీ?’’ అంటూ ఒకప్పుడు ధ్వజమెత్తిన వారి వద్దకే కాళ్లబేరానికి సైతం వెళ్లిపోయారు. మీరెంతంటే అంతే, మీకివి.. మాకవి అంటూ దిగజారిపోయారు. ఆయన తీరేమో గానీ, ఇన్నాళ్లూ పార్టీ పల్లకీ మోసిన నేతల్లో మాత్రం కలవరం మొదలైంది. తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారోనని లోలోనే కుమిలిపోతున్నారు. పొత్తుల కోసం అర్రులు చాస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలిపై ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పూటకో మాట.. రోజుకో నిర్ణయం చందాన చంద్రబాబు చేష్టలు ప్రజలను విస్మయానికి గురి చేస్తుండడమేమో గానీ, ‘తమ్ముళ్ల’లో మాత్రం గుబులు రేపుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఆయన ఇప్పటికే జనసేనతో పొత్తు అంటూ వారిని పక్కలో బల్లెం లాగా కూర్చోబెట్టడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బీజేపీతోనూ పొత్తు ఉంటుందన్న సంకేతాలు ఇవ్వడంపై మండిపడుతున్నారు. జాతీయ పార్టీల నిరంకుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని.. ఇప్పుడు మళ్లీ అవే పార్టీల పాదాల వద్ద మోకరిల్లేలా వ్యవహరిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సీట్లు ఇస్తారని ప్రచారం బీజేపీ, జనసేన పొత్తులు ఖరారైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు సీట్లు ఆ రెండు పార్టీలకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వరదాపురం సూరి.. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ధర్మవరంలో పోటీ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అనంతపురం అర్బన్ సీటు జనసేన కోరుతోంది. అయితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జేసీ దివాకర్రెడ్డి తనయుడు పవన్రెడ్డిని జనసేనలో చేర్పించి అనంతపురం నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపార్టీలో ఉన్నా మనవాడే కదా అన్నది చంద్రబాబు ఆలోచన. దీనిపై మిగతా నాయకులు ససేమిరా అంటున్నారు. వరదాపురం సూరికి టికెట్ ఇస్తామనడంపై పరిటాల వర్గం భగ్గుమంటోంది. అలాగే పవన్రెడ్డికి జనసేన టికెట్ అనడంపై ఇక్కడ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ససేమిరా అంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు బీజేపీతో అంటకాగుతున్న తీరు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందని కళ్యాణదుర్గం టీడీపీ నాయకుడొకరు వాపోయారు. ఓట్లే లేనప్పుడు సీట్లు ఎందుకు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లుఉన్నాయి. ఇందులో ఎక్కడా జనసేన ప్రభావం నామమాత్రంగా కూడా లేదు. అయితే చంద్రబాబు ఏ సభ నిర్వహించినా చోటామోటా జనసేన నేతలకు సభలో పెద్దపీట వేయాల్సి వస్తోంది. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టుమని 10 ఓట్లు లేని వారు కూడా స్టేజీపై దర్జాగా కూర్చోవడంతో రగలిపోతున్నారు. ఇక ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు అంటే తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వారికి ఓట్లే లేనప్పుడు పొత్తు పెట్టుకుని సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటున్నారు. చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారా లేదా పార్టీ పరిస్థితి పాతాళానికి వెళ్లిందా అన్నది అర్థం కావడం లేదని పుట్టపర్తికి చెందిన ఒక సీనియర్ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. -
జనం గుండెల్లో జత కట్టడమే జగనన్న ఎజెండా: చెవిరెడ్డి మోహిత్రెడ్డి
రామచంద్రాపురం: ‘జెండాలు జత కట్టడమే వాళ్ల ఎజెండా అయితే.. జనం గుండెల్లో జత కట్టడమే జగనన్న ఎజెండా’ అని తుడా చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మిట్టకండ్రిగ, కుప్పంబాదూరు, సీకాలేపల్లి, నెత్తకుప్పం, అనుప్పల్లి పంచాయతీల్లో పర్యటించారు. స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. హారతులు పట్టి, టపాకాయలు పేల్చి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ బోర్డులు ఆవిష్కరించారు. బైక్ ర్యాలీగా వచ్చి మోహిత్రెడ్డికి యువకు లు స్వాగతం పలికారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఈ నాలుగున్నరేళ్ల సీఎం జగనన్న పాలనలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని మోహిత్రెడ్డి కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వారి ఆర్థిక పురోగతికి సంక్షేమ ఫలాలు అందించారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. వై ఏపీ నీడ్స్ జగన్ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకై క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ప్రశంసించారు. నాణ్యమైనవిద్య, వైద్యం, మెరుగైన పోషణ, జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం కుప్పంబాదూరు, నెత్తకుప్పం, కొత్తవేపకుప్పంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రం, వాటర్ ప్లాంట్, ఆర్వో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పల్లెబాటల్లో ప్రగతి వేగం.. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు!
కర్నూలు(అర్బన్): దశాబ్దాల తరబడి గుంతలు పడిపోయి, కనీసం నడిచేందుకు కూడా వీలు లేని గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన పల్లె రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాబార్డు నిధులు రూ.189.29 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39 పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు జిల్లాల్లో 257.79 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి. కోడుమూరు మండలం క్రిష్ణాపురం రోడ్డు పనులను పరిశీలిస్తున్న అధికారులు రహదారులు అభివృద్ధి చెందుతుండటంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 28 రోడ్లను బాగు చేసున్తన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187.27 కోట్లతో పాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో ఆయా పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు పీఆర్ ఇంజినీర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేగంగా జరుగుతున్న పనుల్లో కొన్ని ... ► పత్తికొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మద్దికెర నుంచి మొలగవెల్లి మీదుగా ఆలూరు వరకు రూ.8.15 కోట్లతో 14.90 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి నుంచి క్రిష్ణాపురం వరకు రూ.2.97 కోట్లతో 4.10 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. ► కోడుమూరు మండలం వర్కూరు నుంచి మెరుగుదొడ్డి వరకు రూ.4.50 కోట్లతో 12.05 కిలోమీటర్ల మేర రోడ్డును వేస్తున్నారు. ► దేవనకొండ మండలం కర్నూలు – బళ్లారి మెయిన్ రోడ్డు నుంచి కొత్తపేట మీదుగా పుల్లాపురం వరకు రూ.3 కోట్లతో 5.8 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ ప్రాధాన్యత రోడ్ల పనుల్లో భాగంగా చేపట్టిన పనులు పూర్తయితే దాదాపు వంద గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో మద్దికెర – ఆలూరు రోడ్డు ప్రస్తుతం మద్దికెర – ఆలూరు రోడ్డు పనులు ఏఈ స్థాయి నుంచి డీఈఈ, ఈఈ, ఎస్ఈ వరకు వారంలో ఎవరో ఒక అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేగం పెరుగుతోంది. దశల వారీగా నాణ్యతను సంబంధిత అధికారులు పరీక్షించిన తర్వాత మరో దశ పనులు చేపడుతున్నారు. నిధుల కొరత లేదు ప్రభుత్వం ఆమోదించిన రోడ్ల పనులకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఈ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి నాణ్యతతో పూర్తి చేయనున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోడ్ల పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు కూడా ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – కే సుబ్రమణ్యం, పీఆర్ ఎస్ఈ -
YSRCP IT WING: మళ్లీ జగనన్నదే జైత్ర‘యాత్ర’
అనంతపురం కార్పొరేషన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న జైత్రయాత్ర కొనసాగడం ఖాయమని స్పష్టం చేశారు. గురువారం యాత్ర సినిమా విడుదల సందర్భంగా నగరంలో పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ మాస్కులు ధరించి ర్యాలీగా వెళ్తున్న వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ రీజినల్ కో ఆర్డినేటర్ సుధీర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు సుబ్బ రాయల్, చంద్రమోహన్, శ్యాం, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నరేంద్ర రెడ్డి, కో కన్వీనర్ బ్రహ్మారెడ్డి, వెంకటేష్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏ రాష్ట్ర పార్టీలో సంక్షోభం వచ్చినా నేరుగా హైదరాబాద్కే
-
ఆ ఒక్క సీటు కోసం తన్నుకుంటున్న టీడీపీ జనసేన
-
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమపై భూపాలపల్లి పోలీస్స్టేషన్లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, గండ్ర దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తరహాలో ఈ వర్సిటీ నైపుణ్య మానవ వనరులను అందిస్తుందని వివరించారు. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్సిటీ కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారని వ్యాఖ్యానించారు. బుధవారం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. జూన్లో హైదరాబాద్లో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వనిస్తున్నామని శ్రీధర్బాబు వివరించారు. ఏఐ సాంకేతికతలో హైదరాబాద్ను గ్లోబల్ హెడ్ క్వార్టర్స్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించామని, టూరిజం అభివృద్ధిని 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ ఖాయం 1990వ దశకంలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్నప్పుడే హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్బాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... తాము హైదరాబాద్లో ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. టెలిపర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పానలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీ వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాధనాన్ని సొంత ఏటీఏంగా పరిగణిస్తుందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల జాబితా ఎప్పటికీ అంతం కాదని తెలిపారు. యూపీఏ దశాబ్ద పాలనలో రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. బుధవారం రాజ్యసభలో మధ్యంతర బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సానుకూలమైన అంశాలతో మధ్యంతర బడ్జెట్... ఈ బడ్జెట్లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. గతేడాది కంటే ఆరు శాతం అధికంగా రూ.47.65 లక్షల కోట్లు ఖర్చు చేయాలని మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిందని, రెవెన్యూ వసూళ్ళు రూ.30.8 లక్షల కోట్లుగా అంచనా వేయగా, గతేడాది కంటే వసూళ్ళు 12% ఎక్కువగా ఉందన్నారు. మొత్తంగా, ఇది దేశంలో అభివృద్ధి, వ్యయాలకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు. ద్రవ్య లోటును 5.8% నుండి 5.1%కి తగ్గించాలని ప్రభుత్వ యోచన బాగుందని ఇది ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు తోడ్పడుతుందన్నారు. కొత్త పథకాల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖకు మూలధన వ్యయంగా రూ.70,449 కోట్లు కేటాయించారని, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుందన్నారు. గత రెండు దశాబ్దాల్లో పదేళ్లు కాంగ్రెస్వల్ల నష్టపోయామని, తదనంతర పదేళ్లలో దేశం వృద్ధి చెందిందన్నారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందనడానికి సాక్ష్యం గణాంకాలేనని అన్నారు. కాంగ్రేసతర పాలనలోనే ఆర్థిక వ్యవస్థ భేష్... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కాంగ్రేసేతర ప్రభుత్వాల పాలనలో భారత్ యూకే, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలను అధిగమించి ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. కాంగ్రెస్ దుష్పరిపాలన వల్లే దేశ ఆర్థికాభివృద్ధి వెనకంజ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధిని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్థికవేత్తలుగా మన్ననలు పొందిన వారు భారత్ ఐదు శాతం జీడీపీ సాధిస్తే గొప్ప అని చెప్పినప్పటికీ ఇప్పటికే ఏడు శాతాన్ని దాటిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ను అధికారం నుంచి తరిమికొట్టినప్పుడే దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెంది బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం యాదృచ్ఛికం కాదన్నారు. 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి... కాంగ్రెసేతేర పాలనలో ఆదాయ అసమానతలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. కాంగ్రేసేతర పాలనలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. దేశంలోని ప్రజల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పెద్ద శాపంగా ఉందనడానికి ఇవన్నీ సంకేతాలని, ప్రజల అభివృద్ధికి ఆటకంగా ఆ పార్టీ నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరుకుందని, యూపీఏ–1లో 5.8శాతం, యూపీఏ–2లో 10.4 శాతంగా ఉండగా...ప్రస్తుత ప్రభుత్వంలో 4.8 శాతంగా ఉందన్నారు. యూపీఏ హయాంలో 2010–11లో అత్యధికంగా 12.2 శాతం ఉంటే కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అత్యధికంగా 6.7 శాతంగా ద్రవ్యోల్బణం ఉందన్నారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లోనూ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైందని ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ఉపన్యాసాలు ఇచ్చే హక్కు కాంగ్రెస్కు లేదని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భోపోర్స్, 2జీ, కామన్వెల్త్, బొగ్గు, ఆదర్శ్, నేషనల్ హెరాల్డ్, డీఎల్ఎఫ్, దాణా కుంభకోణాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని శ్రీ విజయసాయి రెడ్డి తెలిపారు. చేసిన అవినీతి పనులు చాపకింద నీరుగా దాచడానికి యత్నించినప్పటికీ ప్రజధనాన్ని ఫణంగా పెట్టి కాంగ్రెస్ కుబేరులు జేబులు నింపుకున్న చరిత్రను దాయలేరన్నారు. కాంగ్రెస్ పాలనలో మౌలికసదుపాయాలపై నిర్లక్ష్యం... కాంగ్రెసేతర ప్రభుత్వ హయాంలో రహదారులు, జాతీయ రహదారుల వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 8.25 శాతంగా పెరిగిందన్నారు. రహదారులపై రాబడి కూడా రూ.32వేల కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు, నిర్మాణ వేగం రోజుకి 12 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశానికి జీవనాడి అయిన రైల్వేల అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించిందన్నారు. యూపీఏ హయాంలో రైల్వేల అభివృద్ధికి రూ.46వేల కోట్లు పెట్టుబడులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. 2004–14 మధ్య 44 కొత్త విమానాశ్రయాలు నిర్మించగా పదేళ్ల ఎన్డీయే హయాంలో 74 విమానాశ్రయాలు నిర్మించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశ వృద్ధి సామర్థ్యాన్ని స్తంభింపజేసి మౌలిక సదుపాయాల పరంగా వెనకబాటుతనానికి కారణమైందన్నారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా వ్యాపారవేత్తల వాణిజ్యాన్ని కూడా కష్టతరం చేసిందన్నారు. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో భారతదేశం 142వ స్థానంలోఉంటే ప్రస్తుతం 63వ స్థానంలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ అనే కాంగ్రెస్ యుగం తొలిగిపోవడంతో గడిచిన పదేళ్లుగా చిన్న, పెద్ద వ్యాపారాలకు బహుళ ప్రయోజనాలు సమకూరాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గడిచిన ఇరవై ఏళ్లు గమనిస్తే... 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేసిన విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎంపీ శ్రీ విజయసాయి రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆర్థిక నిరాశను పెంచిందన్నారు. తప్పుడు వాగ్ధానాలతో ఖజానాను కొల్లగొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలో నెట్టారన్నారు. కాంగ్రెస్ లేకుంటే దేశం ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉండేదని అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ పాలనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
అధిష్టానాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు
ఆస్పరి: పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎవ్వరిౖపైనెనా చర్యలు తప్పవని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య హెచ్చరించారు. బుధవారం ఆయన ఆస్పరిలో జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆలూరు నియోజక వర్గంలో ఆస్పరి జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు, కొంత మంది సర్పంచులకు బెదరింపు కాల్స్ వచ్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. బెదిరించిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. రెచ్చగొట్టే వారి పట్ల పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అండగా నిలుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో సమావేశంలో జేసీఎస్ జిల్లా కన్వీనర్ తెర్నేకల్లు సరేంద్రరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు, పార్టీ నాయకులు కేశవరెడ్డి, మహానంది, నరసింహులు, దత్తాత్రేయరెడ్డి, పెద్దరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం ఇవ్వొద్దు! : తమ్మినేని వీరభద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కృష్ణా, గోదావరి జలాల విషయంలో శాస్త్రీయ పరిష్కారానికి ఆలోచన చేయాలే తప్ప కేంద్రానికి పెత్తనం అప్పగించొద్దని.. అదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక కొర్రీ సృష్టిస్తూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలిచేసి ఏకపక్ష పరిపాలన కోసమే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కేంద్రం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. కాగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదని తమ్మినేని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తుండగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేరకున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడకుండా ఓట్ల కోసం తగువు పడితే తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ శాపనార్థాలు పెట్టడం సరైందికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా ఉద్యమాలు, హక్కుల విషయాల్లో అణిచివేయడం, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాలపై అహంకార పూరితంగా ప్రవర్తించిందని తమ్మినేని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని వీరభద్రం తెలిపారు. కాగా, పాలేరు పాత కాల్వ కింద 6వేల ఎకరాల్లో వరి, 1,227 ఎకరాల్లో చెరుకు సాగు చేసినందున నీరు విడుదల చేయించే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్రావు, సాయిబాబా, ఎర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బండి రమేష్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: చర్చకు తేవాల్సిన అంశాలెన్నో.. -
కాంగ్రెస్కు భారమవుతున్నారా?
-
18న అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల కసరత్తు పూర్తిచేసి ఈ నెల 18న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగానే లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం లోక్సభ ఎన్నికలకు జరగకుండా అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే త్వర లో అభ్యర్థులను ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడేలోగా యాత్రలు.. ఈ నెల 20 నుంచి 17 ఎంపీ సీట్ల పరిధిలో రథ (బస్సు) యాత్రలకు జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలను మొదట ఈ నెల 10 నుంచి మొదలుపెట్టాలనుకున్నా అభ్యర్థులు ఖరారయ్యాక చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి యాత్రలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా (మూడు, నాలుగేసి సీట్లు ఒక్కో క్లస్టర్ చొప్పున) బీజేపీ జాతీయ నాయకత్వం విభజించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ యాత్రలను పూర్తిచేయడం ద్వారా మిగతా పార్టీల కంటే ముందే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేసినట్లు అవుతుందని భావిస్తోంది. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున నెలాఖరుకల్లా ఆయా లోక్సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసే యోచనలో పార్టీ ఉంది. త్వరలోనే ఆయా క్లస్టర్లవారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్లు తెలిసింది. సంఘ్ నేతలతో కీలక భేటీ... ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ (సంస్థాగత), కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సోమవారం రాత్రి హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట, అనంతర పరిణామాలు, లోక్సభ ఎన్నికల సందర్భంగా పరివార్ క్షేత్రాలు, అనుబంధ సంఘాలతో బీజేపీ కొనసాగించాల్సిన సమన్వయం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా పదేళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు. -
Kurnool: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
కర్నూలు(సెంట్రల్): నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాఎన్నికల అధికారి/కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్, కులగణన సర్వే తదితర అంశాలపై ఆమె రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జేసీ నారపురెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర కీలకమన్నారు. ఈక్రమంలో త్వరగా మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే 10–15 రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల పనులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా రిటర్నింగ్ అధికారి హ్యాండ్బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇతర నియమాలను తప్పనిసరిగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లతో మాట్లాడుకొని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరేందుకు అవసరమైన రూట్మ్యాప్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షలు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కులగణన సర్వే 88 శాతం పూర్తి జిల్లాలో కులగణన సర్వే 88 శాతం పూర్తయిందని, బుధవారంలోపు 90 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్లో ఉందన్నారు. కానీ ఆరోగ్యశీ యాప్ను డౌన్లోడ్ చేయించడంలో మాత్రం జిల్లా దిగువ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. బుధవారంలోపు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్లో పురోగతి సాధించేలా చూడాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు సంబంధించి వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక కమిషనర్ భార్గవ్తేజ, ఆదోని సబ్కలెక్టర్ శివనారాయన్ శర్మ, డీఆర్వో కె.మధుసూదన్రావు, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
YSRCP- మహిళా విభాగం: టీడీపీని ఓడించేందుకు మహిళలు సిద్ధం!
కర్నూలు(టౌన్): రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక్క మంచి పథకం అమలు చేయలేకపోయాడని, టీడీపీని ఓడించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శశికళారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బిర్లా కాంపౌండ్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 11న అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగనన్న నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లను ఆమెతో పాటు పార్టీ మహిళా నాయకురాళ్లు ఆవిష్కరించారు. మహిళల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో 33 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు వారిపేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. మళ్లీ జగనన్నకే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. వైఎస్ జగన్ను ఎదుర్కోలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ను వెంట పెట్టుకొని పోత్తులకు వెళ్తున్నాడన్నారు. రాష్ట్రంలో మహిళల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయన్నారు. 25 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ సీట్ల గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. సిద్ధం సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఓటమి తప్పదని తెలియడంతోనే షర్మిలను చంద్రబాబు ఎన్నికల్లో పావుగా వాడుకుంటున్నాడన్నారు. జగనన్నను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ బిడ్డ అని పార్టీ పెట్టి చాప చుట్టేసిన షర్మిల రెండు నెలల ముందు ఏపీకి వచ్చి ఏం చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గాజుల శ్వేతారెడ్డి, నగరపాలక డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకా, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ అధ్యక్షురాలు శిరోమణి, పార్టీ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరీ నాయుడు, కార్పొరేటర్ ఆర్షియా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
నిప్పు పెట్టేదే... చేతనైంది చేసుకో
తాడిపత్రి టౌన్: ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడి కందిపంటకు నిప్పు పెట్టిన ఘటన మరవకనే సోమవారం తాడిపత్రి మండలం పులిప్రొద్దుటూరులో పార్టీ సానుభూతిపరుడి గడ్డి వామికి నిప్పు పెట్టారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలు... పులిప్రొద్దుటూరుకు చెందిన ఎర్రచాగంటి రమణారెడ్డి స్థానిక టీడీపీ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి ఇంటి సమీపంలో పశువుల మేత కోసం గడ్డి వామి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రమణారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు వెంట తిరగడం జీర్ణించుకోలేని చంద్రశేఖర్రెడ్డి ఎలాగైనా రమణారెడ్డిని దెబ్బ తీయాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే గడ్డివామిని తగులబెట్టాలని నిర్ణయించుకున్న ఆయన అందుకు సిద్ధమై సోమవారం తన ఇంటి పక్కన ఉన్న చెత్తకు నిప్పు పెట్టాడు. విషయం తెలుసుకున్న రమణారెడ్డి అక్కడకు చేరుకుని నిప్పు ఆర్పాలని, లేకుంటే గడ్డి వామి కాలుతుందని ప్రాధేయపడినా వినకుండా ‘నిప్పు పెట్టేదే.. చేతనైంది చేసుకో’ అంటూ చంద్రశేఖర్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులూ దౌర్జన్యానికి దిగారు. కళ్లముందే గడ్డివామి తగులబడుతుంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో రమణారెడ్డి ఉండిపోయాడు. చంద్రశేఖరరెడ్డి దౌర్జన్యాన్ని సహించలేని గ్రామస్తులు వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. ఈలోపు గడ్డి వామి పూర్తిగా కాలిపోయి, దాదాపు రూ.50 వేల నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి సాయిప్రతాప్రెడ్డి గ్రామానికి చేరుకుని బాధిత రైతును పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పల్లె నాగేశ్వరెడ్డి, ఓబులరెడ్డి, బాబా, విజయ్కాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను వంచించింది పరిటాల కుటుంబమే..!
ఆత్మకూరు: కుట్రలు.. కుతంత్రాలే అజెండాగా ఆది నుంచి పరిటాల కుటుంబం మనుగడ సాగిస్తోందని, బీసీలను వంచించింది కూడా వారేనని ఆత్మకూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడారు. దోచుకొని, దాచుకోవడం తప్ప పరిటాల కుటుంబానికి ఏమీ తెలియదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గ్రామాల్లో కక్షలు ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందేందుకు జయహో బీసీ పేరుతో సభల నిర్వహణకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. తోపుదుర్తి కుటుంబం బీసీల పక్షపాతి పాతికేళ్లు అధికారంలో ఉండి బీసీల పేరు చెప్పుకొని ప్రజలను నిలువునా దోచుకున్న నీచ చరిత్ర పరిటాల కుటుంబానిదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కనగానపల్లి ఎంపీపీ పదవిని బీసీలను కాదని దౌర్జన్యంగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టడం, ఓబులేష్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. గతంలో బీసీలైన పార్థసారథి, కాలవ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో ప్రాధాన్యత చేకూరిందన్నారు. నియోజకవర్గంలో బీసీలకు అన్ని విధాలుగా అండగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నిలిచి, తాను బీసీల పక్షపాతినని నిరూపించుకున్నారన్నారు. మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ జనరల్కు వచ్చినా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత ఒక్క ప్రకాష్రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో పరిటాల రవి హయాంలో రక్తం ఏరులై పారితే... తోపుదుర్తి హయాంలో శాంతి కుసుమాలు విరబూసాయన్నారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు? అధికారంలో ఉన్నప్పుడు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న పరిటాల కుటుంబ సభ్యులు నేడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చారని, ఉచిత బోర్లు వేయించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. ప్రకాష్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పరిటాల సునీత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేకపోతున్నామంటూ ఆనాడు అసెంబ్లీలో మంత్రిగా ఉన్న సునీత చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు చేసిన ఒక్క మంచి పని ఏమిటో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పరిటాల కుటుంబం ఉందని విమర్శించారు. సునీత కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి? రాజకీయాల్లోకొచ్చాక పరిటాల కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. పెనుకొండలో రూ.40 లక్షల బాడుగ వచ్చే భవనం, అనంతపురంలోని శాంతి థియేటర్ వద్ద పెద్ద బిల్డింగ్ నిర్మాణం, సూర్యనగర్లో నెలకు రూ.35 లక్షలు బాడుగలు వచ్చే బిల్డింగ్, నెలకు రూ.కోట్లు ఆదాయం సమకూరే బెంగళూరులోని పబ్బులు, కియా దగ్గర భూములు, పాలసముద్రం దగ్గర 70 ఎకరాలు, పాలచెర్ల వద్ద వంద ఎకరాలు, ముక్తాపురం దగ్గర 40 ఎకరాలు, నర్సంపల్లి వద్ద 70 ఎకరాలు, కురుగుంట వద్ద రూ.కోట్ల విలువ చేసే 11 ఎకరాలు, చిన్నంపల్లి వద్ద 40 ఎకరాలు, ఆకుతోటపల్లి, ఆజాద్ నగర్లో ఎకరా స్థలంలో ఇళ్లు, బెంగళూర్లో గెస్ట్ హౌస్ ఇవన్నీ తన బినామీ పేర్లతో లేవని చెప్ప ధైర్యం సునీతకు లేదన్నారు. వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రకాష్రెడ్డిపై ఆధారాలు లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి తనకు సొంత ఇల్లు లేకపోయినా మహిళా పాడిరైతుల అభ్యున్నతికి రూ.20 కోట్లతో డెయిరీ ఏర్పాటు చేయించారన్నారు. ఆలయాలకు విరాళాలు, అభాగ్యులను ఆదుకోవడం ఇవన్నీ ప్రకాష్రెడ్డి నిస్వార్థంతో చేసినవన్నారు. అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతోనే రాప్తాడు ప్రజలు 25 వేల మెజార్టీతో గెలిపించారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. సమావేశంలో ఎంపీపీ హేమలత, బీసీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బాలపోతన్న, కన్వీనర్ పూజారి లక్ష్మీనరసింహులు, తోపుదుర్తి ఎంపీటీసీ పోతులయ్య, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వెంకట్రాముడు, వైస్ ఎంపీపీ విజయ్కుమార్ నాయక్, రంగంపేట సర్పంచ్ ఉజ్జినప్ప, బీసీ, ఎస్సీ,ఎస్టీ నాయకులు నరసింహులు, నాగరాజు, భాస్కర్, రాము నాయక్, సనప నరసింహులు, వెంకటేష్, శ్రీరామ్, టైలర్ వెంకటేష్, మురళి, వెంకటేష్, ఓబయ్య, రామాంజనేయులు, ఆంజనేయులు, బాబయ్య, గోవర్ధన్, పోతన్న పాల్గొన్నారు. -
మనం ఎందుకు పట్టించుకోం?
భారత రాజకీయాల గురించి ఒక శోచనీయమైన, దురదృష్టకరమైన నిజానికి నితీశ్ కుమార్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం ఏ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లిమొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో యూకేలో కన్జర్వేటివ్లతో లిబరల్స్ పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతిమాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ కుప్పకూలింది. మరి ఈ ‘దుముకుళ్లను’ మన ఓటర్లు ఎందుకు సమ్మతిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? నాయకులు పార్టీని వదిలి వెళ్లడం, వేరే పార్టీలో చేరడం మన అందరికీ బాగా తెలి సిన విషయమే. మనం ఆశించినంతగా ఏమీ వారు అసాధారణమైన వ్యక్తులు కారు. కానీ నితీశ్ కుమార్ అంత బుద్ధిహీనమైన పని చేసిఉండాల్సింది కాదని మీరు అంగీకరిస్తారా? ఆయన అలా చేయకుండా ఉండలేరని అందరూ ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆయన ప్రవర్తన నాకు నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆత్మగౌరవం గల ఒక మనిషి – రాజకీయ నాయకుడే అయినా – తన సొంత రాజకీయ మనుగడ కోసం తను కట్టుబడి ఉండవలసిన విలువల్ని, సిద్ధాంతా లను వెనక్కు నెట్టేయగలిగినంతగా దిగజార గలడని నేను నమ్మ లేకపోయాను. 2013 నుండి, నితీశ్ తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్నిముందుకు తీసుకెళ్లడానికి హఠాత్తుగా కూటములను మార్చేయటం ఇది ఐదోసారి. అయితే నా సహోద్యోగి అశోక్ ఉపాధ్యాయ అనటం ఏమిటంటే – మీరు కనుక నితీశ్ 1994లో సమతా పార్టీని స్థాపించడం కోసం లాలూ ప్రసాద్ యాదవ్తో, జనతాదళ్తో తెగతెంపులు చేసు కోవటాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన అలా చేయడం ఆరో సారి అవుతుందని! నేను అంతగా ఎందుకు ఆశ్చర్యపోయానని మీరు నన్ను అడగ వచ్చు. రెండు కారణాలు. నితీశ్ మళ్లీ అలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు. అలా చేస్తే కనుక విశ్వసనీయత ప్రమాదంలో పడి పోయే స్థాయికి ఆయన ఇప్పటికే చేరుకుని ఉన్నారని నా భావన. ఆయన అలా చేస్తాడని నేను అనుకోకపోవటానికి రెండో కారణం మరింతగా నిస్సందేహమైనది. బీజేపీతో తిరిగి కలిసే అవకాశంపై ఆయన, ఆయన్ని తిరిగి రెండోసారి కూటమిలోకి చేర్చుకునే విషయమై బీజేపీ... ‘అసలు అలాంటి ఆలోచనే లేదన్నట్లు’గా స్పష్టం చెయ్యటం జరిగింది. ఏడాది క్రితమే 2023 జనవరి 30న, ‘‘ఏదో ఒక రోజు మీరు బీజే పీలో తిరిగి కలుస్తారా?’’ అని అడిగినప్పుడు నితీశ్ ఇలా అన్నారు: ‘‘మర్ జానా కబూల్ హై, ఉన్ కే సాథ్ జానా హమ్కో కభీ కబూల్ నహీ హై. యే అచ్ఛీ తరహ్ జాన్ లీజియేగా.’’ (చావనైనా చస్తాను కానీ, వాళ్లతో వెళ్లి కలిసేది లేదు. దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి.)తర్వాత కొన్ని వారాలకు 2023 ఫిబ్రవరి 25న ఇదే ప్రశ్న హోంమంత్రి అమిత్ షాకు ఎదురైంది. బీజేపీ నితీశ్ను మరొకసారి అక్కున చేర్చుకోటానికి సుముఖంగా ఉందా? ‘ది హిందూ’లో వచ్చిన దానిని బట్టి అమిత్ షా ఈ విధంగా సమాధానం చెప్పారు: ‘‘ఆయా రామ్, గయా రామ్లు ఇక చాలు. నితీశ్ కుమార్కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి.’’ సరే, నితీశ్ కుమార్ ఏడాది క్రితం స్పష్టంగా మరణం కంటే అధ్వాన్నం అని భావించిన దానినే ఇప్పుడు కోరుకున్నారు. ఇక ‘ఎప్పటికీ’ అనేది అమిత్ షా ఉద్దేశంలో కేవలం తాత్కాలికం అని మాత్రమే కాదు, హాస్యాస్పదంగా అది ఎంతో స్వల్పకాలిక వ్యవధి అని కూడా!ఈ వైఖరులపై అవమానకరమైన మాటలు వచ్చి పడటంలోవింతేమీ లేదు. నితీశ్ని పల్టూరామ్, పల్టూమార్, పల్టూపుత్ర అంటు న్నారు. శశి థరూర్ అయితే సహజంగానే ఇప్పుడంతగా వాడుకలో లేని ఆంగ్ల పదాన్ని నితీశ్కు అన్వయించడం కోసం తవ్వి తీశారు. ‘స్నోలీగోస్టర్’ అనే మాట అది. ‘తెలివైన, కానీ విలువల్లేని వ్యక్తి’ అని ఆ మాటకు అర్థం. ఏమైనా ఈ పరిణామంపై నా ఆందోళన ఇక్కడితో ఆగటం లేదు. భారతదేశ రాజకీయాల గురించి విచారం వ్యక్తం చేయదగిన, దురదృష్టకరమైన ఒక నిజానికి నితీశ్ కుమార్ సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం అనేది ఏ ప్రధాన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. పైగా ఖండించదగినది. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లి మొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో బ్రిటన్లో లిబరల్స్ అనేవాళ్లు కన్జర్వేటివ్ లతో పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతి మాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓట్లు రాబట్టలేక లిబరల్ పార్టీ కుప్పకూలింది... ఇండియాలో జరగని విధంగా! మన భారతీయులం భిన్నంగా ఎలా ఆలోచి స్తామో, భిన్నంగా ఎలా స్పందిస్తామో చూపించటానికి అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని ఉదాహ రణలు మాత్రమే. మధ్యప్రదేశ్లో ప్రతి పక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకు రావటానికి కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరినవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని సాధించారు. ఈ దుముకుళ్లను మన ఓటర్లు ఎందుకు సమ్మ తిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? ప్రజాసేవ కంటే, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కంటే తమ ప్రయోజనాలకు, సంపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎందుకు మన ఓటర్లు పట్టించుకోరు?ఎందుకు అన్నదానిపై అనేక విధాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కూడా నా దగ్గర సమాధానమైతే లేదు. వాటిల్లో ఒక అభిప్రాయం... అలాంటి రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాలకు కావలసినవన్నీ చేసిపెడుతుంటారని; అలాగే వారి నేర్పరి తనం, రాజకీయ చలనశీలత వారిపై వ్యతిరేకతను కాక, ప్రజల మన్ననను పొందేలా చేస్తోందని! కానీ ఆ అభిప్రాయాలు సరైనవని అనిపించేవి కావు. సాకులు లేదా, అనుకూల వాదనలు. లేదంటే నిలబడని సమర్థింపులు. చివరికి చెప్పొచ్చేదేమంటే, లోపం మనలో ఉన్నదే కానీ, మన తలరాతలో ఉన్నది కాదు. తెలిసే మనం ఇలాంటి నాయకులకు, తమ స్వార్థం కోసమే తప్ప మరింత గొప్ప లక్ష్యాలకు, గొప్ప ప్రజా ప్రయో జనాలకు కట్టుబడి ఉండని వారికి – వాళ్లెప్పుడైనా ప్రజలకు కొంత మేలు చేస్తే చేసి ఉండొచ్చుగాక – ఓటు వేస్తాం. అది కొనసాగినంత కాలం భారతదేశ నితీశ్కుమార్లు మన రాజకీయాలను స్వేచ్ఛగా నడిపిస్తూనే ఉంటారు. మన భవిష్యత్తును కూడా! - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
బీడు భూముల్లో ఇం‘ధనం’..!
రాయదుర్గం: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల చెంతకు వ్యవసాయ సేవలను తీసుకొచ్చింది. విత్తనం మొదలు పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు సాయమందిస్తోంది. మరో వైపు వ్యవసాయం చేసే పరిస్థితులు లేక భూములు బీడు పెట్టుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో బీడు భూములు కలిగిన రైతులకు ఇంధన రంగం ద్వారా శాశ్వత ఉపాధి మార్గం చూపేందుకు ముందుకొచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రూ.12,065 కోట్ల వ్యయంతో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 3,300 మంది, పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి లభించనుంది. నెడ్క్యాప్ ఆధ్వర్యంలో భూసేకరణ.. సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమయ్యే భూములను నెడ్క్యాప్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. నెడ్క్యాప్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామసభలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం మండలాల్లో ఇప్పటికే 15 వేల ఎకరాలు గుర్తించారు. అందులో 6,750 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం తీసుకున్నారు. ప్రస్తుతం డీ హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అదనంగా మరో 2,250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇన్వెస్టర్లను ఒప్పించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాప్తాడులో 1,050 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో 1,050 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను నెడ్క్యాప్ ప్రతినిధులు ముమ్మరం చేశారు. 30 ఏళ్ల లీజుతో సుస్థిర ఆదాయం.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటైతే బీడు భూములకు మహర్దశ కలగనుంది. రైతుల అంగీకారం మేరకు 30 ఏళ్ల పాటు లీజు అగ్రిమెంట్తో నెడ్క్యాప్ ఒప్పందం చేసుకోనుంది. సాధారణంగా రైతు గుత్త (కౌలు)కు ఇస్తే ఎకరా రూ.5వేల నుంచి రూ.8 వేలకు మించదు. అలాంటిది ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు ధర నిర్ణయిస్తే, రైతు సంక్షేమం దృష్ట్యా మరో రూ.5 వేలు పెంచి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను ఒప్పించింది. సోలార్ ప్లాంట్ ప్రతీకాత్మక చిత్రం ఈ నేపథ్యంలో ఎకరాకు రూ.30 వేల చొప్పున రైతు ఖాతాకు నేరుగా జమ కానుంది. పంట పండినా ఇంత మొత్తం చూడటం సాధ్యం కాదని అన్నదాతలు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రెండింతల సుస్థిర ఆదాయం లభిస్తుండడంతో చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మౌలిక వసతులు మెరుగు.. సోలర్ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతం సీనరేజ్ నిధులను సమీప గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తద్వారా రైతు, కూలీల జీవనోపాధికి తోడు గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. వలస మాటే లేకుండా సొంతూళ్లలోనే వేలాది మంది నిరుద్యోగులు, కూలీలకు ఉపాధి లభించనుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాయదుర్గం రూపురేఖలు మారుస్తాం రాయదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చుతాం. పేదరికం శాశ్వతంగా దూరం చేసేలా కృషి చేస్తాం. ఇప్పటికే జాజరకల్లు వద్ద రూ.533 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఇంధన తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది. తాజాగా సోలర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 3వేలకు పైగా మెగావాట్ల సోలర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఇన్వెస్టర్లను ఒప్పిస్తాం. రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోలార్ ప్లాంట్లలో స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తాం. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రైతులు ముందుకు రావాలి బీడు భూములు, వర్షాధారంగా అరకొరగా పంట పండే రైతులు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఐదు ఎకరాలున్న రైతు కూడా పైసా పెట్టుబడి లేకుండా ఏడాదికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనివల్ల ప్రయోజనం తెలిశాకే అంగీకారం పొందవచ్చు. – రాణీ సుస్మిత, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
YSR Bima: దిగులు తీర్చి.. ధీమానిచ్చి
జీవన ప్రయాణంలో అన్ని వైపుల నుంచి అదృష్టం కలిసొస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. పొరపాటున ఊహించని సంఘటన ఏదైనా జరిగి, కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రాణాలు వదిలితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అదే నిరు పేదల పరిస్థితైతే వర్ణణాతీతం. అలాంటి పేద కుటుంబాల దిగులు తీర్చి ధీమా నిస్తోంది వైఎస్సార్ బీమా పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. కడప రూరల్: పేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అనుకోని విధంగా ప్రమాదం జరిగినపుడు ఎవరూ ఆదుకోరనే భయాన్ని పోగొట్టారు. దీంతో నిరుపేదలకు భరోసా లభించింది. ప్రభుత్వం 2020 అక్టోబరు 22న రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్కార్డు కలిగిన 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు ప్రజలందరూ ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తు మరణించినా, వృద్ధాప్య తదితర సహజ కారణాలతో మృతిచెందినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా ఈ పథకం ద్వారా బాధిత కుటంబానికి ఆర్థికసాయం లభిస్తుంది. కుటుంబంలో నామినీగా ఉన్న వ్యక్తికి బీమా నగదు అందుతుంది. ఆ ప్రకారం ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు, 18–50 ఏళ్లలోపు సహజ మరణం పొందిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందుతుంది. తక్షణ సాయంగా దహన సంస్కారాలకు రూ. 10 వేలను అందజేస్తారు. 566 కుటుంబాలకు ప్రయోజనం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ బీమా కింద సహజ మరణాలకు సంబంధించి 572 నమోదయ్యాయి. అందులో ఒకరికి రూ. ఒక లక్ష చొప్పున 481 కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం రూ 4.81 కోట్లు బీమా సొమ్మును అందజేసింది. అలాగే వివిధ ప్రమాదాల్లో 111 మంది మృత్యువాతపడగా, అందులో ఒకరికి రూ 5 లక్షల చొప్పున 85 మందికి మొత్తం 4.25 కోట్ల బీమా సొమ్ము లభించింది. మొత్తం 683 మందికిగాను 566 కుటుంబాలకు చెందిన నామినీలకు మొత్తం రూ.9.06 కోట్ల ప్రయో జనం చేకూరింది. బీమాకు సంబంధించిన పత్రాలను సమర్పించిన 21 రోజుల్లోపే ప్రభుత్వం నామినీ ఖాతా లకు సొమ్మును జమ చేయడం ప్రశంసనీయం. దీంతో బాధిత కుటుంబాలకు దిగులు తీర్చి బీమా ద్వారా ధీమాను కలిగించినట్లైంది. ఈ పథకం అమలు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1. పిల్లలతో ఉన్న ఈమె పేరు మూడే అరుణ. భర్త శ్రీను నాయక్. చేపలు పట్టేవారు. వారు మైదుకూరులో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఓ రోజు శ్రీనునాయక్ చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ ఊహించని విధంగా నీళ్లలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాంటి కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం వెలుగులు నింపింది. తనకు అధికారులు వైఎస్సార్ బీమా కింద రూ 5 లక్షలు ఇచ్చారని అరుణ తెలిపింది. ప్రభుత్వం తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఙతలు తెలిపింది. 2. ఈమె పేరు మాండ్ల వరలక్ష్మి. కూలీ పనికి వెళుతుంది. భర్త శివప్రసాద్ హమాలీ పని చేçస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరిది రాజుపాళెం మండలం. వీరికి ఇద్దరు సంతానం. శివప్రసాద్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ తరుణంలో ఆ కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం కొండంత అండగా నిలిచింది. నామినీగా ఉన్న వరలక్ష్మికి ప్రభుత్వం రూ 5 లక్షలను అందజేసింది. దీంతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని ఆమె తెలిపింది. 3. ఈమె పేరు గోవిందు శ్యామల. కూలీ పనులకు వెళుతుంది. భర్త పేరు లక్షుమయ్య. మగ్గం పని చేసేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిది మూద్దనూరు మండలం. ఒక రోజు పొలంలో గడ్డి కో స్తుండగా లక్షుమయ్యను పాము కాటుతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో నామినీగా ఉన్న లక్షుమయ్య భార్య శ్యామలకు బీమా కింద రూ 5 లక్షలు వచ్చింది. బీమా కారణంగా తనకు ఆర్థిక సహయం కలిగిందని, ప్రభుత్వం తమ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేసింది. వైఎస్సార్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలంతా వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి పెద్దకు ఏమైనా జరిగితే నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను సమరి్పంచిన 21 రోజుల్లోనే నామినీకి క్లైమ్ను అందజేస్తాం. ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది. – ఆనంద్ నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -
సాహితీ ధృవతార ఖమర్
మదనపల్లె సిటీ: రాయలసీమ ఉర్దూ సాహిత్యంలో ఖమర్ అమీని అలియాస్ ఖమర్ హజరత్ అంటే తెలియని వారుండరంటే అతిశయోశక్తి కాదు. సాహితీ ప్రపంచంలో ధృవతార ఆయన. 80 ఏళ్ల వయస్సులోనూ మాతృభాషలైన ఉర్దూ, జాతీయ భాషలైనా హిందీలకు సేవలందిస్తున్నారు. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు, కవితా సంపుటాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాయి. మైనార్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉర్దూ అకాడమీ 2023 ఏడాదికి ఖమర్కు జీవిత సాఫల్య అవార్డు రాష్ట్ర సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన రచనలు గురించి కథనం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం దేవళంవీధిలో నివసిస్తున్న ఈయన ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుడు. అసలు పేరు బాబా ఫకృద్దీన్. కలం పేరు ఖమర్ అమీని. 22 ఏళ్ల పాటు ఉర్దూ ఉపాధ్యాయునిగా , 18 ఏళ్లు హిందీ ఉపాధ్యాయునిగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేసి పదవీ విరమణ అనంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 1954లో మొదట కవిత్వం రాయం ప్రారంభించిన అమీని ఇప్పటి వరకు వేలాది కవిత్వాలు రాశారు. ఆయన రాసిన ‘అమ్మకు ఓ అక్షరం(మా)’ అను కవితకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. ఆయన ప్రసిద్ది చెందిన కడప పెద్ద దర్గాలో 30 సంవత్సరాలు సాహితీ సేవలు అందించారు. ఆయన రచించిన కవితలు ప్రఖ్యాత గాయకులు పంకజ్ఉదాస్, విఠల్రావు, అశోక్ఖోస్లాతో పాటు పలువురు ప్రసిద్ద ఖవ్వాల్లు పాడారు. ఖమర్అమీని రచించిన కవితల పుస్తకాలు గుల్దస్తే, తవాఫే–గజల్, నాత్కీ అంజుమన్,కష్కోల్–ఏ–ఖల్బ్–ఓ–నజర్, ఇర్తెకాజ్–ఏ–అప్కార్,కష్కోల్–కరమ్ బిరుదులు: అనీస్–ఉస్–షోరా, నఖీబ్–ఉష్–షోరా ప్రశంసలు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ,మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్, ప్రముఖ గేయరచయిత సీ నారాయణరెడ్డిలచే పలు ప్రశంసలు అందుకున్నారు. సాహితీ సేవకు వయస్సు అడ్డురాదు సాహితీ సేవకు వయస్సు అడ్డంకి కారాదు. నాకు గుర్తింపునిచ్చిన భాష సేవకే జీవితాన్ని అంకితమిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు సాహితీ సేవలందిస్తాను. ఇప్పటివరకు వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దాను. –ఖమర్ అమీని, ప్రముఖ ఉర్దూ రచయిత -
CBN: అదొక అవుట్డేటెడ్ పాయిజన్!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త డైలాగు నేర్చుకుని వచ్చి జనం మీద వదలుతున్నారు. తనది విజన్ అట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పాయిజన్ అట. డెబ్బైనాలుగేళ్ల వయసులో కూడా ఆయన నిజాలు చెప్పడం లేదు. చంద్రబాబుది అమరావతి రియల్ ఎస్టేట్ విజన్ అయితే, జగన్ది రియల్ డెవలప్ మెంట్ విజన్ అని చెప్పాలి. చంద్రబాబు తన టైమ్ లో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాకుండా తాను ఫలానా పని చేశానని చెప్పుకోగలిగే పరిస్థితి లేదు. అందుకే ఎంతసేపు వైఎస్ జగన్ను విమర్శించడమే తన విజన్ అన్నట్లుగా పాయిజన్ అంటే విషం వెదజల్లుతున్నారు. నిజంగా చంద్రబాబుకు విజన్ అన్నది ఉంటే ఏపీలో స్కూళ్లను ఎందుకు బాగు చేయించలేదు? ఏపీలో ఆస్పత్రులను ఎందుకు ఆధునీకరించలేదు. ప్రజల వద్దకే పాలనను ఎందుకు తీసుకు వెళ్లలేకపోయారు? ఏపీలో ప్రస్తుతం సాగుతున్న పోర్టుల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ది, పలు చోట్ల పారిశ్రామికవాడల అభివృద్ది మొదలైనవి ఎందుకు ఆయన హయాంలో చేయలేకపోయారు? నిజంగా చంద్రబాబుకు విజన్ ఉంటే ఒకసారి ప్రత్యేక హోదా అని మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అని ఎందుకు అన్నారు. ప్రధాని మోదీని మోసగాడు అని ఒకసారి, గొప్పవాడు అని మరోసారి వ్యాఖ్యానించిన చంద్రబాబు ఎలా విజనరీ అవుతారో తెలియదు. బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని, నరేంద్ర మోడీ హంతకుడు అని పెద్ద గొంతుతో అరిచిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ చంక ఎక్కడంలో ఆయన విజన్ ఉందని అనుకోవాలి. హైదరాబాద్లో ఒక భవనం కట్టి ,మొత్తం నగరం అంతా తానే కట్టానని చెప్పడంలో చంద్రబాబు విజన్ ఉంది. ఎక్కడ ఎవరు ఏమి చేసినా, అదంతా తన ఖాతాలో వేసుకోవడంలో ఆయన విజన్ ఉందని ఒప్పుకోక తప్పదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుంటే అడ్డుపడే యత్నం చేసిన చంద్రబాబు ఆ తర్వాత రోజుల్లో తానే దానిని వేశానని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తుంటే తన పార్టీవారితో దానికి వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బారేజీ వద్ద ధర్నా చేయించిన చంద్రబాబు, తానే రాయలసీమకు మేలు చేశానని మిగిలినవారు ద్రోహులని ప్రచారం చేసుకోవడంలో ఆయన విజన్ కనిపిస్తుంది. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా అన్నీ తనవే అని అంటారు. రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి అవసరాలు తీర్చుతూ, వారితో అబద్దాలు ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు విజన్ ఉందని అంగీకరించవచ్చు. చంద్రబాబు టైమ్లో కియా తప్ప, ఇంకొక పరిశ్రమ ఏదైనా వచ్చిందేమో చెప్పమనండి. అందులో కూడా పట్టుమని వెయ్యి ఉద్యోగాలు రాలేదు. కాని బిల్డప్ మాత్రం చాలా ఉంటుంది. అయినా ఫర్వాలేదు. కాని రాజశేఖరరెడ్డి సమయంలో వచ్చిన శ్రీసిటీ, అచ్యుతాపురం సెజ్, ఇలా ఒకటేమిటి. అనేకం ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనకు వచ్చాక శ్రీ సిటీలో పలు పరిశ్రమలు వచ్చాయి. అచ్యుతాపురం లో పరిశ్రమలు వచ్చాయి. నక్కపల్లి పార్మాహబ్ రాబోతోంది. రామాయంపట్నం వద్ద ఇండో సోలార్ పానెల్ ప్లాంట్కు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. బద్వేల్ వద్ద సెంచురి ప్లై వుడ్ ప్యాక్టరీ శంకుస్థాపన, ప్రారంభోత్సం రెండూ జగనే చేశారు. వైఎస్ఆర్ కాలంలో శ్రీ సిటీకి భూములు సేకరిస్తుంటే ఇదే చంద్రబాబు, ఇదే రామోజీరావు దానికి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేశారు? ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే అదంతా తమ ఘనతే అన్నట్లు ఎలా చెప్పుకునే యత్నం చేశారో అందరికి తెలుసు. చంద్రబాబు తాజా అబద్దం ఏమిటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పడం. దేశం అంతటా కలిపే అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో, రావో కాని ఈయన మాత్రం ఏపీలో అన్నీ ఇచ్చేస్తారట. లేకుంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల చొప్పున భృతి ఇస్తారట. గత టర్మ్లో కూడా ఇలాంటి హామీలు ఎన్నో చేసి 90 శాతం చేయకుండా మోసం చేసిన చంద్రబాబు విజనరీ అట. అది జనం నమ్మాలట. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రచారం చేస్తే జనం అంతా నోట్లో వేలేసుకుని వినాలట. అమరావతిలో ఎంత విజన్ అంటే సింగపూర్ నుంచి ప్రైవేటు కంపెనీలు తీసుకు వచ్చి ఆ దేశ ప్రభుత్వమే వచ్చిందని ప్రచారం చేసేంత. చివరికి ఈయనతో సావాసం చేసిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని పదవి పోగొట్టుకున్నారు. ఇది కూడా విజనేనేమో! తల్లికి వందనం కింద ఎందరు పిల్లలు ఉంటే అందరికి డబ్బులు వేస్తానని అసత్యపు హామీ ఇవ్వడంలో ఆయనకు విజన్ ఉంది. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని తప్పుడు వాగ్దానం చేసే విజన్ చంద్రబాబుకు ఉందని ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు ఇస్తున్న ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను కదా పాయిజన్ అని అనాల్సింది. మరి జగన్ ఇలాంటి మోసాలు చేశారా? తను ఏమి చెప్పారో అవి చేసి చూపించారా? లేదా? పలాస వద్ద కిడ్నీ బాధితులకోసం తీసుకు వచ్చిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, వాటర్ స్కీమ్ చాలు జగన్ ఎంత విజనరీ అన్నది చెప్పడానికి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడల వద్ద సాగుతున్న ఓడరేవుల నిర్మాణం చాలు ఆయన ఎంత విజనరీ అన్నది వివరించడానికి, పాడేరు వంటి గిరిజన ప్రాంతంలో కూడా వైద్య కళాశాల పెడుతున్న జగన్ది విజన అవుతుంది కాని అసలు ఈ ఆలోచనలే చేయని చంద్రబాబుది విజన్ ఎలా అవుతుంది. వలంటీర్ల వ్యవస్థ తెచ్చి వృద్దులకు ఇళ్లవద్దే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం, రేషన్ను కూడా ఇళ్లకే పంపించడం, గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా 500 పైగా పౌర సేవలను అందించడం, ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఆధునిక విద్య, టాబ్ లు ఇవ్వడం, స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఏర్పాటు చేయడం, విలేజ్ క్లినిక్స్ నిర్మించడం, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ..ఇవన్ని జగన్ విజన్కు నిదర్శనాలు కాదా! చంద్రబాబేమో లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తే, జగన్ మాత్రం రెండున్నర లక్షల కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా పేదల ఖాతాలలో వేసి చరిత్ర సృష్టించారు. దీనిని కదా మాట నిలబెట్టుకోవడం అని అనాల్సింది. వలంటీర్ల వ్యవస్థపై నోరుపారేసుకుని అవమానించడాన్ని పాయిజన్ అంటారు తప్ప, జగన్ తీసుకువచ్చిన సంస్కరణలను కాదు. ఏ రకంగా చూసినా జగన్లో ఉన్న విజన్ చంద్రబాబుకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అవుట్ డేటెడ్. జగన్ అప్డేటెడ్ నేత. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
విలువలు లోపించాయి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగ విలువలు లోపించాయని, అధికారం వచ్చాక తాము ఏది చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ వేదికగా గురువారం ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడు గురించి రచించిన ‘మూడు దారులు’పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ జె.చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరంగా విధివిధానాలు వేరైనా.. ముగ్గురి గమ్యం ఒక్కటేనని అన్నారు. పాదయాత్ర అనంతరం వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఒక సందర్భంలో వైఎస్ను కలసినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. నేరుగా ప్రజల చెంతకు వెళ్లి, వారికి నమ్మకం కల్పించిన నాయకుడే అధికారాన్ని పొందగలుగుతాడని ఆయన పేర్కొన్నారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి జననేతగా నిలిచారన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాడు.. ఒక పాత్రికేయునిగా తాను చూసిన వాస్తవ సంఘటనలను తన అభిప్రాయాలుగా మూడు దారలుగా తీసుకువచ్చానని రచయిత దేవులపల్లి అమర్ అన్నారు. ఉత్తరాది రాజకీయ నాయకులకు దక్షణాదిలో కొనసాగుతున్న వాస్తవ రాజకీయ పరిణామాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఇదే పుస్తకాన్ని ‘డక్కన్ పవర్ ప్లే’పేరుతో ఇంగ్లిష్లో కూడా తీసుకువచ్చానని చెప్పారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అసమ్మతి నేతగా కొనసాగి, ప్రజల మొప్పుతో ఆ పార్టీనే తనపైన ఆధారపడేలా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులతోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారుకానీ, చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసిన ప్రతీసారి బాబు ఓడిపోయారన్నారు. 1993లో ఎన్టీఆర్ తనకు జరిగిన మోసాన్ని తిప్పికొట్టి 1994లో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారని, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకు వెన్నుపోటు పోడిచి చంద్రబాబు సీఎంగా మారారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన తండ్రికి భిన్నంగా ప్రయాణం చేశారని, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నిరాకరిస్తే ఆ పార్టీనే వదిలి ప్రజల చెంతకు చేరారని అన్నారు. కక్షసాధింపుతో ఆ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టినా 16 మాసాలు జైల్లో ఉండి, అనంతరరం ప్రజల మెప్పుతో 2019లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం, చక్రధర్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు...’ అని విజయవాడ లోక్సభ సభ్యుడు, వైఎస్సార్సీపీ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. సీఎం వైఎస్ జగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని చెప్పారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ పేదల కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు మాత్రం ధనికుల కోసం పని చేస్తారని చెప్పారు. సమాజం బాగుండాలని వైఎస్ జగన్ కృషి చేస్తుంటే... బాబు మాత్రం తన కొడుకు కోసం తపనపడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్లా పనిచేసే వారు ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోనే సుమారు రూ.2.50 లక్షల కోట్లు జమచేశారని, ఆ భగవంతుడే సీఎం జగన్ రూపంలో పేదలకు మేలు చేస్తున్నారని ప్రశంసించారు. పేదల కోసం సీఎం జగన్ ఇన్ని చేస్తుంటే రాష్ట్రం దివాలా తీసింది... అంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్నిచిన్న రోడ్ల ఫొటోలు తీసి పచ్చ పత్రికలో పెద్దగా ప్రచురిస్తున్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగానే ఉన్నాయని నాని స్పష్టంచేశారు. వైఎస్సార్ ఆసరా కింద విజయవాడ నగరంలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చారంటే పేదలపట్ల సీఎం జగన్కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత విద్య చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని గుర్తుచుశారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ‘ప్రతిపక్షాలకు దమ్ముంటే రండి. మేం చేసిన అభివృద్ధి చూపిస్తాం. మేం మంచి చేశాం కాబట్టే దమ్ముగా ప్రజల్లోకి వెళ్తున్నాం.’ అని అన్నారు. టీడీపీ, జనసేన కుల పార్టీలని, వాటికి ప్రజలకు మేలు చేయాలనే అజెండా లేదన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ తరఫున లోకేశ్ పిటిషన్ ఎలా వేశారు?
సాక్షి, హైదరాబాద్: ‘వ్యూహం చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కమిటీ జారీ చేసిన యు సర్టిఫికెట్ రద్దు చేయాలన్న పిటిషన్పై సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ఇక్కడకు అప్పీల్ వచ్చింది.. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదు..’ అంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడి(అచ్నెన్నాయుడు, ఏపీ) అనుమతి లేకుండా పిటిషన్ వేయడానికి రిట్ పిటిషనర్(లోకేశ్)కు ఏం అధికారం ఉందని ప్రశ్నించింది. ‘విచారణకు సిద్ధమై రావాలి కదా.. సబ్జెక్ట్పై వాస్తవాలు వెల్లడించండి. పార్టీ నిబంధనల ప్రకారం ఏపీ అధ్యక్షుడి అనుమతి ఎందుకు తీసుకోలేదు?’ అని మండిపడింది. శుక్రవారం వరకు సమయం కావాలని టీడీపీ న్యాయవాదులు అడగడాన్ని తప్పుబట్టింది. వ్యూహం చిత్రానికి సీబీఎఫ్సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున సీనియర్ న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, చిత్ర విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
కొవ్వూరు టీడీపీలో మళ్లీ భగ్గుమన్న అసమ్మతి
కొవ్వూరు: వారం పది రోజుల్లో టీడీపీ టికెట్లు ప్రకటిస్తారన్న సమాచారంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గ్రూపు రాజకీయాలు రోడ్డున పడ్డాయి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలున్నాయన్న సంకేతాలతో ఆయన వ్యతిరేక వర్గం కొన్నాళ్లుగా అసంతృప్తి గళం విప్పుతున్న విషయం తెలిసిందే. జవహర్ను టార్గెట్గా చేసుకుని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు వారం రోజులుగా గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం పేరిట కొవ్వూరు లిటరరీ క్లబ్ కల్యాణ మండపంలో గురువారం సమావేశం నిర్వహించారు. దీనికి అచ్చిబాబు వర్గీయులు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా జవహర్కు టికెట్టు ఇవ్వద్దన్న ఏకై క నినాదాన్ని తెర పైకి బలంగా తీసుకువచ్చారు. గ్రూపులకు తెర తీశారు ఈ సమావేశం పూర్తిగా జవహర్ను టార్గెట్ చేస్తూ సాగింది. ‘కేఎస్ జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తనకు టికెట్టు వచ్చినట్లు జవహర్ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులను గ్రూపులుగా విభజించి అనైక్యతకు దారి తీసేలా జవహర్ పని చేశారని మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని సూర్య భాస్కర రామ్మోహన్ (చిన్ని) ఆరోపించారు. నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకూ పార్టీని రెండు వర్గాలుగా విడదీసి భ్రష్టు పట్టించారని అన్నారు. ఈ నేపథ్యంలో 2020లో అధిష్టానం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి, గ్రూపులను సమన్వయంపరిచే ప్రయత్నం చేసిందన్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ నిర్వహించినప్పుడు, చంద్రబాబు అరెస్టు సమయంలోను పార్టీని రెండు గ్రూపులుగా విభజించి కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. 2021లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జవహర్ బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచీ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలు, నచ్చిన వారికే పదవులు కేటాయింపు చేసుకున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడి ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాని, శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లడమే నాయకత్వంగా భావించారని చిన్ని విమర్శించారు. ఎస్సీ విభాగం నాయకుడు మాట్లాడుతూ, గతంలో తనను ఓడించడానికి ప్రత్యర్థులకు సైతం జవహర్ సొమ్ములు సర్దుబాబు చేశారని, దళితుడినైన తన పైనే హత్య కేసు నమోదు చేయించి, వేధించారని ఆరోపించారు. నియోజకవర్గంలో జవహర్ విద్వేషాలు రెచ్చగొట్టినా పార్టీ కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని తెలుగు యువత నాయకుడు కాకర్ల సత్యేంద్ర అన్నారు. టీడీపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ అణగదొక్కేందుకు జవహర్ ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పటికీ ఆయనపై ప్రత్యక్ష పోరాటం చేశామని అన్నారు. చాగల్లు మాజీ ఎంపీపీ కేతా సాహెబ్, తెలుగు యువత నాయకులు నాదెండ్ల శ్రీరామ్, ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణ తదితరులు కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గారపాటి శ్రీదేవి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, తెలుగు యువత నాయకుడు సూర్యదేవర రంజిత్, పార్టీ పట్టణ అధ్యక్షుడు దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అచ్చిబాబు సూచించిన వ్యక్తికే టిక్కెట్? నియోజకవర్గంలో అచ్చిబాబు సూచించిన వ్యక్తులకే టికెట్టు ఇస్తారని అత్యధిక నాయకులు అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఖరారులో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు తరచూ ప్రకటిస్తుండగా.. ఇక్కడ మాత్రం అచ్చిబాబు మాటే వేదమని, ఆయన చెప్పినవారికే టికెట్టు అని పలువురు చెప్పడం విశేషం. అచ్చిబాబును కాదనే వారికి నియోజకవర్గ టీడీపీలో చోటు లేదని కూడా నాయకులు మాట్లాడటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం అచ్చిబాబు మాటకు విలువ ఇస్తుందా.. లేక ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా టికెట్టు కేటాయిస్తుందా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నియోజకవర్గ టీడీపీలో ఎనిమిదేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భగ్గుమనడం.. అందునా జిల్లా టీడీపీ అధ్యక్షుడి పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. తిరువూరు లేదు... కొవ్వూరు రాదు! గత ఎన్నికల సమయంలో కూడా అచ్చిబాబు వర్గం జవహర్ను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో టీడీపీ అధిష్టానం కొవ్వూరు టికెట్టును పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఇచ్చి, జవహర్ను కృష్ణ జిల్లా తిరువూరు పంపించింది. అక్కడ ఓటమి పాలైన జవహర్ ఐదేళ్ల నుంచి కొవ్వూరునే కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల ఐవీఆర్ఎస్లో సర్వేలో జవహర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడంతో ఆయనకు పొగ పెట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభమైన తాజా విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి. ఇప్పుడు ఏకంగా జవహర్ వద్దనే ఏకై క నినాదంలో ప్రత్యర్థి వర్గం భారీ సభ నిర్వహించడంతో ఆయనకు టికెట్టు ఖరారు కావడం కష్టమేనని పలువురు భావిస్తున్నారు. తిరువూరు వదిలేసి కొవ్వూరుపై ఆశలు పెంచుకున్న జవహర్కు ఈసారి కూడా ఆశాభంగం తప్పదని అంటున్నారు. -
పార్ట్టైం పొలిటీషియన్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉండగా, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎన్నికల ముందు మాత్రమే హడావుడి చేసే నాయకులుగా మిగిలారు. ప్రధానంగా గత రెండున్నరేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు పార్టీ అధిష్టానం నిర్దేశించిన పలు కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గడపనూ సందర్శించారు. సంక్షేమ పథకాలు అందాయా? లేదా? అని ఆరా తీశారు. సమస్యలేమైనా ఉంటే తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అదే ప్రతిపక్ష టీడీపీలో ఎమ్మెల్యేలు, కొందరు నియోజకవర్గ ఇన్చార్జ్లు ఎన్నికల వేళ కనిపించడం, బీఫాం తీసుకునే వరకు హడావుడి చేయడం, ఫలితాల అనంతరం.. గెలిచినా, ఓడినా పత్తా లేకుండా పోవడంతో ‘పార్ట్ టైం పొలిటీషియన్లు’గా ముద్ర వేసుకున్నారు. మరికొందరైతే సీజన్లో వచ్చిపోయే వలస పక్షులేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరికి ప్రజా సేవ కన్నా సొంత కార్యకలాపాలే ముఖ్యం. దీంతో టీడీపీ అంటే ‘టెంపరరీ డెలిగేట్స్ ఇన్ పార్టీ’గా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అస్మిత్రెడ్డి కేరాఫ్ హైదరాబాద్ తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నుంచి జేసీ అస్మిత్రెడ్డి 2019లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆరు మాసాలకోసారి తాడిపత్రికి వచ్చిపోవడం తప్ప, ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు నియోజకవర్గంలోకి వచ్చి ఊరూరా కలియదిరుగుతున్నారు. బాలయ్యా.. ఏడాదికోసారైనా రావయ్యా హిందూపురం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఏడాదికోసారి వస్తే చాలా గొప్ప అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎన్టీయార్ మీద ప్రేమతో బాలయ్యను గెలిపిస్తే ఆయన ఇక్కడకు ఎప్పుడూ రావడం లేదు. ఇక్కడ ఆయన పీఏలదే పెత్తనమని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఎప్పుడైనా వస్తే.. రెండ్రోజులు హడావుడి చేయడం, ఎన్నికల సమయంలో భార్యతో ప్రచారం చేయించడం, ఆ తర్వాత షూటింగులతో బిజీ అవడం పరిపాటిగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రజలకు దూరంగా పయ్యావుల ఉరవకొండ నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చాలా అరుదుగా కనిపిస్తారని ప్రజల మాట. ఆయన ఎన్నికల ముందే వస్తారని, ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఆయన సోదరుడు శీనయ్య ఇక్కడ పెత్తనం చేస్తారని, కేశవ్ అంతగా రారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. పీఏసీ చైర్మన్గా ఉన్నప్పటికీ ఈయన్ని నియోజకవర్గంలో ‘పార్ట్ టైమ్ పొలిటీషియన్’గానే జనాలు పరిగణిస్తున్నారు. హమ్మయ్య.. సూరికి ధర్మవరం గుర్తుకొచ్చింది ఎప్పుడు కనిపించినా మందీ మార్బలంతో హడావుడి చేసే వరదాపురం సూరి ఈసారీ అదే చేస్తున్నారు. 2019లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి.. ఓడిపోయాక బీజేపీలో చేరిన ఈయన పత్తా లేకుండా పోయారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ఫ్లెక్సీలతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం సూరి.. ధర్మవరంలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అసలు ఈయన బీజేపీలో ఉన్నారా? టీడీపీలో ఉన్నారా? అన్న ధర్మసందేహంలో ధర్మవరం నియోజకవర్గ ప్రజలు సతమతమవుతున్నారు. -
వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్ ప్రభుత్వం తీసుకున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప కార్పొరేషన్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవే ట్ లిమిడెట్(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. 2019లో షెడ్ కన్స్ట్రక్షన్కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్, నీరు, ఇతర అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడంతో పేపర్ ప్లేట్లు, కప్పులకు డిమాండ్ పెరిగింది. స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరోవైపు ప్లాస్టిక్ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్ పేపర్ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది. ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ శ్రీ పావన ఇండస్ట్రీస్లో క్రాఫ్ట్ పేపర్ రోల్స్, గమ్, ఫిల్మ్ తెచ్చి కారగేషన్ మిషన్లో వాటిని అతికించడం ద్వారా పేపర్ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు. అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్సేల్గా రూ.1.50, బహిరంగ మార్కెట్లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది. నీడ పట్టున ఉంటూనే సంపాదన పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! – భారతి, ప్రొద్దుటూరు ఉన్న ఊర్లోనే ఉపాధి ఈ పరిశ్రమలో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది. – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు -
ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల శంఖారావం..
నిర్మల్: ఇంద్రవెల్లి సభ నుంచే కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తుందని మాజీ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే సగం హామీలు నెరవేర్చిందని చెప్పారు. -
హంద్రీ–నీవా ఘనత వైఎస్సార్దే
అనంతపురం కార్పొరేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరందించే హంద్రీ–నీవా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్దేనని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఉరవకొండలో టీడీపీ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేకపోయారని, అప్పట్లో రెయిన్గన్ల పేరిట రూ.600 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, హంద్రీ–నీవా మిగిలిపోయిన పనులకు 200 శాతం అంచనాలు పెంచి స్వాహా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఓట్ల కోసం ప్రతి ఎకరాకూ నీరిస్తామని, 20 లక్షల ఉద్యోగాలిప్పిస్తామని అబద్దపు హామీలతో వంచించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడంతో పాటు టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. ఉరవకొండలో సభకు జనం తక్కువ సంఖ్యలో హాజరయ్యే సరికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్కు గురయ్యాడన్నారు. టీడీపీ సభ అట్టర్ఫ్లాప్ అయ్యిందన్నారు. పయ్యావులది సైంధవుడి పాత్ర.. ఉరవకొండలోని ఆమిద్యాల, రాకెట్ల లిఫ్ట్ ప్రాజెక్ట్లు, ఇప్పేరు, జీబీసీ కాలువకు నీరందకుండా అడ్డుకుని ఎమ్మెల్యే కేశవ్ సైంధవుడి పాత్ర పోషించాడని విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రాజెక్ట్ల కింద ఒక్క ఎకరాకై నా టీడీపీ హయాంలో నష్టపరిహారం చెల్లించారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే రైతులకు నష్టపరిహారం చెల్లించి, అధికారికంగా నీరందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 76 వేల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు నిధులు విడుదల చేస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ బాధితులకు పరిహారం ఇస్తామన్నారు. గుంతకల్లు, వజ్రకరూరు మండలాల్లోని చెరువులకు నీరందించేందుకు రూ.20 కోట్లు ఇస్తామని తెలియజేశారన్నారు. కూడేరులో త్వరలోనే పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో తక్కువ ధరతో భూములు కాజేసి, గాలిమరల కంపెనీతో రూ.కోట్లు కొల్లగొట్టారని కేశవ్పై విరుచుకుపడ్డారు. పీఏసీ చైర్మన్గా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజేయులు పాల్గొన్నారు. 5 టీఎంసీలకు కుదించిన బాబు.. హంద్రీ–నీవా ప్రాజెక్టును ఆనాడు 40 టీఎంసీలతో ప్రతిపాదిస్తే చంద్రబాబు ఐదు టీఎంసీలకు కుదించి.. పైగా పనులేవీ ప్రారంభించకుండా ప్రజలను మోసం చేశారని మాలగుండ్ల శంకర నారాయణ మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలో రూ.6,500 కోట్లతో డీపీఆర్ తయారు చేసి, గుంతకల్లు నుంచి మడకశిర వరకు హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా తాగు, సాగునీరందించాలని, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లతో పాటు కాలువల ద్వారా చెరువులకు నీరందిస్తూ ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురావడానికి రూపకల్పన చేశారన్నారు. -
నితీష్ కుమార్ రాజీనామా
-
Actor Vijay: త్వరలో తమిళనాట కొత్తపార్టీ?
తమిళనాట సినిమా వాళ్ల రాజకీయాలు చాలా టిపికల్గా ఉంటాయి. యాక్టర్ పొలిటీషియన్లుగా సక్సెస్ అయిన రేటు ఎక్కువే. ఫెయిల్యూర్స్ వేళ్ల మీద చెప్పొచ్చు. అయితే మాస్ స్టార్డమ్ ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనుకంజ వేయగా.. మరో సీనియర్ కమల్హాసన్ మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఇక.. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆదరణ ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశంగా మారిందక్కడ. చెన్నై: తమిళనాట మరో రాజకీయ పార్టీ.. అదీ ప్రముఖ నటుడి నుంచే రాబోతుందన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ఓ నిర్ణయం తీసుకోగా.. సభ్యులు పొలిటికల్ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతోపాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఈ మధ్యే వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఆ సమయంలో ఓపికగా కొన్ని గంటలపాటు స్టేజ్పైనే ఆయన నిల్చుని ఉన్నారు కూడా. మరోవైపు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై సమీప పనయూర్లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత.. లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు. గతంలో విజయ్ తండ్రి.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయాల వైపు అడుగులు వేయించే యత్నం చేశారు. అయితే ఆ సమయంలో రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తికనబర్చని విజయ్.. తండ్రితో విబేధించారు కూడా. అయితే ఇప్పుడు విజయ్ పీపుల్స్ మూమెంట్ పేరిట సహాయక కార్యక్రమాలు చేస్తున్న ఆయన.. దానిని పార్టీగా మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. விஜய் அரசியல் பிரவேசம்.. டெல்லியில் முகாம்#Vijay | #PoliticalEntry | #VMI | #VijayMakkalIyakkham | #NewsTamil24x7 pic.twitter.com/Deirtywxla — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 25, 2024 తమిళనాట సినిమా వాళ్ల రాజకీయాలు చాలా టిపికల్గా ఉంటాయి. యాక్టర్ పొలిటీషియన్లుగా మారి సక్సెస్ అయిన రేటు ఎక్కువే. ఫెయిల్యూర్స్ను వేళ్ల మీద చెప్పొచ్చు. అయితే స్టార్డమ్ ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనుకంజ వేయగా.. కమల్హాసన్ మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఇక.. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆదరణ ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశంగా మారిందక్కడ. -
YSR Kadapa: జిల్లా టీడీపీలో అగ్నిగుండంలా అసమ్మతి!
కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక కడప టీడీపీలో అయితే అసమ్మతి అగ్నిగుండంలా మారింది. గురువారం స్ధానిక రహమతియా ఫంక్షన్ హాల్లో టీడీపీ కడప మాజీ ఇన్చార్జి అమీర్బాబు, సీనియర్ నాయకుడు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ క్లస్టర్లు, యూనిట్ ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కార్యకర్తలు పలువురు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఇన్చార్జి మాధవిరెడ్డిల వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు రామలక్షుమ్మ, స్వర్ణలత మాట్లాడుతూ ఏళ్ల తరబడి టీడీపీలో సీనియర్ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి అయితే ఏ నాడూ మమ్మల్ని కనీసం పలకరించను కూడా లేదని విమర్శించారు. ఆయన ఓ వ్యాపారి, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వ్యాపారమే చేసుకుంటాడని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాసులురెడ్డి నీరు–చెట్టు నిధులను కొల్లగొట్టారు. ఆ డబ్బులో చిల్లిగవ్వ కూడా తమలాంటి కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తామని ప్రగల్బాలు పలికి దారుణంగా విఫలమయ్యారని గుర్తు చేశారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అతికష్టం మీద ఒక్క కార్పొరేటర్ స్థానం మాత్రమే గెలిచిందన్నారు. ఇప్పుడు తన సతీమణి మాధవిరెడ్డిని తెరపైకి తెచ్చి, కడప ఇన్చార్జిగా నియమించుకోగలిగారని అన్నారు. ఆమెకు పార్టీ గురించి, కార్యకర్తల గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆమెకు కడప ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కడప ఎమ్మెల్యే టికెట్ను సీనియర్లకు కేటాయిస్తే తామంతా బలపరుస్తామని తెలిపారు. పార్టీలో కార్యకర్తలకే విలువ, గ్యారెంటీ లేదు ప్రజలకు ఏమి గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. అసమ్మతి అంశం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
ఇక టీటీడీ పరిధిలోకి రాజనాలబండ ఆలయాలు..!
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం, సమీపంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో చరిత్రాత్మక ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు విశిష్ట కృషిచేశారని కొనియాడారు. తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ డిప్యూటీ ఈఓ శాంతి, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం కలిసి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఆలయానికి చెందిన భూములు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు ఇక నుంచి టీటీడీ ఆధ్వ ర్యంలో జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆలయ ఆదాయ వనరులు, ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఈఓ శాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ ఏఈఓ మణి, జనరల్ సెక్షన్ డిప్యూటీ ఈఓ శివప్రసాద్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకట్రమణ, ల్యాండ్స్ ఎస్టేట్ విభాగం తహసీల్దార్ లలితాంజలి, టెంపుల్ ఇన్చార్జి భానుప్రకాష్ తదితరులున్నారు. భక్తి శ్రద్ధలతో చండీ హోమం బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని యాగశాలలో నెలకొల్పారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి అభిషేక పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేయించారు. -
బీఆర్ఎస్ నేతలు అహంకారంగా మాట్లాడుతున్నారు : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని.. ఒకవేళ తాము గేట్లు తెరిస్తే ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం ఏర్పాటుచేయగా మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే, తమ ఎమ్మెల్యేలను కొనే శక్తిసామర్థ్యాలు వారికి లేవన్నారు. గత పదేళ్లు అధికారం లేకపోయినా నిర్భంధాలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు అభినందనీయులన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఏజెంట్లూ ఉండొద్దని ప్రలోభాలకు గురిచేసినా ప్రత్యర్థి దిమ్మతిరిగేలా 50వేల పైచిలుకు మెజార్టీతో తనను గెలిపించిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగంతో తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని, వారి అనుమతి లేకుండా కొత్త వారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. కాగా, గత ప్రభుత్వం మాదిరి అవినీతి జరగకుండా నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు మహ్మద్ జావీద్, దొబ్బల సౌజన్య, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్రెడ్డి, నాగండ్ల దీపక్చౌదరి, షేక్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోర్ మీటింగ్లో ‘సోయం’ వ్యాఖ్యల దుమారం! -
సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
నిజామాబాద్: ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. పార్టీ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో బుధశారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ అర్వింద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అట్టడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ఫలాలు అందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. రెండు, మూడు మండలాలకు పరిమితమైన తనకు రూరల్ టికెట్ ఇచ్చి బీజేపీ ప్రోత్సహించిందని, ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తల కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్లో బీజేపీకి 50వేల ఓట్లు వచ్చాయన్నారు. తనకు ఎప్పటికీ రాజకీయ గురువు మండవ వెంకటేశ్వర్రావు అన్నారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు జిల్లాలో శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతల స్వీకరణ.. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు దినేశ్ కులాచారి తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ అభ్యర్థులు, జిల్లా ఇన్చార్జులు, ప్రభారీలు హాజరవుతారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, నాయకులు తిరుపతిరెడ్డి, నక్క రాజేశ్వర్, రాజేశ్వర్రెడ్డి, వినోద్కుమార్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదు.. ప్రజలే తిరగబడతారు: ఎమ్మెల్సీ కవిత -
తంబళ్లపల్లె టీడీపీలో ఇంటిపోరు!
బి.కొత్తకోట: తంబళ్లపల్లె టీడీపీలో అసెంబ్లీ టికెట్ వ్యవహారం ముదిరిపాకాన పడింది. పార్టీ టికెట్ కోసం వర్గాల మధ్య పోరు సాగుతుంటే..వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేది తానేనని ప్రకటించుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. దీంతో శంకర్ వ్యతిరేక వర్గాలు టికెట్ తనకే అని ఎలా ప్రకటించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2014 నుంచి శంకర్ టీడీపీలో ఉంటుండగా, ఈ మధ్యకాలంలో మరో ఇద్దరు టికెట్ తమకూ కావాలంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘మీకెవ్వరికి కాదు మా నాయకుడికే టికెట్’ అంటూ స్థానికంగా లేని మరో నాయకుడి వర్గం ప్రచారం మొదలెట్టింది. ఈనెల 19న బి.కొత్తకోటలో జరిగిన జయహో బీసీ సభలో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ తనదే అని, పోటీచేస్తున్నట్టు శంకర్ ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనపై తేలిగ్గా తీసుకున్న పోటీ వర్గాలకు పుండుమీద కారం చల్లినట్టుగా మంగళవారం కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన బీసీ సభకు హజరైన శంకర్ మాట్లాడుతూ టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్నానని మరోసారి ప్రకటించుకున్నారు. ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదని, స్వయంగా టికెట్ తనకేనని ఎలా ప్రకటించుకుంటారని కొందరు నేతలు శంకర్పై మండిపడుతున్నారు. మరో ముగ్గురు ఆశావహులు కాగా ఇటీవల టీడీపీలో చేరిన ఓ నాయకుడు లాబీయింగ్ ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండునెలల క్రితమే తెరపైకి వచ్చిన ఆయన..చంద్రబాబు, లోకేష్లను కలిసిన ఫొటోలతో టికెట్ తనకే ఇస్తారని ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. టీడీపీ వర్గాల మద్దతు లేకపోయినా నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తున్నారు. గతనెలలో ఓ ఎన్ఆర్ఐ తాను టీడీపీలోనే ఉన్నానని, కొత్తగా పార్టీలో చేరాల్సిన అవసరం లేదని ప్రకటించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. టీడీపీ–జనసేన పొత్తులో తమ నాయకుడికి టీడీపీ లేదా జనసేన టికెట్ ఖరారైనట్టే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇకపోతే స్థానికంగా లేని ఓ నాయకుడి వర్గీయులు టీడీపీ టికెట్పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల తికమక టీడీపీ టికెట్ ఎవరికిస్తారో స్పష్టత లేకపోవడం తమ్ముళ్లు తికమక పడుతున్నారు. ప్రత్యక్షంగా టికెట్ కోసం మూడు వర్గాలు పోటీలో ఉండగా చివరకు ఎవరికి టికెట్ ఇస్తారో టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టత లేదు. దీంతో కార్యకర్తలు ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారు. మరోవైపు తంబళ్లపల్లెలో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసలే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పైగా వర్గాల మధ్య పోరు ముదిరి పాకాన పడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
గండిక్షేత్ర అభివృద్ధికి పాలక మండలి శ్రమించాలి: వైఎస్ అవినాష్ రెడ్డి
చక్రాయపేట: గండి క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి సర్వ హంగులు దిద్దుకున్నాక జాతికి అంకితం చేస్తామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గండి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి,వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డిలతో కలసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గండి క్షేత్రం అభివృద్ధి చెందిందని చెప్పారు.అప్పట్లోనే టూరిజం రెస్టారెంట్,భక్తులు,అర్చకుల వసతి గృహాలు,సిమెంట్ రోడ్లు, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వంటి పనులు జరిగాయని చెప్పారు.ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు గండిపై శీతకన్ను వేశాయన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆలయం పునర్నిర్మాణానికి రు.16 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు.అలాగే రాజగోపురం,ప్రహారి నిర్మాణానికి కూడా మరో రు.6కోట్ల మేర నిధులు మంజూరు చేశారన్నారు. మళ్లీ అధికారం లోకి రాగానే రెండు విడతల్లో గండిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.మొదటి విడతలో భక్తుల సౌలభ్యం కోసం వంద గదుల నిర్మాణాం,రెండో దశలో గండిలోని టూరిజం రెస్టారెంట్ను పూర్తి చేస్తామని వివరించారు. గండి క్షేత్రంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రూ.23 లక్షలు విరాళంగా అందజేశారు.గండి అభివృద్ధికి నూతన పాలక మండలి శ్రమించాలని ఎంపీ అన్నారు. అంతకుముందు ఎంపీ గండి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముకుందారెడ్డి, అర్చకులు పూ ర్ణకుంభ స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు చేయించారు. కుడా చైర్మన్ గురుమోహన్,ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాదరావు, చక్రాయపేట,వేంపల్లె ఎంపీపీలు మాధవీబాలకృష్ణ,గాయత్రి,వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి,మండల సమన్వయకర్త ఓబుళరెడ్డి,కందుల నాని పాల్గొన్నారు. అభివృద్ధికి పాటుపడుతాం చక్రాయపేట : గండి క్షేత్రం అభివృద్ధికి పాటు పడతామని ఆలయ నూతన చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు అన్నారు.సోమవారం గండి పాలక మండలి సభ్యులు ఆలయ సహాయ కమిషనర్ ముకుందారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, రవికుమార్ రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న గండి పాలకమండలి చైర్మన్, సభ్యులు చైర్మన్గా కృష్ణతేజ, పాలకమండలి సభ్యులుగా సుబ్బిరెడ్డిగారి జయమ్మ,కొప్పల మునీశ్వరి,ముద్ది కుమారి,బుక్కే లలితమ్మ, కలమల సోమాకళావతి,బండ్రెడ్డి చక్రపాణిరెడ్డి,పబ్బతి బిందుసాగర్,రాసినేని మధు,బోరెడ్డిగారి వెంకట రామిరెడ్డి,నారుబోయిన సుగుణమ్మ, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రధాన అర్చకుడు కేసరి ప్రమాణ స్వీకారం చేశారు.మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు,ఎంపీటీసీ సభ్యురాలు శాంతమ్మ,పులివెందుల నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి,ఆలయ మాజీ చైర్మన్ రాఘవేంద్రప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ రామాంజులరెడ్డి, మండల యూత్ కన్వీనర్ రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
డోన్ చరిత్రలో చెరగని ముద్రవేశాము: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
ప్యాపిలి: డోన్ నియోజకవర్గంలో దాదాపు రూ. 2,700 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ చరిత్రలో చెరగని ముద్ర వేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హుసేనాపురం గ్రామంలో రూ. 18.77 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాలు, గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం తదితర భవనాలను ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికై న నాయకులు చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికల ముందు కంబగిరి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లే నాయకులు కనీసం ఆ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డోన్ నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్యాపిలి మండలంలో మారుమూల గ్రామమైన వంకమెట్టుపల్లికి సైతం ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే తన ధ్యేయం అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని భావించి హుసేనాపురంలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. పశుసంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడానికి కారణం వెటర్నరీ విభాగంలో ఉన్నత చదువులు స్థానికంగా అందుబాటులో లేవని తాను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణం చేతనే హుసేనాపురంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశానని తెలిపారు. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వెంటనే సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో గొర్రెల పెంపకం ద్వారా సంపద సృష్టించుకున్న గొర్రెల పెంపకందార్లు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో షెప్పర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గొర్రెల పెంపకందార్లకు ఈ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. హామీలతో మభ్య పెడతారు జాగ్రత్త.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హామీలు గుప్పిస్తారని ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్ విమర్శించారు. మహిళలకు కిలో బంగారం, ఇంటికో కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారని..అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న దూరదృష్టి గల వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం డోన్ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. డోన్ అందరికీ ఆదర్శం డోన్ నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఆదర్శమని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు డోన్ నియోజకవర్గాన్ని చూసి అభివృద్ధి విషయంలో మంత్రిని ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. తాను కొద్ది రోజులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంట పర్యటిస్తూ అభివృద్ధి కార్యాక్రమాలు చూస్తేంటే మంత్రి చొరవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, శ్రీవేంకటేశ్వర వెటర్నరి యూనివర్సిటి డీన్ వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ రవి, డైరీ డీన్ సురేశ్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమేంద్రకుమార్, ఏడీ సింహాచలం, నోడల్ ఆఫీసర్ లావణ్యలక్ష్మి, జేడీ రామచంద్రయ్య, డీఏహెచ్ఓ గోవిందనాయక్, డీడీలు శాంతయ్య, రామమూర్తి, ప్రిన్సిపాల్ మాధవి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, హుసేనాపురం, కొమ్మేమర్రి సర్పంచులు మహేశ్వర్ రెడ్డి, దస్తగిరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్యాంరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ టికెట్ కోసం ఇంతటి దిగజారుడా?
ప్రొద్దుటూరు క్రైం : టీడీపీ టికెట్ కోసం ఆ పార్టీ నాయకులు నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డిలు దిగజారి తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్లకల్యాణ మండపంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ టికెట్ను ఆశించే వీరిద్దరి అసత్యపు మాటలకు హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రొద్దుటూరులో వీళ్లకి ఉనికి ఉందని చెప్పుకోవడానికి, చంద్రబాబును ఆకర్షించేందుకు ఎంతటి అబద్దానైన్నా ఆడటానికి వెనకాడటం లేదన్నారు. ప్రవీణ్కుమార్రెడ్డి ఏ రోజూ ప్రజల కోసం తహసీల్దార్ ఆఫీసు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లలేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు చేయలేదని చెప్పారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏది జరిగినా దానికి ఎమ్మెల్యే కారణమని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఆలోచన చేయకుండా బరి తెగించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు దాడులు నిర్వహిస్తే తన ప్రమేయంతోనే ప్రొద్దుటూరులో దాడులు చేస్తున్నారని టీడీపీ నాయకులిద్దరూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇలా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని చెప్పారు. గతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత విస్తృతంగా తనిఖీలు జరిగేవని, అయితే ఈ సారి నెల రోజులు ముందుగానే పోలీసులు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని పులివెందుల, మైదుకూరు, కడప, బద్వేలు, కమలాపురం ప్రాంతాల్లో తనిఖీలు చేసి బిల్లులు లేని కోట్లాది రూపాయలను సీజ్ చేశారన్నారు. ప్రొద్దుటూరులో బిల్లులు లేవనే కారణంతో రెండు చోట్ల పోలీసులు నగదును సీజ్ చేసిన విషయం తెలుసుకొని జిల్లాలోనే కాదు..రాష్ట్రంలోనే మొదట స్పందించింది తానేనని ఎమ్మెల్యే తెలిపారు. మళ్లీ రెండు రోజుల తర్వాత బంగారు అంగళ్ల వద్ద డబ్బు పట్టుకున్న సంఘటనపై బంగారు వ్యాపారులు పలువురు తనను ఆశ్రయించగా వారికి సంఘీభావం తెలిపానన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే వ్యాపారులు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసు, ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఈ విషయమై మాట్లాడటానికి మంగళవారం డీజీపీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని తెలిపారు. కుమార్తె పెళ్లికి బంగారు చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రూ. 14.50 లక్షలు పోలీసులు సీజ్ చేస్తే తాను టూ టౌన్ పోలీస్స్షేషన్కు వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పెళ్లికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ డబ్బు తానిస్తానని కూడా వారికి చెప్పానన్నారు. టూ టౌన్ సీఐ ఇబ్రహీంపై ప్రవీణ్కుమార్రెడ్డి పని గట్టుకొని ఆరోపణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. సీఐ ఇబ్రహీం ముస్లిం కావడంతోనే విమర్శలు చేస్తున్నారని, మైనార్టీలంటే ఆయనకు చిన్న చూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ నాయకులు చెబుతున్న అసత్యాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లె లక్ష్మీదేవి, సగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి పాల్గొన్నారు. -
Sullurpeta: సామాజిక జైత్రయాత్ర
ఒక కుటుంబంలో చిచ్చుపెట్టి, బంధాలను చీల్చే కుట్ర రాజకీయాలు... అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అబద్ధపు ప్రచారాలు... చంద్రబాబు, ప్యాకేజీస్టార్ పవన్ కలిసి చేస్తున్న దగాకోరు రాజకీయాలు... ఇవన్నీ ఒక ఎత్తయితే పచ్చ పత్రికలు రాస్తున్న తప్పుడు కథనాలు... టీవీ చానెళ్లలో జగనన్నపై చేస్తున్న దుష్ప్రచారం... వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠం నుంచి దించాలనే ప్రతిపక్షాల కుతంత్రాలు.. ఇవన్నీ కలిసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తుంటే, ప్రజలు మాత్రం జగనన్న వెంటే అంటూ సామాజిక సాధికార యాత్రకు తరలివచ్చిన జనసంద్రం చెబుతోంది. ఇది జైత్రయాత్రలా సాగింది. సూళ్లూరుపేట: నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో ఆదివారం చేపట్టిన సామాజిక సాధికారయాత్రతో పట్టణమంతా జనసంద్రంలా మారింది. గుండెలనిండా జగనన్నపై అభిమానాన్ని నింపుకుని పట్టణ వీధుల్లో జగనన్న సైనికులు కవాతు నిర్వహించినట్టుగా సాగింది సామాజిక సాధికార యాత్ర. సంక్షేమ పథకాల సృష్టికర్త, నిరుపేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన ఆశాకిరణం, ప్రతి పేదింటికీ పెద్ద కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, మనవడిగా, మామయ్యగా నిలిచిన జగనన్నకు జై అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనం తండోపతండాలుగా తరలిరావడంతోనాయుడుపేట పట్టణంలో జాతరను తలపించింది. ముందుగా పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు విజయగణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలతో యాత్ర ప్రారంభమైంది. వైఎస్సార్కు నివాళి అర్పిస్తున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అక్కడి నుంచి గాంధీమందిరం, పార్కు, గడియారం సెంటర్, వెల్కమ్ సెంటర్, పెద్ద దర్గామీదుగా పురవీధుల్లో బాణసంచా వేడుకలతో వేలాదిమంది జనం మధ్యన సామాజిక సాధికార ర్యాలీ సాగింది. ర్యాలీ సాగినంత సేపు వైఎస్సార్సీపీ నాయకులపై పూలు చల్లి పట్టణ ప్రజలు వారి అభిమానాన్ని చాటుకున్నారు. సాధికార బస్సు యాత్ర సాగుతున్నంత సేపు జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. సాధికారయాత్ర పాత బస్టాండ్వద్దకు చేరుకోగానే అక్కడే వున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగతనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి, సావిత్రిభాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ ప్రతిమకు పూలమాలలు వేశారు. రాజ్యసభ సభ్యులు, రీజనల్ కో–ఆర్డినేటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రులు కళత్తూరు నారాయణస్వామి, అంజాద్బాషా, జిల్లా పార్టీ అధ్యక్షులు, వెంకటగిరి ఇన్చార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, మాజీమంత్రి పీ అనిల్కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణచక్రవర్తి, మేరిగ మురళీధర్, కామిరెడ్డి సత్యనారా యణరెడ్డి లాంటి పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రసంగిస్తున్న విజయసాయిరెడ్డి, పక్కన ఎమ్మెల్యే కిలివేటి, ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆ తరువాత ముందుగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సభకు అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలో గడిచిన అయిదేళ్లలో రూ.3,470 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. సంక్షేమ పథకాల కింద డీబీటీ రూపంలో రూ.1,275 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.7,200 కోట్లు నిరుపేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా వెళ్లిందని చెప్పారు. అభివృద్దికి, సంక్షేమానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలన్నారు. అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్బాషా, మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ ప్రసంగించారు. బాబులంతా బెంబేలు అనిల్కుమార్ యాదవ్ ప్రసంగిస్తున్నంత సేపు సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఇందులో ముఖ్యంగా ‘‘ఇటీవల బాబులు తయారయ్యారంట.. చంద్రబాబు, లోకేష్బాబు, కల్యాణ్బాబు, బాలయ్యబాబులట. ఈ బాబులందరినీ కట్టకట్టుకుని బంగాళాఖాతంలో కలిపేసే రోజు మనముందుంది. జగనన్న కొట్టే దెబ్బకు ఈ బాబులంతా బెంబేలెత్తిపోవడం గ్యారంటీ.’’ అని చెప్పడంతో జనమంతా చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని తెలిపారు. సాధికార యాత్రకు హాజరైన జనసందోహంలో ఒక భాగం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి దళితులకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు. విచ్చేసిన అహుతులందరికీ ఎమ్మెల్యే కిలివేటి శాలువాలు కప్పి బుద్దుడు బొమ్మలను బహూకరించారు. ఈ సభకు అశేష జనం తరలిరావడం విశేషం. -
అవిశ్వాస తీర్మానం.. జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్
పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు చెందిన మేయర్, డిప్యూటీ మేయర్కు అసమ్మతి సెగ రోజుకోతీరులో వెంటాడుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే వ్యతిరేకత ఎదురవుతుండడంతో ఏం చేయాలో తోచక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. అసమ్మతి కార్పొరేటర్లు ఆదివారం మరోసారి భేటీ అయ్యారని తెలిసింది. మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సుమారు 26 మంది సంతకాలు చేశారని, ఇదే విషయాన్ని అసమ్మతి వర్గంలోని కొందరు కార్పొరేటర్లు వెల్లడిస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం పత్రాలు అందజేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ తర్వాత నేరుగా క్యాంపు కోసం గజ్వే ల్ సమీపంలోని ఓ రిసార్ట్కు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని సమాచారం. అయితే, కలెక్టరుకు నోటీసు ఇచ్చాకే వివరాలు వెల్లడిస్తామని అసంతృప్తి కార్పొరేటర్లు చెబుతున్నారు. అప్పుడు మౌనం.. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పందించి అసంతృప్తి కార్పొరేటర్లతో గతనెలలో నేరుగా సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్ట వద్దని అందరికీ ఆయన నచ్చజెప్పారు. ఆ తర్వాత మౌనం వహించిన అసంతృప్తి కార్పొరేటర్లు.. ఇప్పుడు మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానానికి అందరూ కట్టుబడి ఉన్నారని, 26 మంది ఇప్పటికే సంతకాలు చేశారని, వారందరినీ క్యాంపుకు తరలించడానికి రంగం సిద్ధం చేశారని సంకేతాలు ఇచ్చారు. మరోసారి జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్.. శనివారం బీఆర్ఎస్ కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిసింది. అవిశ్వాసం తీర్మానం, క్యాంపు రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే విప్ జారీచేయాల్సి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అందరికీ నచ్చజెప్పారని సమాచారం. అయినా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికే పట్టుపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. రెండ్రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి. ఇవి చదవండి: ఎట్టకేలకు షబ్బీర్ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు.. -
ఉద్దండులను ఓడించి.. ఉన్నత స్థితికి!
సాక్షి, కామారెడ్డి: ఇద్దరు ఉద్దండులను ఓడించి రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం దృష్టిని ఆకర్శించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీ నాయకత్వం మంచి ప్రాధాన్యతనిస్తోంది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ ఆయన ఓడించింది మామూలు వ్యక్తులను కాదు. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్రెడ్డిలు ఇద్దరినీ ఓడించి జెయింట్ కిల్లర్గా పేరుగడించారు. వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పార్టీ కోసం విస్తృతంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ఇన్చార్జీగా నియమించింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, శ్రేణులను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్యభూమిక పోశిస్తున్నారు. కాటిపల్లిని ఎన్నికల ఇన్చార్జీగా నియమించడంతో టిక్కెట్ ఆశిస్తున్న వారంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను భుజాన వేసుకుని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికలకు సమాయత్తం చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలను బీజేపీ నాయకత్వం ఈ సారి సవాల్గా తీసుకుంటోంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్పై ఫోకస్ చేస్తోంది. ఇక్కడ టిక్కెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పది మందికిపైగా నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నారు. అలాగే అయోధ్యలో రామమందిర ప్రారంభో త్సవం ఈ నెలలోనే ఉన్న నేపథ్యంలో పూజిత అక్షింతలను ఊరూరికీ, ఇంటింటికీ చేర్చడానికి ఏర్పాటు చేసిన అయోధ్య శ్రీరామ తీర్థ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్గానూ వెంకటరమణారెడ్డిని నియమించారు. దీంతో ఆయన ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జీగా, ఇటు అయో ధ్య తీర్థట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటిపల్లి మరోవైపు స్థానిక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతు న్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జిల్లా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అండర్–17 జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణ విషయంలో నిర్వహణ కమిటీకి అండగా నిలిచా రు. పోటీల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా చాన్స్..? బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా వెంకటరమణారెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఇద్దరు ఉద్దండులను ఓడించిన వెంకటరమణారెడ్డినే శాసనసభ పక్ష నేతగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చించినపుడు వెంకటరమణారెడ్డి పేరు ప్రస్తావించినట్లు సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ఐదారేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై అనేక పోరా టాలకు నాయకత్వం వహించిన నేపథ్యంలో ఆయనకున్న అనుభవం శాసనసభలో పనిచేస్తుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వెంకట రమణారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయనకు పార్టీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుందని భావిస్తున్నారు. ఇవి చదవండి: కాపులపై టీడీపీ కపట ప్రేమ.. -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
స్వర్ణయుగం vs భ్రమరావతి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యూహకర్తలు రోజుకొక డైలాగు నేర్పి జనంమీదకు వదలుతున్నట్లు ఉన్నారు. వారు ఆ డైలాగును సరిగా చూసుకుంటున్నట్లు లేరు. దాంతో అవి ఒక్కోసారి ఎదురు తగులుతున్నాయి. తాజాగా రాతియుగం కావాలా? స్వర్ణయుగం కావాలా అని జనాన్ని ప్రశ్నించారు. నిజంగానే ఇది చాలా మంచి ప్రశ్న. చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనను, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను బెరీజు వేసుకుంటే ఎవరిది రాతియుగపు పాలనో, ఎవరిది స్వర్ణయుగపు పాలనో ఇట్టే తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు తన నలభైఐదేళ్ల రాజకీయంలో ఎన్నివందల సార్లు మాట మార్చారన్నదానిపై విశ్లేషిస్తే ఒక పెద్ద పరిశోధన గ్రంధం అవుతుంది. అదే జగన్ చెప్పారంటే చేస్తారంతే అన్నది జనం మాట. దీనికి పూర్తి ఆధారాలు కూడా కనిపిస్తాయి. అందువల్లే ఏపీలో ప్రజలకు ఇది నిజంగానే స్వర్ణయుగ పాలనే అని చెప్పాలి. ఎన్నడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజల అవసరాలు తీర్చడం కోసం వారి ఇళ్ల వద్దకు వెళ్లినట్లు చూశామా! అది ప్రస్తుతం జగన్ పాలనలోనే కదా జరుగుతోంది ! వృద్దులకు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇతరులకు వివిధ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా వలంటీర్లే వెళ్లి ప్రజలకు అందించడం ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో అయినా జరుగుతోందా! అంతదాకా ఎందుకు చంద్రబాబు శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఏలుబడిలో ఇప్పుడు ఏమి జరిగింది? లక్షలాది మంది జనం కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలు వస్తాయో, రావో కాని, దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూలలో నిలబడి ఉండవలసి వచ్చిందే. తీరా చూస్తే ఆ దరఖాస్తులు కొన్ని రోడ్డు మీద దొరికాయట. ఆ పరిస్థితి ఏపీలో జగన్ పాలనలో ఉందా? చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఎన్నడైనా వృద్దుల గురించి ఆలోచించారా? ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, రేషన్ వంటివి ఇళ్లకే ఇవ్వాలన్న ఆలోచన చేశారా? కాని జగన్ చెప్పారు. చేసి చూపించారు. అందుకే చంద్రబాబుది రాతియుగపు పాలన, జగన్ది స్వర్ణయుగపు పాలన అని వేరే చెప్పనవసరం లేదు. తానో విజనరీ అంటూ పిచ్చి పుస్తకాలు అచ్చేసి ప్రజలను మోసం చేయడం స్వర్ణయుగపు పాలన అని చంద్రబాబు చెప్పదలిస్తే చెప్పవచ్చు. కాని ప్రజలు ఆయన టైమ్లో పడిన అవస్థల నేపధ్యంలోనే టీడీపీకి 23 సీట్లే వచ్చాయన్న సంగతి మర్చిపోయి ఎవరో రాసిచ్చిన డైలాగులు చెబితే సరిపోతుందా? ప్రజలు అంత పిచ్చివారా! జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద పేదల పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి గాను పదిహేనువేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే, దానిని కాపీ కొట్టిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఒక ఇంటిలో ఇద్దరు, ముగ్గురు పిల్లలకు ఇస్తానని ఎందుకు అంటున్నారు. జగన్ రాతియుగపు పాలన అయితే దానిని మరింత ఎక్కువగా ఇస్తానని చంద్రబాబు ఎందుకు చెబుతున్నారు? అంటే దీని అర్ధం.. జగన్ది స్వర్ణయుగం పాలన అని ఆయన కూడా ఒప్పుకున్నట్లే కదా! పైగా పిల్లలను ఎక్కువ మందిని కని రాతియుగంలోకి వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నారంటే అది ఆయన విజన్ అనుకోవాలి. పోనీ ఆయన కాని, ఆయన కుమారుడు కాని ఎక్కువ మంది పిల్లలను కన్నారా అంటే లేదు. వేల కోట్ల అదిపతి ఒక్క పిల్లవాడితో సరిపెట్టుకుంటారట. పేదలు మాత్రం ఎక్కువ మంది పిల్లలను కని నానా పాట్లు పడాలట. అది ఆయన స్వర్ణయుగమా! ప్రభుత్వ స్కూళ్లలో జగన్ ఆంగ్ల మీడియం పెట్టి పేదలకు ఇంగ్లీష్ విద్య నేర్పడం చంద్రబాబు దృష్టిలో రాతియుగం అన్నమాట. అదే తన టైమ్లో అసలు ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదలివేస్తే అది స్వర్ణయుగపు పాలన అట. నాది ఒక సలహా.. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద అభివృద్ది చేసిన స్కూళ్లను చంద్రబాబు చూసి రావాలి. అక్కడ క్లాస్ రూమ్లలో ఉన్న టివిలు, డిజిటల్ క్లాస్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడిప్పుడే ఆంగ్లంలో మాట్లాడుతున్న పేద విద్యార్ధులను చూసి ఇది స్వర్ణయుగమో కాదో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు తన టైమ్లో అసలు ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోగా విద్య అన్నది ప్రైవేటు బాధ్యత అని చెప్పారే. మరి జగనేమన్నారు. 'విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత. పేదలందరికి చదువు అందాలి' అని చెప్పారు. దీనిని బట్టి అర్ధం కావడం లేదూ.. చంద్రబాబు పాలన ఎంత అద్వాన్నంగా సాగిందో! చంద్రబాబు టైమ్లో ఎన్నడైనా ఆరోగ్య సురక్షక్యాంపులు పెట్టి ప్రజలకు వైద్యసేవలు అందించారా? అలా ఎందుకు చేయలేదు అంటే ఆయనది రాతియుగపుపాలన కాబట్టి. జగన్ మొదటి నుంచి విద్యతో పాటు వైద్య రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నది వాస్తవం కాదా! అందుకే ఇది ప్రజలు మెచ్చిన పాలన అయింది. కాకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా మాఫియా దీని మొత్తాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు కూడా రాతియుగం, స్వర్ణయుగం అంటూ పోలిక తెచ్చి సెల్ఫో గోల్ వేసుకున్నారు. జగన్ తనపాలనలో చేయూత కింద అర్హులైన మహిళలకు 18500 రూపాయలు ఇస్తున్నారు. వారికి కార్పొరేట్ కంపెనీలతో టై అప్ పెట్టి స్వయంఉపాధిని ప్రోత్సహిస్తున్నారు. అప్పట్లో ఈ స్కీమును విమర్శించిన టీడీపీ నేతలు, ఇప్పుడు తాము నెలకు 1500 చొప్పున ఇస్తామని, మహిళలందరికి ఇస్తామని ఎలా చెబుతున్నారు? అంటే జగన్ స్వర్ణయుగాన్ని కాపీ కొట్టడమే కదా! 'పాలన వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రాతియుగం అవుతుందా? లేక కిలోమీటర్ల కొద్ది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం రాతి యుగం అవుతుందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలందిస్తే స్వర్ణయుగం అవుతుందా? లేక చంద్రబాబు టైమ్లో మాదిరి రుణమాపీ హామీ ఇచ్చి రైతులను గాలికి వదలివేయడం స్వర్ణయుగం అవుతుందా!' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్థూలంగా చూస్తే జగన్ టైమ్ నిజంగానే ప్రలకు, ముఖ్యంగా పేదలకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. చంద్రబాబు పాలన మాత్రం కచ్చితంగా స్టోన్ పీరియడే అవుతుంది. అభివృద్ది గురించి చూద్దాం. ఎక్కడి దాకా ఎందుకు! విజయవాడ తీసుకోండి.. కనకదుర్గమ్మ గుడి వద్ద, బెంజ్ సెంటర్ వద్ద భారీ వంతెనలను పూర్తి చేసింది జగనే కదా! చంద్రబాబు కనీసం పట్టించుకోని కృష్ణలంక ప్రాంతంలో చైనా గోడ మాదిరి ఎంత పెద్ద రక్షణ గోడ నిర్మిస్తున్నారు! దీంతో ఆ ప్రాంతంలోని వేలాది మందికి ముంపు బాధను తీర్చింది ఐదేళ్ల జగన్ పాలనా? లేక పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనా? అందుకే జగనది స్వర్ణయుగం అని విజయవాడ వాసులు భావిస్తారు. విజయవాడ స్వరాజ్ మైదానాన్ని చైనా మాల్కు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటే, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహంతో పాటు బ్రహ్మాండమైనరీతిలో టూరిస్టు కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. దీనిని కదా స్వర్ణయుగం అనాల్సింది. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, మూడు నియోజకవర్గాలలోని వందలాది గ్రామాలకు సురక్షిత నీరు ఇచ్చిన జగన్ది స్వర్ణయుగం అవుతుంది కాని, అసలు వారి సమస్యలనే పట్టించుకోని చంద్రబాబుది స్వర్ణయుగం అని చెప్పుకుంటే సిగ్గుచేటు. చంద్రబాబు అంత కాలం పాలించి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాకపోతే, జగన్ పదిహేడు కాలేజీలు తేవడం, ఐదింటిని నిర్మించడం, మరో ఐదింటిని తయారు చేయడం.. దీనిని కదా స్వర్ణయుగం అని అనాల్సింది. నాలుగు పోర్టులు, తొమ్మిది షిఫింగ్ హార్బర్లు నిర్మాణం చేసిన జగన్ని కదా స్వర్ణయుగ కధనాయకుడు అని అనాల్సింది. 'నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ తెచ్చింది ఎవరు? లక్ష మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేసిందెవరు? అవుకు రెండో టన్నెల్ను పూర్తి చేసింది ఎవరు? పోలవరంలోని నలభై ఎనిమిది గేట్లను ఏర్పాటు చేసింది ఎవరు? వెలిగొండ మొదటి టన్నెల్ను పూర్తి చేసి, రెండో టన్నెల్ను దాదాపు పూర్తి చేసింది ఎవరు? కొప్పర్తి పారిశ్రామికవాడను తెస్తున్నదెవరు? రామాయంపట్నం ఇండోసోల్ ఇండస్ట్రీని తేవడానికి సంకల్పించింది ఎవరు? ఈనాడు వంటి మీడియా మాఫియాగా మారి వీటిని ఎంత చెడగొట్టాలని చూసినా, వాటిని ఎదుర్కుంటూ ముందుకు తీసుకువెళుతున్న జగన్ది స్వర్ణపాలన అవుతుంది. కేవలం ఎల్లోమీడియాతో పిచ్చ ప్రచారం చేసుకుంటూ జనం రాతియుగంలో ఉన్నారులే అని భ్రమించి ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోబట్టే వారు చంద్రబాబు పాలనకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇంత జరిగినా మళ్లీ రాతియుగం, స్వర్ణయుగం అంటూ పోలికలతో స్పీచ్లు, ఇలా ఉపన్యాసాలు ఇవ్వడానికి కాస్త అయినా ఇంగితం ఉండాలి. అసలు నలభైదేళ్ల సీనియర్ అయిన చంద్రబాబు ఎవరో రాసిచ్చిన డైలాగులు చదివే దుస్థితిలో ఉన్నారంటేనే అర్ధం ఆయన రాతియుగతం మనస్తత్వంలో ఉన్నారన్నమాట. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. -
ముగియనున్న పంచాయతీల పదవీకాలం.. ఆవేదనలో సర్పంచ్లు!
మిర్యాలగూడ : సర్పంచ్ల పదవీకాలం 20 రోజుల్లో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు. పదవీ కాలం ముగిశాక తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ కార్యదర్శులు ఇన్చార్జిలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సర్పంచ్లకు అందని బిల్లులు.. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి లైట్ల ఏర్పాటు, డంపింగ్యార్డులు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లను అందించింది. మల్టీ పర్పస్ వర్కర్లను నియమించింది. కాగా, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణకు కూడా సరిపోని పరిస్థితి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో జాప్యం కావడంతో సర్పంచ్లు అప్పలు చేసి మరీ పనులు పూర్తి చేశారు. ఇలా ఒకొక్కరు సుమారు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు అప్పులు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో తమ పదవీకాలం ముగుస్తుండడం.. చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రూ.300 కోట్లకు పైగా పెండింగ్! గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డు పనులు అధికారులు సర్పంచ్లపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పూర్తి చేయించారు. ఒక్కో రైతు వేదికను రూ.22లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా అందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా మిగిలిన రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధిహామీ నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఇంత వరకు అందలేదని పలువురు చెబుతున్నారు. ఇలా ప్రతి పనికీ అరకొరగానే బిల్లులు విడుదలయ్యాయని అంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన ప్రభుత్వమైనా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి ఆదుకోవాలని సర్పంచ్లు కోరుతున్నారు. రూ.70లక్షలు రావాల్సి ఉంది.. గ్రామాభివృద్ధి కోసం వడ్డీకి తీసుకొచ్చి పని చేశా. ఆ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, నీటి సమస్య తీర్చేందుకు బోరు మోటార్లకు ఖర్చు చేశా. ఈనెల చివరన పదవీకాలం ముగియనుంది. నేను గ్రామాభివృద్ధి కోసం పెట్టన ఖర్చులో ఇంకా రూ.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలి. – చల్లా అంజిరెడ్డి, సర్పంచ్, వీర్లపాలెం అప్పులు తెచ్చి అభివృద్ధి చేశాం గ్రామాభివృద్ధికి కోసం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి. అప్పులు తీసుకొచ్చి మరీ పనులు చేపట్టాం. దానికి సంబంధించిన ఎంబీ రికార్డులను కూడా సమర్పించాం. వెంటనే బిల్లులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మా గ్రామంలో రూ.30 లక్షల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే వాటిని అందించాలి. పదవీ కాలం పొడిగించాలి. – దొంతిరెడ్డి వెంకట్రెడ్డి, సర్పంచ్, రావులపెంట -
లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం
నల్లగొండ : ఏప్రిల్ నెలల జరగనున్న లోక్సభ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను కాకుండా కొత్త ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. మూడు రోజుల క్రితమే ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లాలో మొత్తం 14,64,080 మంది ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితాలో 14,67,573 మంది ఓటర్లున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు 3,493 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నెల 22 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అవగాహన కల్పిస్తున్న బీఎల్ఓలు 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 22వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బీఎల్ఓలు ఓటర్ల జాబితాను తీసుకుని ఇల్లిల్లూ తిరిగి ఓటు ఉందా లేదా తెలుసుకుని ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోమని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీ లోగా పరిష్కరించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం ఓటరు తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. -
‘పార్లమెంట్’ హీట్! బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు..
కరీంనగర్: లోక్సభ సమరానికి రాజకీయ పార్టీలు సైఅంటున్నాయి. విజయబావుటా ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ సీటును కై వసం చేసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో సభలు.. సమావేశాలకు రెడీ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుట ఎగురవేసింది. కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కరీంనగర్, హుజూరా బాద్లో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోకి బీజేపీ.. బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్కుమా ర్ తిరిగి పోటీ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ శ్రేణులు ఇప్పటికే పలుచోట్ల వాల్రైటింగ్, పోస్టర్లు వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నా రు. గతనెల చివరి వారంలో హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో అమిత్షా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్ క్యాడర్ను కదనరంగంలోకి దించారు. అయోధ్య శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ప్రజ ల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శక్తికేంద్రాల ఇన్చార్జిలను ట్రైనప్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. వికసిత్ భారత్తో ప్రజలతో మమే కం అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మానకొండూరు మండలం కొండపల్కల గ్రామంలో జరిగే ‘వికసిత్ భారత్’లో పాల్గొననున్నారు. జోష్లో ‘కాంగ్రెస్’.. పదేళ్ల తర్వాత అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ ఊపుతో ముందుకెళ్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ఉత్సాహంతో పార్లమెంట్ సీటునూ గెలుచుకోవాలని చూస్తోంది. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండటం, గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో అధిష్టానం లోక్సభ ఇన్చార్జిగా నియమించింది. దీంతో ఆ పార్టీ లీడర్లు బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కొనేందుకు క్యాడర్ను రెడీచేస్తున్నా రు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు బిజీబిజీగా ఉన్నారు. గత అభివృద్ధి, కాంగ్రెస్ హమీలపై ప్రజల్లోకి బీఆర్ఎస్.. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలు తదితరాలు ఎండగట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచిన మూడు సీట్లతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీ ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇవి చదవండి: నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్యాదవ్? -
కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు
కరీంనగర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్సర్వాయిపాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు. గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు. ఇవి చదవండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు -
వైఎస్ జగన్ ను ఎదుర్కొలేక చంద్రబాబు కుట్రలు
-
'టీడీపీ' కి మరో కొత్త తలనొప్పి! ద్వారకా రాకతో..
సాక్షి ప్రతినిధి, కడప: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ఆ ఇద్దరు 30 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలో పోటీపడ్డారు. మూడు దశాబ్దాలుగా పరాన్నజీవులుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. వారిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులను అంటగట్టడంపై మాకు ఇదేం ఖర్మ బాబు అనడం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల వంతు అయింది. చెల్లని రూకలే మహా ప్రసాదంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, శిరోభారమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.' - చెన్నంశెట్టి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి 1985 ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలుపొందారు. 1989లో జనరల్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్కు, 1991 ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తలపడి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపియ్యారు. అయినప్పటికీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనేక పదవులతో సత్కరించిన టీడీపీ పట్ల విశ్వాసం, విధేయుతతో ఉండాల్సిన సీఆర్సీ ప్రజారాజ్యంలో, అక్కడి నుంచి కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీ దక్కించుకొని మంత్రి పదవిని చేజేక్కించుకున్నారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా పార్టీలు మారుతూ పచ్చి అవకాశవాదిగా సీఆర్సీ ముద్ర వేసుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వయోభారంతో నెట్టుకొస్తున్న ఈదశలో ఆయన పార్టీ మారి అనైతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారని పలువురు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు వైఎస్సార్ దీవెనలతో.. వ్యాపార వ్యవహారిక కార్యక్రమాల్లో ఉన్న గడికోట ద్వారకనాథరెడ్డి 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగ్రేటం చేశారు. అప్పటి వర్గ రాజకీయాల ఫలితంగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్రెడ్డి ఓటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీయులు పనిచేశారు. వైఎస్సార్ చల్లని దీవెనలతో ద్వారకా లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఛీ కొట్టింది. 1999లో టికెట్ నిరాకరించింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలనే తపనతో తెరపైకి రావడం ద్వారకాకు సర్వసాధారణమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాజాగా టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. టీడీపీకి కొత్త తలనొప్పి రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్కుమార్రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్బాబు ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వచ్చి చేరారు. ఇప్పటికే అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న నేతల మధ్యలోకి ద్వారకా రావడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పుకొని వెలుగొందిన ద్వారకా వైఎస్సార్సీపీకి దూరం కావడం వెనుక అవకాశవాదం ఉన్నట్లు పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. సీఆర్సీ,ద్వారకాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
చంద్రబాబు నాన్చుడి ధోరణి.. డౌటెవరు?, ఔటెవరు?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. ప్రతిపక్ష టీడీపీలో మాత్రం ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గెలుపు గుర్రాలేవో, కుంటి గుర్రాలేవో తేల్చుకోలేక సతమతమవుతోంది. సీట్లు ఎవరికి ఇవ్వాలో తెలీక తలపట్టుకుంటోంది. ఈ నాలుగున్నరేళ్లూ చురుకై న పాత్ర పోషించడంలో సీనియర్ నాయకులు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో మళ్లీ వారికి టికెట్లిస్తే పుట్టి మునుగుతుందేమోనన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వీళ్లకు ఈసారి డౌటే..? కొంతమంది సీనియర్ నాయకులకు ఈసారి టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం నిరాకరిస్తోంది. ఇందులో తొలివరసలోకి రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఉన్నట్టు తెలిసింది. కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కూడా పెనుకొండ అసెంబ్లీ కాకుండా హిందూపురం పార్లమెంటుకు పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కృష్ణా జిల్లాకు పంపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లకు హుళక్కేనా? గుంతకల్లులో జితేందర్గౌడ్ను తప్పించి మరొకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక.. శింగనమలలో బండారు శ్రావణికి టికెట్ అనుమానంగా ఉంది. ధర్మవరం టికెట్ రేసులో ఉన్న పరిటాల శ్రీరామ్కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయి, బీజేపీలో చేరిన వరదాపురం సూరిని తిరిగి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఉన్నారు. కళ్యాణదుర్గంలోనూ గతంలో పోటీచేసిన అభ్యర్థిని నిలపడం లేదు. అనంతపురం అర్బన్ టికెట్ ఈసారి ప్రభాకర్ చౌదరికి లేదని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. కదిరిలో కందికుంట ప్రసాద్కు నకిలీ డీడీల కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆయన భార్యకు టికెట్ ఇస్తే గెలుస్తుందా అన్న అనుమానంలో అధినాయకత్వం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా ఉందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాన్చుడు ధోరణి తమ మెడకు చుట్టుకుంటోందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రూ.20 కోట్లు ఎక్కడ తేవాలి? ఇటీవల జిల్లాలోని టీడీపీ ఓ నియోజకవర్గ నేత టికెట్ కోసం ప్రయత్నించగా రూ.20 కోట్లు ఉంటే చూపించు టికెట్ ఆలోచిస్తాం అని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. రూ.20 కోట్లు రెడీ చేసుకుంటేనే టికెట్ ఇస్తామని, లేదంటే వేరే ఆలోచిస్తామని తెగేసి చెప్పడంతో చాలామంది నాయకులు బెంబేలెత్తుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గ అభ్యర్థులకు కూడా డబ్బు రెడీ చేసుకుంటేనే టికెట్ ఉంటుందని చెబుతుండడంతో పోటీకి ముందుకొచ్చే అభ్యర్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ కొట్టింది. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో ఇప్పటికీ కోలుకోలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు వైఖరితో పార్టీ పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోయే దశకు చేరుకుంటోందని ఆ పార్టీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
‘గ్రేటర్ వరంగల్’లో బీఆర్ఎస్కు షాక్!
వరంగల్: గ్రేటర్ వరంగల్లో పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్, కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీప్దాస్ మున్షీ సమక్షంలో చేరారు. ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆమె పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హనుమకొండ బీఆర్ఎస్కు చెందిన 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, 49వ డివిజన్ – మానస, 50వ డివిజన్ – నెక్కొండ కవిత, 9వ డివిజన్ – చీకటి శారద, 48వ డివిజన్ – షార్జా బేగం, 31వ డివిజన్ – మామిండ్ల రాజ య్య(రాజు) కాంగ్రెస్ చేరారు. అంతేకాకుండా మా జీ కార్పొరేటర్లు వీరగంటి రవీందర్ స్వామి చరణ్, తాడిశెట్టి విద్యాసాగర్, మోహన్ రావు, చీకటి ఆనంద్, నెక్కొండ కిషన్, నలుబోల సతీశ్, నాయకులు గోల్కొండ రాంబాబు, మైసారపు సిరిల్ లారెన్స్, సిలువేరు విజయ్ భాస్కర్, పోగుల శ్రీనివాస్ అధికార పార్టీలోకి వెళ్లారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్ సయ్యద్ విజయశ్రీ, నాయకులు రజాలీ, బంక సరళ సంపత్ యాదవ్ పాల్గొన్నారు. గాంధీభవన్ ఎదుట ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, కార్పొరేటర్లు, నాయకులు గ్రేటర్ పట్టుకోసం కాంగ్రెస్ పావులు గ్రేటర్ మున్సిపాలిటీపై పట్టుబిగించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వలసల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ముందు కొందరు బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్లో చేరారు. తాజాగా మారికొందరు పార్టీని వీడారు. ఇదిలా ఉండగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన మరికొంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపాక పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇవి చదవండి: సంచలనంగా మారిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయి వాగ్వాదం! -
నామినేటెడ్ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ!
'కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. సంక్రాంతి పండుగలోగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ పలువురు ప్రదక్షిణ చేస్తున్నారు. పార్టీకి తాము చేసిన సేవలు, ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి చేసిన కృషిని వివరిస్తూ నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రధాన నామినేటెడ్ పోస్టులకు జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండగా తొలి విడతలో ఎవరికి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ నెలకొంది.' - సాక్షి ప్రతినిధి, ఖమ్మం లోక్సభ ఎన్నికల నేపథ్యాన.. మార్చిలోగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతల వివరాలను టీపీసీసీ సేకరిస్తోంది. ఆయా నేతలకు గల జనబలం, పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు.. తదితర అంశాలను బేరీజు వేస్తూ జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబితా ఆధారంగా సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులతో చర్చించాక ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానమైనవి తొలుత భర్తీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే, ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు కొన్నింట్లో స్థానిక నేతలను నియమిస్తారని తెలుస్తోంది. తద్వారా లోక్సభ ఎన్నికల్లో నాయకులంతా ఏకతాటిపై నడిస్తే మెజార్టీ స్థానాలు పార్టీకి దక్కుతాయ నే అంచనాల్లో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. జాబితా పెద్దదే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్, లోకేష్యాదవ్, మధిర నియోజకవర్గం నుంచి పైడిపల్లి కిషోర్, డాక్టర్ కోట రాంబాబు, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, ఖమ్మం నుంచి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణరావు, శెట్టి రంగారావు జాబితాలో ఉన్నారు. అలాగే, కొత్తగూడెం నుంచి నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గం నుంచి భట్టా విజయ్గాంధీ, తుళ్లూరి బ్రహ్మయ్య, ఇల్లెందు నియోజకవర్గం నుంచి రాంరెడ్డి గోపాల్రెడ్డి, రాంరెడ్డి చరణ్రెడ్డి, వడ్లమూడి దుర్గా ప్రసాద్, మేకల మల్లిబాబుయాదవ్, అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జూపల్లి రమేష్బాబు, ఆలపాటి రామచంద్రప్రసాద్ పదవులు ఆశిస్తున్నారు. ఇక పాలేరు నియోజకవర్గం నుంచి రామసహాయం నరేష్రెడ్డి, రామసహాయం వెంకట్రెడ్డి, మద్ది శ్రీనివాస్రెడ్డి, శాఖమూరి రమేష్, చావా శివరామకృష్ణ పోస్టులు దక్కించుకోవాలనే యత్నాల్లో ఉన్నారు. ఇందులో చాలా మంది రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులపై ఆశ పెట్టుకోగా.. కొందరు ఉమ్మడి జిల్లా, ఇంకొందరు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. కాగా, ముగ్గురు, నలుగురు నేతలు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు దక్కకపోతే ఎమ్మెల్సీ కోసం పోటీ పడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం.. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు పలువురు తాము రేసులో ముందున్నామని ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలుస్తూ పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు, గతంలో నిర్వహించిన పోస్టుల వివరాలను ఇస్తున్నారు. అలాగే ఏఐసీసీ, టీపీసీసీలో తెలిసిన నేతలను కలిసి నామినేటెడ్ పోస్టుల విషయంలో వారి సహకారం కోరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ముగ్గురు మంత్రులతో పాటు పార్టీ పెద్దలనూ కలిశారు. సామాజిక సమీకరణాలను కూడా పరిశీలించి తమకు అవకాశం ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యాన ఎలాగైనా నామినేటెడ్ పోస్టు దక్కించుకుంటే రాజకీయ భవిష్యత్కు ఢోకా ఉండదని ఆశావహులు భావిస్తున్నారు. ఇవి చదవండి: ‘గ్రేటర్ వరంగల్’లో బీఆర్ఎస్కు షాక్! -
దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రం మంగళవారం నుంచి (2వ తేదీ) 30వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఆమోదం తెలిపింది. రాజకీయ నిధుల విషయంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు ఇచ్చే ప్రత్యక్ష నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రూపొందించారు. 17వ లోక్సభ కాలపరిమితి ముగుస్తున్నందున ఈ ఏడాది మధ్యలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30వ ఫేజ్ ఆఫ్ సేల్లో భాగంగా జనవరి 2 నుండి జనవరి 11వ తేదీ వరకూ తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్క్యాష్ చేయడానికి ఎస్బీఐని అనుమతించడం జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2018 నుంచీ అమలు.. మొదటి బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం మార్చి 2018లో జరిగింది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన అధీకృత బ్యాంకులో ఉన్న బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఎన్క్యాష్ చేసుకోగలుగుతుంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి ఎస్బీఐ మాత్రమే అధీకృత బ్యాంకు. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్పూర్ ముంబైలు అధీకృత ఎస్బీఐ శాఖల్లో కొన్ని. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుండి 15 క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్ను డిపాజిట్ చేసినట్లయితే, సంబంధిత రాజకీయ పార్టీకి ఆయా చెల్లింపులు జరగవు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ నిర్దిష్ట కాలంలో తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్ అదే రోజు జమ అవుతుంది. గత లోక్సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 1 శాతం ఓట్లను పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఈ ప్రాంతంపై మాజీ మంత్రి కేటీఆర్ సవతిప్రేమను ఒలకబోశారు..
సిరిసిల్ల: పదిహేనేళ్లుగా సిరిసిల్ల ప్రాంతంపై మాజీ మంత్రి కేటీఆర్ సవతిప్రేమను ఒలకబోశారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ని యోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఆరోపించారు. ఆ దివారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో మాట్లాడారు. విలీన గ్రామాల అభిప్రాయాలను గౌరవించకుండానే మున్సిపల్లో కలిపిన కేటీఆర్ ఇప్పుడు జీపీలుగా మార్చుతామని మాయమాటలు చెబుతున్నాడని అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సోయి ఏమైందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని కచ్చితంగా నెరవేర్చుతుందనే రాజకీయ కుట్రకు తెరలేపారని విమర్శించారు. బతుకమ్మ చీరలకు సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇక్కడి పరిశ్రమవర్గాలను మోసం చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అమలు చేస్తామన్న ఆరుగ్యారంటీలపై ఎలాంటి శషభిషలు అవసరం లేదన్నారు. దోపిడీదారులు ఆటో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమన్నారు. వారి సమస్యలను తమ సర్కారు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపాల్టీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, విలీన గ్రామాల ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఎల్లె లక్ష్మీనారాయణ, మ్యాన ప్రసాద్, గోనె ఎల్లప్ప, జాలుగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు! -
కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు!
నారాయణపేట: ‘కొడంగల్ ఎమ్మెల్యే తనను.. పేట ఎమ్మెల్యేగా పర్ణికారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపితే కొడంగల్, నారాయణపేటలను హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆ విధంగా రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తా. కొడంగల్ అభివృద్ధికి నిధులు ఎలా మంజూరు చేస్తానో.. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గానికి ఇస్తా..’ అని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) పేరిట జీఓను విడుదల చేయించడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలన్నీ కొత్త సంవత్సరంలో అమలు కావాలని.. పేట అభివృద్ధి పరుగులు తీయాలని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన సంవత్సరంలో అడుగులు వేసి ప్రగతిలో పరుగులు తీయించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, 2023 సంవత్సరంలో జిల్లా అభివృద్ధి ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి పడినట్లయింది. ఇండస్ట్రియల్ పార్క్లు.. జిల్లాలో ఉపాధి లేక ముంబయి, హైదరాబాద్, పూణె, బెంగళూర్ నగరాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. నారాయణపేట జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. నూతన సీఎం ఎనముల రేవంత్రెడ్డి కావడంతో జిల్లాకు పరిశ్రమలకు పునాదులు పడుతాయని ఈ ప్రాంత వలసజీవులు ఆశాభావంతో ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్కు, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయితే ఈ ప్రాంతంలోని వలసజీవులకు ఇక్కడే జీవనోపాధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్, ఆత్మకూర్ ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లు చేయాలని జనం ఆకాంక్షించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనం ఎంతో ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారు. నూతన ఏడాదిలో నారాయణపేట నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు గార్లపాడు, కానుకుర్తి, కోటకొండ మండలాలను ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల అవుతుందనే శుభావార్త వినాలని కోరుకుందాం. ఈ ప్రాంతంలో వ్యవసాయంపైనే ఆధారపడి ఎక్కువ కుటుంబాలు జీవిస్తుంటాయి. జాయమ్మ చెరువును నింపి సాగునీటిని అందించేందుకు పనులు ప్రారంభించాలని రైతులు ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు. కలెక్టరేట్.. జిల్లా ఆస్పత్రికి పునాదులు.. జిల్లాకు ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు ఇతర కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి రూ.55 కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆయా భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను గుర్తించి గతేడాది కలెక్టరేట్కు తాజా మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కార్యాలయానికి ఇంకా పునాదులు పడలేదు. కొత్త ఏడాదిలో నూతన ప్రభుత్వంలో పునాదులు పడుతాయని ఆశిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి పనులు పూర్తయి, మెడికల్ కళాశాల ప్రారంభమై, విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
కాంగ్రెస్కు కలిసొచ్చింది.. డీలా పడిన బీఆర్ఎస్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఈ సంవత్సరంలో తలకిందులయ్యాయి. 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. రాజకీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయగా, బీఆర్ఎస్ డీలా పడిపోయింది. బీజేపీ, సీపీఎం పోటీ చేసినా కనీస ఉనికిని చాటులేకపోయాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొంది రికార్డు సృష్టించింది. అప్పటి వరకు 12 స్థానాలు కలిగిన బీఆర్ఎస్ డీలా పడి ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్కు చుక్కెదురు! బీఆర్ఎస్కు 2023 సంవత్సరం కలిసి రాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వరుసగా రెండుసార్లు ప్రజలు గులాబీ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత రావడంతో 2023 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించారు. కేటీఆర్ కూడా ఆశీర్వాద సభలు, రోడ్షోల ద్వారా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఇంకా దత్తత అయిపోలేదు. కొనసాగుతుందని జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పినప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విశ్వసించలేదు. దీంతో 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో అపజయం పాలైంది. ఒక్క సూర్యాపేటలో మాత్రం మాజీ మంత్రి జగదీశ్రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ను ఆదరించిన జిల్లా ప్రజలు.. 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. తెలంగాణ వచ్చాక పదేళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది కంచుకోటగా ఉంటూ వచ్చింది. కానీ.. మొన్నటి ఎన్నికల ముందు వరకు ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉనికి చాటుకోలేకపోయిన బీజేపీ, సీపీఎం బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలై ఉనికి చాటుకోలేకపోయింది. ఇక సీపీఎం ఉమ్మడి జిల్లాలోని ఏడు స్థానాల్లో పోటీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడా డిపాజిట్ దక్కించుకోలేదు. ఇక కాంగ్రెస్తో పొత్తుల వ్యవహారంతో సీపీఐ జాగ్రత్తగా వ్యవహరించింది. ఎక్కడా సొంతంగా పోటీకి దిగలేదు. దీంతో సీపీఐ బలాబలాలు ఈ ఎన్నికల్లో బయట పడలేదు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఉత్తమ్కుమార్రెడ్డి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పదేళ్ల తర్వాత నల్లగొండ జిల్లాకు మళ్లీ జోడు మంత్రి పదవులు లభించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు ఒకటే మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. -
జేసీవి దిగజారుడు రాజకీయాలు: కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తనపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 'జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు. ఇప్పుడేమో వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం. జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు. నోరు జారితే ఊరుకునేది లేదు. జేసీ వర్గీయులు నా ఓర్పును పరీక్షించవద్దు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు కుట్రలు చేస్తున్నారు.' అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: బాబును ప్రజలు ఫుట్బాల్ ఆడుతారు: మంత్రి రోజా -
'నిరూపించు.. లేదంటే ముక్కు నేలకు రాయి' : మేయర్ సునీల్రావు ఫైర్!
కరీంనగర్: స్మార్ట్ సిటీలో రూ.130 కోట్ల కుంభకోణం జరిగిందని, రోడ్డు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణలు చెప్పి, టవర్సర్కిల్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీలో భాగంగా రూ.934 కోట్లతో పనులు ప్రారంభించామని.. అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ.539 కోట్లు నగరపాలకసంస్థకు వచ్చాయని... రూ.514 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. ప్రతీ పని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), థర్డ్పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిధిలో జరుతుతుందన్నారు. మూడు సంస్థల రిపోర్ట్ తర్వాతే బిల్లులు చెల్లిస్తారన్నారు. గత పాలకవర్గం హయాంలోనే టెండర్లు పూర్తయినా.. రవీందర్ సింగ్ తనకు నచ్చిన ఏజెన్సీకి టెండర్లు దక్కలేదని ఏడాది పాటు పనులు పెండింగ్లో పెట్టారన్నారు. టవర్ సర్కిల్ ఆధునీకరణ పేరిట నిర్మాణాలు కూలగొట్టాలనే ఆలోచన చేసిన గొప్ప మేధావి అని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో రవీందర్ సింగ్ లాంటి వెన్నుపోటుదారులు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ బీఆర్ఎస్ గెలిచిందన్నారు. కార్పొరేటర్, సివిల్సప్లై చైర్మన్గా ఏకకాలంలో రెండు జీతాలు తీసుకున్నారని విమర్శించారు. రవీందర్ సింగ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో కార్పొరేటర్లు గందే మాధవి మహేశ్, గంట కళ్యాణి, కంసాల శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, చాడగొండ బుచ్చిరెడ్డి, వాల రమణారావు, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, కుర్ర తిరుపతి, సల్ల శారద రవీందర్, ఎడ్ల సరిత అశోక్, వంగల శ్రీదేవి పవన్, పిట్టల వినోద శ్రీనివాస్ ఉన్నారు. ఇవి చదవండి: యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్ -
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ తన ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేసిందే తప్ప, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నేత నారాలోకేశ్ యువగళమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై అక్కసుతోపాటు వ్యక్తిగత దూషణలు చేయడానికే పరిమితమైందన్నారు. నాలుగున్నరేళ్లుగా అవినీతిరహితంగా పాలన సాగిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఒక్క ఆరోపణ చేయలేకపోయారన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై మాట్లాడలేదంటే వైఎస్సార్ సీపీ జనరంజక పాలన టీడీపీకి అర్థమై ఉంటుందన్నారు. యువగళంలో టీడీపీ నేతలు ఉచిత పథకాలకు అలవాటుపడొద్దని ప్రజలకు కళ్లబొల్లి కథలు చెప్పి ఆరు ఉచిత పథకాలను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయ నిరాశ్రయులకు పరిహారం మాటెత్తకుండా, టెండర్లు ఖరారు చేయకుండా ఎన్నికల ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపన చేసేశారన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలయ్యాక ప్రజలకు శఠగోపం పెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు బీసీలకు తామేదో ప్రాధాన్యం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, టీడీపీ పాలనలో బీసీ మహిళకు ఇచ్చిన మంత్రి పదవిని తీసేసి, క్షత్రియ వర్గానికి కేటాయించిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ప్రజా సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తుంటే... టీడీపీ, ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ఆయనవెంట పలాస నియోజవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజు, వేపాడ జెడ్పీటీసీ సభ్యులు సేనాపతి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: 'జగనన్నకు కొండపిని కానుకగా ఇస్తా!' : ఆదిమూలపు సురేష్ -
నాగలదిన్నె బ్రిడ్జి ప్రారంభం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం
అయిజ/నందవరం: ఇరు తెలుగు రాష్ట్రాలకు నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలెవల్ వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్రం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రిబ్బన్ కట్ చేసి వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2009లో తుంగభద్ర నది ఉధృతిలో పాత బ్రిడ్జి కొట్టుకుపోయిందన్నారు. 2011లో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కొత్త బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించారన్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కరోనా విపత్తు, తెలంగాణ వైపు భూ సేకరణ వంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆయన పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయని, వారందరికీ ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి రూ.42 కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్కు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి భూ సేకరణ సమస్యను పరిష్కరించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లించి వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం మంజూరు చేసి పూర్తి చేయించిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురు చూశారని, ఎట్టకేలకు రెండు రాష్ట్రాల బంధాలకు వంతెన వారధిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కర్నూలు కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్కుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఆదోని డివిజన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిత్యానందరాజు, ఎంపీడీఓ దశరథ రామయ్య, సీఐ మోహన్రెడ్డి, ఎస్ఐలు తిమ్మయ్య, తిమ్మారెడ్డి, శరత్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేవి గృహలక్ష్మి ఇళ్లా! లేక.. ఇందిరమ్మ ఇళ్లా!
దురాజ్పల్లి (సూర్యాపేట): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుదారుల్లో సందిగ్ధ్దత నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు ఆమోదిస్తారా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మళ్లీ స్వీకరిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్చి ఉంది. ఒకవేళ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తే గతంలో గృహలక్ష్మి పథకం కింద ఎంపికై ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన చోట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే ఇప్పటి వరకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు వృథాయేనా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూం సక్సెస్ కాకపోవడంతో.. గృహలక్ష్మి పథకానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో అనుకున్న స్థాయిలో ఆ పథకం సక్సెస్ కాలేదు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. నిర్మించిన ఇళ్లు తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సొంతస్థలం ఉన్న వారికి గృహ నిర్మాణం కోసం మూడు విడతల్లో రూ.3లక్షల నగదు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో మొత్తం 58,564 దరఖాస్తులు రాగా క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు. వీటిలో 34,849 మందిని అర్హులుగా తేల్చి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల యూనిట్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోకవర్గాల్లో 12వేల యూనిట్లకు మంజూరు పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. దీంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. మిగతా ఆశావహులు సైతం వారికి అందుతాయని భావించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. తమ హామీల్లో భాగంగా గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అమలు చేయాలని యోచిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించింది. సాయం పెంపుపై అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా.. కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో, విధివిధానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో సుమారు 70 వేలకు పైగా కుటుంబాలు సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు సమాచారం. -
నత్తనడకన ‘రైతుబంధు’.. రైతులకు తప్పని అప్పుల తిప్పలు!
నల్లగొండ అగ్రికల్చర్: రైతుబంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలోని 86 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అరెకరం, ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులను జమ చేసినట్లు గణాంకాలు చెపుతున్నాయి. యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులు దాటినా రైతుబంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే.. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఈ సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి పచ్చజెండాను ఊపింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న రైతు భరోసా పథకంపై ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు. దీని కారణంగా పాత పద్ధతినే రైతులకు డబ్బు జమచేసే ప్రక్రియను ఈ నెల 12 నుంచి ప్రారంభించింది. రంగారెడ్డి ట్రెజరీ నుంచి రైతులు దశల వారీగా డబ్బులను జమ చేస్తామని పేర్కొంది. తొలుత ఎకరం లోపు వారికి.. ఆ తర్వాత దశల వారీగా రోజుకు ఎకరం చొప్పున పెంచుతూ రెండు ఎకరాలు, మూడు ఎకరాలు, ఆ తరువాత పై ఎకరాల వారికి రైతుబంధు డబ్బులను జమచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది. నల్లగొండలో జిల్లాలో 5.30 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా ఉన్నారు. వారికి సంబంధించిన రూ.610 కోట్లు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు తప్పని తిప్పలు యాసంగి సీజన్ ప్రారంభమై నెల దాటింది. రుణమాఫీ సక్రమంగా కాకపోవడంతో బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో రైతులు పంటరుణాలు అందక, రైతుబంధు సాయం రాక పెట్టుబడల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుబంధు డబ్బుల జమ ప్రక్రయను వేగవంతం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. వానాకాలంలో కూడా కొందరికి అందలే.. గత వానాకాలంలో సీజన్లో కూడా వేలాది మంది రైతుల వరకు రైతుబంధు డబ్బులు జమ కాలేదు. వివిధ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ సీజన్ ముగిసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరైన సమాధానం రాలేదు. ప్రస్తుత యాసంగి సీజన్ కూడా డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో వానాకాలం పరిస్థితి ఏర్పడుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దశల వారీగా జమ అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ రైతుబంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు రైతులకు ఆ తరువాత రెండెకరాలోపు వారికి ఇలా దశవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకూ రైతుబంధు సాయం అందుతుంది. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ -
'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్నాయక్
మహబూబాబాద్: పార్టీ శ్రేణులు కసిగా పనిచేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని, ఓటు వేసే ముందు ఆలోచిస్తే బాగుండేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ఏం పాపం చేశామని ఎన్నికల్లో ప్రజలు మోసం చేశారో తెలియడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలో లబ్ధిపొంది ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారని, మరి కొంతమంది పార్టీలో ఉంటూ మోసం చేశారన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మీదట పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి, కసిగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, నీలం దుర్గేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, జాటోత్ హరీశ్నాయక్, ఊకంటి యాకూబ్రెడ్డి, సట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట -
నామినేటెడ్పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్పదవులపై ఆశలు.. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గట్టు తిమ్మప్ప, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వేద సాయిచంద్ సతీమణి రజని, ముడా చైర్మన్గా గంజి వెంకన్న ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్, మిషన్ భగీరథ చైర్మన్గా ఉప్పల వెంకటేశ్ గుప్తా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా రమావత్ వాల్యానాయక్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్గా గోలి శ్రీనివాస్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఆంజనేయగౌడ్ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా.. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేతలు, పార్టీ టికెట్ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇవి చదవండి: ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం! -
మంత్రి యోగమెవరికో? ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రా తినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినెట్తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. వీరందరిలో ప్రధానంగా ముగ్గురు సీనియర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్లో చర్చ జరుగుతోంది. ‘పీఎస్సార్’కు ఖర్గే హామీ! ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) మంత్రి పదవి రేసులో ప్రముఖంగా ఉన్నారు. గత ఏప్రిల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీఎస్సార్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కీలక హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. అయితే తొలివిడతలో ఆయనకు అవకాశం రాలేదు. మరోవైపు మంత్రి పదవులు వరించిన వారి సామాజిక వర్గాలు చూస్తే, వెలమ కోటలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో భర్తీ చేయాల్సి వస్తే, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. పోటీలో ఉన్న వారి సామాజిక కోటా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ స్థాయి పదవులతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్తో పదవి దక్కని వారు నిరాశ పడకుండా సర్దుబాటు చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి తదుపరి టీంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు ఉంటుందో, ఎవరికి నిరాశ కలుగుతుందోనని అధికార పార్టీ వర్గాల్లోనూ, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ఇటు రాష్ట్ర పెద్దలతోపాటు అటు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇవి చదవండి: సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం -
అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బుధవారం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన స్పీకర్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం ప్రసాద్కుమార్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం రేవంత్రెడ్డితో పాటు వివిధ పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని వెళతారు. ఆపై నూతన స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికారపక్షం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ప్రసాద్కుమార్ నామినేషన్ పత్రాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అయితే స్పీకర్ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. గడ్డం ప్రసాద్కుమార్ పేరును కాంగ్రెస్ ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్తో కలిసి బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లి గడ్డం ప్రసాద్కుమార్కు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. కాంగ్రెస్ నుంచి అందిన వినతి మేరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రసాద్కుమార్ నామినేషన్ పత్రాలపై కేటీఆర్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్యలు సంతకాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనపనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తదితరులు జట్టుగా అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు ప్రసాద్ కుమార్ తరపున నామినేషన్ పత్రాలు అందజేశారు. తెలంగాణ తొలి శాసనసభలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్గా పనిచేయగా, రెండో శాసనసభలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్రెడ్డి స్పీకర్గా వ్యవహరించారు. ప్రస్తుత మూడో శాసనసభలో దళిత సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా ఎన్నికయ్యారు. -
రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు?
కొమురవెల్లి/సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి పదవీ కాలం గత సెప్టెంబర్ 20 తో ముగిసింది. వెంటనే దేవదాయశాఖ అధికారులు రెగ్యులర్ కమిటీకి నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంటుంది. అందుకు అప్పుడు కొంత మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు పావులు కదిపినా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆలయ రెగ్యులర్ కమిటీకి నోటిఫికేషన్ నిలిచిపోయింది. సమయం లేకపోవడంతో.. ఇటీవల ఎన్నికల ప్రక్రియ పూర్తవడం, నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అందరి చూపు మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకం వైపు మళ్లింది. జనవరి 7న స్వామి కల్యాణం జరగనుంది. దీంతో దేవదాయశాఖకు రెగ్యులర్ కమిటీ నియమించే సమయంలేదు. రెగ్యులర్ కమిటీని నియమించాలంటే నోటిపికేషన్ జారీచేసి 45 రోజుల సమయం ఇచ్చి దరఖాస్తులు కోరాలి. ఆ తర్వాత వాటిని పరిశీలించి, విచారించి కమిటీని ప్రకటించాలి. స్వామి కల్యాణం వచ్చే నెల 7 ఉండడం, అదేవిధంగా సంకాంత్రి నుంచి జాతర మొదలు కానుడడంతో మూడు నెలల కోసం ఉత్సవ కమిటీని నియమించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. పైరవీలు ప్రారంభం! కమిటీ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. సుమారు పదేళ్లు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆ నాయకులకు నామినేటేడ్ పదవులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ ప్రాంత నాయకులు ఉత్సవ, రెగ్యులర్ కమిటీలలో స్థానం కోసం పాకులాడుతున్నారు. చేర్యాల మాజీ జెడ్పీటీసీ నర్సింగరావు, చేర్యాల మాజీ ఎంపీపీ బోడిగె నర్సింహులు, మహదేవుని శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, వల్లాద్రి అంజిరెడ్డి, లింగంపల్లి కనకరాజు, చెరుకు రమణారెడ్డి, జంగనిరవి, జీవన్రెడ్డి, ముస్త్యాల యాదగిరితో పాటు జనగామ, మద్దూరు నర్మేట్ట, హుస్నాబాద్కు చెందిన మరి కొందరి నేతల పేర్లు చైర్మన్ రేసులో ఉన్నట్టు వినిపిస్తున్నాయి. పొన్నం అనుచరులకే.. మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ప్రధాన అనుచరులకు చైర్మన్గా అవకాశం కల్పిస్తారని పలువురు స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలలాకు చెందిన స్థానిక నేతలకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని పలువురు కోరుతు న్నట్టు సమాచారం. కొంత కాలంగా ఆలయంలో ధర్మకర్తల మండలి లేకపోవడంతో ఆలయంలో అధికారులు తమ ఇష్టానుసారంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని, ప్రభుత్వం, దేవదాయశాఖ అధికారులు స్పందించి వెంటనే ఆలయంలో ధర్మకర్తల మండలి నియమించాలని చాలా మంది కోరుతున్నారు.