విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక స్వాతంత్ర్య వేడుకలకు విశాఖపట్టణం వేదిక కానున్నదని ఆ జిల్లా కలెక్టర్ యువరాజ్ ధ్రువీకరించారు. విశాఖలోని బీచ్ రోడ్డులో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వేడుకలను నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్కు అప్పగించే యోచనలో ఉన్నట్టు కలెక్టర్ యువరాజ్ తెలిపారు.