![Huge rains in several districts - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/31/rain.jpg.webp?itok=X98b-u_m)
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకుతోడు పెద్ద ఎత్తున వడగళ్లు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కాలంకాని కాలంలో కురిసిన ఈ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈ వర్షం తీవ్రనష్టం కలిగించింది. కాగా రాష్ట్రంలో అకాల వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment