విశాఖపట్నం, న్యూస్లైన్ : విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య పలు ప్రత్యేక రైళ్లను వాల్తేరు రైల్వే నడపనుంది. ఏసీ రైలు మినహా రెండు ప్రత్యేక రైళ్లను ఏడు ట్రిప్పులు నడపనున్నట్టు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
08503 నంబరు గల విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ నెల 10 నుంచి మార్చి 24వ తేదీ వరకు ప్రతీ సోమవారం రాత్రి 7.05 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో 08504 నంబరుతో ఈనెల 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు ప్రతీ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుతుంది.
08501 నంబరు గల విశాఖపట్నం-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈనెల 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో 08502 నంబరుతో ఈ నెల 12 నుంచి మార్చి 26వ తేదీ వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు విశాఖకు చేరుతుంది.
02727 నంబరు గల విశాఖపట్నం-సికింద్రాబాద్ ఏసీ స్పెషల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 8, 15 తేదీల్లో(శనివారం) విశాఖలో రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో 02728 నంబరుతో ఈ నెల 7, 14 తే దీల్లో(శుక్రవారం) సికింద్రాబాద్లో రాత్రి 10.10 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుతుంది.
విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు
Published Thu, Feb 6 2014 1:28 AM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM
Advertisement
Advertisement