Kidnap
-
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
మమ్మల్ని కిడ్నాప్ చేసి ఏం చేశారంటే.. సంచలన విషయాలు బయటపెట్టిన కార్పొరేటర్లు..
-
కిడ్నాప్ చేసిన కౌన్సిలర్లు ను విడిచిపెట్టకపోతే టీడీపీ కుట్రపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకం
-
తిరుపతిలో హైటెన్షన్.. పోలీసుల ముందే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్
-
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
-
సాక్షి కథనంపై కూటమి కుట్రలు పోలీసులే కిడ్నాపర్లు!
-
భూ వివాదంలో మునీర్ అనే టీచర్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు
-
శ్రీకాకుళం జిల్లాలో YSRCP కార్యకర్తల కిడ్నాప్ కలకలం
-
అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్.. వారిద్దరూ ఎక్కడ?
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కిడ్నాప్నకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లారు. పోలీసు యూనిఫామ్లో వచ్చిన కొందరు దుండగులు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తెలియడంతో ఆయన కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల పేరుతో తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటనే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వారు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఈ క్రమంలో అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆయన అక్కడే కూర్చుని నిరసనలు తెలిపారు. -
ప్రముఖ నటుడి అపహరణ.. రూ. కోటి డిమాండ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు కిడ్నాప్కు గురయ్యారు. వెల్ కమ్, స్త్రీ-2 చిత్రాలతో మెప్పించిన ముస్తాక్ ఖాన్ను కొంతమంది దుండగులు అపహరించారు. అతన్ని దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. విడిచిపెట్టేందుకు రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. ముస్తాక్ ఖాన్ను ఈవెంట్కు రమ్మని కిడ్నాప్ చేశారని ఆయన సన్నిహితుడు శివమ్ యాదవ్ తెలిపారు.అయితే ఈవెంట్కు హాజరయ్యేందుకు ముస్తాక్కు అడ్వాన్స్ ఇచ్చారని.. విమాన టిక్కెట్లు పంపించారని శివమ్ యాదవ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన దండగులు ముస్తాక్, అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు కాజేశారని తెలిపారు. కానీ చివరికీ వారి నుంచి తప్పించుకున్న ముస్తాక్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇటీవల కమెడియన్ సునీల్ పాల్కు సైతం ఇదే తరహాలో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముస్తాక్ బాగానే ఉన్నారని.. కొద్ది రోజుల్లోనే మీడియాతో అన్ని విషయాలు వివరిస్తారని కుటుంబ సభ్యలు వెల్లడించారు. ఈవెంట్ పేరుతో సెలబ్రిటీలను కిడ్నాప్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
షల్ మీడియా యాక్టివిస్ట్ ల పై కొనసాగుతున్న కక్ష సాధింపు
-
'కళ్లకు గంతలు కట్టి, కారులో తోసి.. రూ.20 లక్షలు డిమాండ్ చేశారు'
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్కు గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కిడ్నాప్ అయిన కొద్ది గంటలకే అతడిని విడుదల చేయడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని అతడి భార్య తెలిపింది. ఈ విషయంలో పోలీసులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది.నిజంగానే కిడ్నాప్..అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. ఇది ప్రాంకో, పబ్లిసిటీ స్టంటో కాదని, తనను నిజంగానే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ పాల్ మాట్లాడుతూ.. అమిత్ అనే వ్యక్తి హరిద్వార్లో బర్త్డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపాడు. ఇందుకోసం కాస్త అడ్వాన్స్ కూడా పంపాడు. దీంతో డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లాను. బర్త్డే పార్టీకి వెళ్తుండగా మార్గమధ్యలో స్నాక్స్ తిందామని ఆగారు. రూ.20 లక్షలు డిమాండ్సరిగ్గా అప్పుడే నా అభిమాని అంటూ ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఓ కారులోకి తోశాడు. బలవంతంగా నన్ను కారులో తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఓ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ నన్ను చాలారకాలుగా భయపెట్టారు. రూ.20 లక్షలు కావాలని డబ్బు డిమాండ్ చేశారు, నా ఫోన్ కూడా లాక్కున్నారు. నా దగ్గర ఏటీఎమ్ కార్డు లేదని చెప్పడంతో వారు బేరాలు మొదలుపెట్టారు. నా ఫ్రెండ్స్కు ఫోన్ చేసుకోవచ్చని చెప్పారు.ఖర్చుల కోసం రూ.20 వేలిచ్చారుఅలా రూ.7.5 లక్షలు సమకూర్చాను. దీంతో వాళ్లు మరుసటి రోజు విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.20 వేలు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. కానీ నా భార్య అప్పటికే పోలీసులను సంప్రదించడంతో నేనూ నోరు విప్పాను. కానీ ఆ కిడ్నాపర్లు నా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నారు. వణికిపోయా..నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? నా తల్లి ఎక్కడ నివసిస్తుంది? ఇలా ప్రతీది అడిగారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది భయంగా ఉంది. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానంటున్నారు... అదే నిజమైతే మధ్యలో పోలీసులను ఎందుకు లాగుతాను. పైగా నా స్నేహితుల దగ్గర డబ్బు పంపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నేను ఇంకా బతికే ఉన్నందుకు సంతోషం అని సునీల్ చెప్పుకొచ్చాడు.చదవండి: కమెడియన్ ఆటో రామ్ప్రసాద్కు యాక్సిడెంట్ -
కిడ్నాప్ కు గురైన నెలరోజుల పసికందు సురక్షితం
-
Manipur: కుకీల అరాచకం!.. ఆరుగురి మృతదేహాలు లభ్యం
ఇంఫాల్: కల్లోల మణిపూర్లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. ఈ క్రమంలో జిరిబామ్లో సోమవారం కుకీ ఉగ్రవాదులు మైతీ వర్గానికి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయం విదితమే. కిడ్నాప్కు గురైన ఆరుగురి మృతదేహాలను పోలీసులు తాజాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బందీలుగా చేసిన అయిదు రోజులకు మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ముందుగా శుక్రవారం సాయంత్రం అస్సాం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో తేలుతూ ముగ్గురు మహిళల మృతుదేహాలు లభ్యమవ్వగా.. నేడు మరో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మృతదేహాలు కొంత కుళ్లిపోవడంతో ఉబ్బిపోయాయని, అందరూ మైతీ వర్గానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.కాగా జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బోకోబెరా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్పై సాయుధ కుకీలు హింసాత్మక దాడికి పాల్పడ్డారు. ఈ ఎన్కౌంటర్లో అనుమానిత కుకీ ఉగ్రవాదుల్లో పది మందిని పోలీసులు కాల్చిచంపారు. ఆ దాడి తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వీరిని కుకీలు కిడ్నాప్ చేశారు. -
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుప్పంలో హైడ్రామా !
-
కాకినాడ జిల్లా పెద్దాపురంలో మైనర్ బాలిక కిడ్నాప్
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
OTT: హాలీవుడ్ మూవీ ‘కిడ్నాప్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కిడ్నాప్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా పోరాడే తత్వం తల్లిది అన్న విషయాన్ని సూటిగా చూపించిన ఆంగ్ల చిత్రం ‘కిడ్నాప్’. 2017లో లూయి ప్రీటో దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. హాలీవుడ్ ప్రముఖ కథానాయిక హేలీ బెర్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ (ఇంగ్లిష్), లయన్స్ గేట్ (తెలుగు వెర్షన్) ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. తల్లిగా ఆమె నటన ఈ సినిమా మొత్తానికే హైలైట్. కథాంశానికొస్తే... కార్లా డైసన్ ఓ సింగిల్ మదర్. తన ఆరేళ్ల కొడుకు ఫ్రాంకీని కార్నివాల్కు తీసుకువెళ్ళడంతో ‘కిడ్నాప్’ సినిమా మొదలవుతుంది. కార్నివాల్లో అనుకోకుండా పార్కింగ్ లాట్ నుండి తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లడం చూస్తుంది కార్లా. ఇక అక్కడి నుండి ఆ కిడ్నాపర్ల వెంటపడి తన కొడుకును ఎలా కాపాడుకుంటుంది అన్నదే మిగతా కథ. ఈ సినిమా స్క్రీన్ప్లే దాదాపు రోడ్డు మార్గానే నడుస్తుంది. అమెరికా రోడ్లలో పరిమితికి మించి వేగంగా కొంతమంది కార్లు నడుపుతూ ఉంటారు. అంతకు మించి వేగంగా ఈ కథ స్క్రీన్ప్లే ఉంటుంది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు ఈ సినిమా మొదలయ్యాక శుభం కార్డు పడే వరకు లేవరు. సినిమాను అంత ఆసక్తికరంగా దర్శకుడు లూయీ రూపొందించారనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ప్రఖ్యాత సంస్థ అయిన ఎఫ్బీఐ ఇచ్చిన అంచనాల మేరకు అమెరికాలో ఏటా 8 లక్షలకు పైబడి ప్రతి 40 సెకన్లకు ఓ బిడ్డ కనిపించకుండాపోతున్న పరిస్థితి ఉంది. మనందరినీ మనకి తెలిసీ తెలియకుండా నిరంతరం కాపాడే అమ్మ ఆ విజయదుర్గ. ఆ తల్లి తత్వంతో తీసిన ఈ సినిమా నిజంగా అద్భుతం. విజయదశమి పండగ సమయంలో థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్లకి ఇదో మంచి చాయిస్.– ఇంటూరు హరికృష్ణ -
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్కు గురయ్యారు. కాకర్నాగ్ ప్రాంతం టెరిటోరియల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్ అయిన మరో జవాన్.. కొన్ని గంటలకే కోకెర్నాగ్లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.మృతుడిని అనంత్నాగ్లోని ముక్ధంపోరా నౌగామ్కు చెందిన హిలాల్ అహ్మద్ భట్గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం -
కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య
సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్బుక్ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్రప్రసాద్ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదనపల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్టాక్సీ డ్రైవర్గా, జొమాటో బాయ్గా పనిచేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. పూజల పేరుతో.. స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. పెన్షన్ తీసుకునేందుకు రాకపోవడంతో..ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్కు చేయగా, కాల్ ఫార్వర్డ్ మెసేజ్ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్ మదనపల్లె వచ్చారు. అక్టోబర్ 2న తాలూకా పోలీస్ స్టేషన్లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్ తానే విచారణ చేపట్టారు. స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్ తన ఫోన్ స్విచ్ఆఫ్ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్ వినియోగించిన టవర్ లొకేషన్, నిందితుడు వెంకటేష్ ఫోన్లోని కాంటాక్ట్స్ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్ తరచూ వాడే ఫోన్ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ నంబర్పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్ వెళ్లినట్టు తెలిసింది.ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
వారం రోజులూ వదిలేసి హైడ్రామా
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. వస్తూనే.. నిందితులు దొరికినట్లు ప్రకటించేశారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని కాగితాలు తగలబడినట్లు తెలియగానే హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను అక్కడికి పంపించి గంట గంటకు సమీక్ష చేసిన∙ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు... పుంగనూరులో చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య ఘటన అంత ప్రాధాన్యత కలిగినదిగా కనిపించలేదు. కనీసం ఈ ఘటన జరిగిన ఎనిమిదో రోజు వరకు∙స్పందించాలని కూడా ఆయనకు అనిపించలేదు. కానీ, మాజీ సీఎం పరామర్శకు వస్తున్నారని తెలియగానే పెద్ద హైడ్రామాకు తెరతీశారు. ఒక్కసారిగా ముగ్గురు మంత్రులను పుంగనూరు పంపారు. బాలిక తండ్రిని ఆయన ఫోన్లో పరామర్శించారు. తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ నిస్సిగ్గుగా ఈ ఘటనను కూడా తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. బాలిక కిడ్నాప్, హత్య గురించి ప్రశ్నించిన ప్రతిపక్షంపై పుంగనూరులో మంత్రులు అడ్డగోలు ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం.హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రత్యక్షం..నిజానికి.. చిన్నారి అంజుమ్ గత నెల 29న కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్నామని చెప్పినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో ఈ నెల 2న బాలిక విగతజీవిగా కనిపించింది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులూ ధ్రువీకరించారు. అయితే, హత్యకు గల కారణాలు, నిందితుల గురించి విచారిస్తున్నామని అప్పట్లో వారు చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతోపాటు నిందితుల ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న పుంగనూరు రానున్నారని తెలియడంతో ముగ్గురు మంత్రులు ఆదివారం హడావుడిగా పుంగనూరులో ప్రత్యక్షమయ్యారు. కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. దీంతో ఎనిమది రోజులుగా కనిపించని నిందితులు మాజీ సీఎం వస్తున్నారనే సరికి దొరికిపోయారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు?ఇక కిడ్నాప్కు గురైన ఏడేళ్ల చిన్నారి ఆచూకీని కనిపెట్టలేని ప్రభుత్వం.. ఎనిమిది రోజుల తరువాత నిందితులను పట్టుకున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలిక ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటుచేశామని వెల్లడించిన హోంమంత్రి.. అశ్వియను ప్రాణాలతో తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి.. చిన్నారి కిడ్నాప్ అయిన రోజు నుంచి ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. పైగా.. హత్యకు ముందు పట్టణ పరిధిలోనే చిన్నారిని దాచి ఉంచారనే ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా.. సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముగ్గురు మంత్రులు అనిత, రాంప్రసాద్రెడ్డి, ఫరూక్ పుంగనూరుకు చేరుకుని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే.. చిన్నారి ఎందుకు హత్యకు గురైందన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. వైఎస్ జగన్ పుంగనూరుకు వస్తే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే సీఎం, మంత్రులు హడావుడి చేస్తూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని వారంటున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం. ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు? అంజుమ్ కిడ్నాప్నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు. బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి. హంతకులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది. -
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం
-
పల్నాడులో మళ్లీ పేట్రేగిన టీడీపీ మూకలు..
సాక్షి, నరసరావుపేట, వినుకొండ (నూజెండ్ల): అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఎన్నికల హామీలపై ఏమాత్రం దృష్టిపెట్టని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సర్కారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా పక్కాగా అమలుచేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను హత్యచేయడం, వారిపై దాడులకు తెగబడడం, ఆస్తులు ధ్వంసం చేసి గ్రామాల నుంచి వెళ్లగొట్టడం పల్నాడులో సర్వసాధారణమయ్యాయి. చివరికి సొంత ఊర్లో ఇళ్లు, పొలాలు వదిలి పొట్టకూటి కోసం వలస వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని సైతం వెంటాడి కిడ్నాప్ చేసి అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ గూండాలు వెనుకాడడంలేదు. తాజాగా.. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు ఆటోలో వెళ్తుండగా టీడీపీ నేతలు దారికాచి దాడిచేశారు. అందులోని అతని కుటుంబ సభ్యుల్ని గాయపరిచి నాగరాజును కిడ్నాప్ చేయడం తీవ్ర అలజడి రేపింది. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని నాగరాజును పోలీసుస్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నాగరాజు బావమరిది రవి తెలిపిన వివరాలు ఏమిటంటే..వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన నాగరాజు కుటుంబ సభ్యులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత గ్రామం జంగమేశ్వరపాడు గ్రామాన్ని విడచిపెట్టి వినుకొండలోని తన బావమరిది రవి వద్దకు వచ్చి ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగరాజు తన తల్లి వెంకమ్మ, బావమరిది రవితో కలిసి గురువారం ఉ.8.30 ప్రాంతంలో వెల్లటూరు వైపు వెళ్తుండగా వెంకుపాలెం కురవ వద్దకు రాగానే టీడీపీ నేతలు కారుతో ఆటోను అడ్డగించారు. కారులో వచ్చిన సుమారు 8 మంది రవిపై కత్తులతో దాడిచేసి గాయపరిచారు. ఆ తర్వాత నాగరాజు తల్లిపైనా దాడిచేసి నాగరాజును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెల్లటూరు వైపు దూసుకెళ్లారు. కిడ్నాప్ చేసింది జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ నేతలే అని నాగరాజు కుటుంబ సభ్యులు నిర్థారించారు.అందరూ చూస్తుండగానే..పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తూ నాగరాజును కిడ్నాప్ చేయడంతో వినుకొండ ప్రాంతంలో అలజడి రేగింది. అక్కడున్న స్థానికులు దాడిలో గాయపడిన రవి, నాగరాజు తల్లి వెంకాయమ్మలను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న నాగరాజు భార్య, నాగమల్లేశ్వరి, చెల్లెళ్లు భువనేశ్వరి, రజనీలతోపాటు నాగరాజు తండ్రి సాంబయ్య నాగరాజును చంపేస్తారని, కాపాడాలంటూ భోరున విలపించారు. ఆ టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు..నాగరాజు తండ్రి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. జంగమేశ్వరపాడుకు చెందిన టంగుటూరి శబరి కుమారుడు మల్లికార్జున, కొండా, ఆరెద్దుల మణి, కంచర్ల బొర్రయ్య కుమారుడు రామాంజి, నానారావు కుమారుడు జల్లయ్యతోపాటు మరో ముగ్గురు తన కుమారుడిని కిడ్నాప్ చేశారని తెలిపారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద నాగరాజు భార్య సొమ్మిసిల్లి పడిపోయింది. ఆస్పత్రి ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బతుకుతెరువు కోసం, ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామంలో పొలాలు, ఇళ్లు వదలేసి దూరంగా బతుకుతున్నప్పటికీ టీడీపీ నేతలు తమను ఇక్కడ కూడా బతకనివ్వడంలేదని వాపోయారు. సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుల పట్టివేత..నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ సీఐ శోభన్బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్ల సిగ్నల్ ఆధారంగా నిందితులను బొల్లాపల్లి మండలం మర్రిపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడిలో ఏడుగురు పాల్గొనగా ఆరుగురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. బాధితుడు నాగరాజును రక్షించిన పోలీసులు బొల్లాపల్లి స్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.కత్తులతో దాడిచేసి కిడ్నాప్ చేశారు..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బావ నాగరాజు కుటుంబం టీడీపీ దాడులకు భయపడి వినుకొండలో నా వద్దకు వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అయినాసరే వదిలిపెట్టకుండా గురువారం ఉదయాన్నే కత్తులతో దాడిచేసి గాయపరిచారు. అడ్డొచ్చిన మహిళలపై కూడా దాడిచేసి నాగరాజును కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నా ఫోన్ను సైతం లాక్కెళ్లారు. – రవి, దాడిలో గాయపడిన నాగరాజు బావమరిదినాగరాజుకు ఏం జరిగినాబాబుదే బాధ్యతమాజీమంత్రి అంబటి ఫైర్సాక్షి, అమరావతి: పల్నాడులో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజుకు ఎలాంటి హాని జరిగినా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పల్నాడులో నాగరాజు కిడ్నాప్పై ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను ప్ర శ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి. రాష్ట్రంలో ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నా యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే వినుకొండలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనలపై చంద్రబాబు స్పందించాలన్నారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు.పోలీసులు చేతులేత్తేశారు: కొరముట్లరాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే అంశంలో పోలీసులు పూర్తిగా చేతులేత్తేశారని, కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేసేందుకే అన్నట్లుగా వారి ప్రవర్తన ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తాడేపల్లిలో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. మొన్న వినుకొండ, నిన్న నంద్యాల, జగ్గయ్యపేట ఘటనలు జ రగ్గా ఈరోజు కిడ్నాప్ జరగడం అత్యంత దారుణమన్నారు. జగన్కి ఎక్కువ భద్రత ఉన్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
టీడీపీ నేతల అరాచకం.. నాగరాజుకు తీవ్ర గాయాలు
పల్నాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులు.. నాగరాజును చావబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. నాగరాజును బొల్లాపల్లి స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు.. ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. కిడ్నాడ్ ఘటనకు సంబంధించ ఎనిమిది మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కిడ్నాపర్లను విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గోప్యగా ఉంచుతున్నారు. బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. -
నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: అంబటి రాంబాబు
-
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్
-
బాలుడు కిడ్నాప్.. ఆందోళనలో తల్లిదండ్రులు
-
పాప సేఫ్ ... అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
అబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం
-
అనకాపల్లిలో 20 ఏళ్ల యువతి కిడ్నాప్, రేప్
-
ప్లాన్ ప్రకారమే ఎత్తుకెళ్లాడు.. తండ్రి రోదన..
-
జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టు
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఐటీ కంపెనీ సీఈవోను అపహరించిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.వెంకటగిరి తెలిపారు. నిందితుల నుంచి 84 ల్యాప్టాప్లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రవిచంద్రరెడ్డి గిగ్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ అయిన దాదాపు 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాడు. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, మరో ఐదుగురు ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే జులై 10 అర్ధరాత్రి వీరు రవి నివాసంలోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.కిడ్నాప్ అయిన వెంటనే రవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగే సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 84 ల్యాప్టాప్లను అపహరించినట్ల పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు బృందం రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్లో గుర్తించి రక్షించారు. నిందితులు దొంగలించిన 84 ల్యాప్టాప్లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, మూడు పాస్పోర్ట్లతోపాటు వారికి చెందిన రెండు కార్లు, ఒక మోటర్బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ పి.వెంకటగిరి వివరించారు.ఇదీ చదవండి: ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!ఇదిలాఉండగా, ఉద్యోగం కోసం నైపుణ్యాలు పెంచుకుని నేరుగా కంపెనీలను ఆశ్రయించి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్.. నర్సు వేషంలో వచ్చి..
సాక్షి,కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు కిడ్నాప్కు గురైంది. నర్స్ వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు, ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.కిడ్నాప్ చేసిన మహిళ మచిలీ పట్నానికి చెందిన చెరుకురసం అమ్మే మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నర్సు వేషంలో వచ్చి కిడ్నాప్..
-
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్కు గురయ్యాడు. కిడ్నాప్చేసిన వ్యక్తి ఒమర్ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్తో వెలుగులోకి కిడ్నాపర్కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్చేశారు. ఈ పోస్ట్ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
దేశంలో అంతర్యుద్ధం నడుమ.. అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలోనే తమ బిడ్డ కనిపించకుండా పోయాడు. నెలల తరబడి వెతికినా లాభం లేకుండాపోయింది. చివరకు చనిపోయాడని నిర్ధారించేసుకున్నారు వాళ్లు. సరిగ్గా.. పాతికేళ్ల తర్వాత అదే వీధిలో ఓ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబానికి నోట మాట రాలేదు. 1998లో అల్జీరియాలో అంతర్యుద్ధం జరిగిన టైంలో ఒమర్ బీ అనే వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని కొన్నాళ్లూ.. ఆ తర్వాత కూడా ఆచూకీ దొరక్కపోవడంతో చంపేసి ఉంటారని అతని కుటుంబం నిర్ధారణకు వచ్చింది.26 ఏళ్లు గడిచాక.. ఒమర్ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో అతన్ని బంధించినట్లు కుటుంబం తెలుసుకుంది. వెంటనే ఒమర్ సోదరుడు ఆ బంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఆస్తి పంపకాల తగాదాలు.. ఆ కేసు కోర్టులో నడుస్తుండడంతో దగ్గరి బంధువే ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు తేలింది.అల్జీరియా డిజెల్ఫా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్కు పాల్పడిన నిందితుడు పారిపోయే యత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్చేశారు. 45 ఏళ్ల వయసులో ఒమర్ను చూడగానే ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం అతనికి మానసిక చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం. అయితే.. కిడ్నాప్ చేసి పొరుగింట్లోనే పాతికేళ్లుగా బంధించడం నమ్మశక్యంగా లేదంటున్న పోలీసులు.. సమగ్రంగా దర్యాప్తు చేపట్టాకే కేసు వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. -
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
కరీనా కపూర్ హీరోయిన్గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్రస్తావన సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన నటి మీనాక్షి థాపర్ గురించి! ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇదే చివరి సినిమా! చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్రత్యేక కథనం..సినిమా ఛాన్స్కు ముందు1984 అక్టోబర్ 4న మీనాక్షి థాపర్ జన్మించింది. డెహ్రాడూన్లో తన విద్యాభ్యాసం జరిగింది. సినిమాల మీద ఆసక్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావడానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2011లో 404 అనే హారర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవలేదు.సెట్స్లో అదృశ్యంతర్వాత మధుర్ భండార్కర్ సినిమా 'హీరోయిన్'లో ఛాన్స్ వచ్చింది. కరీనా కపూర్తో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని సంబరపడిపోయింది. త్వరలోనే నటిగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని భావించింది. అంతలోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్కి రాగా అక్కడే ఆమె అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న నటి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు డిమాండ్అందులో మీనాక్షి మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సురిన్తో కలిసి అలహాబాద్కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మూడు రోజుల తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 లక్షలు పంపండి.. మూడు రోజులు మాత్రమే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే తను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. రోజులు గడుస్తున్నాఈ బెదిరింపులకు నటి తల్లి లొంగలేదు. ఆర్మీలో పని చేస్తున్న తన కుమారుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. రోజులు గడుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొరకలేదు. ఒకరోజు అమిత్, ప్రీతి(వీరిద్దరూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్కు చేరుకున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీనాక్షిని హత్య చేసినట్లు అంగీకరించాడు.శరీరాన్ని ముక్కలుగాఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన తర్వా ఆమె తల, మొండెం వేరు చేశారు. అలహాబాద్లో ప్రీతి ఇంటికి దగ్గర్లో ఓ సెప్టిక్ ట్యాంక్లో తన శరీరాన్ని ముక్కలుగా కోసి పడేశారు. తలను అలహాబాద్ నుంచి లక్నోకు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో నుంచి అడవిలో విసిరేశారు. 2018లో న్యాయస్థానంలో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.స్నేహితుల అత్యాశ వల్ల 27 ఏళ్ల వయసుకే నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక తల్లికి తీరని కడుపుకోత మిగిలింది.చదవండి: సింగర్పై బాటిల్ విసిరిన ఆకతాయి.. అయినా సహనం కోల్పోకుండా.. -
అమెరికాలో కిడ్నాపైన నాచారం విద్యార్థి అర్ఫాత్ మృతి
మల్లాపూర్ (హైదరాబాద్): అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్లోని నాచారానికి చెందిన విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) ఓహాయోలోని క్లీవ్ల్యాండ్లో మృతి చెందాడు. అక్కడి సరస్సులో లభ్యమైన మృతదేహం నడుము చుట్టూ పాస్పోర్ట్, మొబైల్ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అర్ఫాత్గా గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ‘ఎక్స్’లో వెల్లడించింది. అర్ఫాత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. అర్ఫాత్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. మార్చి 7న కిడ్నాప్: నాచారానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ గత మార్చి 7న అదృశ్యమయ్యాడు, ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన అర్ఫాత్ క్లీవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయి తే కిడ్నాప్నకు కొద్ది రోజుల ముందు తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని అర్ఫాత్ తన తండ్రి మహమ్మద్ సలీంకు ఫోన్ చేసి చెప్పాడు, దీంతో వారు ఆందోళన చెందారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అర్ఫాత్ కిడ్నాప్ అయ్యాడు. 1200 డాలర్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారని, లేకుంటే అర్ఫాత్ కిడ్నీలు విక్రయిస్తామని కిడ్నాప్ చేసినవారు సలీంను ఫోన్లో బెదిరించారు. అయితే అర్ఫాత్ను రక్షించుకునేందుకు తండ్రి సలీం అంగీకరించి,...అర్ఫాత్ మీ దగ్గర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. దీంతో కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ పెట్టేశారని, వారి నుంచి మళ్లీ కాల్ రాలేదని సలీం తెలిపారు. కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్లో ఎవరిదో ఏడుపు వినిపించిందని..అదే చివరి గొంతు అన్నారు. కిడ్నాపర్ల ఫోన్నంబరు అమెరికాలోని తమ బంధువులకు పంపి క్లీవ్ల్యాండ్ పోలీసులకు అందజేయాలని సలీం చెప్పారు. అర్ఫాత్ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8న క్లీవ్ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఇది జరిగిన దాదాపు నెలరోజుల తర్వాత విషాదవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు రోదిస్తూ చెప్పారు. -
HYD: కిడ్నాప్నకు గురైన పాప సేఫ్..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్నకు గురైన తొమ్మిది నెలల పాప సురక్షితమని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్లో జహీరాబాద్లో బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అయితే, కిడ్నాప్ చేసిన మహిళను సహనాజ్ఖాన్గా గుర్తించారు. బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ మహిళ జహీరాబాద్లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ పోలీస్ స్టేషన్కు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు చేరుకున్నారు. అనంతరం పాపను పేరెంట్స్కు అప్పగించారు. -
పాతబస్తీలో 9నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం
-
ఎయిర్ పోర్ట్ నుండి నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారు
-
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
కథ..స్క్రీన్ ప్లే..డైరెక్షన్..అంత చెల్లె
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
-
టీచర్ను కిడ్నాప్.. తలపై తుపాకీతో బెదిరించి కూతురితో పెళ్లి
బిహార్లో వింత పెళ్లి జరిగింది. ఓ టీచర్ను కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కుతురితో వివాహం జరిపించాడు కిడ్నాపర్. బీహార్లోని వైశాలి జిల్లాలో ఈ ఉదాంతం వెలుగుచూసింది. వివరాలు.. గౌతమ్ కుమార్ ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పటేపూర్లోని రేపురాలోని పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తునాడు. . బుధవారం అతను పాఠశాలలో ఉండగా.. ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో బలవంతంగా వివాహం చేశారు. వివాహానికి నిరాకరించింనందుకు బాధితుడిపై దాడి కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన ఉపాధ్యాయుడిని గాలించే పనిలో పడ్డారు. గౌతమ్ కుమార్ కుటుంబ సభ్యులు రాజేష్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి రాయ్ కుమార్తె చాందినితో వివాహం చేసి ఉంటారని ఆరోపించారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బిహార్లో పకడ్వా వివాహం(ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం) ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గతేడాది అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేసేందుకు వచ్చిన పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెగుసరాయ్లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్లో ఓ ఇంజనీర్కు సంబంధించిన ఇలాంటి ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్లో జూనియర్ మేనేజర్గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. -
కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్, డేటింగ్ వల: అదే కొంపముంచింది!
సోషల్ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్ డేటింగ్ టిండర్లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. 2018లో జైపూర్లో షాకింగ్ సంఘటన జరిగింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు 27 ఏళ్ల ప్రియా సేథ్తో టిండర్ యాప్ ద్వారా పరిచయమైంది. దుష్యంత్ తను అసలు పేరు కాకుండా వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని, ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్మేన్ అని గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి ప్రొఫైల్ చూసిన ప్రియా పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం నటించింది. దీంతో దుష్యంత్ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు కొనసాగింది. చివరికి కలవాలని ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. ఇక్కడే అతడిని కిడ్నాప్ చేసిన పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలన్న తన ప్లాన్ను ప్రియా అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్ రిలేషన్ షిప్లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్ చే చేసి జైపూర్లోని అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్ను అమలు చేశారు. దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసిన 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ దగ్గరనున్న ఏటీఎం కార్డునుంచి రూ.20వేలు లాగేసుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్ మృతదేహాన్ని పోలీసులు అదే ఏడాది మే 4న గుర్తించారు. ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో డేటింగ్ ద్వారా ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ. -
గుంటూరు జీజీహెచ్ లో శిశువు కిడ్నాప్
-
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని చెన్నై ప్లాట్ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్ బ్రిడ్జి కింద బాలుడిని గుర్తించారు. బ్రిడ్జి కింద చిన్నారిని పడుకోబెట్టి బిక్షాటన చేసిన కిడ్నాపర్.. పోలీసులను చూసి పొదల్లోకి వదిలి పారిపోయాడు. ఆరు గంటలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెగ్గింగ్ కోసమే కిడ్నాపన్ చేసినట్లు తేలింది. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యిదేళ్ల బాలుడు కిడ్నప్కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన దుర్గేశ్.. అలిసిపోయి ఉండటంతో స్టేషన్లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. దీంతో స్టేషన్లో ఉన్న జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు. చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! -
నిలోఫర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. తీవ్రంగా శ్రమించి ఈ కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలుడ్ని సురక్షితంగా తీసుకొచ్చారు.సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు మమతకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లైనా పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. తమ కుమారుడి ఆరోగ్యం బాలేదంటూ నిలోఫర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఎవరైనా బిడ్డను అదను చూసి ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. ఆస్పత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుంటూ.. ఫైసల్ఖాన్ అనే చిన్నారి మీద కన్నేశారు. నాలుగు రోజుల కిందట.. ఫైసల్ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పరారయ్యారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఈ జంటకు సహకరించారు. బిడ్డ కనిపించకపోయే సరికి తల్లి విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది పోలీసులకు. చివరకి.. ఆస్పత్రి సమీపంలోనే సీసీ ఫుటేజీల ద్వారా కేసు చేధించగలిగారు. జేబీఎస్ అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డి ఇలా సాగింది కిడ్నాపర్ల ప్రయాణం. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జంటను పట్టుకుని.. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. వింత వ్యాధి.. నవ్వాడనే ఉద్దేశంతోనే.. ! ఈ నెల 14తేదీన నిలోఫర్ లో కిడ్నాప్ గురైన ఆరు నెలల బాబు కిడ్నాప్ కేసును ఛేదించాం. చికిత్స కోసం ఫారీదా బేగం తన కొడుకు ఫైసల్ఖాన్ను తీసుకొని వచ్చింది. భోజనం కోసం బయటకి తల్లి వెళ్ళింది. బాలుడు తల్లి భోజనం కోసం వెళ్లగా, వెంటనే బాలుడి ని కిడ్నాప్ చేశారు. శ్రీను , మమత అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. గత కాలంగా వీళ్లిద్దరికీ పిల్లలు పుట్టి చనిపోతున్నారు. 15 రోజులు క్రితం కూడా దంపతులకు బాలుడు పుట్టారు. అనారోగ్యంతో నిలోఫర్లొనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ జంట.. అధిక రక్త స్నిగ్థత వ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది. దీని ప్రకారం.. మగ పిల్లలు పుడితే వెంటనే చనిపోతారు. కేవలం ఆడ పిల్ల పుడితేనే బతుకుతారు. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు మృతి చెందారు, మూడో పిల్లోడు కూడా చనిపోతాడని భావించారు. అందుకే నిలోఫర్లో ఓ పక్క కొడుకు చికిత్స తీసుకుంటుండగానే.. ప్లాన్ ప్రకారం ఫైసల్ను ఎత్తుకెళ్లారు. ఈ జంట బాన్సువాడ టౌన్లో కిరాయికి ఇల్లు తీసుకుని ఆ ఎత్తుకొచ్చిన బిడ్డతో ఉన్నారు. నిలోఫర్ ఆస్పత్రి నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి కేసును చేధించారు. ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని ఫైసల్ కిడ్నాప్గురించి మమత చెబుతోంది. బాలుడుకి రెండు రోజులు నిందితురాలు మమతనే పాలు ఇచ్చింది అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్కు గురైంది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వివరాలు.. ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఆటోలో వెళ్తున్న దంపతులను కారులో ఛేజ్ చేసిన దుండగులు..భర్తపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. భార్యను ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి కారణాలతోనే తనపై దాడి చేసి, భార్యను కిడ్నాప్ చేశారని భర్త సన్నీ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..? -
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
అమరావతి: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని సాక్ష్యాధారాలతో సహా మరోసారి నిరూపితమైంది. నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యధాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 867గా ఉంది. శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6 గా ఉంది. రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 14714 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. 10680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ 10252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 18వ స్థానంలో ఉంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సరైన అవగాహన లేకుండా పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరైనా తెలివిగల్లోళ్లు పవన్ పక్కన ఉంటే నివేదికను చక్కగా వివరించే అవకాశమైనా ఉండేది. విషయ సంగ్రాహక శక్తి తక్కువగా ఉన్నందునో, వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కొరవడినందునో.. ప్రతి విషయాన్ని వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తూ పవన్ ఎప్పటికప్పుడు జనం ముందు నవ్వులపాలవుతున్నారు. -
ఘట్ కేసర్ లో కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి సురక్షితం
-
GST అధికారుల కిడ్నాప్ కేసులో కీలక విషయాలు
-
మేడ్చల్ జిల్లాలో నాలుగేళ్ల కృష్ణవేణి కిడ్నాప్
-
హైదరాబాద్ లో GST ఆఫీసర్ల కిడ్నాప్ కేసులో టీడీపీ నేత ముజీబ్
-
జీఎస్టీ అధికారుల కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్.. పోలీసులు ఆ కేసును చేధించిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్.. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్లను ఫోన్లో కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్నగర్లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణా నగర్లో ఫేక్ జీఎస్టీ నంబర్తో gst కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు..GST ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మణి శర్మ , ఆనంద్ లు వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు , మరో ముగ్గురు కలిసి... ఫార్చ్యూనర్ కార్ లో కిడ్నాప్ చేశారు. GST అధికారుల ఐడీ కార్డు లు చింపి..వారి పై దాడి చేశారు. మాకు సమాచారం అందగానే... దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నాము. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్.. నిందితులు టీడీపీ నేత అనుచరులు? -
హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచార యత్నం
-
వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే
అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధువును వరునికి అప్పగించే సమయం రానే వచ్చింది. అయితే ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. వరునితో పాటు అతని బంధువర్గం ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంది. రాజస్థాన్లోని భీల్వాడాలో ఒక యువకుడు కొత్త పెళ్లికూతురును ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడు. అప్పగింతల అనంతరం నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.ఇంతలో ఒక యువకుడు తన స్నేహితులతో పాటు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అందరినీ బెదిరించి, వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. వధువు తరపువారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆ యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భీల్వాడా పరిధిలోని బిజోలియాకు చెందిన రవి నాయక్కు లాఛుడాకు చెందిన కవిత(మార్చిన పేరు)తో వివాహం జరిగింది. అనంతరం వధూవరులు, వారి బంధువులతో పాటు ఒక ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడకు ముగ్గురు యువకులు స్కూటర్ మీద వచ్చారు. వారు కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించడంతోపాటు వధువు మెడపై కత్తి పెట్టి ఆమెను తీసుకువెళ్లిపోయారు. అయితే పెళ్లివారు ఆ యువకులను కొంత దూరం వరకూ వెంబడించారు. అయినా ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తరువాత వారు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘ప్రేమికుడే ఈ పని చేశాడు’ ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామన్నారు. అదే సమయంలో వధువును కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆ సమయంలో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందన్నారు. అయితే తన భార్య ప్రేమికుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే! -
హైదరాబాద్- ఘట్కేసర్ లో కిడ్నాప్ కలకలం
-
కిడ్నాప్ అనుమానంతో డ్రైవర్పై కాల్పులు
టెక్సాస్: ఉబర్ డ్రైవర్ తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో అమెరికాకు చెందిన ఒక మహిళ దారుణానికి దిగింది. మెక్సికోకు తనను తీసుకువెళుతున్నాడని భయపడి డ్రైవర్పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆస్పత్రిలో మృతిచెందాడు. టెక్సాస్కు చెంది ఫోబె కోపాస్ (48) తన ప్రియుడి దగ్గరికెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కాక ఫోన్లో ఏదో మాటల్లో పడిపోయిన ఆమె ఆ తర్వాత హఠాత్తుగా పరిసరాలను చూసి తనను మెక్సికోకి తీసుకువెళుతున్నారని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్లో ఉన్న తుపాకీతో డ్రైవర్ డేనియల్ పియేడ్రాపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మెడకు తీవ్ర గాయాలైన అతను రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం ఇచి్చంది. పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయతి్నంచినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. ఉబర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసను సహించలేమంటూ ఫోబె మళ్లీ ఉబర్ సేవలు వినియోగించుకోకుండా నిషేధం విధించింది. -
విశాఖ కిడ్నాప్ కేసు.. ఎంపీ ఎంవివి దగ్గర డబ్బు గుంజడానికి ప్లాన్ చేశారా?
-
కొడుకు కిడ్నాప్పై స్పందించిన ఎంపీ
-
విశాఖ కిడ్నాప్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
-
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం. -
మార్కులు తగ్గాయని ఇంట్లో నుంచి వెళ్లి.. రూ.కోటి ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్!
కోల్కతా: పరీక్షల్లో మార్కులు తగ్గితే కొందరు విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక పరీక్షల్లో మార్కులు తగ్గడంతో తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా తనని కిడ్నాప్ చేశారని నాటకమాడి తన తండ్రి నుంచి కోటి వసూలు చేయాలని ప్రయత్నించింది. ఈ షాకింగ్ ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తన మార్కులను తెలుసుకునేందుకు సైబర్ కేఫ్కి తన 6 ఏళ్ల సోదరితో కలిసి తన ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వాళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదే సమయంలో, బాలిక తండ్రికి గుర్తుతెలియని నంబరు నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తన కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్ చేశామని, రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని అందులో ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్ నంబరు ఆధారంగా చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోం ఎదుట వారు ఉన్నట్లు గుర్తించి కాపాడారు. అయితే విచారణలో వారు కిడ్నాప్ కాలేదని ఇది డ్రామా అని తెలిసి అవాక్కయ్యారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ నాటకమాడినట్లు బాలిక కూడా అంగీకరించింది. చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్ బర్త్డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని.. -
Vizag: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్.. 24 గంటల్లోనే
కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులకు షేక్ రిజ్వానా, షేక్ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. -
‘అయేషా వస్తేనే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు.. లేదంటే!’
ముంబై: వివాహేతర సంబంధం కోసం మహిళ కొడుకును అపహరించిన సంఘటన థానే జిల్లాలోని శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టణంలోని మహ్మద్ అలీ ఫకీర్, అయేషా బీబీ దంపతులు టెమ్ఘర్ మురికివాడలో ఉంటున్నారు. రిపోన్ వ్యాపారి అనే వ్యక్తితో అయేషాకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తనతోపాటు వచ్చేయాలని అయేషాపై ఒత్తిడి పెంచాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఏప్రిల్ 3న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆషిక్ (4)ను కిడ్నాప్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన అలీ, అయేషా స్థానిక శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వచిన వారికి రిపోన్ వ్యాపారి ఫోన్ చేసి ‘మీ కుమారుడు నావద్దనే ఉన్నాడు. అయేషా వస్తేనే సురక్షితంగా ఉంటాడు. లేదంటే హతమారుస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే శాంతినగర్ పోలీసులకు తెలిపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాసిక్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గ్రహించిన సీనియర్ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో 24 గంటల్లో నిందితుని పట్టుకొన్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. -
పక్కా ప్లాన్ వేసి కిడ్నాప్.. చిన్నారి దెబ్బకు దిమ్మతిరిగింది కదా!
చిన్న పిల్లల కిడ్నాప్లు ఇటీవల పెరిగిపోతున్నాయి. అందుకు కిడ్నాపర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కిడ్నాప్ చేసే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అందరి ముందే పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా అమలు కూడా చేశాడు. అయితే ఆ చిన్నారి చిచ్చర పిడుగులా ప్రవర్తించే సరికి చివరిక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు..? వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ఫుట్పాత్పై ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయత్నించాడు. అది కూడా అందరూ చూస్తుండగానే ఈ ప్లాన్ వేశాడు. ఇంకేముంది సైలెంట్గా అపహరించి, భుజాలపై ఎత్తుకుని, అక్కడి నుంచి జారుకునేందుకే సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో అప్రమత్తమైన బాలుడు కిడ్నాపర్ భుజం నుంచి సినిమాటిక్గా తప్పించుకున్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ కిడ్నాపర్ వెంటనే పారిపోయాడు. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని ఆ చిన్నారి చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. -
కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. వీడియో వైరల్
-
ఐఫోనా మజాకా? మైనర్ కిడ్నాప్ డ్రామా...కట్చేస్తే..!
ఖరీదైన ఐఫోన్ కోసం 9వ తరగతి కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిరు వ్యాపారి అయిన తండ్రి ఐఫోన్ కొనివ్వలేకపోవడంతో ఎలాగైనా తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు చివరికి పోలీసుల చేతికి గతుక్కుమన్నాడు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తానే కిడ్నాప్ అయినట్టుగా డ్రామా ఆడాడు. ఆ తరువాత తన స్నేహితుడి ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, లొకేషన్ను ఆధారంగా వారిని పట్టుకున్నారు. సీతాపూర్ కొత్వాలి పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు మైనర్కు ఏడాది వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. దీంతో గారాబంగా పెరిగాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని తండ్రి, ఇతర బంధువులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ మొత్తాన్ని ఖైరాబాద్లో(యూపీ) మసీదు సమీపంలో డెలివరీ చేయాలని కూడా చెప్పాడు. దీంతో తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన జిల్లా పోలీసులు, సైబర్, ఎస్ఓజీ బృందాలు వివరాలు ఆరాతీశారు. ఫోన్ ఫుట్వేర్ షాప్ యజమానిదిగా గుర్తించి విచారించగా ఆఫోన్ను వాళ్లబ్బాయి వాడుతున్నట్టు తేలింది. ఎట్టకేలకు ఇద్దరినీ కనుగొన్న పోలీసులు కౌన్సెలింగ్ అనంతరం వారిని కుటుంబాలకు అప్పగించారు. -
యూపీలో ఆవు దొంగతనం.. అర్థరాత్రి కారులో వచ్చి.. వైరలవుతున్న వీడియో