
సాక్షి, న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఇతర లోక్సభ స్థానాలకు మరికొంతమంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
అంతకుముందు, బీజేపీ మార్చి 2న ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా, కాంగ్రెస్ గత వారం 39 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది.
మరోవైపు, రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) కూడా ఈరోజు సమావేశమైంది. గత వారం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మెగా బహిరంగ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ లోక్సభ అభ్యర్థి జాబితాను కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment