టోల్‌గేట్ వద్ద లారీ యజమానుల ఆందోళన | Lorry owners stage dharna at tollgate | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్ వద్ద లారీ యజమానుల ఆందోళన

Published Mon, Sep 14 2015 4:08 PM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM

Lorry owners stage dharna at tollgate

తణుకు (పశ్చిమగోదావరి) : గడువు దాటిపోయినా టోల్‌గేట్ కొనసాగిస్తున్నారంటూ లారీ యజమానులు ఆందోళనకు దిగారు. అధిక టోల్‌ ఫీజు వసూలు చేస్తూ తమను నష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

లారీ యజమానులు లారీలను గేట్ వద్ద నిలిపివేసి బైఠాయించారు. వెంటనే టోల్‌గేట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు వచ్చి, ఆందోళనకారులను శాంతింపజేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement