తణుకు (పశ్చిమగోదావరి) : గడువు దాటిపోయినా టోల్గేట్ కొనసాగిస్తున్నారంటూ లారీ యజమానులు ఆందోళనకు దిగారు. అధిక టోల్ ఫీజు వసూలు చేస్తూ తమను నష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన టోల్ప్లాజా వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీ యజమానులు లారీలను గేట్ వద్ద నిలిపివేసి బైఠాయించారు. వెంటనే టోల్గేట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు వచ్చి, ఆందోళనకారులను శాంతింపజేశారు. ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
టోల్గేట్ వద్ద లారీ యజమానుల ఆందోళన
Published Mon, Sep 14 2015 4:08 PM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM
Advertisement
Advertisement