పాత నేరస్తుడే కిడ్నాపర్ | Kidnapper is old offender | Sakshi
Sakshi News home page

పాత నేరస్తుడే కిడ్నాపర్

Published Tue, Sep 16 2014 5:57 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

సురక్షితంగా ఇంటికి చేరిన దామోదర్ - కుటుంబ సభ్యుల ఆనందం - Sakshi

సురక్షితంగా ఇంటికి చేరిన దామోదర్ - కుటుంబ సభ్యుల ఆనందం

విశాఖపట్నం: వారం రోజుల క్రితం చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి  దామోదర్(9)ను కిడ్నాప్ చేసినవారిలో ఒకడు పాత నేరస్తుడేనని పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి బాలుడిని నిన్న సురక్షితంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ఇద్దరినీ అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు హాజరుపరిచారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

నిందితులలో ఒకడు శ్రీకాకుళంకు చెందిన కింతాల  కేశవరావు కాగా, రెండవవాడు విశాఖపట్నం చంద్రశేఖర్ అని చెప్పారు. వీరిలో కేశవరావు 2005లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని తెలిపారు. పోలీసులు చాలా కష్టపడి ఈ కేసుని ఛేదించినట్లు తెలిపారు. బాలుడు సురక్షితంగా దొరకడం తమ విజయంగా చెప్పారు. కిడ్నాపర్ల నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement