పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట | Lovers seek police protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Published Fri, Aug 8 2014 1:16 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

కొయ్యలగూడెం : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన పెరువిజ్జు వీరవెంకటసత్యనారాయణ, ఇదే గ్రామానికి చెందిన చిట్రోజు దుర్గాదేవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారని, ఈ నెల 6న ద్వారకాతిరుమలలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నట్టు తెలిపారని ఎస్సై చెప్పారు. పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ తమను ఆశ్రయించారన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement