వృద్ధుని మాయచేసి నగలు చోరీ | jewelry theft from an old man | Sakshi
Sakshi News home page

వృద్ధుని మాయచేసి నగలు చోరీ

Published Sun, Apr 3 2016 2:21 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

jewelry theft from an old man

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని బస్టాండు సమీపంలో బస్సుకోసం నిలబడిన ఒక వృద్ధుడికి మాయమాటలు చెప్పి అతని వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మంగళగిరి సమీపంలోని నవులూరుకు చెందిన  ప్రకాశరావు(70) అనే వృద్ధుడు నిత్యం బంగారు చైను, బ్రాస్‌లెట్, చేతి వేళ్లకు ఉంగరాలతో తిరుగుతుంటాడు.

 

ఇది గమనించిన దుండగులు ఆయనను వెంబడించారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి బస్టాండులో బస్సుకోసం వేచి ఉండగా మాటల్లోపెట్టి అతని వద్దనుంచి బంగారు చైను, బ్రాస్‌లెట్ దోచుకెళ్లారు. ఈమేరకు అతను మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ చేసిన వస్తువుల విలువ రూ.4 లక్షలు ఉంటుందని అతను పోలీసులకు తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement