Rain
-
మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(సోమవారం) నుండి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడనుంది. సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. పాలంలో ఉదయం 4 గంటలకు 50 మీటర్లుగా ఉంది.జమ్ముకశ్మీర్లో భారీ వర్షం, హిమపాతం కారణంగా వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా మంచు గాలులు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తాకాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న పొగమంచు పలు సమస్యలను సృష్టిస్తోంది. పంజాబ్, హర్యానాలలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.పొగమంచు కారణంగా కోల్కతాలో 13 విమానాల రాకపోకలకు(flight arrivals) అంతరాయం కలిగింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, బెంగాల్, బీహార్, ఒడిశా సహా 12 రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో సోమవారం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోనుందని వాతావరణశాఖ తెలిపింది.మంగళవారం పొగమంచు నుండి కొంత ఉపశమనం లభిస్తుందని, రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. పొగమంచు కారణంగా పంజాబ్లోని అమృత్సర్-ఖేమ్కరన్ రహదారిపై ఒక కారు- బస్సు ఢీకొన్నాయి. అమర్కోట్ బస్తీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా హర్యానాలోని మంగళ్పూర్-దరౌలి రోడ్డుపై దట్టమైన పొగమంచు కారణంగా, ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.ఇది కూడా చదవండి: America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం -
వాన చినుకులలో వడ్డన..!
ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.సౌకర్యవంతమైన కుషన్స్లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్కి వెళ్లాల్సిందే మరి. (చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం) -
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్లైన్కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
సాక్షి, విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి,అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
ధాన్యం వర్షార్పణం
దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్యార్డులోని ఫ్లాట్ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు. సుమారు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్ ఫ్లాట్ఫారాలపై రైతులు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజామున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది. వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యార్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
వర్షం కురిసినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తరు గురించి తెలుసా..!
రకరకాల పెర్ఫ్యూమ్లు వాడుతంటాం కదా. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ గురించి విన్నారా..!. అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్కి రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను 'పెట్రికోర్' అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే "మిట్టి అత్తర్" పేరుతో ఈ పెర్ఫ్యూమ్ని తయారుచేస్తున్నారు. దీన్ని పురాత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్లు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారీకీ ఏం ఉపయోగిస్తారంటే..గంగా నది ఒడ్డున ఉండే మట్టిని, గులాబి రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు. తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు తయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నౌజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు. కనీసం ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్డిసి) డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా చెబుతున్నారు. శుక్లా ఈ "మిట్టి అత్తర్"ని సహజమైన డీ-మాయిశ్చరైజర్గా అభివర్ణిస్తున్నారు. (చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!) -
ఇంగ్లండ్, విండీస్ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను నెగ్గింది. ఈ సిరీస్లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
2 రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.6 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారిన తర్వాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనిస్తూ..14వ తేదీ రాత్రి లేదా 15వ తేదీ ఉదయం తీరం దాటనుందని తెలిపారు. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు, రేపు మోస్తరు నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
ఏపీలో 3 రోజులపాటు భారీ వర్షాలు
-
స్పెయిన్ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
దానా ఎఫెక్ట్..రద్దయిన 34 రైళ్లు ఇవే
అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్కోస్ట్ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్కు సేవలందించే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా.. 22న వాయుగుండంగా బలం పుంజుకుని బుధవారం (23న) ఇది దానా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీర్పు తీర ప్రాంతాల దానా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరుణంలో తీర్పుతీర ప్రాంతాలకు రైల్వే సేవలందించే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన 34రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే నోట్ను విడుదల చేసింది. -
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
నాలుగు రోజులు భారీ వర్షాలు..
-
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
-
Rain Alert: రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి,అమరావతి: రానున్న 3-4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు పడతాయని చెప్పారు. ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్,హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు -
భారత్- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అయితే ప్రస్తుతం కాన్పూర్లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్లు పిచ్ను పరిశీలించనున్నారు. కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు
లక్నో/పట్నా: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తరప్రదేశ్, బీహార్లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.వాతావరణ శాఖ తాజాగా అందించిన సూచనల ప్రకారం తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో ఈరోజు(ఆదివారం) భారీ వర్షాలు కురియనున్నాయి. ఉత్తరప్రదేశ్లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైన కారణంగా, పలు నదుల నీటిమట్టం పెరిగింది. ఫలితంగా పలు జిల్లాలకు వరద ముప్పు పొంచివుంది. ఐఎండీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లో 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏడుగురు వర్ష సంబంధిత దుర్ఘటనల్లో మృతిచెందారు. Rainfall Warning : 29th September 2024 वर्षा की चेतावनी : 29th सितंबर 2024 #rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #puducherry #Kerala #karnataka @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma @KarnatakaSNDMC pic.twitter.com/R5HnYKbhru— India Meteorological Department (@Indiametdept) September 28, 2024బీహార్లోని వాల్మీకినగర్, బీర్పూర్ బ్యారేజీల నుంచి నీటి విడుదల, కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా కోసి, గండక్, గంగ నదులు ఉప్పొంగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 66 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. నేపాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ విపత్తు అధికారులు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు.ఇది కూడా చదవండి: నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -
ఒక్క బంతి పడకుండానే...
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వదిలేలా లేడు. భారీ వర్షానికి తోడు వెలుతురులేమి కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యం కాగా... శనివారం రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. ఉదయంనుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ఆట నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోగా... లంచ్ విరామ సయమంలో వరుణుడు కాస్త శాంతించాడు. దీంతో గ్రౌండ్స్మెన్ మైదానాన్ని సిద్ధం చేసే పనిలో పడగా... మరోసారి వర్షం ముంచెత్తింది. ఫలితంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కూడా వర్ష సూచన ఉండటం అభిమానులను కలవరపెట్టే అంశం! కాన్పూర్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్లకు ముందు బంగ్లాదేశ్పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావించిన టీమిండియాను కాన్పూర్లో వరుణుడు అడ్డుకున్నాడు. తొలి రోజు భారీ వర్షం కారణంగా కేవలం 35 ఓవర్ల ఆట సాధ్యం కాగా... శనివారం ఆ కాస్త కూడా తెరిపినివ్వలేదు. అసలు ఆటగాళ్లు మైదానంలోకి వచ్చే అవకాశమే లేకుండా వర్షం ముంచెత్తడంతో పలు సమీక్షల అనంతరం రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చిరుజల్లులుగా మొదలైన వర్షం ఆ తర్వాత మైదానాన్ని ముంచెత్తింది. మధ్యలో కాసేపు వరుణుడు శాంతించడంతో గ్రౌండ్స్మెన్ సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభించగా... మరోసారి భారీ వాన దంచి కొట్టింది. దీంతో ఆట సాధ్యపడలేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆదివారం, సోమవారం కూడా కాన్పూర్లో వర్షం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే. తొలి రోజు ఆటలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (31; 6 ఫోర్లు), షాద్మన్ ఇస్లామ్ (24; 4 ఫోర్లు), జాకీర్ హసన్ (0) ఔట్ కాగా... మోమినుల్ హక్ (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 7 ఫోర్లు), ముషి్ఫకర్ రహీమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. డబ్ల్యూటీసీ 2023–25 సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన భారత్ అందులో 7 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం 71.67 విజయ శాతంతో ‘టాప్’లో కొనసాగుతోంది. 12 మ్యాచ్లాడిన ఆస్ట్రేలియా (62.50 విజయ శాతం) ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్తో సిరీస్ అనంతరం భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టులు, ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో 5 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ రెండింట్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే... టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడం ఖాయమే! బంగ్లాదేశ్తో రెండో టెస్టు వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిస్తే అది రోహిత్ బృందం డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే మార్గంపై స్వల్ప ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఆట సాగితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. -
Ind vs Ban Day 1: మొదటి రోజు 35 ఓవర్లతో సరి
వర్షం, వెలుతురులేమి కలగలిసి భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటను అర్ధాంతరంగా ముగించాయి. తక్కువ వ్యవధిలో మూడు బంగ్లాదేశ్ వికెట్లు తీసి ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా వాన కారణంగా దానిని కొనసాగించలేకపోయింది. ఆట సాగిన 35 ఓవర్లలోనే భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తమ బలహీనతను ప్రదర్శించిన పర్యాటక జట్టుకు ఆట ఆగిపోవడం తెరిపినిచ్చింది. 11 బంతుల తేడాలోనే రెండు కీలక వికెట్లు తీసిన పేసర్ ఆకాశ్దీప్ బౌలింగ్ ఈ సంక్షిప్త ఆటలోహైలైట్గా నిలవగా... మ్యాచ్ రెండో రోజు కూడా వర్షసూచన ఉండటం భారత అభిమానులకు నిరాశకలిగించే విషయం. కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు వాన అంతరాయాలతో మొదలైంది. వర్షం కారణంగా ఉదయం ఆట గంట ఆలస్యంగా మొదలు కాగా... చివర్లో వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయం కంటే గంటన్నర ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ మొదటి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 బ్యాటింగ్; 7 ఫోర్లు), నజు్మల్ హసన్ ( 31; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం మోమినుల్తో పాటు ముషి్ఫకర్ (6 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. ఆకాశ్దీప్కు 2 వికెట్లు దక్కాయి. పిచ్ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా గత టెస్టు తుది జట్టునే కొనసాగిస్తూ ముగ్గురు పేసర్లను ఎంచుకుంది. దాంతో కాన్పూర్ కే చెందిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. రాణించిన మోమినుల్... పరిస్థితులు పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను జాకీర్ (0), షాద్మన్ జాగ్రత్తగా ప్రారంభించారు. బుమ్రా తన తొలి 3 ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మరీ ఇబ్బంది పడిన జాకీర్ 23 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఆపై ఆకాశ్దీప్ తన తొలి ఓవర్లోనే అతడిని సాగనంపి భారత్కు తొలి వికెట్ అందించాడు.జైస్వాల్ పట్టిన క్యాచ్పై కాస్త సందేహం కనిపించినా... వరుస రీప్లేల తర్వాత అంపైర్లు జాకీర్ను అవుట్గా ప్రకటించారు. ఆ తర్వాత ఆకాశ్దీప్ మూడో ఓవర్ తొలి బంతికే షాద్మన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా... రివ్యూ కోరిన భారత్ ఫలితం పొందింది. ఈ దశలో నజు్మల్, మోమినుల్ కలిసి జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేశారు.సిరాజ్ ఓవర్లో నజు్మల్ ఎల్బీ కోసం రివ్యూ కోరిన భారత్ ఈసారి మాత్రం ప్రతికూల ఫలితం రావడంతో ఒక రివ్యూను కోల్పోయింది. ఇద్దరు బ్యాటర్లూ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టి సెషన్ను ముగించారు. లంచ్ తర్వాత తన రెండో ఓవర్లో అశ్విన్ బంగ్లాదేశ్ను దెబ్బ తీశాడు. చక్కటి బంతితో నజు్మల్ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. బంగ్లా కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. నజు్మల్, మోమినుల్ మూడో వికెట్కు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు మరింత ఒత్తిడి పెంచారు. దాంతో మరో 6.1 ఓవర్ల పాటు మోమినుల్, ముష్ఫికర్ కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అనూహ్య ముగింపుతో వారికి కాస్త ఉపశమనం లభించింది. ముందుగా వెలుతురులేమితో ఆటను నిలిపివేసిన అంపైర్లు గంట పాటు వేచి చూసి తుది నిర్ణయం తీసుకున్నారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆకాశ్దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్దీప్ 24; మోమినుల్ (బ్యాటింగ్) 40; నజు్మల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 31; ముష్ఫికర్ రహీమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (35 ఓవర్లలో 3 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80. బౌలింగ్: బుమ్రా 9–4–19–0, సిరాజ్ 7–0–27–0, అశ్విన్ 9–0–22–1, ఆకాశ్దీప్ 10–4–34–2. -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
మహిళ ప్రాణం తీసిన మ్యాన్హోల్ గ్రిల్స్ దొంగతనం
మ్యాన్హోల్ గ్రిల్స్ (మెటల్స్) దొంగతనం 45 ఏళ్ల విమల్ అనిల్ గైక్వాడ్ ప్రాణం తీసింది. భారీ వర్షాలకు గైక్వాడ్ మ్యాన్హోల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండేలా అధికారులు మ్యాన్హోల్స్ను మెటల్స్ను అమర్చారు. ఆ మెటల్స్ను అగంతకులు దొంగతనం చేశారు. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విమల్ అనిల్ గైక్వాడ్ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడి మరణించారు. ఈ ఘటనలో కుటుంబానికి ఆధారమైన తన భార్య మరణానికి కారణమైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి భర్త పోలీసుల్ని ఆశ్రయించారు‘నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నన్ను, నా ఇంటి బాధ్యతల్ని తన చూసుకునేది. ఇంటి బాధ్యతల్ని నా భార్యనే చూసుకునేది. ఆమె మరణంతో మేం సర్వం కోల్పోయాం ’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా తప్పు ఎవరిదైనా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనిల్ గౌక్వాడ్ ఫిర్యాదుతో పోలీసులు..ఈ దర్ఘుటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ శాఖ.. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో నివేదికను కోరింది. నిన్న కురిసిన భారీ వర్షం వల్ల ఆర్థిక రాజధానిలో రైలు పట్టాలు, రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది .14 విమానాలు దారి మళ్లించాయి. అయితే వర్షం బీభత్సం సమయంలో గైక్వాడ్ అంధేరీ ఈస్ట్లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనం గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్హోల్లో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక దళ సిబ్బంది ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ముంబైలో వేర్వేరు మ్యాన్హోల్లో పడిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారు. నగరంలో మ్యాన్హోల్ మెటల్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని, గతేడాది ముంబైలో 791 మ్యాన్హోల్ కవర్ దొంగతనాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్లలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ)సిస్టమ్ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు -
ముంబైలో వర్ష బీభత్సం
ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు. ఫలితంగా ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు. -
మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులు
ముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు -
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.కాగా, సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం పశి్చమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
వానమ్మ.. వాన! ఇన్ని రకాల వానలుంటాయంటే నమ్ముతారా?
నిన్నమొన్నటి దాకా వానలు దంచి కొట్టాయి. విపరీతంగా కురిసిన వానలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కాస్త తెరిపిన పడ్డారో లేదో తెలంగాణాలో, హైదరబాద్లో మళ్లీ వానలు ఆగమేఘాలమీద దూసుకొచ్చాయి. అసలు వానలు ఎన్నిరకాలు, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నమ్మినా నమ్మకపోయినా, వివిధ రకాల వర్షాలు ఉన్నాయి. అవును. అంతేకాదు అన్ని వర్షాలు ఒకేలా ఉండవు! గాంధారి వాన –కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన.మాపుసారి వాన –సాయంత్రం కురిసే వానమీసర వాన – మృగశిర కార్తెలో కురిసే వానదుబ్బురు వాన – తుప్పర / తుంపర వానసానిపి వాన – అలుకు (కళ్లాపి చల్లినంత కురిసే వాన)సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వానబట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిసేంత వానతప్పె వాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వానసాలు వాన – ఒక నాగలి సాలుకు సరిపడా వానఇలువాలు వాన – రెండుసాల్లకు – విత్తనాలకు సరిపడా వానమడికట్టు వాన – బురద పొలం దున్నేటంత వానముంతపోత వాన – ముంతతోటి పోసినంత వానకుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వానముసురు వాన – విడువకుండా కురిసే వానదరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వానబొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వానకోపులు నిండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండేంత వనరాళ్ల వాన – వడగండ్ల వానకప్పదాటు వాన – అక్కడక్కడా కొంచెం కురిసే వానతప్పడతప్పడ వాన – టపటపా కొంచెంసేపు కురిసే వానదొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వానఏకార వాన – ఏకధారగా కురిసే వానమొదటి వాన – విత్తనాలకు బలమిచ్చే వానసాలేటి వాన – భూమి తడిసేంత భారీ వానసాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన -
ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు
భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య ఆదివారం మాంచెస్టర్లో జరగాల్సిన చివరి టి20 మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండా నిర్ణీత సమయానికి రెండు గంటల తర్వాత మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో మూడు మ్యాచ్ల ఈ సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్లతో కూడిన వన్డే సిరీస్ జరుగుతుంది. -
తాజ్మహల్ ప్రధాన గోపురం నుంచి లీకేజీ : స్పందించిన అధికారులు
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్మహల్కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్లో వీడియో గురువారం వైరల్గా మారింది.అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.ఏఎస్ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's AgraWork is ongoing to drain the water from one of the Seven Wonders of the World.pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024 తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
సెప్టెంబర్ 19 నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి
న్యూఢిల్లీ: ఈనెల 19 నుంచి 25 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లడం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఏటా సాధారణంగా జూన్ ఒకటో తేదీన తొలిసారిగా కేరళను తాకుతాయి. అక్కడి నుంచి విస్తరిస్తూ జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా చుట్టేస్తాయి. తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తిరోగమనం మొదలై అక్టోబర్ 15 కల్లా వెళ్లిపోతాయి. ఈ నైరుతి సీజన్లో దేశంలో సగటున 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కంటే ఈసారి 8 శాతం ఎక్కువ నమోదవడం గమనార్హం. ఇదీ చదవండి : ఇయర్రింగ్స్తో కుట్ర..ట్రంప్-హారిస్ డిబేట్పై చర్చ -
Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం?
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్ను ఎంచుకుంది.సోమవారమే మొదలు కావాలి.. కానీభారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.ల్యాండ్స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.ఇప్పుడిక వర్షంఅయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
రెండో రోజూ అదే పరిస్థితి
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సెప్టెంబర్ 11 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది చదవండి: Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్ -
ప్రకాశం బ్యారేజ్ కు మళ్ళీ పెరుగుతున్న వరద
-
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
-
#VijayawadaFloods : చెప్పలేనంత కష్టం.. చెప్పుకోలేనంత నష్టం! (ఫొటోలు)
-
వచ్చే వారం రోజులూ వర్షాలే
సాక్షి, అమరావతి/ మహారాణిపేట(విశాఖ): రాష్ట్రాన్ని వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
Updates: మళ్లీ బుడమేరు భయం.. భారీగా చేరుతున్న వరద
Telugu States Heavy Rains Latest News Updatesబుడమేరు ముంపు బాధితులకు చేదు అనుభవంవరద ఉధృతి తగ్గడంతో ఇళ్లకు వెళ్తున్న వాళ్లను అడ్డుకున్న పోలీసులుప్రైవేట్ వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకున్న వెనక్కి పంపిస్తున్న అధికారులుఎగువన వర్షాలతో బుడమేరుకు పెరుగుతున్న వరదమరోసారి ముంచెత్తే అవకాశంవిశాఖలో భారీ వర్షంవిశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షంతీరం వెంట బలంగా వీస్తున్న గాలులుభద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతికొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక44 అడుగులుకి చేరిన గోదావరి వరద గోదావరి నది నుండి 9,74,666 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులువరద నష్టం వివరాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వంభారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారుఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం 2.34లక్షల మంది రైతులు నష్టపోయారు60వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందాయివరదల వల్ల 22 సబ్స్టేషన్లు దెబ్బతినగా.. 3,973 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమమయ్యాయి 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయివరదల వల్ల మొత్తం 6,44,536 మంది నష్టపోయారు193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారువరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి6 హెలికాప్టర్లు, 228 బోట్లు పనిచేస్తున్నాయి. 317 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారునిజామాబాద్శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద41 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులుఇన్ ఫ్లో 3.5 లక్షల క్యూసెక్కులుఔట్ ఫ్లో 3.58 లక్షల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 90 టీఎంసీలుప్రస్తుతం 1089 అడుగులు, 75 టీఎంసీలుపెద్దపల్లి అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల నుంచి భారీగా వరద నీటి ప్రవాహంఇన్ ఫ్లో 3, 61, 885 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2, 44, 080 క్యూసెక్కులుప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలుప్రస్తుత నిల్వ 14. 0918 టీఎంసీ లు.ప్రాజెక్ట్ కు సంబంధించిన 22 గేట్లు తెరచి సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులుభద్రాద్రి కొత్తగూడెంకిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురుపాల్వంచ మండలం దంతెలబోర పంచాయతీ పరిధిలో కిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురువీరిలో ముగ్గురు పశువుల కాపర్లు దంతెలబోర గ్రామానికి చెందినవారుగంగాదేవిగుప్పకు చెందిన నలుగురు చేపల వేటకు వెళ్లి చిక్కుకున్నారురక్షించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులుసింగ్నగర్ ఖాళీసింగ్నగర్ను ఖాళీ చేస్తున్న జనాలుఇంకా వరదలోనే ఉన్న కాలనీఫ్లై ఓవర్పై రద్దీమరోసారి భయపెడుతున్న బుడమేరు భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి ఎగువన కురిసిన భారీ వర్షాలతో నందివాడలో కూడా బుడమేరు ఉగ్రరూపంవంతెనకు సమానంగా బుడమేరు ప్రవాహం గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరికముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు బుడమేరు పరివాహాక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న గట్లకు గండి పడకుండా ఇసుక బస్తాలు ఐదు దశాబ్దాల్లో ఈ తరహా బుడమేరులో ఇతంటి ఉధృతి చూడలేదని చెబుతున్న స్థానికులు ఇప్పటికే విజయవాడను ముంచెత్తిన బుడమేరు పూర్తి కథనం కోసం క్లిక్ చేయండికృష్ణాదొంగలుగా మారిన రెవెన్యూ సిబ్బంది!అవనిగడ్డలో రెవెన్యూ ఉద్యోగుల చేతివాటంగత అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దొంగలుగా మారిన రెవెన్యూ ఉద్యోగులు.వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన నిత్యావసర వస్తువులను అర్ధరాత్రి బైకులపై ఎత్తుకెళ్లిన రెవెన్యూ ఉద్యోగులుతూర్పుగోదావరిగోదావరిలో పెరుగుతున్న వరదధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగుల వరద నీటిమట్టం నమోదుఆరు లక్షల 61 వేల క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరావరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులుకృష్ణాతెన్నేరు లో బుడమేరు, వన్నేరు కాల్వలకు గండి.ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.ప్రధాన రహదారి లోకి చేరిన వరద నీరు.జలదిగ్బంధంలో ఎస్సీ, బీసీ కాలనీలు.నీట మునిగిన పంట పొలాలు.వరద నీరు గ్రామంలోకి రాకుండా చెరువులోకి మళ్లించుకుంటున్న గ్రామస్తులు.వరద నీటి నుంచి కాపాడాలని గ్రామస్తుల ఆవేదన.పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.కాలువలో ఆహారం!!వరద బాధితులకు అందించాల్సిన భోజనాలు రోడ్డుపాలుఆహారం కోసం ఎదురు చూపులు చూసినా వరద బాధితులకు అందని భోజనాలువరద బాధితులకు అందవలసిన భోజనాలు ఏలూరు కాలువలో హైవే పక్కన పడేసిన వైనంరూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఎన్టీవోఏపీలో వరద బాధితులకు సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన ఎన్జీవో నేతలుఒక రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడిఏపీ వరద నష్టం.. కేంద్రం బృందం ఏర్పాటుఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందం ఏర్పాటుఅదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అమిత్ షానిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని వెల్లడిఏపీలో వరదల పరిస్థితిని మోదీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపిన కేంద్ర మంత్రిచంద్రబాబు తప్పిదం వల్లే.. వైఎస్ జగన్ వరద బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయడం లేదుతన ఇంట్లోకి నీళ్లు వచ్చాయి కాబ్టటే చంద్రబాబు కలెక్టరేట్కు చేరారువాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా.. చంద్రబాబు నిర్లక్ష్యం చేశారుఇప్పుడు వరద సహాయక చర్యల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారుమా హయాంలో వరదలప్పుడు.. అప్రమత్తంగా ఉన్నాంరిలీఫ్ క్యాంపులు ముందుగానే ఏర్పాటు చేశాం.. ప్రజల్ని తరలించాంవలంటీర్లు, సచివాలయం సిబ్బంది.. బాధితులను క్యాంపులకు తరలించేవాళ్లుకానీ, ఇప్పుడు ఎక్కడా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయలేదుబాధితుల్ని ఆదుకోవడం చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు32 మంది ప్రాణాలు కోల్పోయారు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేమృతులకు రూ.25 లక్షల పరిహారం, ప్రతీ ఇంటికి రూ.50 వేలు ఇవ్వాల్సిందేతాను తప్పు చేసి అధికారులను వేలెత్తి చూపిస్తున్నారుఇప్పటికైనా చంద్రబాబు తన తప్పును ఒప్పుకోవాలిబుడమేరు గేట్లు ఎత్తింది ఎవరు?చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే గేట్లు ఎత్తారుఆ నీరంతా విజయవాడను ముంచెత్తిందిఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోందిసంబంధిత వార్త: చంద్రబాబు దగ్గరే తప్పు.. సీఎంగా అర్హుడేనా?: వైఎస్ జగన్కాకినాడ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మొదలైన భారీర్షాలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల దంచికొడుతున్న వానకోనసీమ జిల్లాలో 46.5 మి.మీ వర్షపాతం.గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహంధవళేశ్వరం బ్యారేజ్ నుండి దిగువకు 6 లక్షల 61 వేల క్యూసెక్ ల నీరు విడుదల.రానున్న రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే గోదావరి వరదకోనసీమ లంక గ్రామలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరుకాకినాడ జిల్లాలో 94.6 వర్షపాతం నమోదు.ఏలేరు ప్రాజెక్టు లో చేరుకున్న 20 tmc ల వరద నీరు.దిగువకు 1500 క్యూసెక్ ల నీరు విడుదల.పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలల్లో పలు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులుతుఫాన్ హెచ్చరికల నేపసద్యంలో వేటను నిలిపివేయాలని మత్స్యశాఖ అధికారుల ఆదేశాలు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో జగన్ పర్యటనవిజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన. ఓల్డ్ ఆర్ఆర్ (రాజరాజేశ్వరి) పేటలో బాధితులతో మాట్లాడుతున్న జగన్సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వైస్సార్సీపీ అధినేతప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితుల ఆవేదనమొన్నీమధ్యే సింగ్నగర్లో పర్యటించిన జగన్అక్కడి వరద పరిస్థితి.. బాధితుల అవస్థలు చూసి చలించి పోయిన జగన్వరదలకు మానవ తప్పిదమే కారణమన్న జగన్నిజామాబాద్ రెంజల్ మండల కందకుర్తి వద్ద గోదావరి నది ఉధృతి తో వంతెనను అనుకోని వరద ప్రవాహంబ్రిడ్జి పై నుంచి రవాణా సదుపాయంద్దు తెలంగాణ,మహరాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలుగోదావరికి పెరుగుతున్న వదర43 అడుగులకు చేరిన నీటి మట్టంమొదటి ప్రమాద హెచ్చరిక జారీ కేంద్రం అసంతృప్తి.. తెలంగాణ సీఎస్కు లేఖతెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖతెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపకపోవడం పై అసంతృప్తితెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచన1345 కోట్ల రూపాయల ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన కేంద్రంవరదల్లో సాయం చేసినందుకు ఇప్పటికే 12 ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు వెల్లడించిన కేంద్ర హోం శాఖఎస్డిఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధులు విడుదలకు తక్షణమే వివరాలు పంపాలని ఆదేశంజూన్ లో 208 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదన్న కేంద్రంఇదివరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫికెట్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరిన కేంద్రంవరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపాలని కోరిన కేంద్ర హోంశాఖవిజయవాడ: విజయవాడకు మరో ముప్పు ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ విజయవడలో సుమారు 7 సెంమీ అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రానున్న 24 గంటల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి - విశాఖ వాతావరణ కేంద్రంఎన్టీఆర్ జిల్లా : బుడమేరులో కొనసాగుతున్న వరద ఉధృతికవులూరు - ఈలప్రోలు మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరదగడచిన 24 గంటల్లో జి.కొండూరు మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుఎగువున కురిసిన వర్షాలతో కొంత పెరిగిన వరదనందివాడలో ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరుముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుబలహీనంగా ఉన్న బుడమేరు పరీవాహక గట్లకు గండి పడకుండా ఇసుక బస్తాలు వేస్తున్న ప్రజలుశ్రీశైలం :నంద్యాల శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరదజలాశయం గేట్లు అన్ని మూసివేసిన అధికారులుఇన్ ఫ్లో : 1,43,199 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,897 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ :విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద పడిగాపులు పడుతున్న మృతుల కుటుంబీకులువరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలింపువరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ నిర్లక్ష్యంసీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు సహకరించని వైనంప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలురెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే నిరీక్షిస్తున్న కుటుంబీకులుపోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు జాప్యం చేస్తున్న అధికారులు, పోలీసులువిజయవాడ :విజయవాడ ముంపులోనే వేలాది వాహనాలుబుడమేరు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో ఇప్పటికీ పూర్తిగా వీడని ముంపుముంపులో నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వాహనాలునాలుగైదు రోజులుగా నీటిలోనే బైకులు, కారులు, ఆటోలుఒక్కొక్కటిగా బయటకు తీసి షెడ్లకు తరలిస్తున్న ఓనర్లుఎన్టీఆర్ జిల్లా:తిరువూరులో మల్లమ్మ చెరువుకు పొంచి ఉన్న ప్రమాదంభారీ వర్షాలకు కోతకు గురైన చెరువుకట్టగత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువుకు పోటెత్తుతున్న వరదనీరుచెరువు పొంగితే కట్ట పూర్తిగా తెగిపోయే అవకాశంఆందోళన చెందుతున్న ఆయకట్ట కింద ఉన్న రైతులుఇప్పటికే భారీ వరదలతో పొలాల్లో వేసిన ఇసుక మేటఅటుగా అక్కపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వరదలకు ధ్వంసంఖమ్మం జిల్లా :మున్నేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో రెండవ రోజు ముమ్మరంగా కొనసాగుతున్న 525 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల సహాయక చర్యలువర్షాల వరద ఉద్ధృతి తగ్గడంతో చురుగ్గా సాగుతున్న పారిశుద్ధ్య పనులు ఇళ్లలోకి భారీగా చేరిన బురదను వాటర్ ట్యాంకర్లు ద్వారా తొలగింపురోడ్లపై విరిగి పడిన విద్యుత్ స్తంభాలు తొలగించి పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్న పోలీసులువరద బాధితులకు అండగా ధంసాలపూరం,శ్రీనివాస్ నగర్, ప్రకాశ్ నగర్,రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, కవిరాజ్ నగర్, బొక్కలగడ్డ ముంపు ప్రాంతాలలో స్వయంగా పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎన్టీఆర్ జిల్లా :ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వర్షాలుఅర్ధరాత్రి నుంచి మైలవరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంమళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉందిలోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రచారం విజయవాడ :వరద బాధితులకు వాలంటీర్లే దిక్కుఅధికారులు, పోలీసులు వెళ్లలేని చోటుకు వెళ్తున్న వాలంటీర్లుట్రాక్టర్లలో ఆహారం, మంచినీరు తీసుకుని మారుమూల ప్రాంతాలకు వాలంటీర్లునాలుగు రోజుల తర్వాత బాధితులకు అందుతున్న కాస్తంత ఆహారం, నీరుజగన్ నియమించిన వాలంటీర్లే చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కువాలంటీర్లను చూసి సంతోషిస్తున్న బాధితులుఈ పని నాలుగు రోజుల క్రితమే చేస్తే తమ ఆకలి తీరేదంటున్న బాధితులుకోనసీమ జిల్లా :కొత్తపేట నియోజకవర్గంవ్యాప్తంగా తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంవర్షం కారణంగా పాఠశాలలకు కాలేజీలకు సెలవు ప్రకటించిన అధికారులు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేని భారీ వర్షం.తహిసిల్దార్ వారి కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్లో చేరిన వర్షపునీరుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా :భారీ వర్షాలతో కొత్తగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్సెల్ఫీల కోసం వాగులు,వంకలు,నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దువరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దువర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందికావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలిభద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతున్నది కావున పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.జిల్లా అధికార యంత్రాంగం సూచించిన సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవువిజయవాడ : వరద ముంపు బాధితులకు పాల ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటిల్స్ అందించిన విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆదేశాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాంవరద బాధితులను ఆదుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతవరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందిముందుచూపు చర్య లేకపోవడంతోటే విజయవాడకు విపత్తు కలిగిందిచంటి పిల్లలు మహిళలు వృద్ధులు అనేకమంది వరదలో ఇబ్బంది పడుతున్నారుతన ఇంటిని కాపాడుకొనే క్రమంలోనే విజయవాడ ను ముంచేసిన చంద్రబాబువరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలిప్రజలందరూ కూడా తమవంతుగా సామాజిక బాధ్యత తీసుకునే తరుణమిదినంద్యాల జిల్లా :శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుశ్రీశైలం జలాశయం 6 గేట్లు మూసివేత, 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులుఇన్ ఫ్లో :1,43,199 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,81,235 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 883.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షంరౌతుల ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరురాజమండ్రిలో లలితా నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు , ఆల్కాట్ గార్డెన్, ఆర్యాపురం తుమ్మలోవ ప్రాంతాలు జలమయంకోనసీమలో పలు ప్రాంతాల్లో వరి చేలలో నిలిచిన వర్షపు నీరుఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, శబరి నదుల్లో పెరుగుతున్న నీటిమట్టంఏలూరు జిల్లా : అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో పొంగుతున్న వాగులుబుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం దగ్గర రహదారిపై ప్రవహిస్తున్న జల్లేరు వాగుకొండ వాగులు వస్తున్న కారణంగా ప్రజలు వాగులు దాటవద్దని ప్రమాదకరమని తెలిపిన అధికారులుజంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద డైవర్షన్రహదారిపై జల్లేరు వాగు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు నిలిచిపోయిన రాక పోకలు.వైజాగ్ : ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం తుఫానుగా మారే ఛాన్స్ వెదర్ బులిటెన్ పూర్తి వివరాలు వెల్లడించనున్న వాతావరణ శాఖఅల్లూరి సీతారామరాజు జిల్లా: చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా అడపాదడపా వర్షాలుఎగువ ప్రాంతంలో వర్షాలకు కూనవరం శబరి-గోదావరి నదుల సంగమం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టంచింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుజిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :పి గన్నవరం నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షంఇబ్బంది పడుతున్న వాహనదారులుభారీ వర్షం కారణంగా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలలు ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం :రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవితెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరంతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయిమనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుందిరెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నానుఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కామారెడ్డి జిల్లా :నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 39.157 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17 టీఎంసీలుప్రస్తుత నీటిమట్టం 1403అడుగులు, 14 టీఎంసీలునిజామాబాద్ జిల్లా :శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద41 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులుఇన్ ఫ్లో 2.81 లక్షల క్యూసెక్కులుఔట్ ఫ్లో 1.75 లక్షల క్యూసెక్కులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 90 టీఎంసీలుప్రస్తుతం 1089 అడుగులు, 74 టీఎంసీలువిజయవాడ : గోదావరికి స్వల్పంగా పెరుగుతున్న వరదఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికభద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటి మట్టంధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043, ఔట్ ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కులుప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థగోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థజయశంకర్ భూపాలపల్లి జిల్లా :కాలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉధృతంగా గోదావరిగోదావరి పుష్కర ఘాట్ల వద్ద 11.710 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులుమేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి కొనసాగుతున్న వరదమేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 8,85,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల ఇన్ ప్లో ఔట్ ఫ్లో 8,85,620 క్యూసెక్కులులక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం వద్ధ కొనసాగుతున్న గోదావరి ఉధృతిమోదటి ప్రమాద హెచ్చరికకి చేరువలో గోదావరి ప్రవాహంఈరోజు ఉదయానికి 42.2 అడుగులకి చేరుకున్న గోదావరి నీటి మట్టం43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు ఇప్పటికే నియోజకవర్గంలోని ముంపు గ్రామలతో పాటు , భద్రాచలం పట్టణం ప్రజల్ని అప్రమత్త చేసిన అధికారులుఎటువంటి ఇబ్బంది తలేత్తకుండా ముందస్తు సహాయక చర్యలకి ఆదేశించిన జిల్లా కలెక్టర్విజయవాడ :వరదల్లో బయటపడ్డ మృతదేహాలుమల్లిపాముల వర్ధన్(18)మాత సన్యాసి అప్పుడు(85)గుంజ రమణ(48)వజ్రాల కోటేశ్వరరావు(41)కె దూరగారవు(16)కె వెంకట రమణారెడ్డి(50)నాగ దుర్గారావు(33)పలిశెట్టి చంద్రశేఖర్(32)కొడాలి యశ్వంత్(20)మరో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యంవిజయవాడ :వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీలక్ష పాల ప్యాకెట్లు ,రెండు లక్షల వాటర్ బాటిళ్లు సిద్ధంవరద ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు ట్రాక్టర్లు,ప్రొక్లెయిన్ల ద్వారా పంపించిన మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణువిజయవాడ :విజయవాడలో వరద విషాదంనిన్న 12 మృత దేహాలు వరదల్లో లభ్యం32 కి చేరిన వరద మరణాలుఇంకా ముంపులోనే పలు కాలనీలువరద తగ్గుతున్న చోట ఎవరికి వారే బయటకు వస్తున్న బాధితులుఇళ్ళు, వాహనాలు వదిలేసి బిక్కు బిక్కుమంటు వచ్చేస్తున్న వరద బాధితులు విజవాడ : ఇంకా వరద ముప్పులోనే విజయవాడఎన్టీఆర్ జిల్లా స్కూళ్లకు సెలవు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరద ఉధృతి బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవుజిల్లా కలెక్టర్ జి.సృజన ప్రకటనపెద్దపల్లి జిల్లా:శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల నుంచి భారీగా వరద నీటి ప్రవాహంఇన్ ఫ్లో 4, 72, 428 క్యూసెక్కులుఔట్ ఫ్లో 4, 59, 912 క్యూసెక్కులుప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలుప్రస్తుత నిల్వ 14. 5606 టీఎంసీ లు.ప్రాజెక్ట్ కు సంబంధించిన 32 గేట్లు తెరచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులునది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలుపెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలను కలుపుతూ శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న రహదారిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన అధికారులుపెద్దపల్లి జిల్లా :రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలురామగుండం రీజియన్ లోని నాలుగు ఓసీపీలలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, రవాణానేటికీ సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకంప్రాజెక్టు క్వారీ పని స్థలాలలో భారీగా నిలిచిన వరద నీరు, బురదతో కదలని భారీ యంత్రాలు -
International Day of Charity observed: వరదెత్తిన కష్టాల్లో కరుణే ప్రదానం
ఖమ్మం గుమ్మంలో వరద. బెజవాడ కంటిలో బుడమేరు ΄పొంగు. ఆకలి ఆర్తనాదాలు తెలుగువారిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో సాయం చేసే చేతులే కాదు దాతృత్వం చూపే గుండెలూ కావాలి. నోట్ బుక్స్ తడిసిపోయిన ఒక చిన్నారికి స్కూల్ బ్యాగ్తో మొదలు గుడిసె కూలిన ఒక పేదవాడికి చిన్న ఆసరా వరకూ దాతృత్వంతో సాయం చేయవచ్చు. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి. మనుషులం మనం. ఇవ్వడం తెలిసినవాళ్లం. ఇది ఇవ్వాల్సిన సమయం.‘దానం చేయడం వల్ల ఎవరూ పేద కాబోరు’ అంటుంది ఆనీ ఫ్రాంక్ అనే యూదు బాలిక. ‘ఎంత దానం ఇస్తున్నావన్నది కాదు... ఎంత ప్రేమగా దానం ఇస్తున్నావన్నదే ముఖ్యం‘ అంది మదర్ థెరిసా. ‘దానమీయని వాడు ధన్యుండుగాడయ’ అన్నాడు వేమన. ‘దానం చేయనివారు భూమికి పెద్ద భారం’ అన్నాడు శ్రీనాథుడు. ‘పిట్టకు చారెడు గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... ఇవి అందించడానికి మించిన మానవ జన్మకు పరమార్థం ఏముటుంది’ అంటుంది ఓ కథలోని బామ్మ. దానం మనిషి గుణం. ముఖ్యంగా సాటి మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు దానం చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి.మనది దానకర్ణుడి నేలమనది దాన కర్ణుడి నేల. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని చూడటానికి వెళితే ఆ సమయానికి అతను స్నానానికి సిద్ధమవుతూ రత్నాలు ΄÷దిగిన గిన్నెలో నూనె తలకు రాసుకుంటున్నాడట. కృష్ణుడు ఆ గిన్నె చూసి ‘కర్ణా.. గిన్నె చాలా బాగుంది ఇస్తావా’ అనగానే ఎడమ చేతిలో ఉన్న గిన్నెను ‘తీసుకో’ అని అదే చేత్తో ఇచ్చేశాడట కర్ణుడు. కృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అదేమిటి కర్ణా... ఎడమ చేత్తోనే ఇచ్చేశావు’ అనంటే కర్ణుడు ‘అంతే కృష్ణా. దానంలో ఆలస్యం కూడదు. నువ్వు అడిగాక ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి మారేలోపు నా మనసు మారొచ్చు. లేదా నాకు మృత్యువు సమీపించవచ్చు. అందుకే ఇచ్చేశాను’ అన్నాడట. లోకంలో ఎందరో చక్రవర్తులు పుట్టి ఉంటారు, గిట్టి ఉంటారు. కాని దానం కోసం నిలిచిన శిభి, బలి చక్రవర్తులే ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా శ్లాఘించబడుతున్నారు.వరదల్లో అన్నం పెట్టిన తల్లితూర్పు గోదావరి జిల్లాలోని లంకలగన్నవరంలో తరచూ వరదల చేత లేదంటే ΄÷లాలు పండకపోవడం చేత జనం ఆకలితో అల్లాడుతుంటే వారి కోసమని అన్నదానం మొదలెట్టి ఆంధ్రుల అన్నపూర్ణగా కొలవబడుతున్న తల్లి డొక్కా సీతమ్మ (1841–1909)ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది అవసరమున్న వారికి పంచడం వల్ల కలిగే తృప్తి, దొరికే ఆశీర్వచనం దైవికమైనవి. దానాల్లోకెల్లా శ్రేష్ఠమైనది అన్నదానం అంటారు. ఇవాళ వరదల్లో చిక్కుకున్నవారి కోసం అన్నదానం చేయవలసినవారే కావాల్సింది.స్పందించే హృదయంమనిషి హృదయానికి ఉన్న గొప్ప లక్షణం స్పందించే గుణం. అదే మానవత్వ గుణం. కరుణ, కనికరం, దయ, సానుభూతి ఇవన్నీ సాటి మనిషి కోసం సాయపడమంటాయి. సాయంలో ఉన్నతమైనది దాతృత్వం. కొందరు అడగకపోయినా దానం చేస్తారు. కొందరు అడిగినా చేయరు. ఉండి కూడా చేయరు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఘటనలు జరిగితే సినిమా హీరోలతో మొదలు సామాన్యుల వరకూ స్పందించేవారు. కనీసం నూట పదహార్లు పంపే పేదవారు కూడా ఉండేవారు. ఇవాళ దానం కోసం ప్రొత్సహించే వ్యక్తులు లేరు. తామే తార్కాణంగా నిలవాలని కూడా అనుకోవడం లేదు. వేల కోట్లు ఉన్నవారు కూడా రూపాయి విదల్చకపోతే ఆ సంపదకు అర్థం ఏమిటి?లక్ష సాయాలుఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో వరద బీభత్సంగా ఉంది. పిల్లలకు పుస్తకాల దగ్గర నుంచి వృద్ధులకు మందుల వరకు అన్నీ కావాలి. వంట పాత్రలు నాశనమయ్యాయి. స్టవ్లు పాడయ్యాయి. ఇళ్లు కూలిన వారు ఎందరో. పశువులు కొట్టుకుని పోయాయి. చేతి వృత్తుల పరికరాలు, ఉపాధి సామాగ్రి అంతా పోయింది. జనం రోడ్డున పడ్డారు. వీరి కోసం ఎన్ని వేల మంది సాయానికి వస్తే అంత మంచిది. సరిౖయెన చారిటీ సంస్థలకు విరాళాలు ఇచ్చి సాయం అందగలిగేలా చూడటం అందరి విధి. లేదా ముఖ్యమంత్రుల సహాయనిధికే విరాళం ఇవ్వొచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సమయం అయినా దానం ఇవ్వొచ్చు. సమయం వెచ్చించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలు. నేడు ‘అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’ సందర్భంగా చంద్రునికో నూలుపోగైనా ఇద్దామని సంకల్పిద్దాం. -
విజయవాడలో ఎవరైనా వచ్చి కాపాడండి: బిగ్బాస్ తేజ
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. వరద ప్రాంతాల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లు పూర్తిగా మునిగిపోయి కార్లు, ద్విచక్ర వాహనాలు కాగితం పడవల్లా తేలియాడుతున్నాయి. పైఅంతస్తుల్లో ఉన్న వారంతా రెండ్రోజులుగా గడప దాటే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ సాయం అందక చాలామంది అల్లాడిపోతున్నారు. తమ వీధుల వెంట వెళ్తున్న వార్ని గుండెలవిసేలా పిలుస్తూ.. తమను ఆదుకోండి అంటూ ఆర్తిగా కోరుతున్నారు.ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబాన్ని కాపాడాలని బిగ్బాస్ ఫేమ్ టేస్టీ తేజా కోరారు. ఈ క్రమంలో ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. పసిపిల్లలు,మహిళలు,వృద్ధులు వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయామని వీడియోలో బాధితుడు తెలిపాడు. ఏపీ ప్రభత్వం లేదా విజయవాడలోని ఎవరైన తమను కాపాడాలని కోరారు. రెండు రోజులుగా పిల్లలకు పాలు, ఆహారం కూడా లేదని వాపోయారు. చాలామంది అధికారులకు మెసేజ్ చేసినా ఫలితం లేదని ఆయన తెలిపారు. దయచేసి తమను కాపాడాలని వారు వేడుకున్నారు. టేస్టీ తేజా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
బంగాళాఖాతంలో మరో తుఫాన్
-
ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, అమరావతి : భారీ వర్షంతో ఆంధ్రపద్రశ్కు భారీ ముంపు పొంచి ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయిగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఫిలిప్పీన్స్ను ముంచెత్తిన వరదలు
మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణమండల తుఫాను యాగీ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామరైన్స్ నోర్టే ప్రావిన్స్లోని విన్జోన్స్ పట్టణ తీరాన్ని తాకింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు కామరైన్స్ సుర్ ప్రావిన్స్లోని నాగా పట్టణంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన లుజోన్లో టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. రాజధానికి సమీపంలో ఉన్న మరికినా నదిలో నీటిమట్టం పెరిగిన దృష్ట్యా స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు.ఉత్తర సమర్ ప్రావిన్స్లోని కోస్ట్ గార్డు సిబ్బంది రెండు గ్రామాలకు చెందిన 40 మందిని రక్షించారు. తుఫాను కారణంగా పలు ఓడరేవుల్లో షిప్పింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాను వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దుచేశారు. -
Jamnagar: ఎక్కడ చూసినా.. బురద, దుర్వాసన
జామ్నగర్: గుజరాత్లోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జామ్నగర్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో మీడియా బృందం జామ్ నగర్లో పర్యటించింది. జామ్నగర్లో వరదలు, వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. 500కు పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.వర్షాల అనంతం జామ్నగర్లోని తీన్ బత్తి చౌక్ ప్రాంతంలోని బద్రీ కాంప్లెక్స్ బేస్మెంట్లో నీరు నిలిచిపోయి, బురద పేరుకుపోయింది. విపరీతమైన దుర్వాసన కూడా వస్తోంది. కాంప్లెక్స్లో వర్షాలకు ముద్దయిన సరుకులను సంబంధిత దుకాణాల యజమానులు ట్రాక్టర్లలో ఎక్కించుకుని తీసుకువెళుతున్నారు.ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న మదీనా మసీదు సమీపంలో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి. మీడియాను చూసిన అక్కడి మహిళలు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకున్నారు.ఘాచీ కి ఖడ్కీలో వర్షాల అనంతరం పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. దీంతో స్థానికులు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. రోడ్లపై అడుగుతీసి అడుగువేయలేనంతగా బురద పేరుకుపోయింది. -
అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా ఏపీలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి. అదేరీతిలో హైదరాబాద్ వంటి మహానగరం కూడా వర్షపు నీటితో జలమయం అయింది. భారీ వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయన కోరారు.'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అని చిరు పేర్కొన్నారు.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కళింగపట్నం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
-
గమ్మత్తు.. ఆరడుగుల వాన
-
#HeavyRains : తెలంగాణ అంతటా వర్ష బీభత్సం (ఫొటోలు)
-
ఎంత కష్టం.. ఎంత నష్టం టమాఠా
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం టమాట సాగుకు పెట్టింది పేరు. ఏటా ఖరీఫ్లో 35 వేల ఎకరాలు, రబీలో 20 వేల ఎకరాలు వెరసి 55 వేల ఎకరాల్లో రైతులు టమాట పండిస్తున్నారు. ఎకరాకు సగటున 15 టన్నుల దిగుబడితో ఏటా 6.5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండించే టమాట ఎక్కువగా కోల్కతా, నాగ్పూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి అవుతోంది.వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లకు పైగా ఉన్నట్లు ఉద్యానశాఖ నివేదిక వెల్లడిస్తోంది. సాధారణ పద్ధతితో ఎకరా టమాట సాగుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతుండగా ట్రెల్లీస్ (కట్టెలు) విధానంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. కనగానపల్లి, రామగిరి, తనకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసము్ర దం, కుందుర్పి, శెట్టూరు, రాయదుర్గం, ముదిగుబ్బ, నల్లచెరువు, ఓడీ చెరువు, కదిరి, పెనుకొండ, అమడగూరు, బత్తలపల్లి, ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, గుంతకల్లు, కూడేరు, అనంతపురం, రాప్తాడు, శింగనమల ప్రాంతాల్లో సాగు అధికంగా ఉంది.మార్కెట్ మాయాజాలంఅనంతపురం నగర శివారు కక్కలపల్లి వద్ద కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, దళారులు పెద్ద ఎత్తున మండీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 70 నుంచి 80 శాతం మంది రైతులు అమ్మకాలకు ఇక్కడికే వస్తుంటారు. కిలో కనీసం రూ.10 నుంచి రూ.12 పలికితేకానీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. కూలీల ఖర్చు, రవాణా, ట్రేల బాడుగ, కమీషన్ ఖర్చులు అధికంగా ఉండటంతో టమాట రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఒక్కసారైనా మంచి ధరలు పలికితే బయట పడతామనే ఆశతో రైతన్నలు టమాట సాగునే నమ్ముకున్నారు. ఇదే అదనుగా దళారులు వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.20 వరకు విక్రయిస్తున్నా టమాటా రైతుకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం మండీకి రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల నుంచి 4,800 మెట్రిక్ టన్నుల వరకు సరుకు వస్తోంది. ‘నో సేల్’ కింద పెట్టిన టమాటాలను చేసేదేమీ లేక రైతులు పారబోసి ఉత్త చేతులతో ఇంటి దారి పడుతున్న దుస్థితి నెలకొంది. సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.330 పలికింది. చాలా వాటిని బాక్సు రూ.150 నుంచి రూ.200 లోపే కొంటున్నారు. ఇక సీ గ్రేడ్ టమాటాలు రూ.100 వరకు పలుకుతున్నాయి. ‘నో సేల్’ వాటికి కనీస ధర కూడా ఇవ్వకుండా మండీ నిర్వాహకులు, వ్యాపారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.రగిలిన రైతన్నలురాప్తాడు రూరల్: నాణ్యత సాకుతో టమాటాలు కొనుగోలు చేయకపోవటాన్ని నిరసిస్తూ రైతన్నలు సోమవారం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి మండీ వద్ద ఆందోళనకు దిగారు. సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకుని బైఠాయించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు లోడింగ్ కోసం బయటి వాహనాలు కాకుండా స్థానికంగా బాడుగకు తీసుకోవాలంటూ లారీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన యువ రైతు చిన్ని క్రిష్ణ 160 ట్రేల టమాటాను అనంతపురం శివారులోని కక్కలపల్లి మండీకి తెచ్చాడు.నాణ్యత వంకతో వేలంపాట దారులు సరుకు కొనడానికి ఇష్టపడలేదు. దీంతో ఏం చేయాలో రైతుకు పాలు పోలేదు. చాలాసేపు ఎదురుచూసి చివరకు ట్రేలను మళ్లీ వాహనంలో ఎక్కించి బయట పారబోశాడు. రిక్త హస్తంతో ఇంటికి చేరాడు. ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు నిర్వేదం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది.. సోమవారం మధ్యాహ్నం కుండ పోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్ర నగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, మెహిదిపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.హైదరాబాద్లో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతలోనే భారీ వర్షం కమ్ముకొచ్చింది. తొలుత చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన ఉన్నవాళ్లు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునేలోపు పూర్తిగా తడిచిపోయారు. దీనికి తోడు ఓ వైపు ట్రాఫిక్ జామ్, రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్షంగా నరకం చూసినంత పనైంది. మరోవైపు నగరంలో మరో రెండు మూడు గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఈరోజు ఎన్ని లీటర్లు వాన పడింది??
ఏంటీ ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తోందా.. అవును మరి.. ఎప్పుడూ ఇన్ని మిల్లీ మీటర్లు లేదా ఇన్ని సెంటీమీటర్లలో వర్షం పడింది అని మాత్రమే మనం వింటుంటాం కదా.. అయితే.. కచి్చతంగా ఎంత పడిందన్న విషయం ఎలా తెలుస్తుంది? సింపుల్గా చెప్పాలంటే.. వర్షం పడినప్పుడు ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన పడినట్లు.. అదే పది లీటర్ల నీళ్లు నిలిస్తే.. ఒక సెంటీమీటర్ అన్నమాట. అసలు వానను శాస్త్రవేత్తలు ఎలా లెక్కేస్తారో తెలుసా?ప్రత్యేక పరికరాలతో.. సాధారణంగా వాన నీటి లెక్కలను తేల్చేందుకు ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. వాటిని ఆరుబయట ప్రదేశాల్లో నిటారుగా ఉండేలా అమర్చుతారు. వాటిపై మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల లెక్కలు ఉంటాయి. వర్షం పడినప్పుడు అందులో చేరే నీటి స్థాయిని చూసి.. ఎంత వాన పడిందో చెప్తారు. కానీ వానకు మామూలు లెక్క ఏమిటంటే.. సమతలంగా ఉన్న ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన అన్నమాట. ఈ లెక్కకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కాంక్రీట్, ప్లాస్టిక్, ఏదైనా లోహంతో చేసినది అయినా సరే.. కచి్చతంగా చదరపు మీటర్ విస్తీర్ణం ఉండాలి. ఎక్కువ తక్కువలు, వంపు లేకుండా కచ్చితంగా సమతలంగా ఉండాలి. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండాలి. వాన నీరు పడేందుకు ఎలాంటి అడ్డంకీ ఉండకూడదు.కురిసిన సమయాన్ని బట్టి తీవ్రత..ఎన్ని సెంటీమీటర్లు వాన అన్నది మాత్రమేకాకుండా ఎంత సమయంలో కురిసింది అన్నదాన్ని బట్టి.. వర్షం తీవ్రతను అంచనా వేస్తారు. ఉదాహరణకు ఒక రోజంతా అంటే 24 గంటల్లో ఆరు సెంటీమీటర్ల వానపడితే.. అది మోస్తరు వర్షం కిందే లెక్క. అదే ఒకట్రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్లు పడితే కుంభవృష్టి కురిసినట్టే. ఇలా జరిగితే నీరంతా ఒక్కసారిగా చేరి వరదలు వస్తాయి. ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్పై ఎక్కువగా ఉంటుంది. ఏపీపై ఎలాంటి ప్రభావం చూపదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. అదేవిధంగా.. ఉపరితల ద్రోణి కర్ణాటక, కొమొరిన్ ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. అయితే.. వాయుగుండం తేమగాలుల్ని తీసుకుపోవడం వల్ల మరో మూడు రోజుల పాటు ఉక్కపోత కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. -
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
ఢిల్లీ: భారీ వర్షంతో మొదలైన వీకెండ్..
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలతో వారాంతం మొదలయ్యింది. గురువారం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఢిల్లీ-ఎన్సీఆర్లోని జనానికి ఊరటనిచ్చింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డపై నీరు నిలిచింది. వాక్వే స్టాండ్ లెవల్ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 15 వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఔటర్ ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ పరిధిలోని రాణి ఖేడా గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు నీటి లోతుల్లోకి వెళ్లిన కారణంగా మృతి చెందారు. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఢిల్లీలో ఏకధాటిగా వర్షం
న్యూ ఢిల్లీ : దేశ రాజధానిలో ఢిల్లీలో వాతావారణం ఒక్కసారిగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.రాబోయే కొద్ది గంటల్లో నగరంలోని ప్రీత్ విహార్, ఐటీవో, అక్షరధామ్తో పాటు ప్రదేశాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. ప్రస్తుతం, మధ్య, దక్షిణ, ఉత్తర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడుతుందని అంచనా. కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. తేమ స్థాయి 85 శాతంగా నమోదైందని ఐఎండీ తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విభాగంలో 59 రీడింగ్తో సంతృప్తికరమైన కేటగిరీలో కొనసాగింది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏఐక్యూ)సున్నా 50 మధ్య ఉన్న ఏఐక్యూ ఉంటే మంచిది. 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమైనది. 101 నుంచి 200 మధ్య ఉంటే ఫర్వాలేదని , 201 మధ్య 300 తక్కువ ప్రమాదం అని, 301 నుంచి 400 మధ్య ఉంటే మరింత ప్రమాదమని, 401 నుంచి 500 మధ్య ఉంటే మరింత తీవ్రమైనదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఢిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..
ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లుటియన్స్ ఢిల్లీ,కాశ్మీర్ గేట్, ఓల్డ్ రాజేంద్రనగర్తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. వచ్చే 2 గంటల్లో ఢిల్లీలో 3 నుంచి 5 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. సాధారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కోచింగ్ సెంటర్లతో సహా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని సూచించారు. అంతకు ముందు, ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఎన్సీఆర్లోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. -
Monal Gajjar: వర్షంలో బిగ్బాస్ బ్యూటీ ఆటలు (ఫోటోలు)
-
చైనాలో భారీ వర్షాలు.. 11 మంది మృతి
చైనాలో కురుస్తున్న వర్షాలు, ఈ కారణంగా సంభవించిన వరదలు పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఆగ్నేయ చైనాలో ఒక ఇల్లు కూలడంతో 11 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతమంతా జలమయమైంది.షాంఘైలో ఓ చెట్టు కూలి స్కూటర్పై వెళ్తున్న డెలివరీ బాయ్పై పడటంతో అతను మృతిచెందాడు. చైనాను చేరుకోకముందు ఈ తుపాను ఫిలిప్పీన్స్లో కూడా విధ్వంసం సృష్టించింది. ఫిలిప్పీన్స్లో వర్షాల కారణంగా 34 మంది మృతిచెందారు. టైఫూన్ జెమీ తుపాను తైవాన్ ద్వీపంలో కూడా విధ్వంసం సృష్టించింది. ఇక్కడ మృతుల సంఖ్య 10 దాటింది.హునాన్ ప్రావిన్స్లోని హెంగ్యాంగ్ నగర పరిధిలో కొండచరియలు విరిగిపడినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. భారీ వర్షాల కారణంగా పర్వతాల నుంచి నీరు ప్రవహించడం వల్లే కొండచరియలు విరిగిపడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉష్ణమండల తుఫానుతో కూడిన వర్షపాతం హునాన్ ప్రావిన్స్లోని ఆగ్నేయ భాగాలను తాకినట్లు చైనా వాతావరణశాఖ తెలిపింది. More than 27,000 people in Northeast #China were evacuated and hundreds of factories were ordered to suspend production as #TyphoonGaemi brought heavy rains, the official Xinhua news agency reported on July 27.https://t.co/uIkKuknyTk— The Hindu (@the_hindu) July 27, 2024 -
Weather Update: 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
Telangana: మరో రెండ్రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాతీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జైసాల్మయిర్, కోట, గుణ, మాండ్ల, అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది.రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81, జగిత్యాల జిల్లాలో 7.01, నిర్మల్ జిల్లాలో 6.92, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 23.39 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఆదివారం నాటికి 36.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే 33శాతం అధికంగా వానలు నమోదయ్యాయి. -
ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారత వాతావరణశాఖ జూలై 22 నుంచి 24 వరకు ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల మధ్య ఉండవచ్చు. జూలై 25, 26 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 34, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల మధ్య ఉండవచ్చు.గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో విపరీతమైన వేడి వాతావరణానికి తోడు కాలుష్య తీవ్రత కూడా అధికంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువులుగా మారుతుంటాయి. -
కృష్ణాలో నిలకడగా..
సాక్షి, అమరావతి/రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద నిలకడగా కొనసాగుతోంది. గురువారం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్లోకి 72,286 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 65,580 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 68,797 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 46,329 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25,174 క్యూసెక్కులు దిగువకు వదులుతోంది. ఈ జలాలు శుక్రవారానికి శ్రీశైలానికి చేరుకోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. ఇందుకోసం 7,064 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 32.37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం నుంచి తరలిస్తున్న జలాలతో నాగార్జున సాగర్లోకి 23,851 క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో సాగర్లో నీటి నిల్వ 123.34 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్లోకి 82,491 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ నీటి నిల్వ 46.80 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం తుంగభద్ర డ్యామ్లోకి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.గోదావరిలో పెరుగుతూ..పోలవరం వద్దకు 2.30 లక్షల క్యూసెక్కుల వరదసాక్షి, అమరావతి/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా వచ్చిన జలాలను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి 2,31,161 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 8.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు వదులుతూ మిగతా 2,23,961 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో నీటిమట్టం గురువారం సాయంత్రం 18.20 అడుగులకు చేరింది.పాపికొండల విహార యాత్రకు బ్రేక్బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, తుఫాన్ హెచ్చరికలు, గోదావరి నదికి వరద తాకిడి పెరగడం వల్ల యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 22 అడుగుల వరకు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. -
ఏపీలో దంచికొడుతున్న వానలు..(ఫొటోలు)
-
17 రాష్ట్రాల్లో దంచికొట్టుడు వానలు
దేశం అంతటా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బీహార్, హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జూలై 12-14 మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ వర్ష సూచనను అందిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో జులై 11-13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, తూర్పు రాజస్థాన్ సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మండీ, కాంగ్రా, కిన్నౌర్, కులు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 32 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 16 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అసోంలోని 26 జిల్లాల్లో 17 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్లో వరదల కారణంగా తొమ్మిది ఖడ్గమృగాలు సహా మొత్తం 159 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. -
పొంచివున్న వర్ష బీభత్సం.. పలు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం వేచిచూస్తున్న జనానికి ఉపశమనం కలగడంతోపాటు ప్రతీరోజు వర్షాలు కురిసే అంచనాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. बिहार में 10-12 जुलाई, 2024 के दौरान अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) वर्षा से बहुत भारी (115.5-204.4 मिलीमीटर) वर्षा होने की संभावना है। Bihar is likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) during 10th-12th July, 2024. pic.twitter.com/Q3lsEOWQLK— India Meteorological Department (@Indiametdept) July 8, 2024భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 8 నుంచి 12 వరకూ హిమాలయప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, అరుణాచల్ప్రదేశ్, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అదేవిధంగా జూలై 12 వరకూ జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్టాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి.మరోవైపు భారీ వర్షాల కారణంగా బీహార్లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పూర్వ్ చంపారణ్, గోపాల్గంజ్, పశ్చిమ చంపారణ్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముంబై, ఠాణె, నవీ ముంబైతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ తదితర గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.तटीय कर्नाटक में 08 जुलाई, 2024 को अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) के साथ अत्यंत भारी वर्षा (>204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है। pic.twitter.com/7iaS8uRXCl— India Meteorological Department (@Indiametdept) July 8, 2024 -
రెండో టి20 వర్షార్పణం
చెన్నై: భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ రద్దయింది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించింది. తజీ్మన్ బ్రిట్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), అనెక్ బోష్ (32 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రకర్, దీప్తి శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగానే వర్షం మొదలైంది. రాత్రి 10 దాటినా వాన తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టి20లో నెగ్గిన దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లౌరా వొల్వార్ట్ (సి) రాధా యాదవ్ (బి) పూజా వస్త్రకర్ 22; తజీ్మన్ బ్రిట్స్ (స్టంప్డ్) ఉమా ఛెత్రి (బి) దీప్తి 52; మరిజన్ కాప్ (సి) సజన (బి) దీప్తి శర్మ 20; అనెక్ బోష్ (బి) శ్రేయాంక 40; చోల్ టైరన్ (సి అండ్ బి) రాధా యాదవ్ 12; నదినె డి క్లెర్క్ (సి) సజన (బి) పూజా వస్త్రకర్ 14; డెర్సెక్సన్ (నాటౌట్) 12; ఎలీజ్ మార్క్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–43, 2–75, 3–113, 4–131, 5–164, 6–164. బౌలింగ్: పూజా వస్త్రకర్ 4–0–37–2, సజన సజీవన్ 1–0–13–0, అరుంధతి రెడ్డి 4–0–37–0, శ్రేయాంక పాటిల్ 4–0–37–1, రాధా యాదవ్ 3–0–31–1, దీప్తి శర్మ 4–0–20–2. -
రాజస్థాన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
రుతు పవనాల రాకతో గత మూడు నాలుగు రోజులుగా రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోటా జిల్లా నుంచి మధ్యప్రదేశ్కు వెళ్లే రహదారి తెగిపోయింది. ఇక్కడి పార్వతి నది ఉప్పొంగుతుండటంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా షియోపూర్, గ్వాలియర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఇక్కడికి సమీప గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్లలోతు నీటి మధ్య వివిధ గ్రామాల ప్రజలు కాలం వెళ్తదీస్తున్నారు. టోంక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా బిసల్పూర్ డ్యామ్ నీటిమట్టం 310.09 ఆర్ఎల్ మీటర్లకు చేరుకుంది. వరద ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.జైపూర్లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మేవార్ ప్రాంతంలో జూలై 8 నుండి 10 వరకు భారీ వర్షాలు కురియనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయి. జులై 10 నాటికి రుతుపవనాలు మరింత బలపడతాయని, అప్పడు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్హోల్పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్హోల్స్కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్హోల్లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్హోల్స్లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్లో మ్యాన్హోల్స్కు ఎల్ఈడీ లైట్లు జపాన్లోని టోక్యో సిటీలో మ్యాన్హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్హోల్స్పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్హోల్స్ నిర్వహణపై సీరియస్గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్హోల్స్ను గుర్తించింది. మ్యాన్హోల్స్కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్హోల్స్కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్హోల్స్పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్టెక్ యంత్రాలతో మ్యాన్హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్హోల్స్కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్హోల్స్తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్హోల్స్కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్హోల్స్కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
పిడుగు ముద్దాడ బోయింది
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.బిహార్లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు.. -
రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: పశ్చి మ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 21.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 2 రోజులు వాయవ్య దిశగా పయనించనుంది. ఫలితంగా వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలకు అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. -
హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి,హైదరాబాద్ : హైదరబాద్ కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్టీయూ ఫ్లైఓవర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం ఉద్యోగులు ఓ గంట ఆలస్యంగా ఆఫీస్ల నుంచి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కేరళలో భారీ వర్షాలు.. విద్యాసంస్థల మూసివేత
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
నేడు, రేపు విస్తారంగా వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం, శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. కాగా బుధవారం అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.4 సెం.మీ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 7.01 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 6.08 సెం.మీ వర్షం కురిసింది.