Weather Department
-
మండే ఎండ.. జాగ్రత్తలే అండ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఇంకా ఎక్కువ ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. వడదెబ్బ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఎండల్లో పనిచేసే కార్మికులు గంటకు 10 నిమిషాల చొప్పున నీడపట్టున చేరి విశ్రాంతి తీసుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉ.11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది రాష్ట్రంలో 4,422.. అంతకుముందు ఏడాది 833 చొప్పున వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..– ఎక్కువ సమయం ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి రాకూడదు. అదే విధంగా 40 డిగ్రీల ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ఏసీ గదుల్లోకి వెళ్లకూడదు. – వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. – ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే గొడుగు, టోపీ, హెల్మెట్ వాడాలి. – పిల్లలను ఎండలో ఆడుకోనివ్వకుండా, ఇండోర్ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు కర్టెన్లు వాడాలి.– దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలు తాగుతుంటారు. ఇలాచేస్తే మరింత దాహం పెరుగుతుంది. వీటికి బదులు మజ్జిగా, కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఉత్తమం. – శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేట్ శీతల పానీయాలు తాగకూడదు. అలాగే, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.వడదెబ్బకు గురైతే చేయాల్సినవి..– వడదెబ్బకు గురైన బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అందించాలి.– బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.– బట్టలు వదులు చేసి, చల్లటి నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది.– గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి.రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి..శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్తపడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల పైబడినా, ఐదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం.. చర్మం పొడిబారి వదులుగా మారడం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలు వేడి, చలిని తట్టుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణులు, వృద్ధులు ఎండలేని సమయంలోనే బయటకెళ్లాలి. – డాక్టర్ పి. ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, కాకుమాను, గుంటూరు జిల్లా -
ఈసారి మంటలే.. మించిపోనున్న వేసవి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మండిపోనున్నాయి. వడగాడ్పులూ తీవ్రరూపం దాల్చనున్నాయి. ఈ వేసవి సీజన్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు 2025 మార్చి నుంచి మే నెల వరకు వేసవి సీజన్కు సంబంధించిన అంచనాలను శనివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ ఎండాకాలంలో వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా వేసవిలో నాలుగైదు రోజుల పాటు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం, తర్వాత సాధారణ స్థాయికి తగ్గడం వంటివి జరుగుతాయి. కానీ ఈసారి వరుసగా ఎక్కువ రోజులు ఎండలు మండిపోతాయని, దానితో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా వడగాడ్పులు ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మధ్య వరకు ఉంటాయని, కానీ ఈసారి మార్చి నెలలోనే ఈ పరిస్థితి కనిపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. విభిన్నంగా వాతావరణం.. వేసవి సీజన్లో ఉష్ణోగ్రతల తీరు ఎప్పుడూ కూడా.. అంతకు ముందు వర్షాలు, శీతాకాల వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత వానాకాలంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా.. కృష్ణా పరీవాహకంలో అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటు కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనా.. చాలా ప్రాంతాల్లో లోటు ఉండటం గమనార్హం. ఇక చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గినా.. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు సగటున చూస్తే ఈసారి జనవరి, ఫిబ్రవరి నెలలు అత్యధిక వేడిమి నెలలుగా నిలుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లానినా బలహీనపడటంతో.. పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన లానినా బలహీనంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీనితో ముందస్తు వేసవిని ఆహ్వానించినట్టు అయిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైనట్టు చెబుతున్నారు. మరోవైపు హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో లానినా పరిస్థితులు మరింత బలహీనపడతాయని, అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 125 ఏళ్ల రికార్డులు దాటేయొచ్చు! రాష్ట్రంలో గతేడాది జగిత్యాల, నల్లగొండ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఈసారి అంతకంటే అధికంగా నమోదవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1901 నుంచి 2025 వరకు గత 125 సంవత్సరాల కాలంలో సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంటే... 2025 వేసవిలో ఎక్కువ సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
Cyclone Alert: తుఫాన్గా మారనున్న తీవ్ర వాయుగుండం..
-
మొదలైన ‘గజగజ’!.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 11.8 డిగ్రీల సెల్సియస్గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'!
బోట్ల యజమాని.. టీడీపీ వర్గీయుడు... ఆ బోట్లకు అనుమతులిచ్చిందీ టీడీపీ ప్రభుత్వమే.. టీడీపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నవి అవే బోట్లు... అయినా సరే ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వైఎస్సార్సీపీ కుట్రే...! వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయండి.. ఇదీ సర్కారు ఆదేశం! ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు రాజకీయ కుట్ర ఇదీ!!– సాక్షి, అమరావతి అతి భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుకుండలను తలపిస్తున్నా దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు ప్లడ్ కుషన్ నిబంధనను పాటించకుండా సీఎం చంద్రబాబు లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వరద ముంపు ముంచుకొస్తున్నా రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖలతో కనీసం సమీక్ష నిర్వహించకుండా.. ప్రజలను అప్రమత్తం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మానవ తప్పిదంతో విజయవాడను వరదలు ముంచెత్తేందుకు కారణమయ్యారు. వరద నియంత్రణ, సహాయ, పునరావాస చర్యల్లో ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘బోట్ల’ రాజకీయానికి తెర తీశారు. ఏకంగా రాజద్రోహం లాంటి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించాలని ఆదేశించడం ఈ కుతంత్రానికి పరాకాష్ట. అయితే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఆ బోట్లను కోమటి రామ్మోహన్ అనే వ్యక్తికి విక్రయించారన్న ప్రభుత్వ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. ఇక ఆ బోట్లకు అనుమతులిచ్చింది కూడా టీడీపీ హయాంలోనే కావడం గమనార్హం. అక్రమ కేసు కుట్రదారు బాబే.. ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బోట్ల ఉదంతానికి ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యమిచ్చారు. తద్వారా అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులకు çసంకేతాలిచ్చారు. దీంతో బోట్లు ఢీకొనడం యాధృచి్ఛకమేనని అప్పటివరకు చెబుతూ వచ్చిన నీటిపారుదల శాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దల ఆంతర్యం బోధపడింది. ఇక చేసేదిలేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీపై బురదజల్లుతూ ఎల్లో మీడియాలో చర్చలతో హడావుడి చేస్తున్నారు. ఉషాద్రి టీడీపీ వర్గీయుడే బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014–19 మధ్య టీడీపీ హయాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్స్లు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్ బోర్డ్ అనుమతులతోపాటు అమరావతి బోటింగ్ క్లబ్లో సభ్యత్వం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణా నదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణా నదిలో విహరిస్తూ బాణసంచా కాల్చారు. ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా వైరలయ్యాయి. టీడీపీలో అత్యంత క్రియాశీల సభ్యుడైన ఉషాద్రి బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొంటే అందుకు ఆ పారీ్టనే బాధ్యత వహించాలి కదా? వైఎస్సార్సీపీపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నట్లు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గోప్యత వెనుక గుట్టు ఇదీ..! పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నిందితుడు కోమటి రామ్మోహన్కూ టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మేనల్లుడు అని పోలీసులు పేర్కొన్నారు. రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో కీలక నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడు అనే విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. ఇప్పటికీ రామ్మోహన్ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆ విషయాలనూ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఉషాద్రి, రామ్మోహన్లకు మరో వ్యాపార భాగస్వామి ఉన్నారు. ఆయనే టీడీపీ నేత అలూరి చిన్న. ఈ ఉదంతంలో టీడీపీకి సంబంధాలున్నాయనే విషయాన్ని కప్పిపుచ్చేందుకే పోలీసులు ఆలూరి చిన్న పేరును తప్పించారన్న విషయం కీలకంగా మారింది. టీడీపీ ప్రభుత్వ రాజకీయ కుట్రే వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం.తేలిపోయిన ప్రభుత్వ కుట్ర...⇒ ప్రకాశం బ్యారేజీకి తీవ్ర నష్టం కలిగించేందుకే కృష్ణా నదికి అటువైపు ఉన్న బోట్లను కొద్ది రోజుల ముందు ఇటువైపు తెచ్చారని మంత్రి రామానాయుడు చెబుతున్నారు. కానీ ఆ అభియోగాలు పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో వెల్లడైంది. ఆ బోట్లను నాలుగు నెలలుగా గొల్లపూడి సమీపంలో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న శ్మశానం సమీపంలోనే లంగరు వేసి ఉంచారు. గూగుల్ శాటిలైట్ ఫొటోలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.⇒ బోట్లను ఉద్దేశపూర్వకంగానే ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేసులో ప్రస్తావించారు. కానీ ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఆ బోట్లే కాదు.. కృష్ణా నదిలో అన్ని బోట్లను అవే బలమైన ప్లాస్టిక్ తాళ్లతో లంగరు వేసి ఉంచుతున్నారు. అందుకోసమే తయారు చేసిన ప్లాస్టిక్ తాళ్లను అమరావతి బోటింగ్ క్లబ్ తమ సభ్యులకు సరఫరా చేస్తోంది.⇒ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఉన్న స్లూయిజ్ చైన్లను తెంపేశారని ప్రభుత్వం ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ‘అవేమీ చిన్నా చితకా తాళ్లు కాదు తెంపేయడానికి. బలమైన ఇనుప గొలుసులు. వాటిని తెంపడం అసాధ్యం’ అని నీటిపారుదల శాఖ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.⇒ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలే కృష్ణా నది వద్ద ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో అన్ని బోట్లు ఆ పార్టీ నేతల ఆదీనంలోనే ఉన్నాయి. అవి బ్యారేజీని ఢీకొంటే అందుకు బాధ్యత టీడీపీ వర్గీయులదే అవుతుంది కానీ వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?⇒ ఈ కేసులో కీలక నిందితుడు ఉషాద్రి స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు లోకేశ్, దేవినేని ఉమాకు సన్నిహితుడు కాదా? ⇒ ఆ బోట్లు నాలుగు నెలలుగా కృష్ణా ఒడ్డున లంగరు వేసి ఉండటం నిజం కాదా? వరద సమయంలో వాటిని తొలగించకుండా నీటిపారుదల, పోలీసులు, పర్యాటక శాఖ అధికారులను ఎవరు అడ్డుకున్నారు? ⇒ జూన్లో టీడీపీ విజయోత్సవ వేడుకల్లో ఆ బోట్లతో ర్యాలీ నిర్వహించలేదా? ⇒ తలశిల రఘురాం, నందిగం సురేశ్తోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు పోలీసులపై ఒత్తిడి తేవడం నిజం కాదా? -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
AP: నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశి్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం కళింగపటా్ననికి 240 కి.మీ., పూరీకి ఆగ్నేయంగా 150 కి.మీ., పశి్చమ బెంగాల్లోని దిఘాకు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీన పడనుందని వెల్లడించారు.వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై సోమవారం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం వరకూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 10వ తేదీ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, కోస్తాంధ్రలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రపు అలలు 1.3 నుంచి 1.6 మీటర్/సెకెను వేగంతో దూసుకొస్తుండటంతో, పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్ : వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాం«ధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గడిచిన 48 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 168.5 మి.మీ., చీపురుపల్లిలో 167.75 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 158.75, ఆమదాలవలసలో 142 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా వై.రామవరంలో 133.5, నెల్లిమర్లలో 129.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతోంది. గోపాలపట్నంలోని రామకృష్ణనగర్ వద్ద మట్టి కోతకు గురవుతుండటంతో.. 15కు పైగా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లన్నీ ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కంచరపాలెంలో కొండచరియలు విరిగిపడి.. కార్లు, బైక్లు ధ్వంసమయ్యాయి. ప్రధాన మార్గమైన జ్ఞానాపురం వద్ద ఎర్రిగెడ్డ పొంగిపొర్లుతుండటంతో రోడ్లు జలదిగ్బంధంలోచిక్కుకున్నాయి. దీంతో విశాఖ నుంచి గాజువాక వైపు రాకపోకల్ని నిలిపేసి.. ప్రధాన రహదారి వైపు మళ్లించారు. జిల్లాలోని 12 మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని 81 లోతట్టు ప్రాంతాల్ని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఆదేశాలిచ్చారు. జీవీఎంసీలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 98 వార్డుల్లో పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 110 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు గంభీరం రిజర్వాయర్ గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. గంభీరం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 126 అడుగులు కాగా.. ప్రస్తుతం 123.8 అడుగులకు వరద నీరు చేరుకుంది. 50 క్యూసెక్కుల నీరు చేరుతున్న తరుణంలో.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వంశధార, నాగావళి, బహుదా ఉగ్రరూపం ⇒ శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదాతో పాటు గెడ్డలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద పది గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. జిల్లాలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 వరకు 1461.6 మి.మీ వర్షం కురవగా, ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 620 మి.మీ వర్షం కురిసింది. బెజ్జిపురం వద్ద గడ్డలో వాహనం కొట్టుకుపోయింది. ⇒ శ్రీకాకుళం పరిధి కల్లేపల్లిలో శనివారం పిడుగుపడి 6 గొర్రెలు మృతి చెందాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చడంతో పాడేరు, పెదబయలు మండలాల్లోని సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకులోయ, అనంతగిరి, పాడేరు, లంబసింగి ఘాట్ మార్గాల్లో కొండచరియలు విరిగి పడుతున్నందున ఆదివారం సాయంత్రం నుంచి ఘాట్ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా 72.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ⇒ చాపరాయి జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో జలవిహారి సందర్శనను నిలిపివేశారు. జలవిద్యుత్ ప్రాజెక్ట్లకు నీరందించే డొంకరాయి జలాశయానికి వరద తాకిడి నెలకొంది. ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ⇒ విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే çపగలు, రాత్రి బస్సు సరీ్వసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం అర్థరాతి నుంచి భారీగా వర్షాలు కురిశాయి. తాండవ రిజర్వాయర్, రైవాడ, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తేశారు. ⇒ విజయనగరం జిల్లా మడ్డువలస ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేశారు. నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాటిపూడి జలాశయం గేట్లు ఎత్తి వేసి 350 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు చేయకపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారంతా తుపానులో చిక్కుకుపోయారని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మరబోట్లకు గోపాల్పూర్ పోర్టులో ఆశ్రయంభావనపాడు పోర్టులో 6 బోట్లు, సిబ్బందికి ఆశ్రయం మహారాణిపేట : ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విశాఖకు చెందిన పలు మరబోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని గోపాలపూర్, గజ్జాం జిల్లాల్లో పోర్టు లోపలికి అనుమతించకపోవడంతో మరబోట్లు, మత్స్యకారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. దీంతో అక్కడ మరబోట్ల యజమానులు, సిబ్బంది విశాఖలో ఉన్న ఏపీ మరపడవల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.సి.అప్పారావు దృష్టికి తెచ్చారు.అప్పారావు వెంటనే మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విజయ కలిసి గోపాలపూర్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సముద్రంలో చిక్కుకున్న 14 మరబోట్లను, మత్స్యకారులకు గోపాలపురం పోర్టులో ఆశ్రయం కలి్పంచాలని కోరారు. దానికి కలెక్టర్ సమ్మతించి హార్బర్లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 14 బోట్లు, సిబ్బంది గోపాలపూర్ పోర్టులో ఆశ్రయం పొందినట్టు అప్పారావు తెలిపారు. అలాగే భావనపాడు పోర్టులో 6 మరబోట్లు, సిబ్బంది ఆశ్రయం పొందారని, మిగతా బోట్లకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ఆందోళనలో సిక్కోలు ప్రజలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నాగవాళికి వరద మరింత పెరిగితే తమ పరిస్థితేంటని సిక్కోలు ప్రజలు భయపడిపోతున్నారు. విజయవాడలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య కాలంలో చేసిన ఓ ఘోర తప్పిదం.. జిల్లా కేంద్రాన్ని ముంపు ముప్పు బారిన పడేసింది. వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నాగావళి నదిలో నీటికి అడ్డుకట్ట వేసి, నిల్వ చేసుకునేందుకు శ్రీకాకుళం వద్ద డైక్ నిరి్మంచాలని 2017లో చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018లో విశాఖపట్నానికి చెందిన తమ అనుకూల కాంట్రాక్టర్కు రూ.4.95 కోట్లతో పనులు అప్పగించింది. సాధారణంగా నదులపై చేపట్టే డైక్ నిర్మాణాలను జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఇక్కడి పనులను మున్సిపల్ వర్క్స్ ఇంజనీర్లకు అప్పగించారు.నేతలు చెప్పినట్టు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వ్యవహరించి, కాంట్రాక్టర్ ఇష్టానికే పనులను వదిలేశారు. దీంతో నాసిరకం పనులు జరిగాయి. ఈ లోగా నాగావళి నదిలోకి భారీ వరద నీరు రావడంతో అప్పట్లో అంతవరకు నిర్మించిన డైక్ కొట్టుకుపోయింది. పనులు నాసిరకంగా జరగడం దీనికి ఒక కారణమైతే, ఆ డైక్ నిర్మాణానికి ముందు నాగావళి నదీ ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ప్రాథమిక నిర్మాణాలు చేపట్టకపోవడం మరో కారణంగా చెప్పొచ్చు. నాసిరకం నిర్మాణం, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో భారీ వరదలకు డైక్ కొంత భాగం కొట్టుకుపోవడమే కాకుండా మిగిలిన నిర్మాణం కొంతమేర కిందకు దిగిపోయింది. దాని కింద ఇసుక కొట్టుకుపోయింది. దానికి తోడు ఎడమ వైపు గట్టు కోతకు గురవడంతో సమస్య జఠిలంగా మారింది. అప్పటి నుంచి నదీ గమనం పూర్తిగా మారిపోయింది. దీన్ని అధిగమించాలంటే ముందు రక్షణ గోడ నిరి్మంచాలి. డైక్ సమీపంలో వంద మీటర్ల వరకు రింగ్బండ్ వేసి రివిట్మెంట్ లాంచింగ్ ఏప్రాన్ వేయాల్సి ఉంది. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికొచి్చనట్టయింది. డైక్ నిర్మాణాన్ని కొత్తగా చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కొట్టుకుపోయిన డైక్ను పరిశీలించేందుకు వచి్చన ఇంజనీరింగ్ సాంకేతిక బృందమే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాగావళి మరింతగా పొంగి ప్రవహిస్తే నగరంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఇలిసిపురం, రెల్లివీధి, మరికొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ఊహించి నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.వరదెత్తిన నదులుసాక్షి, అమరావతి : పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, ఏలేరు నదులు వరదెత్తుతున్నాయి. మహోగ్రరూపం దాల్చి శాంతించినట్లు శాంతించిన కృష్ణమ్మ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంతో మళ్లీ ఉగ్రరూపం దాలి్చంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా వరదకు మున్నేరు, కట్టలేరు తదితర వాగుల వరద తోడవుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 4,50,442 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 202 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పశి్చమ కనుమల్లో శనివారం, ఆదివారం విస్తారంగా వర్షాలు కురువడంతో కృష్ణాలో ఎగువన వరద మళ్లీ పెరిగింది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి 1.10 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి బీమా నుంచి 33 వేల క్యూసెక్కులు జత కలుస్తుండటంతో జూరాల ప్రాజెక్టులోకి 1.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 34 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 3.07 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్లోకి చేరుతున్న 2.60 లక్షల క్యూసెక్కులను అదే రీతిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.56 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.03 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. స్థిరంగా గోదావరి వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరంలోకి 6,59,942 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 2,300 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 6,57,642 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భారీ వరద వస్తుండటంతో ఏలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తి 5,775 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నాగావళి, వంశధార పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్టలోకి నాగావళి నుంచి 18,500 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక వంశధార నది నుంచి గొట్టా బ్యారేజ్లోకి 7,439 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1152 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 6,287 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Telangana: మళ్లీ 'మున్నేరు' ముంపు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు, మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కనీవిని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈనెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 అడుగులుగా నమోదైంది. ఆదివారం 15.75 అడుగులకు చేరుకుని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, ఈనెల 1నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు కూడా ఇటీవలి భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ భారీ వర్షం.. ఇక్కడ భయం ఖమ్మం జిల్లాకు ఎగువన మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షం పడినా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. ఆ విధంగానే ఈ నెల 1న భారీయెత్తున వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్లో భారీ వర్షాలు కురిస్తే ఖమ్మం జిల్లాలోని 11 మండలాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఇక ఆకేరు పరీవాహకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మండలాలు, ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు ఉంటాయి. ఆకేరు వరద మున్నేరులోకి చేరుతుండటంతో మున్నేరు ఉధృతి మరింత తీవ్రమై ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత పది రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ రెండు రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెం.మీ. పైగా నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షం ఈ రెండు ఏర్ల పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలోనే వరద ఉప్పెనలా పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రెండు వాగుల వేగ ఉధృతి కూడా గతంతో పోలిస్తే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి వరదలతో ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్నగర్, ధంసలాపురం కాలనీ.. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. నాటి వరదతో అప్రమత్తం మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్కు గురి చేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిõÙక్ అగస్త్య.. వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. శనివారం రాత్రి కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి ముంపు ప్రాంతాల ఇళ్లల్లో ఉన్న వారందరినీ మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఆయా కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఆదివారం కొందరు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని రాత్రికి తిరిగి వచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, మందుల పంపిణీని వేగవంతం చేశారు. -
వచ్చే వారం రోజులూ వర్షాలే
సాక్షి, అమరావతి/ మహారాణిపేట(విశాఖ): రాష్ట్రాన్ని వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: కోస్తా ఆంధ్రా, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ ఆవ ర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం కల్లా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. 2.06 సెంటీమీటర్ల వర్షపాతం.. బుధవారం రాష్ట్రంలో సగటున 2.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 5.47 సెంటీమీటర్లు, మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 59.77 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 83.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. -
సహాయక చర్యల్లో ఆ మంత్రులు విఫలం
సాక్షి, హైదరాబాద్, చేగుంట(తూప్రాన్): ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడలేకపోయారని మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అనేక మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.వర్షాలతో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో కాపాడమని కోరుతున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలు చేపట్టడం మానేసి బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని నిందించారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారమివ్వాలి ఓ వైపు ప్రజలు ఆపదలో ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడుతున్నారని హరీశ్రావు విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ నాగేశ్వర్పై సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని హరీశ్రావు ఖండించారు. -
Telangana: వర్షం.. విలయం
రాత్రీ పగలూ ఎడతెరిపి లేకుండా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కుండపోత.. అడుగు బయటపెట్టలేకుండా ఎటు చూసినా నీళ్లే.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మిగిలింది కన్నీళ్లే. వాగులు, వంకలు ఉప్పొంగుతూ, చెరువులు అలుగుపారుతూ.. ఊర్లు, రోడ్లను ముంచేస్తూ అతలాకుతలం చేస్తున్నాయి. వరద దాటే ప్రయత్నం చేసిన ఎన్నో ప్రాణాలను మింగేస్తున్నాయి. ఇది మరో రెండు రోజులూ కొనసాగుతుందని, మరింతగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానల తీవ్రత శనివారం రాత్రి నుంచి మరింత పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనితో జనజీవనం అతలాకుతలమైంది. వరద పోటెత్తి, రహదారులు కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలూ నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు నిండి అలుగెత్తాయి. వాగులు, వంకలు పోటెత్తాయి. దీనితో పదులకొద్దీ గ్రామా లు జలదిగ్భంధం అయ్యాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు, సహాయక చర్యలు, ముందు జాగ్రత్తల గురించి దిశానిర్దేశం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్రూమ్భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 040–23454088 నంబర్ ద్వారా.. వర్షాలు, వరదల పరిస్థితిపై కలెక్టర్లతో సంప్రదిస్తూ.. అవసరమైన సహాయ సహకారాలు, సూచనలను అందిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.రికార్డు స్థాయిలో వర్షపాతం..రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు సరికొత్త రికార్డును నమో దు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే ఇంత భారీగా వానలు కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో సెప్టెంబర్ 1 నాటికి 58.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతంనమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 76.19 సెంటీమీటర్లు కురిసింది. ఇది సాధారణం కంటే 31శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం సీజన్లో నమోదవాల్సిన వర్షపాతం.. మరో నెల రోజులు ఉండగానే కురిసింది.మరో రెండు రోజులు భారీ వర్షాలురాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షా లు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆదిలాబాద్, నిజామాబాద్, రా జన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగా రెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, సూర్యా పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్, వనపర్తి, నారా యణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.తడిసి ముద్దయిన హైదరాబాద్రెండు రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. శనివారం రాత్రి నుంచీ ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. నాలాలలో వరద పెరిగి, డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాల కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. హుస్సేన్సాగర్ నిండిపోవడంతో తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. దాదాపు 165 వాటర్ ల్యాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో.. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్బోర్డుల ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు ఎప్పటికప్పుడు నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి.ఖమ్మం.. అల్లకల్లోలం భారీ వర్షాల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అల్లకల్లోలమైంది. పాలేరు, మున్నేరు, వైరా, ఆకేరు, కట్టలేరు నదులు పోటెత్తాయి. చాలాచోట్ల రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా వర్షం పడటం, ఎగువన మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం కురవడంతో.. ఒక్కసారిగా మున్నేరు, ఆకేరు ఉగ్రరూపం దాల్చాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఖమ్మం నగరానికి వరద పోటెత్తింది. 35 కాలనీలు నీటమునిగాయి. తమను కాపాడాలంటూ కాలనీలు, గ్రామాల వాసులు నేతలు, అధికారులకు ఫోన్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకా చాలా మంది తమ భవనాలపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 5వేల మంది వరద బాధితులను తరలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వరదలను, సహాయక చర్యలను పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా పలుచోట్ల సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మణుగూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలో సీతారామ ప్రధాన కెనాల్కు గండి పడింది. ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. వరంగల్.. ఎటు చూసినా వరదే! ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవడంతో.. జలదిగ్బంధమైంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 56 చెరువులు తెగిపోయాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ కింద కట్ట కొట్టుకుపోయింది. దీనితో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామపంచాయతీ సీతారాం తండాలు నీటమునిగాయి. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు.. ‘ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆదుకోండి’ అంటూ అధికారులు, బంధువులకు ఫోన్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వందల కొద్దీ పాత ఇళ్లు కూలిపోయాయి. వేములవాడ నుంచి భద్రాచలానికి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. శనివారం రాత్రి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం– తోపనపల్లి శివార్లలో వరదలో చిక్కుకుంది. ప్రయాణికులు వరద మధ్య బస్సులోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉమ్మడి నల్లగొండ వాన బీభత్సం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సూర్యాపేట జిల్లా కాగితరామచంద్రాపురం వద్ద, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం శివారు రంగులబ్రిడ్జి వద్ద గండ్లు పడ్డాయి. సూర్యాపేట మండలం పిల్లలమర్రి– పిన్నాయిపాలెం మధ్య మూసీ ఎడమ కాలువకు గండిపడింది. వేల ఎకరాలు నీట మునిగాయి. పలుగ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మఠంపల్లి మండలం చౌటపల్లిలో ఊరచెరువుకు, హుజూర్నగర్ మండలం బూరుగడ్డ చెరువు, మేళ్లచెరువులో నాగుల చెరువులు తెగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట, చౌల్లరామారం, అడ్డగూడూరులలో చెట్లు విరిగిపడ్డాయి. ఉమ్మడి మెదక్ నిలిచిన రాకపోకలు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో నారింజ వాగు ఉప్పొంగడంతో కర్ణాటక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్–హైదరాబాద్ రహదారిపై చెట్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. గుండువాగు, పెద్దవాగు, గంగమ్మ వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం జలదిగ్బంధమైంది. ఉమ్మడి రంగారెడ్డి దెబ్బతిన్న పంటలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కాగ్నా, ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో టమాటా, ఆకుకూరల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు పరిధిలోని గౌతాపూర్ సబ్స్టేషన్లో వరద నీరు చేరడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ నిండుకుండల్లా ప్రాజెక్టులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వరదలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కుమురం భీం, కడెం, వట్టివాగు, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జైనథ్ మండలం పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్పూర్లలో పంటలు నీట మునిగాయి. బోథ్ మండలం పొచ్చెర జలపాతం ఉప్పొంగుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సిద్దాపూర్ వాగు పొంగడంతో సిద్దాపూర్, కౌట్ల, ముజ్జిగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నిర్మల్ మండలం చిట్యాల వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. వాహనంలోని వారికి ఈతరావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ రోడ్లు జలమయం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వర్షం దంచికొట్టింది. కలెక్టరేట్ ఆవరణలోని భారీ వృక్షం కూలిపడి, విద్యుత్ స్తంభం విరిగింది. వీణవంక, మామిడాలపల్లిలో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణిలోని ఓపెన్ కాస్ట్లలో బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి– తాండ్య్రాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లెలోని బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్, రంగంపల్లి, పెద్దకల్వల, సుల్తానాబాద్ బస్టాండ్, రామగుండం–మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారి (ఎస్హెచ్–1)పై వరద నీరు చేరి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి పాలమూరు దెబ్బతిన్న రోడ్లు రెండు రోజులుగా కురుస్తున్న వానలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. మహబూబ్నగర్ లోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. జడ్చర్ల పట్టణంలోని యాసాయకుంట తెగి పలు కాలనీలు నీటమునిగాయి. పెద్దగుట్ట రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై దోమలపెంట వద్ద కొండచరియలు విరిగిపడి.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిడ్జిల్ మండలం మున్ననూర్ వాగు వద్ద కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండిపడి 167 జాతీయ రహదారిపై నీళ్లు చేరాయి. ఇదే రహదారిపై మహమ్మదాబాద్లో రెండు చోట్ల రోడ్డు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ దంచికొట్టిన వాన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో వాగులు పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు నీట మునిగాయి. చెట్లు కూలిపడటంతో మెదక్–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వానలకు 18 ప్రాణాలు బలివానలు, వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. ⇒ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పవన్ నక్కల వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. రామగిరి మండలం రాజాపూర్లో అంకరి రాజమ్మ (65) విద్యుత్ షాక్తో మృతిచెందింది. కమాన్పూర్ మండలం జూలపల్లిలో వ్యవసాయ కూలీ ఇలాసారం కిరణ్ (36)కు ఫిట్స్ వచ్చాయి. వర్షంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందాడు. ⇒ నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడులో వర్షానికి పాత ఇల్లు పైకప్పు కూలి హన్మమ్మ (60), అంజులమ్మ (40) మృతిచెందారు. ⇒ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లికి చెందిన ఎరుకలి శేఖర్ (35) పల్లం చెరువులో మునిగి కన్నుమూశాడు. ఇదే జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడలో రైతు యాదయ్య (50) పశువుల కొట్టానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి మృతి చెందాడు. ⇒ కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బొందగూడకు చెందిన టేకం గణేశ్ (35) గ్రామశివార్లలో వాగుదాటుతూ కొట్టుకుపోయి మృతి చెందాడు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రీకూతుళ్లు నునావత్ మోతీలాల్, అశి్వని.. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయిగూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. మధిర మండలం దెందుకూరులో గేదెలు కాసేందుకు వెళ్లిన పద్మావతి వరదలో కొట్టుకుపోయి మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద నీటిలో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. అశ్వాపురం మండలంలో తోగువాగు ఉప్పొంగడంతో ఇద్దరు పశువుల కాపర్లు కొట్టుకుపోయి మృతి చెందారు. ⇒ వరంగల్ జిల్లా రాజీపేటలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన రాములు (58) మృతిచెందాడు. ఇదే జిల్లా దుగ్గొండి మండలం మందపల్లిలో వృద్ధురాలు కొండ్ర సమ్మక్క (75) వరద నీటిలో పడిపోయి మృతి చెందింది. ⇒ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగం రవికుమార్ వాగు దాటే క్రమంలో కారుతో సహా కొట్టుకుపోయి మరణించాడు. ఉత్తమ్ పద్మావతినగర్ వద్ద యారమాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్పై వరదను దాటుతూ ప్రమాదానికి గురై మరణించారు. -
AP: నేడు, రేపు మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం: కళింగపట్నం మీదుగా ఆగ్నేయంగా మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్యలో విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం, బుధవారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయి. -
వరుణించిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం. సస్యశ్యామల ‘సీమ’ నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.ఆ జిల్లాలో జూన్లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. సీమలోనే ఎక్కువ ఎందుకంటే.. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.జూలైలోనూ సమృద్ధిగా.. జూన్ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు. -
మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు. రుతుపవనాలకు అనుకూలంగా..నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
రేపు అల్పపీడనం! రాష్ట్రానికి మూడు రోజులు వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తొలుత వాయవ్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పసుమాములలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం చాలాచోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
రెండ్రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో అత్యధికంగా 40.5 డిగ్రీ సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో అత్యధికంగా 24.8 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని ఆ శాఖ తెలిపింది. -
3 రోజులు తేలికపాటి వానలు!
సాక్షి, హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క పోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ కాస్త చల్లని కబురు చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదుకావొచ్చని పేర్కొంది.19 జిల్లాల్లో వానలకు చాన్స్: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో మంగళ, బుధ, గురు వారాల్లో ఉరు ములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలిక పాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వానలకు సంబంధించి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.జల్లులు పడినా ఎండల మంటలే..రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దానితో ఆదివారం రాత్రి వాతావరణం కాస్త చల్లబడింది. అయినా సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లిపూర్లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదైంది. వచ్చే మూడు రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
నిడమనూరు@44.5 రాష్ట్రం నిప్పుల కొలిమి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాడ్పులు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం లేదా చివరి వారంలో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. సోమవారం సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏప్రిల్ 8న రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో కుతకుతలాడాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది. తప్పనిసరైతేనే బయటకెళ్లాలి రానున్న రెండ్రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, ములుగు, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 44 డిగ్రీ సెల్సీయస్ మధ్యన నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
సమ్మర్ సలసల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల తొలివా రం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అందరిలో కలుగుతోంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితిలో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది కంటే 2.5 డిగ్రీలు అధికంగా... నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 41 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఈ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం సగటున 1 డిగ్రీల సెల్సీయస్ నుంచి 2.5 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదవగా హైదరాబాద్లో 2.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్లలో 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
AP: జర జాగ్రత్త.. మూడు రోజులు మండే ఎండలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
చలి పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు నెలకొన్నాయి. దీంతో క్రమంగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత పడిపోయాయి. ఉష్ణోగ్రతల పతనానికి తో డుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. అంతటా తగ్గుదలే... రాష్ట్ర మంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. కానీ ప్రస్తుతం సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల వారీగా పరిశీలిస్తే మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకో రెండు రోజులు ఇలానే రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 9.4 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతోపాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని, జనవరి మొదటి, రెండు వారాల్లో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే... రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది. లక్షద్వీప్, తమిళనాడుతోపాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుపానుకు అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన.. తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అతి తీవ్ర తుపాను మంగళవారం సాయంత్రం తుపానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలో ఏకంగా 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దమ్మపల్లి, ముల్కలపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బుధవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉన్నట్లు వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు తుపాను ప్రభావంతో వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. గత రెండ్రోజుల వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మంగళవారం సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురు వారాల్లో ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్లో 28.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్లో 18.7 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వరి, పత్తి పంటలకు నష్టం ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం ♦ నేల కొండపల్లిలో గుడిసె కూలి భార్యాభర్తలు మృతి ♦ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ♦ నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు సాక్షి నెట్వర్క్, ఖమ్మం, నేలకొండపల్లి: తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం మొదలైన వాన మంగళవారం తగ్గుముఖం పట్టినా మళ్లీ సాయంత్రం పెరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు జిల్లావ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. మరోపక్క కలెక్టరేట్లలో కంట్రోల్రూంలు ఏర్పాటుచేసిన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బోట్లు సమకూర్చడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. భద్రాచలానికి 20 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, పది మందితో కూడిన ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు. సింగరేణి ఓసీల్లో నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న వర్షం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోడలు నాని పూరిగుడిసె కూలడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు(40) – లక్ష్మి (30) దంపతులు మృత్యువాత పడ్డారు. మట్టిపెళ్లలు మీద పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. అప్పటివరకు చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ దంపతులు ఇంట్లోకి వెళ్లగా.. ఒక్కసారిగా శబ్దం రావటంతో స్థానికులు వెంటనే స్పందించారు. 108కు సమాచారం ఇవ్వగా అక్కడి చేరుకున్న సిబ్బంది అప్పటికే భార్యాభర్తలు మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే నిరుపేద దంపతులు అకాల వర్షంతో మృతి చెందడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. -
పగలు భగభగ.. రాత్రి గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా.. సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 15 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
రాయలసీమలో భారీ వర్షాలు
(సాక్షి నెట్వర్క్) : రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉమ్మడి వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజోలి ఆనకట్టకు భారీగా నీరు.. కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు వైఎస్సార్ జిల్లా మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు భారీగా వచ్చి చేరుతోంది. కుందూ పరీవాహక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఇందిరారాణి సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో 73.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో సగటున 53.4, కర్నూలు జిల్లాలో సగటున 19.8 మి.మీ. వర్షం కురిసింది. రెండు రోజులుగా తిరుపతి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం జిల్లాలో గరిష్టంగా బాలయపల్లి మండలంలో 118.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తిరుపతి అర్బన్లో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా తవణంపల్లె మండలంలో 83.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వర్షాలు కురిశాయి. అటు సత్యసాయి జిల్లా, ఇటు అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో మొదటిసారిగా పుట్లూరు మండలంలో 111.6 మి.మీ. భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో సగటున 17.2 మి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 25.52 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద పెన్నా నదిలో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా నీటి ఉధృతి ఎక్కువైంది. నదిలో షికారుకు వెళ్లిన చెన్నూరు కొత్త గాంధీనగర్కు చెందిన వెంకట సుబ్బయ్య, రాజు, రమణ(పెద్దోడు), వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, శ్రీను, రమణ, రాజేష్ పెన్నా నదిలో షికారుకెళ్లి పెన్నా నదిలో చిక్కుకున్నారు. మైదుకూరు రూరల్ సీఐ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటు సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ♦శనివారం రాత్రి కురిసిన వర్షానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు సమీపంలోని ఇసుక వంకలో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇసుక వంకలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సదాశివయ్య పోలీసులు, రెస్క్యూ టీమ్ వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న 13 మంది ప్రయాణికులను, డ్రైవర్, కండక్టర్ను తాడు సాయంతో ఉప్పలపాడు వైపు గట్టుకు తీసుకొచ్చారు. రేపు అల్పపీడనం! సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి, ఆంధ్రప్రదేశ్ను ఆనుకుని ఉన్న తెలంగాణపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోను, బుధవారం ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపింది. -
Telangana Rains: రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనావేసింది -
తీవ్ర తుపానుతో అమెరికా అతలాకుతలం.. 11 లక్షల ఇళ్లల్లో అంధకారం
వాషింగ్టన్: అమెరికాలోని తూర్పు తీర రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. టెన్నెస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లోని 11 లక్షల నివాసాల్లో అంధకారం అలుముకుంది. సుమారు 3 కోట్ల మందిపై తుపాను ప్రభావం పడింది. తమ ప్రాంతంలోని విద్యుత్ లైన్లను మరమ్మతు చేసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నాక్స్విల్లె యుటిలిటీ బోర్డ్ తెలిపింది. అలబామాలోని ఫ్లోరెన్స్లో సోమవారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సౌత్ కరోలినాలోని అండెర్సన్ కౌంటీలో చెట్టు కూలి పడటంతో ఓ బాలుడు(15) చనిపోయాడు. భారీ వర్షాలు, గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో విమాన, రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎనిమిది వేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. మరో 2,600 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తూర్పు తీర ప్రాంతం వైపు రావాల్సిన విమానాలను దారి మళ్లించినట్లు ఫెడరల్ ఏవియేషన్ తెలిపింది. వందలాదిగా ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలి రహదారులు, నివాసాలపై పడిపోయాయి. విధులకు హాజరైన ఉద్యోగులను తుపాను కారణంగా ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్ర తుపాను ఇదేనని జాతీయ వాతావరణ విభాగం పేర్కొంది. -
Telangana: నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట్లో 7 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. -
మూడు రోజులు విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం ఒడిశా–ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది. -
వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అంచనావేసింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వెల్లడించింది. రెండు రోజులు (గురువారం, శుక్రవారం) మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. (చదవండి: వాన లోటు తీరినట్టే!) కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్) -
వర్షాభావం ఎదురైనా.. నీళ్లు ఇద్దాం!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. రైతులకు సాగు నీటిని సరఫరా చేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. అందుకు ఎంత ఖర్చ యినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల కోసం ఏర్పాట్లు చేయాలని, అన్ని రిజర్వాయర్లను నింపాలని సూచించారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి విడుదలకు కొన్నిరోజులు విరామం ఇచ్చి, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జూలై తొలి వారం నాటికి వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఇతర అంశాలపై మరోసారి సమీక్షించుకుని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను ఆగస్టులోనే సమీక్షించి.. కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30– 35 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీలు నింపాలన్నారు. రంగనాయకసాగర్లో 3 టీఎంసీల సామర్థ్యానికిగాను 0.69 టీఎంసీలే ఉన్నాయని ఇంజనీర్లు వివరించగా.. మిడ్మానేరు నుంచి వెంటనే 2 టీఎంసీలను ఎత్తిపోయాలని, దీంతో రంగనాయకసాగర్ కింద వానాకాలం పంటలకు నీరు అందించడానికి వీలవుతుందని సూచించారు. నిజాంసాగర్లో ఉన్న 4.95 టీఎంసీల నీళ్లు ఆగస్టు చివరివరకు 3 తడులకు సరిపోతాయని, తర్వాత మరో 3 తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు సమీక్షలో వివరించారు. దీనితో ఆగస్టులో కొండపోచమ్మసాగర్ ద్వారా 5 టీఎంసీలను నిజాంసాగర్కు తరలించాలని సీఎం సూచించారు. జలాశయాలన్నీ నింపి పెట్టుకోవాలి వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ఫ్లో ఆగిపోయాక కూడా.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరిలో ప్రవాహాలు ఉంటాయి. రెండో పంట అవసరాలకు ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లలో తగినంత నీటిని నింపి పెట్టుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మ్యాన్యువల్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వార్ధా ప్రాజెక్టుకు అనుమతులివ్వండి వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు కోసం రూ.4,252.53 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, పరిపాలన అనుమతులు త్వరగా ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కోరగా.. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, శంకర్, సీఈలు హమీద్ఖాన్, రమణారెడ్డి, శ్రీనివాస్, అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘పాలమూరు’ లిఫ్టింగ్కు సిద్ధం చేయండి తాగునీటి అవసరాల కోసం ఆగస్టు చివరికల్లా పాలమూరు–రంగారెడ్డి నుంచి నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, సమర్థులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. ఇక తాగునీటి అవసరాల కోసం మిడ్మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. 26 నుంచి రైతుబంధు వానాకాలం పంటల కోసం జూన్ 26 నుంచి రైతుబంధు సొమ్ము పంపిణీని ప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ పూర్తయ్యాక పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతుబంధు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. -
Andhra Pradesh: రాష్ట్రం భగభగ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగభగమండగా కోస్తా జిల్లాల్లో వాటి ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించింది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉ.11 గంటలకే చాలా ప్రాంతాల్లో 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకురావడానికే బెంబేలెత్తిపోయారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాల్లో దాదాపు అన్నిచోట్లా 40–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.7, కామవరపుకోటలో 44.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 44.4, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మోకా తుపాను ప్రభావమే మోకా తుపాను ప్రభావంవల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతం నుంచి ఏపీకి వీచే గాలులను తుపాను లాగేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మన ప్రాంతంలో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. కేవలం తేమలేని పొడిగాలులు వీస్తుండడంతో తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం లేకపోవడంతో ఉక్కపోత, ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. తుపాను ప్రభావం తగ్గేవరకు అంటే నాలుగైదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
తెలంగాణలో ఇక భానుడి భగభగలు.. జైనలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: భానుడి భగభగలతో రాష్ట్రం హీటెక్కింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావాలతో గత పక్షం రోజులుగా నడి వేసవిలోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండ్రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం మరింత పెరిగి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో 44.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చని వివరించింది. -
తుఫాన్గా మారిన అల్పపీడనం, తీరం అల్లకల్లోలం.. భారీ వర్ష సూచన
బరంపురం (ఒడిశా): ఉత్తర బంగాళాఖాతం అండమాన్ దీవిలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 6 నుంచి 9వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. తాజా సమాచారం అందే సమయానికి గోపాల్పూర్ తీరానికి 700కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మూడు రోజుల క్రితం బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం సైక్లోన్గా మారినట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షంతో పాటు గంటకు సుమారు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంజాం, గజపతి, రాయగడ, ఖుర్దా, జగత్సింగపూర్, పారాదీప్ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరప్రాంతాల్లో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గంజాం జిల్లా ఛత్రపూర్లో కలెక్టర్ దివ్యజ్వోతి పరిడా వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వరకు తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గోపాల్పూర్లో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గోపాల్పూర్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పారాదీప్ నుంచి కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరించగా.. సైక్లోన్ జోన్గా గుర్తింపు పొందిన గోపాలపూర్ సైతం ఇదే ఆందోళన కొనసాగుతోంది. దీని కారణంగా తీరంలో 5 మీటర్లకు పైగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మోటార్ బోట్లతో చేపల వేటపై నిషేధం ఉండగా.. సంప్రదాయ బోట్లు సైతం తీరానికే పరిమితమయ్యాయి. జిల్లాలోని సముద్ర తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే పనిలో ఉన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాలి జయపురం: ఇటీవల విరుచుకుపడిన పెనుగాలులతో కూడిన అకాల వర్షాలు, తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని జయపురం సమితి బాధితులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో పలువురు బాధితులు జయపురం సబ్ కలెక్టర్ దేవధర ప్రదాన్ను ఆయన కార్యాలయంలో గురువారం కలిసి, వినతిపత్రం అందించారు. అధికారులు కేవలం టార్పాన్లు ఇచ్చి, చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఎవరికి భూమి పట్టాలు ఉన్నాయో వారికి మాత్రం కొంత ఆర్థికసాయం అందించారని, మిగతా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై దృష్టి సారించి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్ జాని, సాను ఖొర, బలరాం జాని తదితరులు పాల్గొన్నారు. -
Telangana: మరో రెండు రోజులు వడగళ్ల వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ పది మినహా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదవుతాయని వెల్లడించింది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలంలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 18.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2.97 సెంటీమీటర్ల సగటు వర్షపాతం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.47 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలో 5.76, వరంగల్ జిల్లాలో 5.08, కరీంనగర్ జిల్లాలో 4.42, మంచిర్యాల జిల్లాలో 4.0, జగిత్యాల జిల్లాలో 4.0 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. -
Telangana: రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ విద ర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 37.0 డిగ్రీల సెల్సియస్గా నమో దైంది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ఇక ఎండలు మండవు
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. తీవ్రమైన ఎండలు తగ్గిపోయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటివరకు మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, ఆగ్నేయ/నైరుతి గాలుల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తున్నాయి. గత మూడేళ్లుగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైనా మధ్యలో 2, 3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత మే నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలలోపే నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మూడోవారం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడోవారం చివర్లో వర్షాలు మొదలవడంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే రకరమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. మే 9, 12 తేదీల మధ్య బంగాళాఖాతంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మయన్మార్ వైపు వెళ్లినా ఇక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్నిబట్టి మే రెండోవారం కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఒకటి, రెండురోజులు ఎండలు పెరిగినా వర్షాలు మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీవర్షం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీవర్షం కురిసింది. సగటున కర్నూలు జిల్లాలో 27 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లాలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కల్లూరు, కర్నూలు, గోనెగండ్ల తదితర మండలాలు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, బేతంచెర్ల, పాణ్యం, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో ఒక్కరోజు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆస్పరి, కొత్తపల్లి, పెద్దకడుబూరు మండలాల్లో పిడుగులు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామంలో పిడుగుపడటంతో 13 జీవాలు మరణించాయి. ఎమ్మిగనూరు మండలంలో 108.2 మిల్లీమీటర్లు, బనగానపల్లిలో 88, బేతంంచెర్లలో 75.2, కల్లూరులో 70.4, గోనెగండ్లలో 65, పాణ్యంలో 62.4, పగిడ్యాలలో 60.8, కర్నూలు అర్బన్లో 54.6, కర్నూలు రూరల్లో 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ , ఆదిలాబాద్ సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సాధారణం కంటే అధికంగా.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. – పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. – ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 44.5 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్సైట్లో తెలిపింది. – ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా భగభగలు న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు
న్యూఢిల్లీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య భారతదేశంలో వచ్చే నాలుగు రోజుల్లో వడగాలులు వీసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ల్లో ఈ పరిస్థితులుంటాయని వివరించింది. దక్షిణ భారతంలోని ఏపీ తీరప్రాంతంలో బుధవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వరుసగా రెండో రోజు సాధారణం కంటే కనీసం 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. బుధవారం నాటికి వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశాలున్నాయంది. -
HYD: హైదరాబాద్లో భారీ వర్షం.. వడగండ్ల వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, కోఠి ఇలా పలు ప్రాంతాల్లో.. భారీ వర్షం పడుతోంది. తెలంగాణ హైకోర్టు వడగండ్ల వాన కురుస్తోంది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్బజార్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. నగర శివారుతో పాటు తెలంగాణలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం ఉన్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. Massive hailstorm in Hyderabad #HyderabadRain #Hailstorm #Lakers pic.twitter.com/fuyS2z3VQ7 — محمد عبدالله (@abdullahqidvai) April 17, 2023 It was hot as hell since morning and now hail strom..#HyderabadRain #weather pic.twitter.com/d7xQaHFOpT — Q (@qutuba) April 17, 2023 #hyderabad #rainyday #hail #hailstorm #weather #awesome #beautiful #hyderabadrain 17th April 2023@HiHyderabad @balaji25_t @swachhhyd @Hyderabad_Bot pic.twitter.com/pEAuWWYadd — Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) April 17, 2023 -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20.0 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. -
నేడు, రేపు భగభగలే...!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భానుడి ప్రతాపం కొనసాగింది. గురు, శుక్రవారాల్లో కూడా పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
కాలిఫోర్నియాకు మంచు తుపాను, వరద ముప్పు
లాస్ఏంజెలెస్: అమెరికాను మంచుతుపాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాను శనివారం మధ్యాహ్నానికి ఎన్నడూ లేనంతటి వరదలు, తీవ్ర మంచు తుపాను చుట్టుముట్టే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లాస్ఏంజెలెస్ కొండ ప్రాంతాల్లో 5 అడుగుల మేర మంచు కురియవచ్చని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. మంచు తుపాను ఈ వారమంతా కొనసాగుతుందని పేర్కొంది. ఒరెగాన్ నగరంలో చాలా భాగం అడుగు మేర మంచు కురిసింది. పోర్ట్లాండ్లో అకస్మాత్తుగా కురిసిన మంచుతో ట్రాఫిక్ జామైంది. కరెంటు లైన్లు తెగిపోవడంతో సరఫరా నిలిచింది. స్కూళ్లు మూత బడ్డాయి. 10 లక్షల నివాసాలు, వ్యాపార సంస్థలు చీకట్లో మగ్గాయి. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, విస్కాన్సిన్ల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
ఆదిలోనే అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో 37 నుంచి 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో 36–38 డిగ్రీల ఉష్ణోగ్రతలొచ్చాయి. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో 3– 5, రాయలసీమలో 2–3 డిగ్రీల మేర సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొడి గాలుల కారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. -
ఏపీలో వర్షాలు.. రానున్న రెండు రోజుల్లో..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. మరోవైపు డిసెంబర్ నాలుగో తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం విలీనం కానుంది. తరువాత అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ -
AP: రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లో ఈ నెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 20వ తేదీ నాటికి ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. క్రమంగా ఇది ఏపీ–ఒడిశా తీరం వైపు కదులుతూ 24, 25 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా మారుతుందని పలు అంతర్జాతీయ ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.33 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండ లం ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, కాకుల డొంక వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోం ది. కాగా వర్షాల నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతితో ప్రవహించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో వాగుల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. అష్టదిగ్బంధంలో అమరావతి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. గత టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా నిర్మించిన అమరావతిని వాన నీరు చుట్టుముట్టింది. భూసమీకరణ పేరుతో వేలాది ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతంలో అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు. -
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ వార్నింగ్ను జారీ చేసింది. 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రజలు శిథిల భవనాలు/ఇళ్లలో ఉండవద్దని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పలుచోట్ల భారీ వర్షాలు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో 7.5 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 7.4, నంద్యాల జిల్లా వెలుగోడులో 7, ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 6.2, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 5.7, అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 5, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4.7, శ్రీశైలంలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది. -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
AP: భగభగలు..
సాక్షి, అమరావతి/రెంటచింతల: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వారం రోజులుగా అన్ని ప్రాంతాల్లో సగటున 3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఉ.8 నుంచి 10 గంటల మధ్య 26–28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి వుండగా ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది. 10 నుంచి 12 గంటల మధ్య 36–38 డిగ్రీలు ఉండాల్సి వుండగా 40 డిగ్రీలు నమోదవుతోంది. ఇక మ.12–3 గంటల మధ్య 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26–29 నుంచి 30–32 డిగ్రీలకు పెరిగాయి. మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఇక మే 8వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఆ తర్వాత నెలాఖరు వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ను అతలాకుతలం చేస్తున్న వేడిగాలులు అక్కడి నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వైపు వీస్తున్నాయి. ఈ గాలులు ఉత్తరాంధ్ర మీదుగా వెళ్తుండడంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోను వాటి ప్రభావం ఉంటోంది. నిప్పుల కొలిమిలా రెంటచింతల గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధ, గురు, శుక్రవారాలలో వరుసగా మూడ్రోజులుగా 44.6, 44.2 45.4 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. శనివారం గరిష్టంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలుగా నమోదు కావడంతో ఒక్కసారిగా రెంటచింతల అగ్నిగుండంగా మారింది. పనులకు వెళ్లిన కూలీలు ఎండకు తట్టుకోలేక ఉ.11 గంటలకే ఇంటి ముఖం పట్టారు. వడగాడ్పులతో వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పడమలలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.6, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 44.1, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44, ప్రకాశం జిల్లా యద్ధనపూడి, కర్నూలు జిల్లా మహానంది, పెరుసోమల, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, గొల్లవిడిపిలో 43.9, అనంతపురం జిల్లా తరిమెలలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు. ► తలపై టోపీ లేకపోతే కర్చీఫ్ కట్టుకోవాలి. పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. ► ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని తాగాలి. ► వడ దెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ► మంచినీరు ఎక్కువగా తాగాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు మంచి నీరు తాగాలి. ► ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు తాగాలి. ► ఎండలో ఉన్నప్పుడు తల తిరుగుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం దక్షిణ అండమాన్ సముద్రంలో మే 5న అల్పపీడనం ఏర్పడనుంది. తొలుత 4న ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం బలమైన అల్పపీడనంగాను, ఆపై వాయుగుండంగాను బలపడుతుంది. ఇది ఉత్తర, ఈశాన్య దిశగా కదులుతూ మయన్మార్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంపై అంతగా ప్రభావం ఉండే అవకాశంలేదు. అందుకు భిన్నంగా పశ్చిమ/వాయవ్య దిశగా పయనిస్తే మాత్రం రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వాయుగుండం తీరాన్ని దాటాక రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. -
Rain Alert: హైదరాబాద్కు భారీ వర్ష సూచన
హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. అయితే, హైదరాబాద్కు ఉత్తరం, పడమర వైపు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చేవెళ్ల ప్రాంతంలో కమ్ముకున్న మేఘాలు జంట నగరాల వైపు దూసుకొస్తున్నాయని.. అందుకే భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. కాగా, కొద్దిరోజులుగా తీవ్ర ఎండతో సతమతమవుతున్న భాగ్యనగరవాసులకు వర్షం కొంత ఉపశమనం కలిగించనుంది. ఇదిలా ఉండగా.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. #HyderabadRains UPDATE 🚨 04:20PM Dense Clouds have been formed around #Chevella. As per Current Wind Steering these Clouds are Moving towards the City. Hence Moderate Rains🌧with T-Storms⚡ expected at isolated parts of City in next 90min@HiHyderabad @DonitaJose @serish pic.twitter.com/7Voo6QDPAh — HYDERABAD Weatherman (@HYDmeterologist) April 15, 2022 -
AP: వణుకుతున్న 'రాష్ట్రం'
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. గ్రామాలు, నగరాలు గజగజ వణుకుతున్నాయి. విజయవాడ నగరంలో చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో బుధవారం తెల్లవారుజామున 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. 50 ఏళ్ల తరువాత విజయవాడలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ చెబుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది. 1970లో డిసెంబర్ 14న అత్యల్పంగా 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 1995, 1984, 2010 సంవత్సరాల్లో 13.7, 13.4, 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం నగరంలో చలితీవ్రత పెరిగింది. రాబోయే రెండురోజులు నగరంలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా అంతా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోను చలిగాలులు కొనసాగుతున్నాయి. బుధవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 5.4 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. పెదబయలులో 5.7, ముంచంగిపుట్టులో 6.3, డుంబ్రిగూడలో 6.8, అరకు వ్యాలీలో 7, గుంటూరులో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్య భారతదేశం నుంచి చల్లటిగాలులు నేరుగా ఏపీ వైపు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారే అవకాశం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరణ స్ధిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం భారత ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతు పవనాల రాక ప్రారంభమైంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది. -
AP: ఈ నెలంతా వానలే
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నాయి. బుధవారం నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలుకానుంది. మరోవైపు తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం పైకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. సూళ్లూరుపేటలో 176.50 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా ఏర్పేడులో 139.5, ముత్తుకూరులో 133.25, బుచ్చినాయుడుకండ్రిలో 114.25, ఇందుకూరుపేటలో 99.25, తడలో 96, గూడూరులో 86.5, మనుబోలులో 79.5, చిల్లకూరులో 70.25, నెల్లూరులో 70, సత్యవేడులో 64.25, కొరుటూరులో 63, శ్రీకాళహస్తిలో 59.5, తొట్టంబేడులో 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఉత్తరాంధ్రలో కుండపోత
బలహీనపడిన తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిన తుపాను సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమ ఒడిశా వైపు కదులుతూ అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ తుపాను వల్ల గాలులు 95 కిలోమీటర్ల వేగానికి పరిమితమవగా వర్షాలు మాత్రం విపరీతంగా కురిశాయి. అది కూడా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలపైనా ప్రభావం ఉండటంతో అక్కడా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం వర్షం బాగా తెరిపి ఇవ్వొచ్చని వాతావరణ శాఖ పేర్కొనడం ఊరట కలిగిస్తోంది. సాక్షి, అమరావతి /సాక్షి నెట్వర్క్: గులాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లాలో అనూహ్యంగా 11.8 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8 సెం.మీ., విజయనగరం జిల్లాలో 8.9 సెం.మీ. సగటు వర్షం కురిసింది. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. నగర శివారులోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు 33.3 సెం.మీ. వర్షం కురిసింది. పెందుర్తిలో 28.8, గాజువాకలో 23.7, పరవాడలో 22.9 సెం.మీ. వర్షం పడింది. అడవివరంలో 31.9, న్యూ రైల్వే కాలనీలో 31.4, అప్పన్నపాలెం, ధారపాలెం ప్రాంతాల్లో 31.2 సెం.మీ. వర్షం పడింది. రైతుబజార్, కొత్తపాలెం, సింహాచలం ప్రాంతాల్లో 30 సెం.మీ. వర్షం పడింది. విశాఖ పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 24.2, గంగవరంలో 22.4, నెల్లిమర్లలో 22.1, పూసపాటిరేగలో 20.7, సబ్బవరంలో 20.2 సెం.మీ. వర్షం పడింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 451 కేంద్రాల్లో 6సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. హుద్హుద్, తిత్లీ తర్వాత మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన తుపాను గులాబ్ అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అందులో 99 శాతం మంది విశాఖ జిల్లా నుంచే ఉన్నారు. వీరికోసం 105 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 62 మండలాలపై తీవ్ర ప్రభావం వర్షాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 62 మండలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. విశాఖ జిల్లాలో 32, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 15 మండలాలు వర్షాల ధాటికి విలవిల్లాడాయి. వీటి పరిధిలో మొత్తం 375 గ్రామాల్లో ఎడతెగని వర్షాలు కురిసినట్టు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,800కు పైగా ఇళ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా విద్యుత్ శాఖ కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. విశాఖ విమానాశ్రయంలోకి నీరు భారీ వర్షానికి తోడు, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు విశాఖ విమానాశ్రయంలోకి చేరింది. పాత, కొత్త టెర్మినళ్లలో మోకాలి లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఊపిరి పీల్చుకున్న తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లాలో కుండపోత వర్షం పడినా పెద్దగా నష్టం కలిగించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కడియంలో 14 సెం.మీ, తాళ్లరేవులో 12.1, కరప, కాకినాడ అర్బన్, యు.కొత్తపల్లి, పెదపూడి, రాజమహేంద్రవరం రూరల్, ఆత్రేయపురం, అమలాపురాల్లో 10 సెం.మీ మించి వర్షం పడింది. మారేడుమిల్లి మండలంలోని చావడికోట పంచాయతీ బొడ్లంక సమీపంలోని పెళ్లిరేవు వాగు ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో లలిత అనే మహిళను ప్రసవానికి తరలించాల్సి రావడంతో ఇబ్బందులెదురయ్యాయి. రహదారి ఇవతలి వైపు అంబులెన్స్ ఉంచి స్థానికులు ఆమెను స్ట్రెచర్పై మోసుకెళ్లారు. అవతల వైపు మరో అంబులెన్స్ను ఏర్పాటు చేసి మారేడుమిల్లి పీహెచ్సీకి సకాలంలో తరలించారు. ‘పశ్చిమ’లో పొంగిన వాగులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెరిపిలేకుండా భారీవర్షాలు కురిశాయి. దెందులూరు–సానిగూడెం రహదారిలో సైఫన్ వద్ద గుండేరు వాగుకు గండి పడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దోసపాడు–కొవ్వలి గ్రామాల పరిధిలోని డ్రెయిన్లు పొంగాయి. కృష్ణాలో భారీ వర్షం కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం, జిల్లాలోనూ రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడలోని చిట్టినగర్ వద్ద కొండచరియలు విరిగి పడటంతో ఓ ఇల్లు ధ్వంసమైంది. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. జిల్లాలో అత్యధికంగా రెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడేపల్లిలో 33.25 సెం.మీ. వర్షపాతం గుంటూరు జిల్లాలో సోమవారం వేకువజామునుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. డెల్టా ప్రాంతంలో లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం 8 నుంచి తాడేపల్లిలో 33.25 సెం.మీ, మంగళగిరిలో 29.75, పెదకూరపాడులో 28.75, తాడికొండలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరంలో సీఎస్ సమీక్ష విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో 40,876.7 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగావళి, సువర్ణముఖి, గోస్తనీ, చంపావతి, గోముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నష్టాలపై సీఎస్ ఆదిత్యనాథ్దాస్ కలెక్టరేట్లో సమీక్షించారు. గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను ఆయన పరిశీలించారు. మరోవైపు తుపాను పశ్చిమంగా ప్రయాణించి బలహీన పడింది. ఇది వాయవ్య దిశగా పయనించి మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న సువర్ణముఖి ఐదుగురి మృతి.. ఇద్దరు గల్లంతు తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు ఐదుగురు మరణించారు. ఒక బాలుడి సహా ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన రైతు విజనగిరి శ్రీను నువ్వుల బుట్టలు తెచ్చుకునేందుకు పొలం వెళ్తూ గెడ్డలో పడిపోయాడు. గ్రామస్తులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. విశాఖ జిల్లా వేపగుంట నాయుడుతోట సమీపంలోని సీపీఐ కాలనీలో ఇంటిగోడ కూలడంతో దులసి భావన(31) మృతి చెందింది. కొండవాలు నుంచి వచ్చిన భారీ రాళ్లు ఇంటి ప్రహరీపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని చినముషిడివాడ సమీపంలోగల గిరిప్రసాద్నగర్–3లో కుశ్వంత్కుమార్ (7) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ విద్యుదాఘాతానికి గురై మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీ పేటకు చెందిన సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్తూరి నాగేశ్వరరావు(50) పొలం వెళుతూ పర్రెడ్డిగూడెం సమీపంలో వర్షపు నీటిలో కాలు జారి కొట్టుకుపోయారు. వర్షం తగ్గిన తర్వాత తూరలో ఇరుక్కున్న ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. గోపాలపురంలో ఇంటివద్ద నీట మునిగిన మోటర్ను ఆన్ చేస్తూ ముల్లంగి విజయభారతి (52) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా సీతానగరానికి చెందిన కోరాడ కృష్ణవంశీరెడ్డి (16) స్నేహితులతో కలిసి చేపల కోసం వెళ్లి స్టీల్ప్లాంట్ రైల్వేగేటు సమీపంలో ఉన్న కాలువలో పడిపోయాడు. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ధర్మపురి వద్దనున్న గెడ్డలో చేపలు పట్టడానికి వెళ్లిన గేదెల రామారావు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. రాత్రి వరకు గాలించినా అతడి ఆచూకీ దొరకలేదు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్ట దిగువన ఉన్న మెట్టపైకి సోమవారం గొర్రెలను మేతకు తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్యన చిక్కుకున్నాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. కొట్టుకొచ్చిన మృతదేహం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. సైదాబాద్ కృష్ణా నగర్లో వరద నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ముషీరాబాద్, భోలక్పూర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, రామ్నగర్, కవాడీగూడ, దోమలగూడలో వర్షం పడింది. విద్యానగర్, అడిక్మెట్, బోయిన్పల్లి, చిలకలగూడ, మారేడ్పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్, ప్యారడైస్, ఆల్వాల్లో భారీ వర్షం కురిసింది. (చదవండి: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు) #hyderabadrains traffic jam at #bahadurpura @HYDTP pic.twitter.com/eprDaSGYQN — DW NEWS (@dwnewshyderabad) September 20, 2021 దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపునీరు చేరింది. వాహనదారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. Situation at shahali banda after heavy rain#HyderabadRains pic.twitter.com/TqUWDn73Dq — Salam Hyderabad (@HyderabadSalam) September 20, 2021 Water logging @ #moosarambagh bridge #Hyderabad #hyderabadrains #rains #Weathercloud #WeatherUpdate @HiHyderabad @Rajani_Weather @Hyderabadrains @balaji25_t @GHMCOnline @HMWSSBOnline @TS_AP_Weather @swachhhyd @Hydbeatdotcom pic.twitter.com/HniN8rZLId — Younus Farhaan (@YounusFarhaan) September 20, 2021 వర్షం కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు వాతావరణ శాఖ సూచించింది. పాతబస్తీలో పలు చోట్ల కాలనీలు నీటమునిగాయి. జూపార్క్ ప్రాంతంలో 9.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. దూద్బౌలిలో 7.7 సెం.మీ, చార్మినార్లో 5.8 సెం.మీ, అత్తాపూర్లో 5.1 సెం.మీ, రెయిన్బజార్లో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. #Hyderabad #HyderabadRains pic.twitter.com/4jQqYBgmkK — Siddhu Manchikanti (@SiDManchikanti) September 20, 2021 #HyderabadRains #Malakpet @KTRTRS @TelanganaCMO @ActivistTeja @GHMCOnline @vinay_vangala @Rakhs2009 @charan_tweetz @shanthchandra @SrinivasBellam @SrikanthV21 @_hariyaali_ @CitizensForHyd @HiHyderabad @TOIHyderabad pic.twitter.com/KnOyRLSBFn — Charith Juluri🇮🇳 #SaveKBR #vedhafoundation (@JuluriCharith) September 20, 2021 #HyderabadRains #charminar pic.twitter.com/jx6dLTtjdn — DW NEWS (@dwnewshyderabad) September 20, 2021 చదవండి: ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ.. -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చాంద్బలికి దక్షిణంగా సోమవారం తీరం దాటింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రానున్న 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. -
ఏపీకి తప్పనున్న వాయుగుండం ముప్పు!
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు, మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2, 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వెల్లడించింది. అయితే కోస్తా తీరానికి సమీపం నుంచి కదులుతుండటంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ రెండో వారం వరకూ వర్షాలు పడే సూచనలున్నాయనీ.. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వానలకు కొండ వాగులు, వంకలు, నదులు ఉధృతరూపం దాల్చాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాక్షి, నెట్వర్క్: కృష్ణా జిల్లాలో సోమవారం 1.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు మెట్ట, డెల్టా, ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని చుట్టుముట్టాయి. ఎటపాకలో మిర్చి తోటలు నీట మునిగాయి. కాకినాడలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలోకి వర్షపు నీరు భారీగా చేరడంతో అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోట్క్లబ్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. జిల్లాలో సగటు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ శ్రీకేష్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తోటపల్లి, మడ్డువలస జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. విజయనగరం జిల్లాలో చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. చంపావతి, సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తోటపల్లి, వట్టిగెడ్డ, తాటిపూడి జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తడిసి ముద్దయింది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుండేటి వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగపాలెం మండలం యడవల్లిలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలి గొడ్డేటి నాగేశ్ (55) మృతి చెందాడు. యువతి గల్లంతు బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్లిన మనీషా వర్మ (23) అనే యువతి కొండవాగుల ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు, మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాగల రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. ఇక గురువారం మోస్తరు వర్షం పడుతుందన్నారు. కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సగటున 6.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో ఉధృతంగా వరాహ, శారదా నదులు విశాఖ ఏజెన్సీలో గెడ్డలు, కొండవాగులు, వరాహ, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం పైడపర్తికి చెందిన పాడి కన్నయ్య (41) వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అలాగే మాడుగుల మండలం గొప్పులపాలెంకు చెందిన పాగి నాగమణి (28) పిడుగుపాటుతో మృతి చెందింది. -
రేపు అల్పపీడనం.. భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లోను.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాజమండ్రిలో 7.2 సెం.మీ., అంబాజీపేటలో 7, ఎల్.ఎన్. పేటలో 6.7, తణుకులో 6.3, మచిలీపట్నంలో 6.1, మండపేటలో 5.9, అనపర్తి, పెడనలో 5.9, మచిలీపట్నంలో 5.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 12 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లాలో 5 మి.మీ. సగటు వర్షపాతం నమోదవగా, శ్రీకాకుళం జిల్లాలో 4.2, పశ్చిమగోదావరిలో 4.2, తూర్పుగోదావరిలో 3.2, విశాఖపట్నంలో 3, గుంటూరులో 1.9, కృష్ణాలో 1.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రమే వర్షపాతం నమోదవలేదు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అత్యధికంగా 73.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నర్సాపురంలో 66, తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో 65.5, విజయనగరం జిల్లా సాలూరులో 45, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో 39.8, కోరుకొండలో 36.3, సఖినేటిపల్లిలో 36, విశాఖ జిల్లా మేకావారిపాలెంలో 33.5, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో 33, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజులు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని పేర్కొంది. ఛత్తీస్గఢ్ సమీపంలో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుండగా, అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన రుతుపవన ద్రోణి శివపురి, ఛత్తీస్గఢ్, విశాఖపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆనుకుని ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో దిశను మార్చుకుని ఉత్తర దిశగా విదర్భ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. మరోవైపు.. అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వరకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయన్నారు. మత్స్యకారులెవ్వరూ రాగల 48 గంటల వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ముసునూరులో 58.5 మి.మీ, సూళ్లూరుపేటలో 55.2, చింతూరులో 52, లావేరులో 45.2, నర్సాపురంలో 40, పెడనలో 39, పాలకొండలో 34.5, రాయవరంలో 30.5, అనపర్తిలో 28.5, సీతంపేట 27.5 మి.మీ వర్షపాతం నమోదైంది. -
ఒకవైపు ఎండ.. మరోవైపు వాన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవగా, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో మంగళవారం దక్షిణ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా విశాఖ రికార్డుకెక్కింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు... ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనించే సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు జోరందుకొంటాయని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కిర్లంపూడిలో 75.25 మి.మీ, రావులపాలెంలో 72.25 మి.మీ, అయినవిల్లిలో 64.5, ఐ.పోలవరంలో 62.25, రాజమండ్రిలో 55.5, దగదర్తిలో 44.5, ఒంగోలులో 42.5 మి.మీల వర్షపాతం నమోదైంది. -
ఇక వర్షాకాలమే...
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర భారతదేశంలో అల్పపీడన ప్రాంతం.. రుతుపవన ద్రోణితో కలిసి హిమాలయాల వైపుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే రోజులు సమీపించాయి. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి, ఉభయగోదావరి జిల్లాల మీదుగా సోమవారం మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాయువ్య గాలుల ప్రభావంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో ఎండలు విజృంభించాయి. మంగళవారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
12న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్యలో బంగాళాఖాతంలోఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు పడతాయన్నారు. మరోవైపు ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయి. మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రంపై పొడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ అల్పపీడనం బలహీనపడేవరకు పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి వాయవ్య దిశగా గాలులు నెమ్మదిగా రాష్ట్రంపైకి వీయనుండటంతో వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో 80 మిల్లీమీటర్లు, వంగరలో 70, కిర్లంపూడిలో 47.25, దుగ్గిరాలలో 41, దేవరాపల్లిలో 39.25, చందర్లపాడులో 39, సత్తెనపల్లిలో 38, కురుపాం, నూజెండ్లల్లో 35, అమరావతిలో 33.5, శంఖవరంలో 33, కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మండుతున్న ఎండలు.. కారణమిదే!
సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయమిది. అందుకు భిన్నంగా వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభా వంతో వీచే గాలులు బలహీనపడటం.. నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఈ సీజన్లో పాకిస్తాన్ వైపు నుంచి వీచే గాలులు బంగాళాఖాతం మీదుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లాలి. ఈ గాలుల్లో తేమ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మేఘాలు ఏర్ప డి వర్షాలు కురుస్తాయి. వీటి ప్రభావంతో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గాలులు చాలావరకు బంగాళాఖాతాన్ని తాకకుండా నేరుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లిపోతున్నా యి. దీనివల్ల ఆ ప్రాంతంలో అల్పపీడనం, ఉపరిత ల ఆవర్తనం ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీ ర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి ఈ గాలులే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ లేకపోవడం వల్ల ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. కొద్దిగా వీస్తున్న గాలుల ప్రభావంతో అక్కడక్కడా స్వల్ప స్థాయిలో వర్షాలు పడుతున్నా.. మొత్తంగా రాష్ట్రమంతా వేడి వాతావరణం ఉంటోంది. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత పరిస్థితి కొంత మారవచ్చని అంచనా వేస్తోంది. సాధారణం కంటే 2 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు పశ్చిమ, నైరుతి దిశగా వీస్తున్న గాలుల్లో తేమ లేకపోవడం వల్ల రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. గాలులు బలహీనంగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అన్నిచోట్లా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. వారం తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావచ్చు. – డాక్టర్ స్టెల్లా, డైరెక్టర్, అమరావతి వాతావరణ కేంద్రం -
వేసవిని తలపిప్తోన్న వానాకాలం!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆగస్టులో ఇటీవల కాలంలో లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆగస్టు రెండో వారం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపారు. కోస్తా తీరం వెంబడి రానున్న 3 రోజుల్లో ఉపరితల ద్రోణి ఏర్పడనుందని..దీనికి అనుబంధంగా ఈ నెల 7న మచిలీపట్నం సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఉభయగోదావరి జిల్లాల మీదుగా కదులుతూ తెలంగాణ వైపు ప్రయాణించనుందని దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగానూ, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు వర్ష సూచనలు ఏపీలో పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాగల 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచన ఉందని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
2 నెలలు... జోరు వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైరుతి సీజన్ మొదలైన రెండు నెలలకే సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా తొలకరి సమయంలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం దాదాపు 4–5 రోజుల్లోనే నమోదైంది. అనంతరం రుతుపవనాల కదలికలు కాస్త నెమ్మదించినప్పటికీ జూలైలో తిరిగి చురుకుగా ప్రభావం చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 36.31 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... సోమవారం నాటికి 56.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరు జిల్లాల్లో రెట్టింపు వర్షపాతం... రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురవగా ఆరు జిల్లాల్లో సాధారణం కంటే రెట్టింపు వర్షాలు కురిశాయి. జగిత్యాల, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సాధారణం కంటే 100–150 శాతంఅధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వివరించింది. మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ జూన్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ కూడా 150 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవగా 18 జిల్లాల్లో అధిక వర్షాలు, 6 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్లో 107.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి కేవలం జూలైలోనే సాధారణం కంటే 57% అధికంగా వర్షాలు కురిశాయి. అత్యధికం: నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాయ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి అధికం: అదిలాబాద్, ఆసీఫాబాద్, జగిత్యాల, మహబుబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ములుగు. -
సీమ నేలపై వరుణ కరుణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వరుణుడు కరుణ జల్లులు కురిపిస్తున్నాడు. వరుసగా మూడో ఏటా కరువుతీరా వర్షం కురుస్తోంది. నేలతల్లి పులకిస్తోంది. జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో సాధారణంగా కురిసే వర్షాల కంటే 82 శాతం అధిక వర్షాలు కురవగా, కోస్తాంధ్రలో 14 శాతం అధిక వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర వరకే చూసినప్పుడు అక్కడి మూడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో సగటున 222 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 298 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు రాష్ట్ర వర్షపాత వివరాలను వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం విడుదల చేసింది. అనంతపురంలో 121.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 252 మి.మీ. (103 శాతం అధికం) కురిసింది. వైఎస్సార్ కడప జిల్లాలో 163.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 330.5 మి.మీ. (102 శాతం అధికం) కురిసింది. చిత్తూరు జిల్లాలో 173.8 మి.మీ.కిగానూ 335.5 మి.మీ. (93 శాతం అధికం).. కర్నూలు జిల్లాలో 199.5 మి.మీ.కిగానూ 283.2 మి.మీ. (42 శాతం అధికం) కురిసింది. కృష్ణాలో 45 శాతం అధికం.. కృష్ణా జిల్లాలో 314 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 456.6 మి.మీ (45 శాతం అధికం) వర్షం పడింది. గుంటూరు జిల్లాలో 241.5 మి.మీ.కిగానూ 308.4 మి.మీ. (28 శాతం అధికం), తూర్పుగోదావరి జిల్లాలో 336.9 మి.మీకి గానూ 423.5 మి.మీ. (26 శాతం అధికం), పశ్చిమగోదావరి జిల్లాలో 363.3 మి.మీ.కిగానూ 449 మి.మీ. (24 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో 143.5 మి.మీ.కిగానూ 175.7 మి.మీ. (22 శాతం అధికం), ప్రకాశం జిల్లాలో 166.9 మి.మీ.కిగానూ 186.3 మి.మీ. (12 శాతం అధికం) వర్షం పడింది. విశాఖపట్నం జిల్లాలో 297.6 మి.మీ.కిగానూ 257.5 మి.మీ. (13 శాతం లోటు) వర్షం, విజయనగరం జిల్లాలో 325.3 మి.మీ.కిగానూ 288.8 మి.మీ. (11 శాతం లోటు), శ్రీకాకుళం జిల్లాలో 340.2 మి.మీ.కిగానూ 319 మి.మీ. (6 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వాతావరణ శాఖ దాన్ని సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తుంది. దీంతో ఉత్తరాంధ్రలో సాధారణం కంటే కొంచెం తక్కువ వర్షం పడినా అది సాధారణమే. -
నేడు బలపడనున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం తీవ్రరూపం దాల్చి రానున్న మూడు రోజుల్లో పశ్చిమ దిశలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందని వివరించారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ఏపీలో పడమర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. -
రెండు రోజులపాటు వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. -
28న మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బిహార్ వైపు వెళ్లి బలహీనపడింది. దీంతో దాని ప్రభావం రాష్ట్రంలో తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. -
Andhra Pradesh : వదలని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతటా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షాలు పడ్డాయి. అమలాపురంలో అత్యధికంగా 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దీనివల్ల విద్యుత్ వైర్లు తెగి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలకోడేరు, తాడేపల్లిగూడెం, భీమవరంలలో 9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద జల్లేరు, బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం వద్ద వాగులు పొంగి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో వాగుల కల్వర్టుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో వైరా, కట్టలేరు, నల్లవాగు, మున్నేరు, వెదుళ్లవాగు.. లక్ష్మయ్య వాగు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కోతకు గురవడంతో అక్కడక్కడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. గుంటూరు నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉమెన్స్ కాలేజీ వద్ద చెట్టు కూలడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థిని గాయపడింది. రొంపిచర్ల మండలంలోని ఓగేరువాగు, నక్కలవాగు, గాడిదలవాడు, ఊరవాగు, కొండవాగు, ఏడు గడియలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, లో లెవెల్ చప్టాలపై వాహన రాకపోకలు నిలిపివేపి పోలీస్, రెవెన్యూ సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట, త్రిపురాంతకం మండలం రామచంద్రాపురంలో వర్షాలకు నానిన పాత ఇళ్లు కూలిపోయాయి. నెల్లూరు జిల్లాలో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. : కర్నూలు జిల్లాలోని మహానంది–గాజులపల్లె రహదారి మధ్య గల పాలేరువాగు పొంగటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ కొండపై పెనుగాలులు వీచాయి. సందర్శకులు ఆందోళనకు గురై గదుల్లోకి పరుగులు తీశారు. ఓ చెట్టు విరిగి పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై పడింది. విద్యుత్ తీగలు తెగి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో గురువారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలకు ఆదేశాలిచ్చింది. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ తీగలు తెగిన చోట యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఇరిగేషన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. నేడు, రేపు చెదురుమదురు వర్షాలు సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది శుక్రవారం ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో శుక్రవారం నుంచి క్రమంగా భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత అల్పపీడనం విదర్భ ప్రాంతం వైపు ప్రయాణిస్తుందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రం వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించింది. శుక్రవారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. రెండు రోజులపాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్లకు సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం కాపు నేస్తం పథకం అమలు వర్చువల్ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి తగిన సహాయ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. -
48 గంటల్లో విస్తారంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి : ఏపీ తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రా తీరం వెంబడి ఉత్తర కోస్తాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఒడిశా తీరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు ప్రభావం చూపనుంది. 22, 23వ తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరించారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/అనంతపురం: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇది బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఒకవేళ బలపడి వాయుగుండంగా మారితే ఒడిశా వైపు కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కదిరిలో రికార్డు స్థాయి వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా కదిరిలో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెనుకొండ, హిందూపురం పట్టణాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. లేపాక్షిలో 10.04 సెం.మీ., ఎన్పీ కుంటలో 9, అమడగూరులో 8.52 చిలమత్తూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పెద్దఎత్తున వర్షం నీరు చేరింది. ఓడీ చెరువు సమీపంలో ప్రధాన రహదారి తెగిపోవడంతో కదిరి, హిందూపురం, బెంగళూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సె.మీ. వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ చాలాచోట్ల వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఏపీ: రెండు రోజులు వర్షాలే..
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీనివల్ల గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. దీని ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా, కోస్తాంధ్రలో అడపాదడపాగా వానలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. సముద్రంలో తూర్పు, పశ్చిమ గాలుల కలయికతో ఏర్పడిన షియర్ జోన్ సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ. మధ్య విస్తరించి ఉంది. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల (గురు, శుక్రవారాలు) పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ముంచెత్తిన వాన.. కాలనీలు జలమయం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వాన ముంచెత్తింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురవగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. కల్వర్టులు, రోడ్లు తెగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన చెరువుల్లో నీరు భారీగా వచ్చి చేరింది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో నీరు 15 ఫీట్లకు చేరింది. పట్టణ, నగర ప్రాంత కాలనీల్లోని ఇళ్లకు వరద నీరు భారీగా చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నర్సంపేట మండలం గురిజాలకు చెందిన గడ్డం అనిల్ (38) బైక్పై గ్రామ శివారులోని లోలెవల్ వంతెన దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి నీటి ఉధృతికి అతను కొట్టుకుపోయాడు. వరంగల్ మహానగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు పొంగి పొర్లింది. అవతల చిక్కుకుపోయిన వారిని పోలీసులు జేసీబీ సాయంతో సురక్షితంగా తరలించారు. నిజామా బాద్ జిల్లా మోర్తాడ్లో ఆదివారం కురిసిన వర్షంతో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తిప్పలుపడ్డారు. ఇక, వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఇజ్రాఇట్టంపల్లిలో ఆర్అండ్బీ రోడ్డును పునఃనిర్మాణం చేసే క్రమంలో మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకంటే రెండు మీటర్ల ఎత్తు పెంచారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నర్సంపేట సర్వాపురంలోని ఓ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వర్షం కురిసింది. అత్యధికంగా హుజూరాబాద్లో 90 మి.మీ. వర్షపాతం నమోదు కాగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సండ్రవాగు పొంగిపొర్లడంతో లక్ష్మీపూర్ వెళ్లే తాత్కాలిక రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లంతకుంట మండలంలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రం భీమ్ ప్రాజెక్టు రెండుగేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం జిల్లాలో 73.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ డివిజన్లో 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన లోద్ద గంగవ్వ(50) పొలంలో నాట్లు వేస్తుండగా పిడుగుపడి మృతిచెందింది. మరో రెండ్రోజులు వర్షాలు పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితలద్రోణి ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కోస్తాకు రేపు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమను తీసుకువస్తోంది. దీనికితోడుగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 నుంచి 3.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది క్రమంగా ఛత్తీస్గఢ్ వైపు పయనించనుందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లోనూ అనకాపల్లిలో 6.7 సెం.మీ., మధురవాడలో 6.6, సూళ్లూరుపేటలో 6, కోటనందూరులో 5.7, పరవాడలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
రెండు రోజుల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఇది దక్షిణ ఒడిశా వైపు 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారతదేశం, ఒడిశా, ఛత్తీస్ఘడ్ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వల్ల గాలుల వేగం రాష్ట్రంపై పెరిగింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా.. ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నాయి. కాగా, జూలై మొదటి వారంలోనూ కోస్తా, రాయలసీమల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక నెమ్మదిగా ఉంది. వారం, పది రోజల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించే పరిస్థితి ఉందని, వర్షాలకు ఢోకా లేదని అంచనా వేస్తున్నారు. -
2 రోజుల్లో మరో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఉండగా.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. వాయవ్య జార్ఖండ్ పరిసరాలపై ఉన్న ఈ అల్పపీడనం ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్లపై ఉంది. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపుగా కదులుతుందని, దీని ప్రభావం మన రాష్ట్రంపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలకు , దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గింది. పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో రుతుపవనాల పురోగతి నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించొచ్చు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అధికారులు చెప్పారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కదలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వీటికితోడు నైరుతి రుతుపవనాల విస్తరణతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. -
నెలాఖరు నుంచి వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి అమరావతి: మండుతున్న ఎండలు, వడగాడ్పులతో గత మూడు రోజులుగా తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. అరేబియా సముద్రం నుంచి గాలులు నేరుగా వీస్తుండటంతో ఈ నెలాఖరు నుంచి వర్షాలు పడతాయని వెల్లడించారు. శనివారమూ ఎండలు, వడగాడ్పులు ఉంటాయని, ఆదివారం నుంచి వాతావరణం చల్లబడుతుందని, పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఛత్తీస్గఢ్, ఒడిశాల నుంచి మేఘాలు ఉత్తరాంధ్ర వైపు రావడంతో జూన్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకుతాయని వివరించారు. మూడో రోజూ భానుడు భగభగ రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ శుక్రవారం కూడా భానుడు భగ్గుమన్నాడు. వడగాడ్పులు విజృంభించాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండలు మంటలు పుట్టించాయి. శనివారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
Hottest Summer: ‘రికార్డు’ భగభగలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది. ఎండ భగభగలాడేలా చేసింది. తుపాను తేమగాలుల్ని తీసుకుపోవడంతో రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి. ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో మే నెలలో 43 ఏళ్ల తర్వాత.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1978 మే 19న విశాఖ నగరంలో నమోదైన 42 డిగ్రీలు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది. బుధవారం నగరంలో 42.3 డిగ్రీలు నమోదైంది. ఈనెల 30 వరకు వడగాలులు, ఎండలు ఈనెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 36 మండలాలు, కృష్ణాలోని 15, తూర్పు గోదావరిలోని 12, విజయనగరంలోని 2, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 14, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 65 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల మే 30 తర్వాత తేమగాలులు తెలంగాణ మీదుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వర్షాలు మొదలవుతాయని తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. -
Cyclone Tauktae: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: టౌటే తుపాను ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని, వివిధ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహబూబ్నగర్, నారాయణ్పేట్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల, అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. సాధారణ ఉష్ణోగ్రతలే...రాష్ట్రంలో శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు æనమోదయ్యాయి. నల్లగొండలో 42.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్లో 22.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను ప్రభావం రాష్ట్రంపైన ఉండడంతో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియవచ్చని పేర్కొంది. బుధవారం విశాఖలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చదవండి: సీఎం జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం టీడీపీ నేతకు అండగా నిలిచిన సీఎం రిలీఫ్ ఫండ్ -
Rain Forecast: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ద్రోణి విస్తరించడం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర–దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద ఇప్పటికే ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వద్ద బిహార్ తూర్పు ప్రాంతాల నుంచి ఉత్తర ప్రాంత ఒడిశా వరకు వ్యాపించి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చదవండి: అమరావతి జేఏసీ వెబినార్ అట్టర్ ఫ్లాప్ తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత -
Rain Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర–దక్షిణ ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. మరోవైపు 1.5 కిలో మీటర్ల ఎత్తులో తూర్పు బిహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీరప్రాంతమైన ఒడిశా వరకు మరో ద్రోణి వ్యాపించినట్టు తెలిపింది. చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా -
దిశ మార్చుకున్న తీవ్ర అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం దిశ మార్చుకుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్ప పీడనంగా మారి దిశ మార్చుకుంది. ఇది రాగల 24 గంటల్లో వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరానికి సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా తూర్పు–పశ్చిమ ద్రోణి వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో వాయుగుండం ప్రభావమూ ఉందని తెలిపింది. అందువల్ల సరిహద్దు జిల్లాల్లో భారీగా మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ నెల 17 నుంచి మరో రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
నేడు రాష్ట్రంలో తేలికపాటి వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో నేడు బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో తిరిగి ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో 4 సెంమీ, అనకాపల్లి, భీమిలి, పోలవరంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఏపీ: రెండురోజులు పాటు భారీవర్షాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్ వెల్లడించారు. కృష్ణా జిల్లాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తూర్పుగోదావరి: గోదావరి వరద ఉధృతి క్రమం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 14,63,902 క్యూసెక్కులుగా నమోదయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం తూర్పుగోదావరిలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం.. పశ్చిమ గోదావరిలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నీటమునిగిన పంటపొలాలు కృష్ణా జిల్లా: ఎడతెరిపిలేని వర్షాలతో కృష్ణా జిల్లాలోమున్నేరు, వైరా, కట్టలేరు, కూచివాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో కాజ్వేలపై నీరు ప్రవహిస్తోంది. పంటపొలాలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఇన్ ఫ్లో 1,20,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,12,000 క్యూసెక్కులుగా నమోదయ్యింది. 70 గేట్లను ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. ఈ రాత్రికి 1,50,000 క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధమవుతున్నాయి. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా ఒరిస్సా, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 9.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు.. నేడు, రేపు అనేక చోట్ల.. ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రేపు(ఆదివారం) ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిది. -
రైతుల్లో ‘నైరుతీ’ ఆశల మోసులు..!
సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు రైతుల్లో ఆశల మోసులు రేకెత్తిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల కంటే అధిక వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందంగా పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ నెల ఒకటో తేదీతో ఆరంభమైన ఖరీఫ్ (నైరుతీ) సీజన్లో ఇప్పటి (జూన్ 26వ తేదీ) వరకూ చూస్తే ఏడు జిల్లాల్లో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం, అయిదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ► ఒక్క చిత్తూరు జిల్లాదీ మాత్రమే 21 శాతం కంటే తక్కువ వర్షపాతంతో లోటు జాబితాలో ఉంది. (30 ఏళ్ల సగటు వర్షపాతంతో పోల్చితే..) ► జిల్లాల వారీగా చూస్తే నెల్లూరులో 58శాతం, గుంటూరు– 43, కర్నూలు–38, విజయనగరం–31, కృష్ణా–30, అనంతపురం– 23, ప్రకాశం–21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్ కడప, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
నైరుతి వచ్చేసింది
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. రుతు పవనాల ఆగమనానికి సూచికగా సోమవారం ఆ రాష్ట్రంలో చల్లని ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం సోమవారం ధ్రువీకరించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులను ఈ రుతు పవనాలు పూర్తిగా కమ్ముకున్నాయి. మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాలు, కోమెరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలవల్లే దేశంలో 50 శాతంపైగా పంటలు సాగవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అత్యధిక ప్రాంతాల్లో పంటల సాగుకు నైరుతి రుతుపవనాలే కీలకం. నేడు, రేపు వర్షాలు ఇక ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెం.మీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పిడుగులు పడి నలుగురు మృతి ఇదిలా ఉంటే.. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఎస్సీ మరువాడ గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పొలంలోని పాకలో తలదాచుకున్న సమయంలో పిడుగుపడి వీరు బలయ్యారు. వీరితో పాటు ఉన్న మరో ముగ్గురు స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే, గుంటూరు జిల్లాలో కూడా పిడుగుపడి ఓ రైతు మరణించాడు. అమరావతి మండలం అత్తలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే జిల్లా ఈపూరు మండలంలో దాదాపు రెండు కేజీల బరువు ఉండే వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది 102శాతం వర్షపాతం ఈ సీజన్ (జూన్–సెప్టెంబర్)లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్లు ఐఎండీ సోమవారం ఢిల్లీలోనూ, అమరావతిలోనూ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా మీడియా సమావేశంలో వివరించారు. ప్రాంతాల వారీగా, నెలల వారీగా కూడా దీర్ఘకాలిక వర్షపాత అంచనాలను ఐఎండీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం వర్షపాతం నమోదవుతుంది. ఈ అంచనాలో తొమ్మిది శాతం అటూ ఇటుగా తేడా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. దక్షిణాది రాష్ట్రాల్లో 102 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. కాగా, ఈ నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. -
భగ భగలే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వడగాడ్పులు హడలెత్తించాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బాపట్ల, జంగమహేశ్వరపురంలలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉంపన్ పెను తుపాను కారణంగా.. గాలిలోని తేమంతా తుడిచిపెట్టుకుపోవడం వల్లే రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రానున్న రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఉంపన్ పూర్తిగా బలహీనపడింది. ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. కాగా, విపరీతమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై విశాఖ జిల్లాలో శుక్రవారం ఒకరు మరణించారు. జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన గరికి గాటీలు(60) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. పవర్..హీట్! రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తాజా పరిస్థితిని శుక్రవారం సమీక్షించిన ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండు వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ► రాష్ట్రంలో చాలా చోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ట్రాన్స్ ఫార్మర్లను చల్లబరచే ఆయిల్ను తరచూ పరిశీలించాలి. కాలిపోయినా, వేడితో మొరాయించినా తక్షణమే మార్చాలి. ► ఉష్ణోగ్రతల పెరుగుదలతో విద్యుత్ తీగలు సాగుతుంటాయి. గాలి దుమారం సమయంలో తీగలు రాసుకుని ప్రమాదం సంభవించే వీలుంది. ఇలాంటి వాటిని గుర్తించి తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలి. ► లోడ్ పెరగడం వల్ల గ్రిడ్లో సమస్యలు తలెత్తకుండా లోడ్ డిస్పాచ్ సెంటర్ అప్రమత్తంగా ఉండాలి. ► పీక్ అవర్స్లో విద్యుత్తు వాడకం అత్యధికంగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 9 వేల మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఏసీలు, కూలర్ల వినియోగమే దీనికి ప్రధాన కారణమని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ► విద్యుత్ డిమాండ్ గత రెండు రోజులుగా వేగంగా పెరుగుతోంది. శుక్రవారం 187 మిలియన్ యూనిట్లు నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే ఇది 13 మిలియన్ యూనిట్లు ఎక్కువ. ఉత్పత్తి సంస్థలు, డిస్కమ్లు, ఎస్ఎల్డీసీల మధ్య సమన్వయం పెరగాలి. ► ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగమే పెరుగుతోంది. ఈ నెలాఖరులోగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పెరిగితే విద్యుత్ డిమాండ్ రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది. ► మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కుదరని పక్షంలో ధర్మల్ విద్యుత్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. జెన్కో ప్లాంట్ల వద్ద 15 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెన్కో అధికారులు తెలిపారు. -
తెలంగాణకు వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల వరకు అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేడు,ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (30 నుంచి 40 కి.మీ.) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 42 నుండి 44 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
తెలంగాణకు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ కోస్తా తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కోమరంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఈ సమ్మర్..సుర్రు
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఈసారి వేసవిలో హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సూచకంగా కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరంలో ఫిబ్రవరి ప్రారంభంలోనే అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండెక్స్) ‘7’పాయింట్లకు చేరుకోవడంతో ఉక్కపోత, చర్మం, కళ్ల మంటలతో సిటిజన్లు విలవిల్లాడుతున్నారు. సాధారణం గా ఈ నెలలో యూవీ సూచీ 5 పాయింట్లకు మించరాదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో యూవీ సూచీ 12 పాయింట్లు చేరుకునే ప్రమా దం పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ఫిబ్రవరిలోనే వికిరణ తీవ్రత పెరిగి ఒళ్లు, కళ్లు మండిపోతున్నాయని హైదరాబాదీలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగే ‘యూవీ’తో ఇక్కట్లు.. యూవీ ఇండెక్స్ పెరగటంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. కిరణాలు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ఎండలో ఎక్కువసేపు తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటివి తలెత్తుతున్నాయి. యూవీ సూచీ సాధారణంగా 5 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులుండవు. 10 పాయింట్లు నమోదైతే ప్రమాదం తథ్యం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్ స్కిన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుగు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. హరితహారం పనిచేయలేదు.. మహా నగరాన్ని గ్రీన్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. నగరంలో గ్రీన్బెల్ట్ను గణనీయంగా పెంచేందుకు దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కల్లో 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని.. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో గ్రీన్బెల్ట్ 15 శాతానికి పెరగటం అసాధ్యమని అంటున్నారు. గ్రీన్బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. హరితం తగ్గుముఖం.. శతాబ్దాలుగా తోటల నగరం (బాగ్) గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగై పర్యావరణం వేడెక్కుతోం ది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్బెల్ట్ ఉండాల్సి ఉండగా.. నగరంలో కేవలం 8 శాతమే ఉండటంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటిజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రీన్బెల్ట్ శాతం పలు మెట్రో నగరాల్లో ఇలా.. స్థానం నగరం హరితం శాతం 1 చండీగఢ్ 35 2 ఢిల్లీ 20.20 3 బెంగళూరు 19 4 కోల్కతా 15 5 ముంబై 10 6 చెన్నై 9.5 7 హైదరాబాద్ 8 -
రేపటి నుంచి అకాల వర్షాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ వర్షాలు ప్రారంభమవుతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల పాటు నిరవధికంగా ఈ వాతావరణం నెలకొని, మర్నాడు బుధవారం వరకు వర్షం కురుస్తుందన్న స్పష్టమైన సమాచారాన్ని స్కైమెట్ వెదర్.కామ్ సంస్థ తెలిపింది. ఈ నెల 30వ తేదీన ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్ష సూచన జారీ అయింది. రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టిన అనంతరం వర్షం పుంజుకుంటుంది. ఈ నెల 28వ తేదీన స్వల్ప స్థాయి నుంచి మోస్తరు స్థాయి వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగ కేంద్రం పేర్కొంది. కటక్, అంగుల్, ఢెంకనాల్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, ఝార్సుగుడ, మయూర్భంజ్, కెంజొహర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షపు జల్లులు కురుస్తాయి. మయూర్భంజ్, కెంజొహర్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా ప్రాంతాల్లో ఈ అకాల వర్షాలు కురుస్తాయి. ఈ నెల 30వ తేదీ రాత్రి ఉష్ణోగ్రత క్రమంగా 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని వాతావరణ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. -
వణికిస్తున్న చలి గాలులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాదిన మొదలైన చలి తీవ్రత రాష్ట్రానికీ విస్తరిస్తోంది. ఇక్కడి ప్రజల్ని గజగజా వణికిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వీస్తున్న గాలుల కారణంగా ఏర్పడుతున్న శీతల ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విలోమ పొర (ఇన్వర్షన్ లేయర్) ఏర్పడి.. కాలుష్యంతో కూడిన పొగమంచు కురుస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు అధిక పీడన ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 4 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కలవరపెడుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గటం.. దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి పెరిగింది. అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పాటు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల పెద్ద భేదమేమీ లేకపోయినా.. చలిగాలుల వల్ల ఈ వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు. సాధారణం కంటే 5 డిగ్రీలకు మించి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్)గా ప్రకటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగాల్సింది పోయి తగ్గిపోతుండటంతో చలి తీవ్రత అధికమవుతోంది. ఆ పొరతో ప్రమాదం విలోమ పొరతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మాదిరిగా.. కింది నుంచి వెళ్లే నీటి ఆవిరి, కాలుష్యం, దుమ్ము, ధూళి కణాలన్నీ కలిసి విలోమ పొర కారణంగా మధ్యలోనే ఆగిపోయి పొగమంచులా ఏర్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. విలోమ పొర అంటే.. సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ.. వాతావరణంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఉపరితలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉండగా.. పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీన్నే విలోమ పొర (ఇన్వర్షన్ లేయర్) అని పిలుస్తారు. -
తీవ్ర తుపానుగా బుల్బుల్
సాక్షి, విశాఖపట్నం : తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్బుల్.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది.తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బుల్బుల్ తీవ్రరూపం దాలుస్తున్నందున విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక, కాకినాడ, గంగవరం పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండనున్నందున మత్స్యకారులెవరూ శుక్రవారం వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం కేసముద్రం (మహబూబాబాద్) 7 సెం.మీ., పైడిపల్లి (వరంగల్ అర్బన్) 7 సెం.మీ., అమ్మనగల్(మహబూబాబాద్) 7 సెం.మీ., కట్టంగూర్ (నల్లగొండ) 7 సెం.మీ., ఎల్లంకి (యాదాద్రి భువనగిరి) 6 సెం.మీ., బొమ్రాస్పేట (వికారాబాద్) 6 సెం.మీ., కమ్మర్పల్లి (నిజామాబాద్) 5 సెం.మీ., రంగంపల్లి(పెద్దపల్లి) 5 సెం.మీ., ఓదెల (పెద్దపల్లి) 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాగల మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. -
వాన కురిసె.. చేను మురిసె..
సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతం లోటు... ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. గమనిక: +19 % నుంచి –19% వరకు ఉంటే సాధారణ వర్షపాతం కింద, +20%, ఆపైన ఉంటే అధిక వర్షపాతం కింద, –20 % నుంచి –59 % వరకు ఉంటే లోటు వర్షపాతం కింద, –59 % నుంచి –99 % వరకు ఉంటే భారీ లోటు వర్షపాతం కింద పరిగణిస్తారు) -
ఒమన్ వైపు ‘వాయు’ గమనం
అహ్మదాబాద్: గుజరాత్ను భయపెట్టిన ‘వాయు’ తుపాను తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలో అల్లకల్లోలం రేపుతున్న ఈ తుపాను ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. అయినప్పటికీ, గుజరాత్ తీరం వెంబడి వర్షాలు, గాలుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ‘వాయు’ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ‘వాయు’ గమనం మార్చుకున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపినప్పటికీ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పాఠశాలలు శుక్రవారం కూడా మూసే ఉంటాయని ప్రకటించారు. ‘వాయు’ దిశ మారినప్పటికీ సౌరాష్ట్ర తీరం వెంబడి రాగల 24 గంటల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వాయు తుపాను ప్రభావం తొలగిపోయినట్లు భావించలేమని అధికార వర్గాలు చెప్పాయి. వాయు ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపాయి. పోర్బందర్లోని 150 ఏళ్ల నాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం తీవ్ర గాలులు, భారీవర్షం ధాటికి కుప్పకూలిందని వెల్లడించాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 86 రైళ్లను రద్దు చేసి, 37 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించింది. -
గుజరాత్కు ‘వాయు’ గండం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరభారతంలో ఒక వైపు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడుతుండగా మరోవైపు ‘వాయు’తుపాను గుజరాత్ వైపు ప్రచండ వేగంతో దూసుకువస్తోంది. గుజరాత్ తీరంలోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతంపై ‘వాయు’ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని, భారీ వర్షాలు కురియడంతోపాటు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తీరం ప్రాంతాల్లోని పది జిల్లాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నావికా దళం, వాయుసేన ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రభుత్వం, స్థానిక విభాగాలు అందించే సూచనలు, సలహాలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ట్విట్టర్లో కోరారు. వాతావరణ శాఖ హెచ్చరిక ‘వాయు’తుపాను అతితీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్బందర్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూల మధ్య గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. తీరం దాటిన తర్వాత తుపాను సాధారణంగా బలహీన పడుతుంది. ఇందుకు విరుద్ధంగా, ‘వాయు’మరింత తీవ్రంగా మారనుందని తెలిపింది. వెరావల్కు దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘వాయు’ గురువారం మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని తాకే అవకాశ ముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి తీరాన్ని తాకుతాయని తెలిపింది. అధికార యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికలతో గుజరాత్, డయ్యూ యంత్రాంగాలతోపాటు కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ సహాయ దళం(ఎన్డీఆర్ఎఫ్), సైన్యం ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. యుద్ధ నౌకలు, నావికా దళ విమానాలను కూడా సిద్ధం చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పోర్బందర్, డయ్యూ, భావ్నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్పోర్ట్లను 13వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని బస్ సర్వీసులను రద్దు చేసింది. విద్యా సంస్థలకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. ఇప్పటికే 70 రైళ్లు రద్దుచేశారు. వచ్చే రెండు రోజులపాటు కొన్ని రైళ్లను రద్దు చేయడమో లేక దారిమళ్లించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబైకి రాకపోకలు సాగించే 400 విమానాలకు అంతరాయం కలిగింది. జామ్నగర్కు విమానంలో బయల్దేరిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు -
రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతా ల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. గల్ఫ్ ఆఫ్ మార్ట్ బాన్ నుంచి దక్షిణ కోమోరిన్, మాల్దీవుల ప్రాంతం వరకు ఏర్పడిన షియర్ జోన్ కూడా బలహీనమైంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారి రాజా రావు తెలిపారు. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ల్లో 45 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీల చొప్పున, భద్రాచలం, హైదరాబాద్, మహబూబ్నగర్, రామగుండంల్లో 43 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మెదక్లో మాత్రం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో ఎండ, వాన.. హైదరాబాద్లో ఆదివారం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓ వైపు మబ్బులు పట్టి, అక్కడక్కడా చిరుజల్లులు కురిసినా, మరోవైపు ఎండ దంచే సింది. ఆదివారం నగరంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం కావటం విశేషం. -
జూన్ 11న రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉం డాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై బుధవారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వడగాడ్పు లు ఇంకా కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవసరమైన హెచ్చరికలు పంపాలని ఆదేశించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, తెలంగాణలో జూన్ 10 లేదా 11న చేరుకునే అవకాశం ఉంద న్నారు. అధిక వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంట్రోల్ రూంల ద్వారా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ శాఖ ద్వారా ప్రాంతాల వారీగా వర్షం వచ్చే వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు, పట్టణాలలో అత్యధిక వర్షాలు కురిసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు ఇచ్చారు. వివిధ శాఖల కంట్రోల్ రూంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతోపాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షపాత వివరాలు రోజువారీగా జిల్లాలకు పంపిస్తామని, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమీక్షించడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రైల్వే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించామని.. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. 195 బృందాల ఏర్పాటు.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధిలో 195 సంచార బృందాలను ఏర్పాటు చేశామని సంస్థ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఫ్లడ్ మ్యాప్స్ రూపొందిస్తున్నామని, విపత్తుల నిర్వహణ బృందాలు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. నాలాల పూడికతీతను జూన్ 6 నాటికి పూర్తి చేస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పట్టణ, గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కూలిన చెట్ల తొలగింపునకు చర్యలతోపాటు అవసరమైన హెలీప్యాడ్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆర్అండ్బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. గోదావరి నది పరీవాహక పరిధిలో ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కరకట్టలను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు తెలిపారు. -
47.8 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్ద ఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఆదివారం 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్లో 17, హైదరాబాద్లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 20 గ్రామాల్లో వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది. జగిత్యాల మండిపోతోంది... రాష్ట్రంలో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 20 గ్రామాల్లో 9 గ్రామాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. «జిల్లాలోని దర్మపురి, వెలగటూరు, బీర్పూరు, జగిత్యాల రూరల్, సారంగపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో సూర్యప్రతాపం ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 47.5 నుంచి 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఎండలు 47 డిగ్రీలు దాటిపోయాయి. తేమ తగ్గుతోంది... మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో గాలిలో తేమ శాతం 17 శాతానికి పడిపోయింది. హైదరాబాద్లో 20, ఆదిలాబాద్లో 22, రామగుండంలో 27, ఖమ్మం, మహబూబ్నగర్లో 28 శాతానికి పడిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎండకు బయటికి వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కాసేపు ఎండలో ఉంటేనే తీవ్ర తాపానికి గురవుతుండటం గమనార్హం. అయితే, మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. మండే ఎండలు, వడగాడ్పులు, తేమ శాతం వాతావరణంలో తక్కువ కావడం కొనసాగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమ్మో..యూవీ సెగ! ►ప్రమాదకరస్థాయిలో అతినీలలోహిత వికిరణ(యూవీ) ఇండెక్స్ ►12 పాయింట్ల గరిష్టానికి చేరుకున్న వైనం ప్రచండ భానుడి ‘వికిరణ’ తీవ్రతకు గ్రేటర్వాసులు హడలిపోతున్నారు. మహానగరంలో ఇప్పుడు అతినీలలోహిత వికిరణం (అల్ట్రావయొలెట్ రేడియేషన్–యూవీ) తీవ్రత గరిష్టంగా ‘12’పాయింట్లకు (పూర్తిస్థాయి గరిష్టం) చేరుకుంది. సెగ.. భగలతో హైదరాబాద్ నగరవాసులు విలవిల్లాడుతున్నారు. సాధారణంగా మే నెలలో యూవీ సూచి 10 పాయింట్లకు మించరాదు. కానీ ఈసారి 12 మార్కుకు చేరుకుంది. ఈ ట్రెండ్ మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం శాతం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీట్, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో నగరంలో వికిరణ తీవ్రత పెరిగింది. యూవీ సెగ..భగలతో అవస్థలివీ... ►అతినీలలోహిత వికిరణ తీవ్రత(యూవీ ఇండెక్స్)పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ►ఈ కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరడంతోపాటు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులు ప్రబలుతాయి. ►అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయి. ►యూవీ సూచీ సర్వసాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ 12 పాయింట్లు నమోదయితే చర్మం, కళ్లకు ప్రమాదం తథ్యం. ►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదివారం నగరంలోని మాదాపూర్లో గరిష్టంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ►దేశంలోని గ్రేటర్ నగరాల్లో హైదరాబాద్లోనే అత్యంత తక్కువ గ్రీన్బెల్ట్ 8 శాతానికే పరిమితం అయింది. ఇలా చేస్తే మేలు... నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, కాలుష్యం బాగా తగ్గుతుంది. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. వడదెబ్బతో ఎనిమిది మంది మృతి ఖమ్మం: ఎండలకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సూర్యప్రతాపం నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. దమ్మపేట మండల కేంద్రంలోని అర్బన్కాలనీకి చెందిన గుంజి వెంకమ్మ (62), ప్రకాష్నగర్ కాలనీకి చెందిన బడుగు నాగశిరోమణి (60), టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన మేడ మల్లయ్య (70), కామేపల్లి మండల కేంద్రానికి చెందిన మంచాల చిట్టెమ్మ (50), ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఎస్కే యాకూబ్మియా (70), వేంసూరు మండలం దుద్దెపూడి గ్రామానికి చెందిన పర్సా లక్ష్మీనారాయణ (32), జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన తోట భిక్షం (70), జవ్వాది లింగమ్మ(81) మృత్యువాత పడ్డారు. ఎండలు అప్.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఆదివారం 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తేమ డౌన్.. నిజామాబాద్ జిల్లాలో గాలిలో తేమ శాతం 17శాతానికి పడిపోయింది. హైదరాబాద్లో 20, ఆదిలాబాద్లో 22, రామగుండంలో 27, ఖమ్మం, మహబూబ్నగర్లో 28 శాతానికి పడిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎండకు బయటికి వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. -
సూపర్ సైక్లోనే..!
సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను అంతకంతకు తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు ఉధృతమవుతోంది. ఊహించిన విధంగానే సూపర్ సైక్లోన్గా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను వాయవ్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి చెన్నైకి ఆగ్నేయంగా 910, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగాను, అనంతరం 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను మారనుంది. ఇలా మే ఒకటో తేదీ సాయంత్రం వరకు క్రమంగా వాయవ్య దిశగా పయనించనుంది. ఆ తర్వాత మలుపు (రీకర్వ్) తీసుకుని ఉత్తర ఈశాన్య దిశలో కదులుతుంది. మే ఒకటో తేదీన సూపర్ సైక్లోన్ (ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్)గా బలపడనుందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. తీవ్ర తుపానుగా ఉన్న సమయంలో బంగాళాఖాతంలో గంటకు 110–125, అతి తీవ్ర తుపానుగా మారాక 130–155, సూపర్ సైక్లోన్ అయ్యాక 160–195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. అదే సమయంలో కోస్తాంధ్ర, పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ‘ఫొని’ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 2వ నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 30 నుంచి ‘ఫొని’ ప్రభావం! తుపాను ప్రభావం ఈనెల 30 నుంచి రాష్ట్రంపై కనిపించనుంది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మే 2వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖ ఏజెన్సీలో వర్షాలు విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి. హుకుంపేట, డుంబ్రిగుడ, అరుకులోయ మండలాల్లో వర్షం పడింది. మిగిలిన ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మధ్యాహ్నం మాత్రం తీవ్రమైన ఎండతో జనం అవస్థలు పడ్డారు. కాగా శనివారం వీచిన గాలులతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నర్సీపట్నం ప్రాంతంలో ఆదివారం కూడా సరఫరాను అధికారులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోయారు. వానలకు బదులు ఎండలు.. వాస్తవానికి తుపానులు వచ్చినప్పుడు భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తుపానుకు మాత్రం వానలకంటే ఎండలే ఎక్కువగా ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తుపాను వాయవ్య దిశగా పయనించడం వల్ల అటు నుంచి వీస్తున్న వేడిగాలులను తుపాను శక్తి రాష్ట్రంపైకి లాక్కుని వస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు, నాలుగు రోజులు సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. -
రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో గురువారం అల్పపీడనం ఏర్పడి తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఇది తర్వాతి 24 గంటలలో తీవ్రంగా మారి హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మరఠ్వాడా నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. -
మార్చిలోనే మంటలు
ప్రచండ భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన తడాఖా చూపుతున్నాడు. ఎండలతో జనాలను ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ఇండెక్స్ (యూవీ) సూచీ ‘పది’పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ యూవీ ఇండెక్స్ అంటే.. రోజులో ఏదైనా ప్రాంతంలో, సమయంలో మానవ చర్మం మంటపుట్టించే అతినీల లోహిత కిరణాల తీవ్రతను (వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద) యూవీ ఇండెక్స్గా పరిగణిస్తారు. సూచీ తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్ 6 ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్బర్న్ (చర్మం మంటపుట్టడం) వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచీ 12 కనుక ఉంటే 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచీని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచీ ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తుంటాయి. సమస్యలు.. పరిష్కారాలు యూవీ ఇండెక్స్ పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఓజోన్ రక్షణ లేక మనుషులపై నేరుగా పడటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మంట పుట్టడం, రెటీనా దెబ్బతినడం జరుగుతాయి. యూవీ సూచీ సాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఇబ్బందులు ఉండవు. 10 పాయింట్లు నమోదైతేనే ప్రమాదం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో సన్స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని సూచిస్తున్నారు. పలు మెట్రోనగరాల్లో హరితం ఇలా.. దేశంలో 35% గ్రీన్బెల్ట్తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 20.2%, గ్రీన్సిటీగా పేరొందిన బెంగళూరులో 19%, కోల్కతాలో 15%, ముంబైలో 10%, చెన్నైలో 9.5% గ్రీన్బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్లో మాత్రం 8 శాతానికే పరిమితం కావడంపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో తగ్గుతున్న హరితం.. హైదరాబాద్ను గ్రీన్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. గ్రీన్బెల్ట్ను గణనీయంగా పెంచేందుకు దోహదపడలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని పేర్కొంటున్నారు. గ్రీన్బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే మేలు.. - ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. - సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వాలి. - నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్బెల్ట్ ఉం డాలి. లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. -
షికాగో థెరిస్సా
గడ్డ కట్టించే చలిలో అందరూ సొంత భద్రత చూసుకుంటారు.కాని ఆమె మాత్రం రోడ్డుపై నివసించే వారి కోసం ఏకంగా హోటల్ రూములే బుక్ చేసింది. చికాగోలో మొన్నటి బుధవారం నుంచి జీవితం తెల్లబోయింది. పనులు గడ్డకట్టాయి. ఉత్తర ధ్రువపు మంచు ఫలకాలపై చోటు చేసుకున్న వాతావరణమార్పు అమెరికాలోని కొన్ని నగరాలను వొణికించడం మొదలెట్టింది. ముఖ్యంగా చికాగోని. వాతావరణ శాఖ వెంటనే హెచ్చరికలు మొదలెట్టింది. బయట పది నిమిషాలు నిలుచున్నా మంచుకాటు తప్పదని భయపెట్టింది. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 27 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కొంచెం ధైర్యం ఉన్న జనం బయట ఆటలకు ప్రయత్నించారు. బయట గుడ్డు పగలకొట్టి ఆమ్లెట్ వేయడం అసంభవం అని నిరూపించారు. గుడ్డు పగలగొట్టిన మరుక్షణం అది గడ్డకట్టుకుపోతే ఆమ్లెట్ ఎలా వేయడం? వేడి నీళ్లను తీసుకొచ్చి బయటకు చిమ్మితే ఆ నీళ్లు కిందపడేలోపు ఐసుగడ్డలుగా మారుతున్నాయి. ఎవరో వండిన నూడుల్స్ బయటకు తెచ్చి ఫోర్క్తో పైకి ఎత్తితే నూడుల్స్ బిగుసుకుపోయి వాటిని చుట్టుకున్న ఫోర్క్ గాలిలో నిలబడింది. జనం ఇలా ఎవరి గొడవల్లో వారు ఉన్నారు. కాని ఒక్క మహిళ మాత్రం తానొక మనిషినని ఇది సాటి మనుషులకు సాయం చేయాల్సిన సమయం అని గుర్తించింది.ఆమె పేరు కాండిస్ పేనె. వయసు 36. షికాగోలో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో మామూలు ఉద్యోగి. ఆమె రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో రోడ్డు పక్క డెబ్బై ఎనభై మంది పేవ్మెంట్ మీద నివసించే వారిని గమనించేది. వారంతా అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ ఏరియాలో స్థానికులు ‘టెంట్ సిటీ’ అంటారు. ఇప్పుడు మారిన వాతావరణానికి పెద్ద పెద్ద భవంతులలో ఉన్నవారే వొణికే పరిస్థితి ఉంటే మంచు కమ్ముకుంటున్న ఈ రాత్రి వీరికి ఆసరా ఎవరు అనే ఆలోచన కాండిస్ పేనెకు వచ్చింది. బుధవారం రాత్రి వాళ్లు కనుక పేవ్మెంట్ల మీద ఉంటే గడ్డకట్టుకుని చనిపోతారని ఆమెకు అర్థమైంది. వాళ్లను తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేందుకు హోమ్ లేదు. తన ఇల్లు చాలదు. అందుకని తన దగ్గర ఉన్న డబ్బుతో వారికి హోటల్ రూములు బుక్ చేయాలని అనుకుంది. ఆ ప్రాంతంలో ఎన్ని హోటళ్లకు ఫోన్ చేసినా పేవ్మెంట్ మనుషులను తమ హోటల్లోకి రానివ్వమని చెప్పారు. కాని ఒక్క హోటల్ ‘అంబర్ ఇన్’ అందుకు అంగీకరించింది. వెంటనే ఒక్క రోజుకు 70 డాలర్ల లెక్కన కాండిస్ అందులో 20 గదులు బుక్ చేసింది. అంతే కాదు తన ట్విట్టర్ అకౌంట్లో ‘నేను ఇలా రూములు బుక్ చేశాను. టెంట్ సిటీలో ఉన్న దిక్కులేని వారిని కాస్త హోటల్ వరకూ తెచ్చి వదిలిపెట్టండి’ అని నగర వాసులను అభ్యర్థించింది. అంతే. దానిని చూసిన సహృదయులు వెంటనే స్పందించారు. వెంటనే సాయానికి ముందుకు వచ్చారు. డబ్బులు తమకు తామే అంబర్ ఇన్ హోటల్కు పంపడం మొదలెట్టారు. బుధవారం నుంచి ఆదివారం వరకు (మంచు తుఫాను అధికంగా ఉంటుందని తెలిసిన ఐదు రోజులు) యాభై రూములు బుక్ అయ్యాయి. అంతే కాదు టెంట్ సిటీలో ఉన్న 80 మందినే కాక మరో ముప్పై నలభై మంది దిక్కులేనివారిని తీసుకొచ్చి హోటల్లో పెట్టారు.‘మొదట వాళ్లు టెంట్లను వదిలి రావడానికి సిద్ధపడలేదు. మా వస్తువులు పోతాయి అన్నారు. పోయిన వస్తువులకు కూడా డబ్బు ఇస్తాను అని వారిని తీసుకొచ్చాను’ అంది కాండిస్.మంచి మనసుతో ఒకరు ప్రయత్నిస్తే దానికి అందరూ తోడవుతారనేదానికి ఉదాహరణగా చాలామంది ఇప్పుడీ నిరుపేదల ఆహారానికి ఏర్పాట్లు చేశారు. దుస్తులు అందచేశారు. కాండిస్ని ప్రశంసలతో ముంచెత్తారు.‘నేను మామూలు మనిషిని. ఇదంతా నాకు కొత్త. కాని ఈ పని చేశాక ఇలా రోడ్డు మీద నివసించేవారి కోసం శాశ్వతంగా ఒక హోమ్ నిర్మించాలని తలంపు మాత్రం వచ్చింది’ అంది కాండిస్.ప్రభుత్వాలే అన్నీ చేయవు. ప్రభుత్వాలకు అన్నీ తెలిసే వీలు ఉండదు.కాని తెలిసిన మనుషులం వెంటనే సాయానికి దిగాలని కాండిస్ని చూస్తే అనిపిస్తుంది.అన్నార్తుల కోసం దిగి వచ్చిన నల్ల థెరిసా అని కూడా అనిపిస్తుంది. -
ముంచుకొస్తున్న ‘పెథాయ్’ ముప్పు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెనుతుపానుగా మరే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకువస్తున్న వాయుగుండం చెన్నైకి 910 కిలోమీటర్ల దూరంలో.. శ్రీహరికోటకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆధికారులు తెలిపారు. ఈ నెల 17న మధ్యకోస్తా వద్ద తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ తుపాన్కు పెథాయ్ తుపాన్గా నామకరణం చేశారు. (కోస్తాకు ‘పెథాయ్’ ముప్పు!) సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడుతున్నాయని తెలిపారు. తుపాన్ మార్పులను అనుక్షణం గమనిస్తున్నామని అన్నారు. తుపాన్ వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఆధికారులు తెలిపారు. పరిష్కారం వేదిక 1100 కాల్ సెంటర్ నుంచి తుపాన్ జాగ్రత్తల సందేశాలు జారీ చేస్తామని చెప్పారు. తుపాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్లో ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా 48 వేల మంది మత్స్యకారులకు ఫోన్లు పంపిణీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో చేపల వేటకు మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. తుపాన్ నేపథ్యంలో రాత్రంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఇది క్రమంగా బలపడి రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. తదుపరి 72 గంటలలో ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్ర ప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాలవైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. -
తమిళనాడు..‘గజ’ గజ!
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: తీవ్ర తుపానుగా మారిన ‘గజ’ సైక్లోను తమిళనాడు వైపు దూసుకొస్తోంది. శుక్రవారం వేకువజామున ఆ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తోంది. నాగపట్నానికి 140 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుపాను.. కడలూరు, పాంబన్ మీదుగా ముందుకు కదులుతోంది. ఆ తీరం వెంబడి ఉన్న కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పొరుగున ఉన్న పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురు, శుక్రవారం ఆ ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. గురువారం సాయంత్రానికే దుకాణాలు, కార్యాలయాలు మూతపడడంతో ఆ జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీదుగా కడలూరు–చెన్నైని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. అలాగే, చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే రైళ్లు కొన్ని రద్దు కాగా, మరికొన్ని విరుదాచలం వైపు మళ్లించారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సిబ్బందిని సన్నద్ధం చేశారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది. కోస్తాకు తప్పిన ‘గజ’ ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గజ తుపాను ముప్పు తప్పింది. తుపాను ప్రభావం ఈ రెండు ప్రాంతాలపై తప్పకుండా ఉంటుందంటూ కొద్దిరోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత నెల్లూరు–చెన్నైల మధ్య అది తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే క్రమేపీ తుపాను తన దిశ మార్చుకుంటూ తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో కోస్తా, రాయలసీమకు గజ ముప్పు తొలగిపోయినట్లయింది. -
తీవ్రంగా మారనున్న ‘గజ’ తుఫాన్
సాక్షి, చెన్నై: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గజ తుఫాన్ 759 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది. కావునా సముద్రంలోకి చేపల వేటగాళ్లు, జాలర్లు ఎవరు వేటకు వెళ్లకుడదని తీరంవెంబడి ఈదురుగాలులు వీచి అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడలురు రేవులలో మూడో నెంబర్ హెచ్చరికలు జారి చేసింది. -
నైరుతి సీజన్ ముగిసింది
న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటున 9 శాతం లోటు వర్షపాతం నమోదయిందని వెల్లడించింది. బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాలతో సగటు కన్నా తక్కువ వర్షమే కురిసిందని తెలిపింది. అనుకున్నదాని కంటే మూడు రోజులు ముందుగా కేరళలో మే 28న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం నుంచి వీటి నిష్క్రమణ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి నైరుతి రుతుపననాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 91 శాతం వర్షపాతం నమోదయిందనీ, ఇది అంచనా వేసిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. తూర్పు, ఈశాన్య భారతంలో అత్యధిక లోటు వర్షపాతం నమోదుకాగా, సెంట్రల్ ఇండియా, వాయవ్య రాష్ట్రాలు లోటు వర్షపాతంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ నెలలో 95 శాతం, జూలైలో 94 శాతం, ఆగస్టులో 92 శాతం వర్షపాతం సంభవించింది. ఇక సెప్టెంబర్లో అయితే వర్షపాతం ఏకంగా 76 శాతానికి పడిపోయింది. -
రానున్న మూడురోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల వచ్చే మూడ్రోజుల పాటు తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయానికి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ మధ్య వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం వల్ల ఈ నెల 19 వరకు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే 24 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో భూపాలపల్లిలో 19 సెంటీమీటర్లు, కొమురంభీం జిల్లాలో 17 సెం.మీ., ఆసిఫాబాద్లో 13 సెం.మీ., కాళేశ్వరంలో 11 సెం.మీ., ఉట్నూర్, ఆదిలాబాద్లో 11 సెం.మీ., మంచిర్యాల చెన్నూర్లో 11సెం.మీ., పెద్దపల్లి, మంథనిలో 11 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్లో 6 సెం.మీ., రాజన్న సిరిసిల్లలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించింది. -
జోరు వర్షం..
కరీంనగర్ సిటీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న ముసురు శనివారంతో ఊపందుకుంది. ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా అన్నిమండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధింగా రామడుగు, చొప్పదండి మండలాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాల సూచన మేరకు సహాయ, పునరావాస చర్యలకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనాను ప్రభుత్వం నియమించింది. ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన రైతుకు వరుణుడు కరుణ చూపాడు. వివిధ పంటలపై ఆశలు వదులుకున్న పరిస్థితుల్లో ఆదుకున్నాడు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మెట్ట పంటలకు ప్రయోజనం చేకూర్చాయి. అయితే ముంచెత్తిన వర్షాలతో పలుచోట్ల పంట చేలల్లో నీరు చేరి మునిగిపోయాయి. చొప్పదండి, గంగా ధర, రామడుగు, వీణవంక, హుజూరాబాద్, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పత్తి, వరి పొలాల్లో నీళ్లు చేరాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఇదే వర్షాలు కొనసాగితే మత్తడి దుంకి కట్టలు తెగే పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమయ్యింది. అవసరమైన సహాయ, పునరావాస చర్యలకు ఉపక్రమించింది. పత్తి చేలు ఎండిపోతున్న దశలో వానలు పడడంతో ఆ పంటకు జీవం పోసినట్లయ్యింది. వాన భారీగా లేకున్నా ముసురుపడడంతో రైతులు కుదుటపడ్డారు. వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటలకు మేలు కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు మేలును చేకూర్చాయి. జూన్లో వర్షాలు సరిగా లేకపోవడంతో పంటలు దెబ్బతినగా జులైలో తుపానుతో కూడిన వర్షాలు ఒకటి రెండు రోజులు పడడంతో పంటల విస్తీర్ణ పెరిగింది. ఇక జూలై నెలాఖరులో వానలు పడలేదు. తాజాగా ఆగస్టు రెండోవారంలో వానలు మొదలయ్యాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. తాజాగా పడుతున్న వర్షాలతో రైతులు కొంత మేర గట్టెక్కే అవకాశాలున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తెల్లబంగా రంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కురిసే వానలకు ఎరువులు వేసే అవకాశాలుంటాయి. ప్రస్తుతం ముందుగా వేసిన పత్తి చేలకు పూతతోపాటు ఊడలు కూడా వచ్చాయి. భూగర్భజలాలు అడుగంటడం, బావుల్లో నీరులేకపోవడంతో వరి నారు ఎండిపోయే దశకు వచ్చింది. వర్షాధారంగా సాగు చేసిన వరి పరిస్థితి మరింత దారుణం. ఈ క్రమంలో కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. వరి సాగు పూర్తిగా ఆగస్టు వర్షాలపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. వాడిపోయే దశలో ఉన్న మొక్కజొన్నకు ఈ వర్షాలు జీవం పోశాయి. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరో పదిరోజులు ఇలాగే వర్షాలు కురియాలని రైతులు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు. జిల్లా అంతటా వర్షం జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు వాతావరణ శాఖ వివరాల ప్రకారం అత్యధికంగా జిల్లా సగటున 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చొప్పదండిలో 16.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రామడుగులో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గంగాధరలో 12.4, కరీంనగర్లో 13.9, మానకొండూర్లో 12, తిమ్మాపూర్లో 12.1, చిగురుమామిడిలో 12.6, సైదాపూర్లో 10.2, కేశవపట్నంలో 10.1, వీణవంకలో 12.4, హుజురాబాద్లో 11.7, జమ్మికుంటలో 14.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంటలో వర్షపాతం కొలిచే యంత్రాలు లేక అధికారులు వివరాలు వెల్లడించలేదు. అక్కడ సగటున 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఇప్పటివరకు 466.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 541.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. చొప్పదండి, జమ్మికుంట, వీణవంక, చిగురుమామిడి మండలాల్లో అధిక వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. కలెక్టరేట్లో కంట్రోల్రూం భారీ వర్షాల నేపథ్యంలో సహాయ, పునరావాస చ ర్యల నిమిత్తం కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పా టు చేశారు. వర్షాలతో జరిగిన నష్టాన్ని, సహాయక చర్యల కోసం ఫోన్ చేసి వివరించవచ్చు. అందుబాటులో ఉన్న అధికారులు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టనున్నారు. కంట్రోల్ రూం నంబర్ 1800 425 4731 (టోల్ఫ్రీ)కు ఫోన్ చేయవచ్చు. -
భాగ్యనగరంలో భారీ వర్షం
-
భాగ్యనగరంలో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాం తాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి బయల్దేరిన ప్రయాణికులు, వాహనచోదకులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. రాత్రి 10 గంటల వరకు 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రలో 7.6 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయవ్య బంగాళా ఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
గ్రేటర్లో పెరిగిన ఉక్కపోత..!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల ప్రభావం తగ్గడంతో గత 2 రోజులుగా గ్రేటర్ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత పెరగడంతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలతోపాటు గాలిలో తేమ శాతం 67 నుంచి 52 శాతానికి తగ్గడంతో ఉక్కపోత, పొడి వాతావరణంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. మరో 5 రోజులు నగరంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని.. అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని.. ఈ సీజన్లో రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడం వంటివే దీనికి కారణమని విశ్లేషించారు. సోమవారం నగరంలో గరిష్టంగా 33.2 డిగ్రీలు, కనిష్టంగా 23.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. -
ఐదు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి,హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాలో భారీ వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదైన ప్రాంతాలు చెన్నూర్లో 11 సెం.మీ, జూలపల్లిలో 11 సెం.మీ, మాచారెడ్డిలో 10 సెం.మీ, ఉట్నూర్లో 9 సెం.మీ, పెగడపల్లి(జగిత్యాల)లో 8 సెం.మీ, సుల్తానాబాద్లో 8 సెం.మీ, గంధారిలో 8 సెం. మీ, కామారెడ్డిలో 8 సెం.మీ, సదాశివనగర్లో 8 సెం.మీ, గంభీరావ్పేటలో 7 సెం.మీ, ఖానా పూర్లో 7 సెం.మీ, సిర్పూర్’లో 7 సెం.మీ, కాళేశ్వరం వద్ద 6 సెం.మీ, ముస్తాబాద్లో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. -
రానున్న 3 రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, ఉత్తర, దక్షిణ కర్ణా టక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవ ర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజు లు అక్కడక్కడ ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని వారాల్లో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతో పా టు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది -
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు సాధారణంగా కొనసాగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చురుగ్గుగా కదిలే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా రెండురోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. -
సెలవుల వెనుక మతలబు!
42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించినా మే నెలలోనే జ్ఞానధార కార్యక్రమం నిర్వహించింది విద్యాశాఖ. ఇప్పుడు అదే విద్యాశాఖ 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోన్న సమయంలో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచకపోవడం వెనుక వాటికి పరోక్షంగా మేలు చేసే ఉద్దేశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు సిటీ : వేసవి సెలవులు ముగిసి వారం క్రితమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల మొదటి వారంలో మూడు రోజులు మినహా పెద్దగా వాతావరణంలో మార్పులు కూడా కనిపించలేదు. అయినా, విద్యాశాఖ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని మూడు రోజులు (19, 20, 21 తేదీలు) సెలవులు ప్రకటించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్రంలోని సముద్ర తీరానికి సమీప ప్రాంతాల్లో పగలు వేడి తీవ్రత ఉంది. అయితే, ఈ వేడి ప్రమాదకరమని వాతావరణ శాఖ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయినా, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. గత 20 రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో ఒక్క రోజు కూడా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, మరి ఎందుకు సెలవులు ఇచ్చారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రైవేట్కు మేలు చేసేందుకేనా? ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో కావడం లేదు. పరోక్షంగా వారికి మేలు చేయడం కోసమే సర్కారు స్కూళ్లకు ఆకస్మిక సెలవులు ఇచ్చారని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి .సెలవులు ప్రకటిస్తూ జారీ చేసిన సర్క్యులర్లో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచక పోవడం అందులో భాగమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరిగేలా ప్రోత్సహించాల్సిన విద్యాశాఖే అసంబద్ధ నిర్ణయాలతో అందుకు విరుద్ధంగా వ్యవహస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు మండిపడుతున్నారు. సెలవుల అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్ర విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు అన్ని చోట్ల అలాగే ఉండవు. స్థానికంగా ఉండే పరిస్థితులకు తగ్గట్లు సెలవులు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి. స్కూళ్ల పునఃప్రారంభమైన వారం రోజులకు సెలవులు ఇవ్వడం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆటంకంగా మారుతోంది. – వి.కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 90 నుంచి 99 శాతం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, సన్నద్ధతపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. పోలీసు, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ పంచాయతీరాజ్, మున్సిపల్, పశుసంవర్థక, వైద్య, విద్యుత్తు, రైల్వే, ఫైర్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ శాఖలు నిరంతరం పంచుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని విభాగాలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రత్యేక యాప్...: విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ప్రజలకు వాతావరణ వివరాలు తెలిసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ను రూపొందించామని, త్వరలోనే ఈ యాప్ను అందుబాటులోకి తెస్తామని సీఎస్ వెల్లడించారు. వాతావరణ శాఖ ద్వారా వర్షపాతం అలర్ట్స్ను అన్ని శాఖలకు రోజూ పంపిస్తున్నామని, 31 జిల్లాల్లో వర్షపాతాన్ని నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వెబ్సైట్, వాట్సాప్ గ్రూపు ద్వారా వాతావరణ శాఖ ప్రతిరోజు సమాచారాన్ని చేరవేస్తోందని, ప్రజలకు తెలిసేలా మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించాలని సూచించారు. బస్తీ దవాఖానాల్లో మందులను అందుబాటులో ఉంచాలని, యాంటీ లార్వా ఆపరేషన్లను చేపట్టాలని, నాలాల పూడికలు తీయాలని, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు కం ట్రోల్ రూం నుంచి పర్యవేక్షించాలని సూచించారు. మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినందున, రైతులకు సరిపడే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాసం, వ్యాక్సిన్లు, పంచా యతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లకు మరమ్మతులు, ఇరిగేషన్ ద్వారా చెరువులు, కుంటలు, ట్యాంకులకు పటిష్ట చర్యలు, సివిల్ సప్లై నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ శాఖ ద్వారా స్వచ్ఛమైన మంచి నీరు సరఫరా చేయా లని ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, పంచా యతీ రాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.వి.చంద్రవదన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్ పాల్గొన్నారు. నేడు రాష్ట్రానికి రుతుపవనాలు సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు శుక్రవారం రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. రుతుపవన గాలులు పశ్చిమ దిశ నుంచి రావాల్సి ఉండగా, వాయవ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ముం దుగా అనుకున్నట్లుగా గురువారం ప్రవేశించలేదని, గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తాయని అన్నారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా 2 రోజులుగా రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయని వివరించారు. వర్షాలొస్తున్నాయి.. జాగ్రత్త : మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రెవెన్యూ శాఖ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. గురువారం సచివాలయంలో వర్షాకాల పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా రాష్ట్రంలో, జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాల వల్ల నష్టం కలగకుండా తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
సూర్యుడు @ 48
సాక్షి, అమరావతి: రోళ్లు పగిలే రోహిణి కార్తెలో భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. బయట కాలు పెడితే సూరీడి వేడి సెగలతో జనం అల్లాడుతున్నారు. ఇళ్లల్లో ఉన్నవారు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే వేడి గాలులు మొదలై రాత్రి 9 గంటల వరకు తీవ్రత కొనసాగుతుండటంతో పిల్లలు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎండ ధాటికి శీతల యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయి. మరోవైపు ఎన్నడూ లేనంతగా నేడు కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేయటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ (ఏపీఎస్డీపీఎస్)కు చెందిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల్లో బుధవారం పలుచోట్ల 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం, కాకినాడ (అర్బన్), నెల్లిపాక, కూనవరం, తాళ్లపూడి, ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు, మర్రిపూడి, కొండపిలో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్లో 44.4, గుంటూరు జిల్లా నరసరావుపేటలో 44.3, పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరులో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. నేడు కృష్ణాలో భగభగలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు నేడు మరింత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ‘గురువారం కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ను తాకే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 – 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఉభయ గోదావరి, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 – 43 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు వడగాడ్పుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఇవీ జాగ్రత్తలు.. – ఎండాకాలంలో శరీరం నుంచి చమట రూపంలో లవణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ద్రవ పదార్థాలు, నీరు అధికంగా తీసుకోవాలి. – ఎండ వేళ బయట తిరగకుండా జాగ్రత్త వహించాలి. – వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. – చల్లదనం కోసం కిటికీలకు పరదాలు అమర్చాలి – 3 నుంచి పలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు విశాఖ సిటీ: నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన నేపథ్యంలో ఈ ఏడాది వర్షపాత అంచనా వివరాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. ఈసారి దాదాపుగా దేశమంతా ఒకే విధంగా సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది. 2017 కంటే ఈ ఏడాది కాస్త మెరుగైన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ దేశంలో 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వివరించింది. విస్తరిస్తున్న రుతుపవనాలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా జూన్ 3వతేదీ నుంచి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ వానలు విస్తారంగా పడతాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం నాటికి రుతుపవనాలు అరేబియా సముద్రంతోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక తీరంలో కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని భాగాలకు విస్తరించాయి. ఆదివారం నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు అనువైన సమయంగా కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. -
యూపీలో మరో తుపాను
లక్నో: ఉత్తరప్రదేశ్ను మరో తుపాను కుదిపేసింది. బుధవారం రాత్రి నుంచి మొదలైన పెనుగాలులు, భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో 18 మంది మరణించారు. 27 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమ యూపీలోని 9 జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఇటావాలో ఐదుగురు, మథుర, అలీగఢ్, ఆగ్రాల్లో ముగ్గురు చొప్పున, ఫిరోజాబాద్లో ఇద్దరు, హతరాస్, కాన్పూర్ దెహాత్లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. మథుర జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శనివారం, ఆదివారం పెనుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ యూపీలో మరో ఇసుక తుపాను సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది. -
ఈ నెల 11 నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు
-
ఎల్లుండి నుంచి వర్షాలు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్టు వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఛండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్తాన్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వివరించింది. తూర్పు రాజ స్తాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గాలి దుమారం వీచింది. అతి ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు ప్రస్తుత పరిణామాలకు కారణమని, ఈ నెల 13 నుంచి హిమాలయ ప్రాంతంలో కూడా ఇవే పరిస్థితులు ఉత్పన్నమవు తాయని తెలిపింది. దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో వచ్చే వారం ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిపింది. ఈ పరిస్థితుల కారణంగా వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ నెల 13 నుంచి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ, ఏపీలలో.. తెలంగాణ, ఏపీలలో 11 నుంచి మూడ్రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ మధ్యలో భారీ వర్షాలు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. విశాఖ వాతావరణ శాఖ విభాగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తుంటుందని, ప్రజలు వాటిని గమనిస్తుండాలని సూచించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 9, 10, 11, 12 తేదీల్లో దక్షిణ కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే 9న కేరళ, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో వేడి గాలులు వీస్తాయని వివరించింది. 10న మహారాష్ట్రతో పాటు రాజస్తాన్లో కూడా వేడిగాలులు వీస్తాయని తెలిపింది. 11, 12న ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని.. రాజస్తాన్, మహారాష్ట్రలలో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఐఎండీ డైరక్టర్ జనరల్ దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరి స్థితులపై ఐఎండీ డీజీ కె.జయరాం రమేశ్ మంగళ వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వాతా వరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, లోహపూరిత నిర్మాణాలైన బస్షెల్టర్ లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు. ఇటీవల దేశంలోని 20 రాష్ట్రాల్లో గాలి దుమారం చెలరేగిందని, రుతుపవనాల రాక ముందు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉందన్నారు. రాజస్తాన్లో ఇసుక దుమారం వల్ల ఢిల్లీ చుట్టపక్కల రాష్ట్రాలకు దుమ్ము ప్రభావం ఉంటుందని.. అయితే ఒకసారి వర్షం పడితే దుమ్ము ప్రభావం తగ్గిపోతుందన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయని.. దీంతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. -
కడలి అలజడి.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: కడలిలో అకస్మాత్తుగా అలజడి రేగింది. ఒకపక్క పెనుగాలులతో కూడిన వర్షం, మరోపక్క ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను చూసి జనం ఆందోళన చెందారు. మళ్లీ సునామీ వచ్చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇదంతా ప్రచారమేనని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? సోమవారం అర్థరాత్రి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి మొదలైంది. మంగళవారం ఉదయానికి వాటి తీవ్రత మరింత పెరిగింది. హిందూ మహాసముద్రానికి (భూమధ్యరేఖకు) బాగా దిగువన మడగాస్కర్ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా అలలు సుమారు 2 మీటర్లకు పైగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తాలో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పాటు అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తీరప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో నైరుతి దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. అప్రమత్తం చేసిన ఇన్కాయిస్.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరంలో లంగరేసిన బోట్లు దెబ్బతినకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలని మత్స్యకారులకు సూచించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. సునామీ ప్రచారం నమ్మొద్దు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం, అలలు ఎగసి పడడంతో మీడియా, సోషల్ మీడియాలో సునామీ రాబోతోందంటూ మంగళవారం విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలోనూ ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు మాత్రమే సునామీ వస్తుంది తప్ప కెరటాలు ఎగసిపడినా, అకాల వర్షాలు కురిసినా సునామీ రాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. -
అకాలంలో ముంచింది
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకుతోడు పెద్ద ఎత్తున వడగళ్లు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాలంకాని కాలంలో కురిసిన ఈ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈ వర్షం తీవ్రనష్టం కలిగించింది. కాగా రాష్ట్రంలో అకాల వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
మండే ఎండలు మొదలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చి ప్రారంభం కావడంతో రానురాను ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ నుంచి వడగాడ్పులు మొదలవుతాయని.. ఈ సారి వడగాల్పులు ఎక్కువ రోజులు నమోదవుతాయని స్పష్టం చేసింది. దీంతో వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. గత 24 గంటల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల వరకు అధికంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్లలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భద్రాచలంలోనూ 2 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లోనూ 3 డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలో 23, నిజామాబాద్, భద్రాచలంలలో 21 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
చెన్నైలో కుండపోత
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ వర్షాలకు చెన్నై తడిసిముద్దయింది. గత ఐదు రోజులుగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం, తిరువారూరు, కడలూరు సముద్రతీర జిల్లాల్లో వర్ష బీభత్సంతో ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. గురువారం రాత్రంతా కురిసిన వర్షానికి చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్లపై ఐదు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాలేజీలు, స్కూల్స్కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కాస్త తెరపిచ్చినప్పటికీ సాయంత్రం నుంచి జోరువాన మొదలైంది. భయం గుప్పిట్లో జనం గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షంతో చెన్నైలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెరీనా బీచ్లో 30 సెంటీమీటర్ల వర్షం కురవటంతో బీచ్ సర్వీస్ రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువారం రాత్రి సెయింట్ థామస్ మౌంట్ నుంచి కొడంబాకంకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి 9.30 నుంచి తెల్లవారు జామున 3.20 గంటల వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రైవేటు సంస్థలు శుక్ర, శని వారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించాలని లేదా.. ఇంటినుంచి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వదంతులు నమ్మొద్దు చెన్నై పరిసరప్రాంతాల్లోని రిజర్వాయర్లు నిండిపోయాయని అవి కూలిపోయే ప్రమాదముందనే సమాచారంతో చెన్నై శివార్లతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవన్నీ వదంతులేనని.. రిజర్వాయర్లు భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్నా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. తమను ఆదుకోవాలంటూ చెన్నైలోని ముదిచుర్ రోడ్పై పలువురు నిరసన తెలిపారు. చెన్నై సహా వర్షప్రభావ జిల్లాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. అయితే దూరప్రాంత రైళ్లు, విమాన సేవలకు అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తుల నివారణ బృందాలు నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కరుణ, పన్నీర్సెల్వం ఇళ్లల్లోకి... చెన్నై గోపాలపురంలోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆళ్వార్పేటలోని డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వంసహా పలువురు మంత్రుల నివాసాల్లోకి వరదనీరు వచ్చింది. పట్టాలపై వరదనీరు చేరడంతో లోకల్ రైళ్లను నిలిపివేశారు. సీఎం పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎగసిపడుతున్న సముద్రం నాగపట్టణం భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. ఒకవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండగా మరోవైపు కుండపోత కారణంగా జిల్లాలో పలుప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలో వేల ఇళ్లు, లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగాయి. దాదాపు 10వేల మంది మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
నగరంలో మళ్లీ కుండపోత
-
నగరంలో మళ్లీ కుండపోత
సాక్షి, హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాలు రాజధానిని వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం కూడా భారీ వర్షంలో నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లు, కాలనీలు, బస్తీల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవలి 13 సెం.మీ. భారీ వర్షం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ వచ్చి పడ్డ వర్షంతో వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. శనివారం రాత్రి తొమ్మిదింటి వరకు మీరాలంలో 7.1 సెంటీమీటర్లు, ఆసిఫ్నగర్లో 5.05, సర్దార్మహల్లో 4.05, రాజేంద్రనగర్లో 3.28, గోల్కొండ, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 2.5, సైదాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, అమీర్పేట్, షేక్పేట్ తదితర చోట్ల 1 సెం.మీ. వర్షం కురిసింది. ఉప్పల్, కూకట్పల్లి, ఎల్బీనగర్, కుషాయీగూడ, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కరెంట్ పోయి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అటు వరదనీరు, ఇటు కటిక చీకటితో అల్లాడారు. మరో 24 గంటల పాటు.. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల మరో 24 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలుంటాయని అధికారులు తెలిపారు. -
మరో మూడు రోజులు వానలు
-
'వాతావరణంలో మార్పులు వస్తాయి'
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తాయని, దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని పేర్కొంది. అదే విధంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీవర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. -
ముంబయి తరహాలో చెన్నైకి ముప్పు?
► భారీ స్థాయిలో ముందుజాగ్రత్త చర్యలు ► వచ్చేనెల 10 నాటికి 38 శాఖలు అప్రమత్తం ► అప్పుడే చెప్పలేమంటున్న వాతావరణశాఖ రెండేళ్ల క్రితం చెన్నైని ముంచెత్తిన వరదనీటి చేదు అనుభవాన్ని తమిళనాడు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. భారీ వర్షాల కారణంగా ముంబయి మహానగరం ఇటీవల నీట మునిగిన దృశ్యాలు రాష్ట్ర ప్రజల మదిలో ఇంకా నిలిచే ఉన్నాయి. అదే తరహా ముప్పు చెన్నైకి పొంచి ఉందనే ప్రచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఎటువంటి అవాంతరం ఎదురైనా ఎదుర్కొనేందుకు చెన్నై కార్పొరేషన్ సమాయత్తంఅవుతుండగా, అప్పుడే ఏమీ చెప్పలేమని వాతావరణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: 2015 డిసెంబరు 1, 2 తేదీలు తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా చెన్నై జనాలు ప్రాణభయంతో వణికిపోయిన రోజులు. ఊపిరి ఉన్నంతవరకు అటువంటి భయంకరమైన అనుభవం ఎదురుకాకూడదని ప్రజలు ప్రార్థించిన కాళరాత్రులు అవి. అయితే అంతటి తీవ్రత కాకున్నా భారీ వర్షాలు చెన్నైని మరోసారి ముంచెత్తే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ చెన్నై కార్పొరేషన్ సైతం సహాయ చర్యలపై సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్న కారణంగా ప్రజా పనులు, రహదారులు, చెన్నై తాగునీరు, జాతీయ విపత్తుల నివారణ, పోలీస్, అగ్నిమాపక, మత్స్య, విద్యుత్, సమాచార తదితర 38 శాఖల అధికారులతో కమిషనర్ కార్తికేయన్ ఇటీవల సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా జరిపిన ఈ సమావేశంలో సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా పనులశాఖకు సంబంధించి వీరాంగల్ ఓడై, మనపాక్కం, కాల్వాయ్, కూవమ్, అడయారు చెరువు, అడయారు చెరువు అనుబంధ కాల్వల్లో ఇంకా పూడిక తీయని సంగతిని గుర్తించి వచ్చేనెల పదో తేదీలోగా పూర్తిచేయాలి. రహదారుల శాఖ పరిధిలో ఔట్లేని పారుదల కాల్వలను గుర్తించి వేగంగా పనులను పూర్తిచేయాలి. అలాగే కాల్వల్లో పూడికితీసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. గ్రేటర్ చెన్నై ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ పరిధిలోని పాతబడిన బస్సుల్లో పగుళ్లు, రంధ్రాలకు మరమ్మతులు చేసి వర్షాలు, వరదలు సంభవించినా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఆవిన్ పాలపైనే ఆధారపడకుండా ప్రయివేటు సంస్థల ద్వారా పాలను కొనుగోలుచేసి తగిన స్థాయిలో పాల ప్యాకెట్లను నిల్వచేసుకోవాలి. కార్పొరేషన్ కమ్యూనిటీ హాళ్లను శుభ్రం చేసి అవసరమైన ప్రజలను ఉంచేందుకు వీలుగా సిద్ధంగా ఉంచాలి. జాతీయ విపత్తుల నివారణ, త్రివిధ దళాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముంపు ప్రాంతాల్లో ప్రజల రక్షణకు తగిన ముందు జాగ్రత్తలతో ఉండాలి. పోలీస్, అగ్నిమాపక, విద్యుత్శాఖలతోపాటూ, తాగునీటి సరఫరా సమాచార విభాగం చెన్నై కార్పొరేషన్లోని కంట్రోలు రూముతో అనుసంధానమై ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనాలి. వదలు సంభవిస్తే లోతట్టులో ఉండే టాన్స్ఫార్మర్లు నీటమునగకుండా ఎత్తు పెంచాలి. సమాచార సంస్థలు తమ టవర్లు ఉన్నచోట్ల కనీసం ఏడు మీటర్ల దూరంలో జనరేటర్లను అమర్చుకుని ఎంతటి భారీ వర్షం వచ్చినా సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మత్య్సశాఖ వారు పెద్ద సంఖ్యలో పడవలను సిద్ధం చేసుకోని, పడవల యజమానులు, మత్స్యకారుల పేర్లతో జాబితాను సిద్ధం చేసుకోవాలి. చెన్నై కార్పొరేషన్ విపత్తుల నివారణ, సహాయక చర్యలపై ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుని వాటి నకలును అన్ని శాఖలకు త్వరలో అందజేయడం. రుతుపవనాల తాకిడిని దీటుగా ఎదుర్కొనేందుకు అక్టోబరు 10వ తేదీలోగా పూర్తి చేయాలని కమిషనర్ కార్తికేయన్ ఆదేశించారు. 36 గంటల ముందు మాత్రమే ముప్పు అంచనా ఇటీవల ముంబయిలో చోటుచేసుకున్నట్లుగా ఈ ఏడాది చెన్నైలో సైతం ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, చెన్నై నగరం ముంపునకు గురవతుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న చెన్నై వాతావరణ కేంద్రం అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈశాన్య రుతుపవనాలు సగటున 44 సెంటీమీటర్లు వరకు నమోదవుతుందని చెప్పారు. ఈ సగటు వర్షపాతం మాత్రమే ఈ ఏడాది కురిసే అవకాశం ఉన్నట్లు గణాంక వివరాలు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. నవంబరులో భారీ, అతి భారీ వర్షాలు పడుతాయని పెద్దగా నష్టం జరుగకపోవచ్చని తెలిపారు. 36 గంటల ముందుగా మాత్రమే వాతావరణ కేంద్రం కచ్చితమైన అంచనాలు వేయగలదని, రెండు, మూడు నెలల తరువాత వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చెప్పడం అసాధ్యమని అన్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న వదంతులను ప్రజలు నమ్మరాదని, వాతావరణ కేంద్రం ద్వారా నిర్ధిష్టమైన సమాచారాన్ని వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు బులిటెన్లు విడుదల చేస్తుందని ఆయన తెలియజేశారు. -
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ మీదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన అల్పపీడనం.. మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది ఇప్పటికీ సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి గుజరాత్ దిశగా కదులుతోందని వివరించింది. బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. వాయగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలపై రుతుపవనాలు బలంగా కనిపిస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. విశాఖపట్టణం మీదుగా రుతుపవన ద్రోణి పయనిస్తోందన్నారు. రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబరు 2న కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వెల్లడించారు.