Police
-
అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కోలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.ప్రణయ్ డే , ప్రసున్ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు. చదవండి: రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఫిబ్రవరి 19 ఉదయం కోల్కతా తూర్పు శివార్లలోని టాంగ్రాలోని వారి నివాసం నుండి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోదరులు ప్రణయ్, ప్రసున్ డే, వారి భార్యలు సుధేష్ణ, రోమి డేలతో కలిసి టాంగ్రాలోని ఇంట్లో నివసించేవారు. ప్రణయ్ సుధేష్ణల దంపతులకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ భార్యల్ని, కుమార్తెను (ప్రణయ్ భార్య సుధేష్ణ (39), ప్రసున్ భార్య రోమి (44), ప్రసున్-రోమి కుమార్తె ప్రియాంవద(14)) హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. మరోవైపు మృతుల దేహాలపై గాయాలుండటం మరింత అనుమానాలను తావిచ్చింది. పోస్ట్మార్టం నివేదికలో ఇవి హత్యలుగా తేలాయి. దీంతో ప్రణయ్, ప్రసున్లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!అనేక అనుమానాలు, ప్రశ్నలుకోల్కతాలోనిఒక ఇంట్లో మైనర్బాలికతో సమా ఇద్దరు మహిళ హత్యలు గ్భ్రాంతికి గురిచేశాయి. అందరమూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుని విషంతీసుకున్నామని, ప్రసున్, ప్రణయ్ తెలిపారు.కుటుంబ సభ్యులందరూ డ్రగ్ కలిపిన డెజర్ట్ తిన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.కానీ బాలికలో తప్ప, మిగిలిన ఇద్దరి మహిళల్లో విషయ ప్రయోగం జరిగిన దాఖలు కనిపించలేదని కూడా ఆయన తెలిపారు. పైగా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు, తీవ్ర రక్త స్రావంగానే మరణాలు సంభవించాయని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి బుధవారం తెల్లవారుజామున 1 గంట మధ్య హత్యకు గురయ్యారు.బుధవారం తెల్లవారుజామున 12.51 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన తర్వాత (సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం) అలా చేయడానికి వారికి రెండున్నర గంటలు ఎందుకు పట్టింది?ప్రమాదానికి ముందు వారు రెండున్నర గంటలు నగరం చుట్టూ ఎందుకు తిరిగారు?మంగళవారం ఇంటికి వచ్చిన పనిమనిషిని బుధవారం ఉదయం రమ్మని ఎందుకు అడిగారు?ఎయిర్బ్యాగ్లతో కారును ఢీకొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాలికను హత్య చేసి అబ్బాయిని తమ వెంట ఎందుకు తీసుకెళ్లారు? -
రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే!
అత్తాకోడళ్లంటే శత్రువులు అనే భావన చాలామందిలో స్థిరపడిపోయింది. వీరి మధ్య జరిగే వివాదాలను టీవీ సీరియళ్లలో ఆసక్తికరంగా చూపిస్తుంటారు. చిన్నపాటి విషయానికే కొందరు అత్తాకోడళ్లు తెగ తిట్టేసుకుంటారని, కొట్టేసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయ. తాజాగా అత్తాకోడళ్లకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు. Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MHpic.twitter.com/QAjcpr6sYu— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025ఈ అత్తాకోడళ్లు(Daughter-in-laws) యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. ఇది కూడా చదవండి: Mahashivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే.. -
Visakhapatnam: మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం..
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.పథకం ప్రకారం.. కత్తితో పొడిచికాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్లో చికిత్స తీసుకున్నాడు.ఒక రోజు ఆగి..ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా.. 10 మంది మహిళలు అరెస్ట్
గుణదల(విజయవాడతూర్పు): స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్ ప్రైవేట్ యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పై భాగంలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. అమ్మాయిలతో వల వేసి బడా బాబులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆ బిల్డింగ్లో వ్యబిచారం జరుగుతున్నట్లు మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దాడి విషయం తెలిసిన భార్గవ్ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు.మరెన్నో ఆరోపణలు..భార్గవ్కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్ చానల్ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నేతగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..! -
వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రలు
-
పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ
-
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
వైఎస్ జగన్ మీద అసభ్యకరమైన పోస్టులపై YSRCP లీగల్ సెల్ ఫిర్యాదు
-
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
గచ్చిబౌలి: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు కారు ప్రమాదాలు.. నలుగురికి గాయాలుమణికొండ: బుధవారం జరిగిన వేర్వేరు కారు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. నార్సింగి పోలీసులు తెలిపిన మేరకు.. రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్కు చెందిన విజయ్కుమార్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి బుధవారం తెల్లవారు జామున సుజికీ ఫ్రాంక్స్ కారులో కోకాపేట మూవీటవర్ వైపు లాంగ్ డ్రైవ్కు వచ్చారు. కారును వేగంగా నడపటం, ముందు లారీ వెళుతున్న విషయాన్ని గమనించకపోవటంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దాంతో విజయ్కుమార్తో పాటు అతని స్నేహితురాలికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు. మరో సంఘటనలో వోక్స్ వ్యాగన్ కారులో వికారాబాద్ నుంచి నార్సింగికి వస్తుండగా సీబీఐటీ కళాశాల ముందుకు రాగానే అదుపు తప్పిన కారు రోడ్డు మధ్యలో డివైడర్పై ఉన్న హోర్డింగ్ పోల్ను ఢీ కొట్టింది. దాంతో కారు ముందు బాగం పూర్తిగా నుజ్జు,నుజ్జు అయ్యింది. అందులో ఉన్న కార్తీక్, అభిõÙక్రెడ్డిలకు స్వల్పగాయాలు కావటంతో వారు కారును అక్కడే వదిలి పారిపోయారు. రెండు కారు ప్రమాదాల కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పోలీసులు లేకపోతే మీటింగ్ జరగదనుకున్నారా నీ కుట్రలు పనిచేయవు బాబు
-
జగన్ పర్యటనలో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం
-
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు.. రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది.బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వైఎస్సార్సీపీ(YSRCP) నేతల వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగు పెట్టిన వైఎస్ జగన్(YS Jagan) .. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ.. ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కలిగించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు. సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెత్తుతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాలని జనం వచ్చారు. అలాంటిది యార్డులో ఒక్క పోలీసుల కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
‘కమాండ్’ తప్పిందా?
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కు ఇటీవల కాలంలో సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి..టాస్్కఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి మూడుసార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్నదానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కూకట్పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్లో కలుసుకున్న నకిలీ టాస్్కఫోర్స్ కానిస్టేబుల్..తన పేరు హరిజన గోవర్ధన్గా పరిచయం చేసుకొని హోటల్ బిజినెస్లో లాభాలు వస్తాయంటూ రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. మూడు విడతలుగా ఇదే హోటల్లో బాధితుడు చెల్లించడం జరిగింది. ఈ మూడుసార్లు నిందితుడు హరిజన గోవర్దన్ ఐసీసీసీ నుంచి బయటికి వచ్చి బాధితుడిని నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్సెంటర్ నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పని చేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకొని తీరా మోసపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసీసీసీలో సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుడు మూడుసార్లు రావడం పోలీసులు గుర్తించారు. ఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్ళడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికకారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా..అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించగా తాజాగా సీఎం సమీక్షలకు వస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. -
టీడీపీ కుట్రలు బట్టబయలు
-
ఏపీ పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
-
ఎవ్వడినీ వదలం.. జగన్ స్పీచ్ కు దద్దరిల్లిన విజయవాడ
-
తప్పు చేసినోళ్లు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్
-
ఎవ్వరినీ వదిలిపెట్టను.. బట్టలూడతేసి నిలబెడతా!
-
‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’
యూపీలో జరుగుతున్న కుంభమేళా నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొన్ని విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట, తాజాగా న్యూఢిల్లీలో తొక్కిసలాట.. ఈ రెండూ ఉదంతాలకు అధికారుల వైఫల్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా కుంభమేళాకు వెళుతున్న రైలుకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. Pakda gya 🐒 (Police Caught a guy who was trying to break the Door of train) pic.twitter.com/NPGHMUXxc6— Ghar Ke Kalesh (@gharkekalesh) February 16, 2025ఆ వీడియోలో కొందరు ప్రయాణికులు స్టేషన్కు వచ్చిన రైలు డోర్ లాక్ అయి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఒక యువకుడు అసహనంతో రగిలిపోతూ, గట్టిగా కొడుతూ, రైలు కోచ్ అద్దాలను పగులగొట్టే ప్రయత్నం చేస్తాడు. దీనిని గమనించిన ఒక రైల్వే పోలీసు ఆ యువకుని షర్టు కాలర్ పట్టుకుని, కొడుతూ లాక్కెళుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ పోలీసుల చర్యను మెచ్చుకుంటున్నారు. అద్దాలు పగులగొట్టేవారిని అలా ఈడ్చుకెళ్లాల్సిందేనంటూ సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: Railway Station Stampede: ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత -
పరారీలో యూట్యూబర్ అల్హాబాదియా..!
ముంబయి:వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి ఆగ్రహాన్ని చవిచూసిన యూట్యూబర్ రణ్వీర్అల్హాబాదియా పారిపోయాడా.. పోలీసులకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్లిపోయాడా..అంటే అవుననే అంటున్నారు ముంబయి పోలీసులు. అల్హాబాదియాకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వస్తోందని, ఇంటికి వెళ్తే తాళమేసి ఉందని పోలీసులు తెలిపారు.ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రులపై అల్హాబాదియా అశ్లీల వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో అల్హాబాదియాను పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే తాను తన ఇంటి వద్దే వాంగ్మూలం ఇస్తానని అల్హాబాదియా పోలీసులను కోరాడు.దీనికి పోలీసులు తిరస్కరించారు. తర్వాత స్టేట్మెంట్ కోసం పోలీసులు అల్హాబాదియాకు ఫోన్చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హాజరవడానికిగాను మరో కమెడియన్ సమయ్రానాకు పోలీసులు మార్చి 10 దాకా సమయమిచ్చారు.బీర్బైసెప్స్తో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నరణ్వీర్ అల్హాబాదియా ఇటవలే ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో యూట్యూబ్ ఆ వీడియోను కూడా ఇప్పటికే డిలీట్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అస్సాంలోనూ అల్హాబాదియాపై కేసు నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అల్హాబాదియా తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
తప్పుడు కేసులతో పోలీసులు వంశీని వేధిస్తున్నారు
-
వల్లభనేని వంశీపై కేసులో కుట్రకోణం: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో కచ్చితంగా కుట్ర కోణం ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్లు వెనుకుండి నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. సాంకేతికంగా చూస్తే హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్ను విచారించలేదని పేర్కొన్నారు. టీడీపీ కక్షసాధింపులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్రెడ్డి హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దాదాపు 90 మందిని అక్రమంగా ఇరికించారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తారీఖున కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చారు.కేసు వెనక్కి తీసుకోవాలని నిన్ను ఎవరైనా బెదిరించారా అని జడ్జి ప్రశ్నించినప్పుడు కూడా నా అంతట నేనే ఇష్టపూర్వకంగానే వచ్చానని సత్యవర్ధన్ చెప్పిన మాటలను జడ్జి రికార్డు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలని భావించిన తెలుగుదేశం నేతలు సత్యవర్ధన్ వాగ్మూలంతో ఉలిక్కిపడ్డారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రలోభాలు పెట్టారు. ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ సోదరుడితో నా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయించి మరో కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ వెళ్లి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ అడిగితే చిత్తు పేపర్ మీద అక్కడిక్కడే పెన్నుతో రాసి ఒక నోటీస్ ఆయన చేతుల్లో పెట్టారు.విశాఖలో సత్యవర్థన్ను కాపాడామంటూ కొత్త డ్రామాఫిబ్రవరి 13వ తేదీన సత్యవర్ధన్ను విశాఖలో కాపాడామని పోలీసులు కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ సీసీ టీవీ వీడియో చూస్తే సత్యవర్ధన్ను బెదిరించి పోలీసులే లాక్కుని వెళ్తున్నట్టు ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే సత్యవర్ధన్ను పోలీసులు విశాఖ నుంచి తీసుకొచ్చారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయాలి. కానీ సాంకేతికంగా చూస్తే సత్యవర్ధన్ను విచారించకుండానే వంశీకి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇదీ చదవండి: అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్పై వైఎస్ జగన్ ఫైర్వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే పోలీసులు విశాఖలో సత్యవర్ధన్ను పట్టుకొచ్చారని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్గా వంశీని కేసులో ఇరికించడానికే టీడీపీ పన్నాగం పన్నింది. ముందుగా అనుకున్నట్టుగా నాన్ బెయిలబుల్, జీవితఖైదుకు సంబంధించిన సెక్షన్లతో పోలీసులు కేసులు సిద్దం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వంశీని విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు, నోటీస్ ఇవ్వడం తప్ప.. ఏ కేసులో, ఎందుకు తీసుకొచ్చింది, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. నాలుగైదు స్టేషన్లలో తిప్పి రాత్రి 11.45గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చి, 12 గంటలకు ఎఫ్ఐఆర్ రాశారు. ఈ మధ్యలో వంశీని ఎలా ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు, లోకేష్, డీజీపీ చర్చించుకున్నట్టుగా అర్థం అవుతోంది.చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే..ఈ తతంగమంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగానే పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అధికారులుగా ఎవరుండాలి, దర్యాప్తు చేసి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరెవర్ని సాక్ష్యులుగా తీసుకోవాలి, ఎవర్ని కేసుల్లో ఇరికించాలి, ఇలాంటివన్నీ కూటమి నాయకులే చెప్పడం దానిని పోలీసులు తుచ తప్పకుండా అమలు పరచడం కనిపిస్తోంది.ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పోలీసులకు ఇదే పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతి పరులను అక్రమ కేసులతో వేధించి జైలు పాలు చేయడం, వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేస్తున్నారు. న్యాయస్థానాలంటే గౌరవం లేదుచట్టాలన్నా, న్యాయస్థానాలన్నా కూటమి ప్రభుత్వానికి భయం కానీ, గౌరవం కానీ లేదని ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో పోలీస్ స్టేషన్లకు చెందిన సీసీ టీవీ ఫుటేజ్లు అడిగితే ఇవ్వనందుకు సాక్షాత్తు హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఎప్పుడడిగినా ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని, మా ఆదేశాలను ధిక్కరిస్తే డీజీపీనే కోర్టుకు రప్పిస్తామని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం లెక్క చేయడం లేదంటే న్యాయస్థానాల మీద వారికున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దెందులూరులో ఒక పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన కారుకు అడ్డం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోపాటు ఆయన డ్రైవర్, ఇతర అనుచరుల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. ఎమ్మెల్యేనే దారుణంగా దుర్భాషలాడి తిరిగి ఆతనే వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టించాడు. నిందితులే బాధితులపై కేసులు పెడుతున్న దారుణాలు నిత్యం జరుగుతున్నాయి.తాము అనుసరిస్తున్న విధానాలు కరెక్టో కాదో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మేం చేయబోయే పోరాటంలో పోలీసులే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. డీజీపీ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు తప్పు చేసింది ఎవరైనా వదిలే ప్రసక్తే ఉండదు. చీఫ్ సెక్రటరీ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందర్నీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం. -
పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉంది: వల్లభనేని వంశీ
-
Munich: జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు
బెర్లిన్: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గురువారం సిటీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ జరుగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిపిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధాని ఇది. శుక్రవారం ఈ నగరంలో భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ కాన్సరెన్స్ను హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఘటనలో గాయపడ్డవాళ్లంతా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లేనని సమాచారం. -
నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య
సాక్షి, విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్ఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. తమను పోలీస్స్టేషన్ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి పోలీసులు పంపించారు.వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు: జగన్మోహన్రావువైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారని మండిపడ్డారు. లోకేష్ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారని.. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందేనన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని జగన్మోహన్రావు అన్నారు.వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదు: లాయర్ చిరంజీవిసుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదని.. ఆయనను కావాలనే అరెస్ట్ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్ చిరంజీవి అన్నారు. -
ప్రతీకారంతో అరెస్టులు.. వల్లభనేని వంశీ అరెస్ట్ పై భూమన రియాక్షన్
-
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పోలీసులు
-
పోలీసుల తీరుతో వల్లభనేని వంశీ భార్యకు ఇక్కట్లు
ఎన్టీఆర్, సాక్షి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆయన భార్య పంకజ శ్రీ(Pankaja Sri) సైతం ఇబ్బందికి గురయ్యారు. అడుగడుగునా పోలీసులు ఆమెను అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అప్పటికప్పుడు ఆయన భార్య చేతిలో నోటీసులు పెట్టి తెలియజేశారు. ఆ పరిణామంతో ఆమె కంగారుపడిపోయారు. భర్త కోసం పోలీసుల వెనకాలే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో నందిగామ(Nandigama) వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. కంచికచర్ల సీఐ ఆ వాహనంలో కూర్చున్నారు. ఇదేమిటని అడిగితే.. వాళ్ల నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న ఆ కారుని పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు. మునగచర్ల వద్ద పర్వతనేని సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్ డ్రైవింగ్ స్కూల్ వద్ద ఆమెను, డ్రైవర్ను పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకుని.. ఆపై విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఆమె నేరుగా కృష్ణలంక పీఎస్కు చేరుకోగా.. అక్కడా ఆమెను వంశీని చూసేందుకు అనుమతించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలు జరిగింది ఇదే..! -
పేర్ని నాని హౌస్ అరెస్ట్...
-
AP High Court: న్యాయం అందరికీ ఒకటే..
-
విజయపాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
గుంటూరు లీగల్: సీఐడీ విశ్రాంత అధికారి ఆర్.విజయపాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు విజయపాల్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో రెండో అడిషనల్ జిల్లా సెషన్ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను ఆయనకు మంజూరు చేసింది. -
మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, విజయవాడ: మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తన భర్త రమణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ భార్య లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పోలీసులపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారంటూ సీరియస్ అయ్యింది. ‘‘రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగేనా ఉండాల్సింది..?. తమ ముందున్న కేసుల్లో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల చర్యలపై డీజీపీని పిలిపించి వివరణ కోరతాం’’ అని పేర్కొన్న హైకోర్టు.. రమణను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.ఈ కేసులో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: మరో వీడియో విడుదల చేసిన కిరణ్ రాయల్ బాధితురాలు -
పోలీసులకు మా ఆదేశాలంటే.. గౌరవం లేదు: హైకోర్టు
-
పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు
కోర్టు ఎప్పుడు సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగినా, ఆ వెంటనే అది మిస్టీరియస్గా మాయమైపోతోంది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసు? ప్రతి పోలీస్స్టేషన్లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తాం. లేకపోతే ప్రతి సీసీ టీవీ ఫుటేజీ మాయమవుతూనే ఉంటుంది. కోతుల వల్ల సీసీ టీవీ కాలిపోయిందంటే మేం నమ్మాలా? తప్పులను సమర్ధించుకోవద్దు. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలపై ఏ మాత్రం గౌరవం ఉండటం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత పోలీస్స్టేషన్లోని సీసీ టీవీ ఫుటేజీని తమ ముందుంచాలని ఆదేశాలు ఇచ్చినప్పుడే, ఆ సీసీ టీవీ పుటేజీ మాయమవుతోందని తెలిపింది. ఇది చాలా మిస్టీరియస్గా మాయమవుతోందని, పోలీసులు చెబుతున్న కారణాలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ప్రతి పోలీస్స్టేషన్లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కోతుల కారణంగా సీసీ టీవీ ఎస్ఎంపీఎస్లోని సర్క్యూట్ కాలిపోయిన కారణంగా సీసీ టీవీ ఫుటేజీని కోర్టు ముందుంచలేక పోతున్నామన్న పోలీసుల వాదనను హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. సర్క్యూట్ కాలిపోవడం చేత సీసీ టీవీ ఫుటేజీ రికవరీ చేయడం సాధ్యం కాదంటూ సౌత్రిక టెక్నాలజీస్ ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఆ నివేదికలోని సంతకాలు, సీలు తేడాగా ఉన్నాయంది. ఈ నేపథ్యంలో కాలిపోయిన సీసీ టీవీ పరికరాలను తామే స్వయంగా పరిశీలిస్తామని తెలిపింది. ఆ పరికరాలను తదుపరి విచారణ సమయంలో తమ ముందుంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీ టీవీ కాలిపోయిందని.. అందువల్ల ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్స్టేషన్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)పై జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్పీ చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవంది. ఇంక్రిమెంట్లో కోత సరిపోదని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తన సోదరుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కాటారి నాగరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.సోదరుడి అక్రమ నిర్బంధంపై సీసీటీవీ ఫుటేజీ కోరుతూ పిటిషన్...తన సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 7వ తేదీనే అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్స్టేషన్లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీకి సంబంధించిన ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ కూడా ఆయన ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం.. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని పెన్ డ్రైవ్లో ఉంచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే సీసీ టీవీ కాలిపోయిందని, అందువల్ల ఆ ఫుటేజీని ఇవ్వలేమంటూ మాచవరం పీఎస్ స్టేషన్హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) అఫిడవిట్ వేశారు. దీనిపై మండిపడ్డ హైకోర్టు, పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతూ ఆ ఫుటేజీలను తమ ముందుంచడం లేదని తప్పు పట్టింది. ఇలాంటి తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎస్హెచ్వోపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.కోతుల వల్ల కాలిపోయింది.. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషనర్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్కు ఏ మైనా హాని ఉందా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణు తేజ స్పందిస్తూ, కోతుల వల్ల వైర్లలో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందన్నారు. సీసీ టీవీ కెమెరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మాచరం ఎస్హెచ్వోపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారని, ఏడాది పాటు ఇంక్రిమెంట్లో కోత విధించారని తెలిపారు. ఎస్ఎంపీఎస్ సర్క్యూట్ కాలిపోయిందని, ఇది బయటకు కనిపించదని, అందువల్ల ఫుటేజీని రికవరీ చేయడం సాధ్య పడలేదని వివరించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు గౌరవం ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పోలీసులకు కోర్టు ఆదేశాలంటే ఏ మాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఎప్పుడు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని అడిగినా, ఆ వెంటనే ఆ ఫుటేజీ మిస్టీరియస్గా మాయమైపోతోందని తెలిపింది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. కోతుల వల్ల సీసీ టీవీ సర్క్యూట్ కాలిపోయిందంటే మేం నమ్మలా? అంటూ ప్రశ్నించింది. తప్పులను సమర్థించుకోవద్దని వ్యాఖ్యానించింది. కాలిపోయిన సీసీ టీవీని తామే స్వయంగా చూస్తామని, అందుకు సంబంధించిన అన్ని పరకరాలను తమ ముందుంచాలని ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. -
Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే..
కాఠ్మాండు: నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్లోని బాగమతి ప్రాంతంలో అరెస్టు చేశారు. వీరు ఆన్లైన్లో అక్రమంగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. నేపాల్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వీరు కాఠ్మాండుకు 10 కిలోమీటర్ల దూరంలోని బుద్ధనిలకంఠ ప్రాంతంలోని రెండస్తుల భవనంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక రహస్య సమాచారం మేరకు ఒక భవనంపై దాడి చేసి, 23 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 81 వేల రూపాయలు, 88 మొబైల్ పోన్లు, 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని యాంటీ గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం నేపాల్ పోలీసులు కోట్ల రూపాయల విలువైన ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను చేధించారు.అలాగే పది మంది భారతీయులతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. లలిత్పూర్లోని సనేపా ప్రాంతంలో రెండు ఇళ్లపై ప్రత్యేక పోలీసు బృందం దాడి చేసి, ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మంది భారతీయ పౌరులు, 14 మంది నేపాలీ జాతీయులను అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారని నేపాల్ పోలీసులు తెలిపారు. నిందితులు రెండు అద్దె ఇళ్లలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్రాజ్ సంగమం స్టేషన్ మూసివేత -
రంగరాజన్పై దాడి..పోలీసుల కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం(ఫిబ్రవరి10) కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ వెల్లడించారు.పూజారి రంగరాజన్పై దాడి కేసులో సోమవారం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్కు చెందినవారని చెప్పారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని,రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని నిందితులు రంగరాజన్ను డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఇందుకు నిరాకరించడంతో రంగరాజన్పై వారు దాడి చేసినట్లు వెల్లడించారు.2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ స్థాపించాడు: డీసీపీవీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించాడని,సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ రామరాజ్యంపై ప్రచారం చేశాడని డీసీపీ తెలిపారు. రామరాజ్యంలో చేరితే రూ.20వేలు జీతం ఇస్తానని చెప్పాడన్నారు. తణుకు,కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించాడని,రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడన్నారు. ఈ నెల 6న అందరూ యాప్రాల్లో కలిశారన్నారు. రామరాజ్యం బ్యానర్తో ఫొటోలు,వీడియోలు తీసుకున్నారని తెలిపారు. వాటితో సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. ఈ నెల 7న మూడు వాహనాల్లో వీరరాఘవరెడ్డి అనుచరులు 25మంది నల్ల దుస్తుల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్పై దాడి చేసినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం అని డీసీపీ తెలిపారు. -
పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!
ఎంత పెద్ద ఫేమస్ సింగర్ అయినా ఒక్కోసారి ఊహించని చేదు అనుభవాలు ఎదురవ్వుతుంటాయి. ముందుగా ప్లాన్ చేసుకుని, పర్మిషన్ తీసుకున్నా ఒక్కోసారి అవమానపాలుకాక తప్పదనేలా ఉంటాయి పరిస్థితులు. హుందాగా, నిజాయితీగా వ్యవహరించినా..అధికార దర్పం ముందు తలవంచక తప్పదేమో ఒక్కసారి. ఇదంతా ఎందుకంటే..నాలుగుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకుని, పాప్ ఐకాన్గా పేరుగాంచిన సింగర్కి బెంగళూరులో అనుకోని పరిణామాన్ని చవిచూశాడు. ఏం జరిగిందంటే.. బ్రిటిష్ గాయకుడు-గేయ రచయిత ఎడ్ షీరన్ బెంగళూరులో చర్చి స్ట్రీట్లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రదర్శన ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఒకటికి మించి రెండు పాటలతో అలరించబోతున్నా అంటూ మొదలు పెట్టారాయన. షీరన్ ముందుగా మొటి పాట అనగానే ఒక పోలీసు ఎంట్రీ ఇచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు.ఆయన ప్రదర్శన జరగకుండా స్పీకర్లను కూడా డిస్కనెక్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉండగా, ఎడ్ షీరన్ మాత్రం ముందుస్తు ప్రణాళికతోనే ఈ ప్రదర్శన ప్లాన్ చేశామన్నారు. ఇలా రోడ్డుపై ప్రదర్శన ఇచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తామేమి అకస్మాత్తుగా అప్పటికప్పుడూ ఇలా ప్రదర్శన ప్లాన్ చేయలేదంటూ ఇన్స్టాగ్రామ్లో వివరణ ఇచ్చారు. కాగా, షేప్ ఆఫ్ యు, థింకింగ్ అవుట్ లౌడ్, పర్ఫెక్ట్ అండ్ కాజిల్ ఆన్ ది హిల్ వంటి హిట్ పాటలకు పేరుగాంచిన పాప్ రాక్ ఐకాన్ ఎడ్ షీరన్. అతని ఆల్బమ్లు హాటకేక్లా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అమ్ముడైపోయాయి. ఆయన జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు భారత్లో పర్యటించనున్నారు.A police officer pulled the plug when Ed Sheeran surprised everyone on Church Street😂😭😭😭 pic.twitter.com/cMIRoLC7Mk— Naai sekar (@snehaplsstop) February 9, 2025 (చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్గా మార్చి..) -
ఆరున్నొక్కరు.. జారితే దక్కరు
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ ఓ వైపు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు లెక్కచేయడం లేదు. విజయవాడ అజిత్సింగ్ నగర్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలతో బైక్పై ఇలా దౌడు తీస్తూ ఫొటోకి చిక్కాడు. - సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడబంతికాదది భానుడే చీకట్లను చీల్చుకుని వెలుగులు వెదజల్లుతూ పైకి వస్తున్న బాలభానుడు ఇలా ఓ దీపస్తంభంపైన ఎర్రని బంతి ఉంచినట్లు కనిపించాడు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప సండే సందడివారమంతా పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపిన నగరప్రజలు ఆదివారం వచ్చేసరికి ఇలా సముద్ర తీరానికి చేరుకుని సేదతీరారు. పర్యాటకుల సందడితో ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కేబీచ్ ఇలా సందడిగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసుల భద్రతా చర్యలు
తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan) నివాసం వద్ద కూటమి నేతలు తరచూ గొడవలు చేయడం, ఇటీవల ఆయన ఇంటిముందు పార్కుకు నిప్పుపెట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు భద్రత(Police security) చర్యలు చేపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం(YSRCP central office) పరిసరాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం ఉండే రోడ్డులో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రాకపోకలను పరిశీలించే విధంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రధాన గేటు వద్ద రెండు సీసీ కెమెరాలు, భరతమాత సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు, కుంచనపల్లి–ప్రాతూరు అండర్ పాస్ నుంచి బకింగ్హామ్ కెనాల్ మీదుగా వడ్డేశ్వరం వెళ్లే మార్గాల్లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి నిత్యం తాడేపల్లి సీఐతోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. -
జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. పోలీసులకు బాధితురాలి మరో ఫిర్యాదు!
సాక్షి,తిరుపతి : తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్గా మారింది.తాజాగా,తన కుటుంబంపై కిరణ్ రాయల్ బెదిరింపులకు దిగుతున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. తన ఇద్దరు కుమారుల్ని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారని ఆదివారం సాయంత్రం లక్ష్మి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కిరణ్ ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇప్పించాలని ఫిర్యాదులో కోరింది. -
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్ఫోన్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్ఫోన్ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
Mettuguda Incident: అంతా కట్టుకథేనా!
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్కు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సమాచారం. బాధితుడే.. నిందితుడు... ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్పాల్, వినయ్లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. -
గచ్చిబౌలి కాల్పుల కేసు.. బస్సులో పరిచయం.. సీన్ కట్ చేస్తే
సాక్షి, హైదరాబాద్: ప్రిజం పబ్బు కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్ను గచ్చిబౌలి పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్పై కోర్టు.. సోమవారం విచారణ చేయనుంది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న(గురువారం) సాఫ్ట్వేర్ రంజిత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. . ప్రభాకర్కు రంజిత్ బస్సులో పరిచయం అయ్యాడు. ప్రభాకర్కు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చి హెల్ప్ చేసిన రంజిత్.. ఇద్దరు బీహార్కు వెళ్లి గన్స్ కొనుగోలు చేశారు. ప్రభాకర్ అరెస్ట్తో పారిపోయిన రంజిత్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ జరిగింది..పశ్చిమగోదావరి జిల్లాలోని గోపవరం గ్రామానికి చెందిన మిన్నీ రంజిత్ 2022లో రాజమండ్రిలో ఓ ఆర్టీసీ బస్సులో బత్తుల ప్రభాకర్కు పరిచయమయ్యాడు. ఈ నెల 1వ తేదీన ప్రభాకర్, రంజిత్, రోహిత్లు కారులో బీర్లు తాగుతూ ఐటీ కారిడార్లో తిరిగారు. ఈ క్రమంలో కారు బ్రేక్డౌన్ కావడంతో గ్యారేజ్కు వెళ్లారు. ఆ సమయంలోనే ప్రభాకర్ ఫోన్చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రీజం పబ్కు వెళ్లాడు. ఊహించని రీతిలో పోలీసులు పట్టుకోవడంతో కాల్పులు జరపగా, హెడ్కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి గాయాలైన విషయం తెలిసిందే. బిహార్లో ఉద్యోగం చేస్తున్న రంజిత్కు 2023లో ఐటీ కారిడార్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కేపీహెచ్బీలో ఉంటున్న సమయంలో తరచుగా ప్రభాకర్ అతని వద్దే ఉండేవాడు. అక్కడి నుంచి రంజిత్ వట్టినాగులపల్లిలోని ఓ అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ ఇరుకుగా ఉందని చెప్పి నార్సింగిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్ను రంజిత్ పేరిట బత్తుల ప్రభాకర్ అద్దెకు తీసుకున్నారు. కొద్ది నెలల తర్వాత ఒడిశాకు చెందిన ఓ యువతితో ప్రభాకర్ సహజీవనం చేశాడు.ఇదీ చదవండి: మమత హత్య కేసు.. వీడిన మిస్టరీదీంతో రంజిత్ గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో స్నేహితుడు రోహిత్తో కలిసి ఉంటున్నాడు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి రంజిత్ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకొని ఆ తర్వాత డబ్బు తిరిగిఇచ్చేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడటంతో రంజిత్ యూపీఐలు, క్రెడిట్ కార్డులను ప్రభాకర్ వాడుకున్నాడు. రంజిత్ పేరిట కొనుగోలు చేసిన కారులోనే పబ్లు, జిమ్లకు వెళ్లేవారు.గన్లు కావాలని అడగ్గా, రంజిత్ బిహార్లో తనకు తెలిసిన వారిని పరిచయం చేశాడు. వారి ద్వారా మూడు కంట్రీమేడ్ గన్లను ప్రభాకర్ కొనుగోలు చేశాడు. గన్ల కొనుగోలులో రంజిత్ ప్రమేయం ఉండటం, బ్యాంక్ లావాదేవీలు రంజిత్ ద్వారానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు కారులో రంజిత్తో పాటు రోహిత్ కూడా ఉన్నాడని, ప్రభాకర్ లావాదేవీలు, చోరీల్లో అతని ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. ఏ 2 రంజిత్ నుంచి కారు, కేటీఎం బైక్, ఫోన్, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
లగచర్లలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, వికారాబాద్ జిల్లా: దుద్యాల మండలం లగచర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామిక వాడ కోసం భూసేకరణలో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు రోటిబండ తండా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని వెళ్లకుండా వారించారు. దీంతో గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గిరిజనులు ప్లకార్డులు చేతబూని తమ నిరసన తెలిపారు.మా అనుమతి లేకుండా పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీస్ పహారా మధ్య అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్లకుంట తండాలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం దాదాపు 13 వందల ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లి కలెక్టర్తో పాటు పలువురు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు.ఈ ఘటన సంచలంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది రైతులు జైలు పాలయ్యారు. ప్రస్తుతం వాళ్లు బెయిల్పై విడుదలయ్యారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. తర్వాత అక్కడే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారుఇందులో భాగంగా ఇవాళ రోటిబండ తండాకు అధికారులు సర్వే చేసేందుకు రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించి రైతులను సర్వేవైపు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలం పరిశ్రమల కోసం లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పోలీసుల నిర్భందంతో సర్వేచేయటంపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే సర్వే నిలిపివేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్య మంటున్నారు గిరిజన మహిళలు. -
అర్ధరాత్రి దౌర్జన్యంగా పేదల ఇళ్లు కూల్చేసిన పోలీసులు
-
మమత హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఐదురోజుల క్రితం వెలుగులోకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లికి చెందిన మమతను జనవరి 27న హత్య చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేసిన విషయం తెలిసిందే. అయితే, వివాహేతర సంబంధమే మమత హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. గత నెల 27న తన కుమారుడితో కలిసి బెల్లంపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయినా ఆమె.. కరీంనగర్ జిల్లా కొండనపల్లి శివారులో శవమై కనిపించింది. తల్లితో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు కూడా కనిపించకుండా పోయాడు. నిందితులు పరారైన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెన్నైలోని ఒక లాడ్జిలో బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడి.. నానమ్మకు అప్పగించారు.మృతురాలు మమత.. భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్తో కలిసి ఉంటుంది. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారించారు. భాస్కర్ సోదరి, ఆమె స్నేహితుడు రఘు, సుపారీ కిల్లర్ కల్యాణ్, భాస్కర్ తండ్రి, సోదరి సమీప బంధువును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
పోలీసుల తీరుపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
స్వీడన్లో కాల్పులు.. 10 మంది మృతి
ఒరెబ్రో: ప్రశాంత వాతావరణానికి మారుపేరైన స్వీడన్లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని స్టాక్హోంకు 200 కిలోమీటర్ల దూరంలోని ఒరెబ్రోలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నగర శివార్లలోని రిస్బెర్గ్స్కా వయోజన విద్యా కేంద్రం క్యాంపస్లో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ప్రైమరీ, అప్పర్ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడే వలసదారులకు స్వీడిష్ బోధిస్తారు. తరగతులు ముగియడంతో చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, కాల్పుల సమయంలో అక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.మృతుల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతడొక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావించడం లేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు. ఘటన ప్రాంతంలో భీతావహ పరిస్థితిని బట్టి చూస్తే మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని ఓ అధికారి చెప్పడం గమనార్హం. దారుణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికైతే ఉగ్ర లింకులున్నట్లు చెప్పలేమన్నారు. అధికారులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు. -
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. సెక్రటరియేట్ను బాంబుపెట్టి పేల్చేస్తాంమంటూ అగంతకుడు సీఎం రేవంత్రెడ్డి పీఆర్ఓపీకి ఫోన్ చేశాడు. బెదిరింపులతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ పోలీసులు తెలంగాణ సెక్రటరియేట్లో తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చి చెప్పారు. మూడు రోజుల నుంచి అగంతకుడు బెదిరింపు కాల్స్ చేశాడు. అగంతకుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఎందుకు బెదిరింపు కాల్స్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నం చేసిన టీడీపీ గూండాలు
-
ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
కోట: రాజస్థాన్లోని కోటలో జరిగిన ఎన్కౌంటర్ ఊహించని మలుపుతిరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందాడని భావిస్తున్న 24 ఏళ్ల నేరస్తుడు బతికే ఉన్నాడని, ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తేలిడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆదివారం నాడు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు అతను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు భావించారు. అయితే ఈ ఉదంతంలో చోటుచేసుకున్న మలుపును పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు రుద్రేష్ అలియాస్ ఆర్డీఎక్స్ ఆదివారం నాడు కోట పరిధిలోని నయా నోహ్రాలోని ఒక ఇంట్లో దాక్కున్నప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రుద్రేష్ తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులు భావించారు. కాగా ఆ సమయంలో రుద్రేష్ సహచరుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు.ఈ ఘటన అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం రుద్రేష్ కుటుంబ సభ్యులు మృతుడిని ప్రీతమ్ గోస్వామి అలియాస్ టీటీగా గుర్తించారు. అతను కూడా పేరుమోసిన నేరస్తుడేనని డిఎస్పీ లోకేంద్ర పలివాల్ తెలిపారు. ఇంతలో రుద్రేష్ తన స్నేహితుల్లో ఒకరికి పోన్ చేసి, తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆ మిత్రుడు రుద్రేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.సీసీటీవీ ఫుటేజ్లోని ఫీడ్ ప్రకారం పోలీసు బృందం రాకముందే రుద్రేష్ అక్కడి నుంచి పారిపోయాడని డీఎస్పీ తెలిపారు. అతని ముఖం ఛిద్రమై ఉండటం, గదిలో అతని వస్తువులు కొన్ని కనిపించడంతో, ఆ మృతదేహాన్ని పోలీసులు రుద్రేష్గా గుర్తించారు. పోలీసులు రుద్రేష్ ఇంటి నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రుద్రేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు -
Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేపు (ఫిబ్రవరి 5) మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పొలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఒక కోటీ 55 లక్షల మంది ఓటర్లు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలను ఢిల్లీ అంతటా మోహరించారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రంతా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించారు. 35 వేలకు పైగా పోలీసులను ఎన్నికల విధుల్లో నియమించారు. 220 కంపెనీల కేంద్ర రిజర్వ్ దళాలను కూడా భద్రత కోసం రంగంలోకి దింపారు. 19 వేల మంది హోమ్ గార్డ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు ఢిల్లీ విడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు వేయనున్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఢిల్లీలో గరిష్ట ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్ద ఎంత జనసమూహం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్కు ఇక్కడున్న బలమైన ఉనికి ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చింది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అతిషి నియోజకవర్గంలో మూడు ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల్కాజీ, కస్తూర్బా నగర్లలో రోడ్ షో చేశారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్తో భేటీ? -
'రాజ్ తరుణ్తో విడిపోవడానికి అతనే కారణం'.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య!
లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు..పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి. ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)అసలేం జరిగిందంటే..టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గతేడాది సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్కు రిలేషన్ ఉందని గతంలో లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది. -
టార్గెట్ రూ.333 కోట్లు!.. 100 మంది యువతులతో సన్నిహితంగా..
గచ్చిబౌలి: ఎప్పటికైతే తాను రూ.333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని భావించాడు బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టూ. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై రెండు వైపులా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపింది ఇతగాడే. సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా.. చదివింది ఎనిమిదో తరగతి.. పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. రూ.3 వేల చోరీతో మొదలుపెట్టి... బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడి వైపు 3, ఎడమ వైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాడిని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం రూ.3 వేల నుంచి చోరీ మొదలైందని, అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ‘3’ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రూ.333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని బయటపెట్టాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాస వంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 అలా ఉన్నట్లు చెప్పాడు. గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్స్పేస్ సమీపంలోని ఫ్లాట్లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్లింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్ను తనిఖీ చేసినప్పుడు రూ.50 వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ లభించింది. ప్రతిరోజూ ఉదయం జిమ్కు వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్.. సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. స్నేహితులకూ భారీగా ముట్టచెబుతూ... ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు -
డ్రగ్స్ మూలాలపై ఏఎన్బీ గురి
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ ముఠాల కట్టడిపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్బీ) మరింత ఫోకస్ పెట్టింది. మత్తు పదార్థాలు వాడేవారు, సరఫరా చేసే పెడ్లర్ల వరకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉంటూ డ్రగ్స్ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న కింగ్పిన్ (కీలక నిందితు)లను కూడా పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. మత్తు ముఠాలను మూలాల నుంచి పెకిలించేలా మెరుపు దాడులకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మాదకద్రవ్యాల కేంద్రాలపై ఆకస్మిక దాడులకు రంగం సిద్ధం చేసినట్టు టీజీఏఎన్బీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 1,942 ఎన్డీపీఎస్ కేసులలో టీజీఏఎన్బీ 4,682 మందిని అరెస్ట్ చేసింది. రూ.143 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. మూలాలపై ఫోకస్ మత్తుపదార్థాల రవాణా, విక్రయం వ్యవస్థీకృత నేరంగా మారింది. ఈ దందాలోకి దిగినవారు మళ్లీ బయటికి రాలేక మరింత లోతుకు కూరుకుపోతున్నారు. ఏజెంట్లు కింగ్పిన్స్గా, కస్టమర్లు సప్లయర్లుగా మారుతూ మరింత ముదిరిపోతున్నారు. ప్రధానంగా గోవా, ముంబై, బెంగళూరులో డ్రగ్స్ కింగ్పిన్స్ తలదాచుకుంటున్నారు. హైదరాబాద్లో పోలీస్ నిఘా పెరగడంతో నైజీరియన్ గ్యాంగ్ బెంగళూరుకు మకాం మార్చింది. దీంతో హైదరాబాద్లో సప్లయర్లు, కస్టమర్లు తప్ప కింగ్పిన్స్ చిక్కడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తవారి ద్వారా, సరికొత్త మార్గాల్లో సరుకును మార్కెట్లోకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉండి మన రాష్ట్రంలో డ్రగ్స్ దందా నడుపుతున్న కీలక వ్యక్తులపై ఏఎన్బీ దృష్టి పెట్టింది.పట్టుబడిన పెడ్లర్లు, సప్లయర్లు, కస్టమర్లతోపాటు డీఆర్ఐ, నార్కోటిక్స్ బ్యూరో నుంచి సేకరించిన డేటా ఆధారంగా టీజీ ఏఎన్బీ స్పెషల్ ఆపరేషన్స్కు ప్రణాళిక రూపొందించింది. కింగ్పిన్స్ స్థావరాలు, వారి మొబైల్ నంబర్లు, ద్వితీయ శ్రేణి సప్లయర్ల వివరాలను సేకరించి, మెరుపు దాడులకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ ఓ డ్రగ్స్ ముఠాకు మహారాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్లతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధంచేసింది.కీలకంగా డాగ్ స్క్వాడ్అనుమానిత ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు చేసే తనిఖీల్లో బాంబ్ స్క్వాడ్ తరహాలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ను కూడా అధికారులు సిద్ధం చేశారు. సుమారు 120 జాగిలాలకు అత్యత్తమ శిక్షణ పూర్తి ఇచ్చారు. వీటిని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైళ్లలో తనిఖీ చేసేందుకు ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద సెర్చ్ ఆపరేషన్స్లోనూ వీటిని ఉపయోగించనున్నారు. -
చిల్లర చోరీల నుంచి భారీ దోపిడీలకు..
గచ్చిబౌలి: పోలీసులపై కాల్పులు జరిపిన కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ (28) త్వరలో మరో రెండు భారీ దోపిడీలకు ప్రణాళిక వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అతడు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో శనివారం రాత్రి సీసీఎస్ కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపిన అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి మూడు దేశీయంగా తయారైన పిస్టళ్లు, 451 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహ తెలిపారు. ఆదివారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్కు శనివారం రాత్రి 7.30 గంటలకు వచ్చినట్లు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్ రెడ్డి, వీరస్వామి, ప్రదీప్రెడ్డిలు అక్కడికి వెళ్లి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతలోనే ప్రభాకర్ తన జేబులోని పిస్టల్ తీసి రెండు రౌండ్లు కాల్పులు జరపగా, వెంకట్రెడ్డి పాదానికి బుల్లెట్ గాయమైంది. ప్రభాకర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ప్రదీప్రెడ్డి, వీరస్వామిలతోపాటు పబ్ బౌన్సర్లు కలిసి అతి కష్టంమీద పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి నుంచి రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నార్సింగిలోని అతడి నివాసం నుంచి మరో కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు 7.6 ఎంఎం 451 బుల్లెట్లు, రూ.62 వేల నగదు, సెల్ ఫోన్, దోపిడీకి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీలలోనే చోరీలు ఏపీలోని పశ్చిమగోదావరి, వైజాగ్ ప్రాంతాలలో 2013 నుంచి ప్రభాకర్ చోరీలు చేస్తుండేవాడు. 66 కేసుల్లో జైలుకు వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడు. 21 చోరీల్లో రూ.2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తరువాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్లో మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్ కాలేజీలో రూ.8 లక్షలు చోరీ చేశాడు. జనవరిలో వీజేఐటీలో రూ.16 లక్షలు దోచుకున్నాడు అని పోలీసులు తెలిపారు. శత్రువును చంపేందుకు పిస్టల్స్ కొనుగోలువైజాగ్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఓ ఖైదీ బత్తుల ప్రభాకర్ను అవమానించటంతో అతడిని చంపేందుకు పిస్టల్స్ను కొన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు త్వరలో రెండు పెద్ద దోపిడీలు చేసే ప్లాన్లో ఉన్నాడని చెప్పారు. బిహార్కు చెందిన అన్షు అనే వ్యక్తి ద్వారా పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుళ్లను డీసీపీలు అభినందించారు. ప్రభాకర్కు సహకరించినవారి కోసం గాలిస్తున్నారు. -
కర్ణాటకలో లొంగిపోయిన చివరి మావోయిస్టు
బెంగళూరు:కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఇటీవల చేసిన ప్రకటన నిజమైంది. రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తున్న తొంబట్టు లక్ష్మీ ఆదివారం(ఫిబ్రవరి2) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండర్ అయ్యారు.తనకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి లక్ష్మీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు.దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. సమీప ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం ప్రచారం చేయడంతోపాటు పోలీసులపై దాడి ఘటనల్లో ఆమెపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి.చాలా ఏళ్లుగా ఆమె ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం.ఇటీవల లక్ష్మీ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.సరెండర్ కమిటీ సభ్యుడు,గతంలో లొంగిపోయిన ఆమె భర్త సలీంతో కలిసి ఉడుపి పోలీసుల ముందుకు వచ్చారు.కాగా, కర్ణాటకను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మావోయిస్టుల సరెండర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే మావోయిస్టులకు మార్గం సుగమం అయింది. రెండురోజుల క్రితమే శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు రవీంద్ర నెమ్మార్ చిక్కమగళూరులో అధికారుల ముందు లొంగిపోయాడు. -
స్టార్ డాక్టర్ కిల్లర్గా మారితే ఇంత ఘోరంగా ఉంటుందా..!
వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా "వైద్యో నారాయణో హరి:" అని అంటారు. అలాంటి వైద్య వృత్తికి కళంకం వచ్చేలా చేశాడో వ్యక్తి. ప్రాణాలు కాపాడతాడని ఆశతో వచ్చిన వాళ్లందరిని పొట్టనబెట్టుకున్నాడు. తామెందుకు చనిపోతున్నామో తెలియకుండానే ఎందరో అమాయకులు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. కనీసం చిన్న క్లూ దొరక్కుండా పక్కాప్లాన్తో చంపేశాడు. సీరియల్ కిల్లర్కి మించిన కిరాతకుడు. ఒక్క హత్య మాత్రం అతడి ఆగడాలకు చెక్పెట్టి దొరికపోయేలా చేసింది. చివరికి ఆ దారుణాలు పశ్చాత్తాపంతో కుమిలిపోయి చనిపోయేలా చేసింది. అయితే అతడు ఎందుకు ఈ హత్యలన్నీ చేశాడన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది.డాక్టర్ డెత్గా పిలిచే ఈ వైద్యుడి పేరు హెరాల్డ్ షిప్మ్యాన్. బ్రిటన్కి చెందిన వ్యక్తి. అతడికేసు పోలీసులకు అర్థంకానీ మిస్టరీలా మిగిలింది. అతడు పోలీసులకు పట్టుబడినప్పుడు 50 మంది రోగులు చనిపోయారని తెలియగా..దర్యాప్తులో మాత్రం ఏకంగా 200 మందిని హతం చేసినట్లు తేలింది. వారిలో అత్యంత చిన్న బాధితుడు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండడం అత్యంత విషాదకరం. అయితే అతడి టార్గెట్ అత్యంత వృద్ధులే. వారి అయితే ఎలాంటి అనుమానం రాకుండా చంపేయొచ్చనేది అతడి ఆలోచన కావొచ్చనేది పోలీసుల అనుమానం. ఇక ఈ హెరాల్డ్ షిప్మాన్ డాక్టర్ అయిన వెంటనే వెస్ట్ యార్క్షైర్లో ఉద్యోగం పొందాడు. అతను ప్రిమ్రోస్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు కూడా. ఇంత మంచి జీవితాన్ని ఇలా ఎందుకు చీకటి మయం చేసుకున్నాడనేది అర్థంకానీ చిక్కుప్రశ్న.స్టార్ డాక్టర్ నుంచి కిల్లర్గా..1972లో, అతను 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు న్యుమోనియాతో బాధపడుతున్న నాలుగేళ్ల బాలికను చికిత్స పేరుతో హతం చేశాడు. బాలిక తల్లిని టీ తీసుకురమ్మని చెప్పి..హతమార్చాడు. అయితే ఆమె కూడా అనుమానించలేకపోయింది. ఎందుకంటే ఆమె అనారోగ్యంతోనే బాధపడటంతో ఆ ఆలోచనే ఆమెకు తట్లలేదు.ఎప్పుడైతే ఈ డాక్టర్ పట్టుబడ్డాడో అప్పుడామె తాను కూడా బాధితురాలినంటూ కోర్టు మందు ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది. అతడు వైద్యుడిగా వెస్ట్ యార్క్షైర్లో ఉన్న సమయంలో అతని సహచరులు పెద్ద మొత్తంలో నొప్పి నివారిణి పెథిడిన్ కనిపించకుండా పోయిందని గమనించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ హెరాల్డ్ మంచి డాక్టర్గా గుర్తింపు ఉండటంతో ఎవ్వరూ అతడిని అనుమానించే సాహసం చేయలేకపోయారు. ఈ డాక్టర్ మొదట అక్కడ పేషెంట్ల నమ్మకం పొందాక...తన ప్రణాళికను అమలు చేయడం మొదలు పెడతాడు. వృద్ధులనే టార్గెట్ చేసుకుని హత్యలకు పాల్పడుతాడు. ఒక్కొసారి వారిని ఇంటికి రమ్మని పిలచి మరీ హతమారుస్తుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోగికి కూడా వైద్యుడే తమను చంపుతున్నాడన్న విషయం తెలియదు. అయితే అతడితో చికిత్స పొందిన రోగులంతా చివరగా విపరీతమైన దగ్గుతో లేదా అంబులెన్స్కి ఫోన్ చేస్తూ మరణించినవారే..!. అలా 1998 వరకు ఇలాంటి దారుణాలకే పాల్పడుతూ వచ్చాడు.పట్టించిన కేసు..1998లో, అతను హైడ్ మాజీ మేయర్ కాథ్లీన్ గ్రండి (81)కి చికిత్స చేశాడు. ఆమె అత్యంత చురుకైన వ్యక్తి, మంచి ఆరోగ్యవంతురాలు, ధనవంతురాలు కూడా. అయితే ఆమె చెవులకు సంబంధించిన సమస్యతో అతడి వద్దకు వెళ్లింది. అతడిని సందర్శించిన నాలుగంటల్లోనే చనిపోయింది. ఇక్కడ కాథ్లీన్ గ్రండి కూతురు ఏంజెలా వుడ్రఫ్కి తన తల్లి మరణం సహజమైనది కాదనేది ఆమె అనుమానం. ఆ దిశగానే ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే ఆమె తల్లి అంత్యక్రియలు పూర్తి అయ్యిన నెలకు ఆమె వీలునామా గురించి ఆరా తీసింది. అందులో మొత్తం ఆస్తి అంతా డాక్టర్ హెరాల్డ్కి కట్టబెట్టినట్లుగా ఉండటంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. అదీగాక ఇక్కడ వుడ్రప్ లాయర్ కావడంతో పోలీసులతో కలిసి తన తల్లి హత్య కేసుని చేధించడం చాలా తేలికయ్యింది. ఆ క్రమంలోనే డాక్టర్ హెరాల్డ్ పట్టుబట్టాడు. అతడి శస్త్రచికిత్స చేసే రూమ్లో టైప్రైటర్ని గుర్తించారు పోలీసులు. అలాగే వీలునామాలో కూడా కాథ్లీన్ గ్రండి సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తేలుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వుడ్రఫ్ని డాక్టర్ హెరాల్డ్ ఆమె తల్లిని దహనం చేయమని కోరాడు. అయితే అందుకు వుడ్రఫ్ వ్యతిరేకించి తమ మతానుసారం ఖననం చేస్తుంది. ఎప్పుడైతే డాక్టరే నేరస్తుడని తేలిందో.. అప్పుడే వుడ్రఫ్కి ఈ సంభాషణ గుర్తుకొస్తుంది. ఆ రోజు హెరాల్డ్ ఎందుకని తన తల్లిని దహనం చేయమన్నాడన్న అనుమానంతో.. తన తల్లి సమాధి నుంచి అవశేషాలను వెలికి తీసి మరీ పోస్ట్మార్ట్ చేయిస్తుంది. నివేదికలో కాథ్లీన్ శరీరంలో ప్రాణాంతకమైన మార్ఫిన్ పెద్ద మొత్తంలో ఉన్నట్లు తేలుతుంది. దీంతో పోలీసులు సదరు వైద్యుడు హెరాల్డ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే 50 మంది రోగులను చంపినట్లు తేలుతుంది. కానీ పోలీసుల దర్యాప్తు ఆ సంఖ్య 200కి చేరుకుంటుంది. ఇంతమందిని పొట్టనబెట్టుకున్నాడా అని పోలీసులే విస్తుపోతారు. అయితే కోర్టు అతడు ఇంత మందిని హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? అతడి మనోస్థితి ఏంటో చెప్పాల్సిందిగా మానసిక నిపుణులను కోరింది. అయితే మానసిక నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పారు. ఒకరు అతడి తల్లి చిన్నతనంలో కేన్సర్తో బాధపడుతూ..ఆ నొప్పిని భరించలేక మార్ఫిన్ ఇంజెక్షన్లు తీసుకుందని అయినా ఫలితం లేక మరణించినట్లు తెలిపారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసి ఇలా చేస్తున్నట్లు చెప్పారు. మరికొందరూ నిపుణులు తనను తాను దేవుడిగా ఊహించుకుని మరణాన్ని శాసించాలన్న ఉద్దేశ్యంతో చేశాడని చెప్పుకొచ్చారు.అయితే హెరాల్డ్ మాత్రం కోర్టు ముందు హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు కానీ ఎందుకు చేశాడన్నది వివరించలేదు. చివరికి ఆ కిరాతకు వైద్యుడు హెరాల్డ్కి 2000 సంవత్సరంలో జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే రెండేళ్లకే తన 58వ పుట్టిన రోజునాడు తన జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆ డాక్టర్ అందమైన తన జీవితాన్ని ఎందుకు చేజేతులారా నాశనం చేసుకున్నాడనేది ఎవరికీ అర్థకానీ మిస్టరీలా మిగిలిపోయింది.(చదవండి: 'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!) -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
HYD: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీకి పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి1) కాల్పలు కలకలం రేపాయి. ఇక్కడున్న ఒక పబ్కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. మొత్తం రెండు రౌండ్లు పాత నేరస్తుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్లో పనిచేసే బౌన్సర్కు, కానిస్టేబుల్ వెంకట్రామ్రెడ్డికి గాయాలయ్యాయి. అయితే చివరకు ఆ పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజులు ఇంట్లోనే..
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ వారసిగూడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో నాలుగురోజుల క్రితం లలిత అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు సైతం తల్లితోపాటు ఆత్మహత్యకు ప్రయత్నించగా ధైర్యం సరిపోక విరమించుకున్నారు. దీంతో తల్లి మృతదేహంతో కుమార్తెలిద్దరూ నాలుగురోజుల పాటు ఇంట్లోనే ఉంపోయారు. దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ప్రశ్నించగా విషయం బయటపడింది.తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేవని కుమార్తెలు చెప్పడంతో విషయం పోలీసులకు చేరంది. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు -
ఇంటూరి రవికిరణ్పై ప్రకాశం జిల్లా పోలీసుల దురుసు ప్రవర్తన
సాక్షి, ప్రకాశం జిల్లా: సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్ను ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు షరతు మేరకు సంతకం పెట్టేందుకు ప్రకాశం జిల్లా మార్టూరు స్టేషన్కు వెళ్లిన ఇంటూరిని.. అక్కడ నుంచి పర్చూరుకు సిఐ తీసుకెళ్లారు. ఇంటూరి రవి కిరణ్.. ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.కిడ్నాపర్లలా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకొని గుర్తు తెలియని ప్రదేశంలో ఇంటూరి రవి కిరణ్ను వదిలేశారు. కనీసం ఏ కేసుపై తీసుకొని వెళ్ళారో కూడా చెప్పని సీఐ శేషగిరి రావు.. ఇంటూరిని ఇబ్బంది పెట్టిన అంశంలో ఇదే సీఐకు న్యాయస్థానం షాకాజ్ నోటీసులు ఇచ్చింది. కక్ష సాధింపులో భాగంగా మరో అక్రమ కేసు బనాయించడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
తణుకు రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. ఎస్ఐ ఆత్మహత్యకు కారణం ఇదేనా?
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం స్టేషన్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మృతుడు.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడంతో పాటు, సూసైడ్ నోట్ రాశారనే అనుమానాలు ఉండటంతో ఆయన సెల్ ఫోన్ తమకు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.స్టేషన్కు చేరుకున్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర పోలీస్ అధికారులతో ఎస్ఐ మూర్తి బంధువులు వాగ్వివాదానికి దిగారు. మూర్తి.. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తుండగా, ఇటీవల ఆయన విధుల నుంచి తొలగించారు. ఎస్ఐ సత్యనారాయణమూర్తి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కే.గంగవరం గ్రామం. ఆయనకు ఇద్దరు పిల్లలు. అకారణంగా విధుల్లోంచి తొలగించి, తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంపై ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎస్ఐ మూర్తి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండగా, ఎస్ఐ ఆత్మహత్య ఘటనతో పోలీసు వర్గాల్లో కలవరం రేగింది. బందోబస్తు డ్యూటీ నుంచి వచ్చి స్టేషన్లోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేయాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. మండల మెజిస్ట్రేట్ ముందు ఫోన్ ఓపెన్ చేయాలని బంధువుల, స్నేహితులు పట్టుబడుతున్నారు. అధికారుల ఒత్తిడి వల్లే చనిపోయాడంటూ ఎస్ఐ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: యువజంట పరువు హత్య.. హంతకులకు మరణశిక్ష -
సైఫ్పై దాడి చేసింది అతడే..! గుర్తించిన అత్యాధునిక టెక్నాలజీ
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు.ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లామేనని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నిర్ధారించినట్లు వెల్లడించారు. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదన్న ప్రచారం నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ నిర్ధారణ కీలకంగా మారింది. కాగా,జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు నిందితుడు ముంబయి బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. దాడి అనంతరం నటుడి ఇంటిని పరిశీలించిన పోలీసుల బృందం అక్కడి నుంచి సుమారు 19 వేలిముద్రలను సేకరించింది. ఈ ఫింగర్ ప్రింట్స్లో ఏవీ నిందితుడు ఇస్లాం ఫింగర్ ప్రింట్స్తో సరిపోవడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరిగడంతో దర్యాప్తుకు బ్రేక్ పడింది. నిజానికి సైఫ్ ఇంట్లోకి నిందితుడు ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని ఈ క్రమంలో అడ్డుకున్న సైఫ్తో తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. -
YSRCP సోషల్ మీడియాపై పోలీసుల ఓవరాక్షన్.. హైకోర్టు దెబ్బకు సీన్ రివర్స్
-
ఓవర్ యాక్షన్ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు
సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన ఫలితం.. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డారు. అక్రమ కేసులు పెట్టిన ఇద్దరు ఖాకీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరినీ వ్యక్తిగతంగా సంజాయిషీ కోరింది. బోసా రమణ అనే వ్యక్తి విషయంలో పోలీసు అధికారులు.. హైకోర్టు అదేశాలను బేఖాతరు చేశారు. రమణని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదు.మరో కేసు ఉందంటూ పోలీసులు ఇచ్చాపురం తీసుకెళ్లారు. తమ ఆదేశాలను ధిక్కరించటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సీఐలు వెంకటేశ్వర్లు, చెన్నంనాయుడులకు నోటీసులు జారీ చేయాలని రెండు జిల్లాల జిల్లా జడ్జీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీఐలు ప్రభుత్వ లాయర్ను వినియోగించుకోకుండా వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగి దొరికాడిలా!
సాక్షి,హైదరాబాద్ : కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. తాజాగా, తెలంగాణ సెక్రటరియేట్లో కేటుగాళ్లు..‘మేం తెలంగాణ సెక్రటరియేట్ ఉద్యోగులం మీకు ఏమైనా పని కావాలంటే చెప్పండి. చిటికెలో చేసి పెడతాం. కాకపోతే దానికి కొంత ఖర్చవుతుంది’ అంటూ పలువురి దగ్గర భారీ వసూళ్ల పాల్పడ్డారు. చివరికి ఎత్తుగడ ఫలించక దొరికిపోయారు. ఇంతకీ ఆ ఫేక్ ఉద్యోగి ఎవరు? ఆ ఫేక్ ఉద్యోగికి సహకరించింది ఎవరు? వాళ్లని పోలీసులు ఎలా పట్టుకున్నారు? రెండ్రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ ఐడీ కార్డు వ్యవహారంలో.. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాస్కర్రావు, రవిలు సచివాలయంలో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఫేక్ ఐడీ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. -
మాటల్లో చెప్పలేం.. మీర్ పేట్ హత్య కేసులో నివ్వెరపోయే విషయాలు
సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన మీర్పేట (meerpet) వెంకట మాధవి (venkata madhavi) హత్య కేసులో భర్త గురుమూర్తి (gurumurthy) గురించి పోలీసులు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. గురుమూర్తి మనిషి కాదని.. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. ఆయనలో ఎలాంటి పశ్చాతాపం కనిపించడం లేదంటూ రాచకొండ సీపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్ బాబు కేసు విషయాల్ని వెల్లడించారు. భార్యను ఇంత దారుణంగా చంపిన గుర్తుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. క్షణికావేశంలో జరిగిన హత్య కాదు.. పథకం ప్రకారమే హత్య చేశాడు. చూడటానికి మనిషి బాగున్నా. స్వతాహాగానే క్రూరుడు. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య ఎలా చేశాడో మాటల్లో చెప్పలేం. ఈ నెల 15,16 తేదీల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. 16న ఉదయం 8 గంటలకు ఆమెతో అకారణంగా గొడవపెట్టుకొని ఘర్షణకు దిగాడు. మాధవి తల గోడకేసి మోదాడు. ఆపై గొంతు నులిమి హతమార్చాడు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు, చేతులు, బాడీ, తల నాలుగు భాగాలుగా కట్ చేశాడు. శరీర భాగాల్ని వాటర్ హీటర్తో నీళ్లు మరిగించి ఉడక బెట్టాడు. ఉడక బెట్టిన శరీర భాగాల్ని మరింత చిన్నవిగా చేసేందుకు ఇంట్లో ఉన్న పెద్ద గ్యాస్ మీద పెట్టి కాల్చాడు. కాల్చిన అనంతరం రోకలి బండతో శరీరభాగాలను దంచి పొడి చేశాడు. ఆ పొడిని సాయంత్రం ఆరుగంటల సమయంలో ప్లాస్టిక్ బకెట్లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పోశాడు.ఇంటికొచ్చిన తర్వాత ఉదయం ఎలా అయితే శుభ్రంగా ఉందో.. అలాగే శుభ్రం చేశాడు. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి పిల్లల్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన పిల్లలు తమ అమ్మ గురించి అడగ్గా.. మాధవి గురించి పిల్లలకు లేనిపోనివి అన్నీ చెప్పాడు. మమ్మి నాతో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్లిందని నమ్మించాడు.భార్యను హత్య చేసిన తర్వాత శరీర భాగాల్ని కట్ చేసిన బెడ్ రూంకు తాళ వేశాడు. అలా రెండ్రోజుల పాటు మేనేజ్ చేసిన తర్వాత.. బాధితురాలి తల్లిదండ్రులు రావడం.. తప్పని సరి పరిస్థితుల్లో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు మిస్సింగ్ కప్లయింట్ నమోదు చేయడం. ఆ కంప్లయింట్ ద్వారా విచారణ చేపట్టాం.పోలీసుల విచారణలో గురుమూర్తి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ముందుగా మాధవి డెడ్ బాడీ గురించి అడ్డగా.. జిల్లెల గూడా చెరువు పక్కనే ఉన్న మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడేశానని చెప్పాడు. కానీ వాస్తవం అది కాదు. కేసు నుంచి తప్పించుకోవాలనే అలా చెప్పాడు. ఈ కేసులో నిందితుడు ఉపయోగించిన 16 రకాల ఆధారాల్ని లభ్యం చేసుకున్నాం.’అని వెల్లడించారు. 👉చదవండి : ఏపీ యువతి కేసులో సుప్రీం సంచలన తీర్పు -
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. వరలక్ష్మి అరెస్ట్
వెంగళరావునగర్: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురు మహిళలను మధురానగర్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్ పీఎస్ పరిధిలోని జవహర్నగర్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు జవహర్నగర్లోని ఓ గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో వరలక్ష్మి అనే నిర్వాహకులు వివిధ జిల్లాల నుంచి మహిళలు, యువతులను ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుందని గుర్తించారు. కాగా దాడి సమయంలో వరలక్ష్మి తోపాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో పురుషులు ఎవరూ ఇంట్లో లేరు. వ్యభిచారం చేయించడానికి వరలక్ష్మి కి స్థానికంగా నివాసం ఉండే నరేష్ చౌడేశ్వరి అనే ఇద్దరు సహకరిస్తున్నారు. పోలీసులు నిర్వాహకురాలితో పాటుగా ఇద్దరు మహిళలను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘సైఫ్’పై దాడి చేసింది ఒక్కడు కాదా..? రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరిఫుల్ ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.ఇక ఇస్లామ్కు సిమ్కార్డు అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్ కొన్ని రోజులపాటు కోల్కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు సైఫ్అలీఖాన్పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై దాడి చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సైఫ్ ఇప్పటికే పోలీసులకు తెలిపారు. -
AP: ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్.. పోలీసుల గాలింపు
సాక్షి, శ్రీ సత్యసాయి: ధర్మవరంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం నుంచి ముగ్గురు కాలేజీ విద్యార్థినులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అదృశ్యం కేసు మిస్టరీగా మారింది.వివరాల ప్రకారం.. ధర్మవరంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి శిరీష, గాయత్రి, ప్రియాంక కనిపించపోవడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్.. పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ముగ్గురు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు
నేడు (జనవరి 26) దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. #WATCH | Delhi: On the eve of #RepublicDay, and the occasion of National Voters' Day as well as ahead of #DelhiElections2025, the iconic Qutub Minar illuminated in colours of the Tricolour and Voter Awareness Programme. pic.twitter.com/oRGtZO6ASu— ANI (@ANI) January 25, 2025దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో అత్యంత భారీగా పరేడ్ జరగనుంది. ఈ నేపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Delhi | The Central Secretariat building complex illuminates with colourful lights and Tricolor on the eve of the 76th #RepublicDay pic.twitter.com/bSBTKWNClV— ANI (@ANI) January 25, 2025ఢిల్లీలోని ప్రతీ ప్రాంతంలో సైనికులు పహారా కాస్తున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు వెలువడ్డాయి.#WATCH | Delhi: Security personnel carry out foot patrolling at Sarojini Nagar Market on the eve of #RepublicDay pic.twitter.com/9OwyABwjBc— ANI (@ANI) January 25, 2025ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ నియంత్రణ కేంద్రం ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.#WATCH | Delhi: Security tightened at Sarojini Nagar Market on the eve of #RepublicDay pic.twitter.com/drBd5dnTRC— ANI (@ANI) January 25, 2025భద్రతా సిబ్బంది ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లో పెట్రోలింగ్ నిర్వహించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.ఢిల్లీ లోని చారిత్రాత్మక ఇండియా గేట్ త్రివర్ణ పతాక కాంతితో వెలిగిపోతోంది. సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయం కూడా రంగురంగుల లైట్లు, త్రివర్ణ పతాకాలతో మెరుస్తోంది. కుతుబ్ మినార్ కూడా త్రివర్ణ పతాక రంగుల్లో కాంతివంతంగా మారింది.#WATCH | Delhi: Police monitor the security situation at Sarojini Nagar Market through the FRS (Facial recognition system) control centre here. pic.twitter.com/PsT4UNHDFO— ANI (@ANI) January 25, 2025ఒకవైపు జనవరి 26, మరోవైపు ఢిల్లీ ఎన్నికలు ఉన్నందున విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఢిల్లీ అదనపు డీసీపీ (సౌత్) అచింత్ గార్గ్ తెలిపారు. సున్నితమైన ప్రదేశాలు,మార్కెట్లలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఇది కూడా చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created sand art in Puri, on the eve of #RepublicDay pic.twitter.com/fD9KLPWqvr— ANI (@ANI) January 25, 2025 -
Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని రక్షణ విభాగంలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా, పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర భద్రత తదితర విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకం, 101 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి.95 శౌర్య పురస్కారాలలో అత్యధిక పురస్కారాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నియమితులైన సైనికులకు అందజేయనున్నారు. వీరిలో నక్సలైట్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన 03 మంది సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్-హోం గార్డ్స్కు, 36 కరెక్షనల్ సర్వీస్కు లభించాయి.రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్గఢ్కు చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్కు చెందిన 17 మందికి, జమ్ముకశ్మీర్కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. అస్సాం రైఫిల్స్ నుండి ఒక సైనికునికి, బీఎస్ఎఫ్ నుండి ఐదుగురు, సీఆర్పీఎఫ్ నుండి 19 మంది, ఎస్ఎస్బీ నుండి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి చెందిన 16 మంది అగ్నిమాపక సిబ్బందికి, జమ్ముకశ్మీర్ అగ్నిమాపక విభాగానికి చెందిన ఒక అగ్నిమాపక అధికారికి అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే.. -
బీఎస్పీ నేత దారుణ హత్య
అంబాలా: హర్యానాలోని అంబాలాలో దారుణం చోటుచేసుకుంది. అంబాలా పరిధిలోగల నారాయణ్గఢ్ నుండి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన హర్విలాస్ రజ్జుమాజరాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. హర్విలాస్ రజ్జుమాజరా కారుపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో హర్విలాస్ మృతిచెందగా, అతని ముగ్గురు సహచరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చండీగఢ్ పీజీఐకి తరలించారు. దాడికి పాల్పడినవారిని ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. बहुजन समाज पार्टी हरियाणा के प्रदेश सचिव और नारायणगढ़ से पूर्व प्रत्याशी हरबिलास रज्जूमाजरा जी की गोली मारकर हत्या कर दी गई है। उनके तीन साथी गंभीर रुप से घायल हैं।मुख्यमंत्री @NayabSainiBJP, @cmohry, @police_haryana जल्द से जल्द कार्यवाही करें और आरोपीयों को गिरफ्तार करें। pic.twitter.com/e2bFu9NV4t— BSP4Haryana (@bspforharyana) January 24, 2025కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో కాల్పుల శబ్దం వినబడటంతోపాటు, కొంతమంది పారిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 7:20 గంటల సమయంలో హర్విలాస్తో పాటు అతని సహచరులు కారులో ప్రయాణిస్తుండగా, కొంతమంది దుండగులు వారిపై కాల్పులు జరిపారు. దీనిని గమనించిన స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ దాడిని బహుజన్ సమాజ్ పార్టీ హర్యానా చీఫ్ ధరంపాల్ టిగ్రా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, కాల్పుల ఘటనలు సాధారణమైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో -
సైబరాబాద్ అధికారి‘అదనపు’ విధులు!
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు.. సాధారణంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్నీ నిర్లక్ష్యం చేస్తారనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. న్యాయస్థానాలతో పాటు ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపైనే పలువురిపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి. కొందరు ఖాకీలకు ఇదంతా డ్యూటీల దగ్గర మాత్రమే... ‘వాటా’ల వద్దకు వచ్చేసరికి మాత్రం తమవి కాని విధుల్నీ నిర్వర్తించేస్తుంటారు. భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఇతర శాఖల అధికారులతో కలిసి ‘ప్లాన్’ చేస్తూ భూ యజమానుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యవహారమే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతోంది. హైటెక్ జోన్ కేంద్రంగా ఓ ఉన్నతాధికారి నిర్వర్తిస్తున్న ‘అదనపు’ విధులకు బల్దియా అధికారి సైతం సహకరిస్తుండటం గమనార్హం. భూ విలువలు పెరగడంతో కుట్రలు.. నగర వ్యాప్తంగా భూములు విలువలు గణనీయంగా పెరిగిపోవడం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. ఖాళీ జాగాలకు కొత్త యజమానులు పుట్టుకువస్తున్నారు. మదీనాగూడ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం కూడా అలాంటిదే. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతంలోని రెండు సర్వే నంబర్లలో ఉన్న స్థలం ఖరీదు చేశారు. మొత్తం వెయ్యి చదరపు గజాలకు పైగా ఉన్న ఈ స్థలంలో చాలా భాగం విక్రయించారు. మిగిలిన 300 గజాల్లో నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిపై కన్నేసిన పాత యజమాని సంబం«దీకులు కొందరు వివాదం చేయడం మొదలెట్టారు. రేటు ఆకాశాన్ని అంటడంతో ఏమాత్రం అవకాశం చిక్కినా చట్టపరంగా ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. ఈ స్థలంపై యాజమాన్యం హక్కు కోసం, ఆపై టెనెంట్ కేసుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానికోసం కొన్ని నోటరీ పత్రాలను సమరి్పంచారు. ఖాళీ స్థలాలకు కేవలం ప్లాట్ నంబర్లు మాత్రమే ఉంటాయి. వివాదం చేయాలని భావించిన వాళ్లు ఏకంగా డోర్ నంబర్ వేసుకుని మరీ పత్రాలు రూపొందించారు. దీంతో న్యాయస్థానం వారి పిటిషన్ను తిరస్కరించింది. ఆ భూమి ఎవరి పేరుతో ఉందో ఆ మహిళకే కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ సైతం ఇచి్చంది. దీని ఆధారంగా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్న భూ యజమాని నిర్మాణం కోసం అనుమతి కూడా తెచ్చుకున్నారు. ఈమెను ఇబ్బంది పెట్టడం ద్వారా లబి్ధ పొందాలని ప్రయతి్నంచిన కబ్జారాయుళ్లు దీనికోసం కొత్త పథకం వేశారు. ఒత్తిడికి యత్నించి.. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని ఓ కీలక జోన్లో పని చేస్తున్న ఉన్నతాధికారిని సంప్రదించాడు. ఇద్దరి మధ్యా జరిగిన ‘ఒప్పందం’తో రంగంలోకి దిగిన అధికారి తొలుత పోలీసులను వాడి భూ యజమానికిపై ఒత్తిడికి ప్రయతి్నంచారు. ఇది ఫలితం ఇవ్వకపోవడంతో కథ మార్చారు. బల్దియాకు చెందని మరో ఉన్నతాధికారితో కలిసి ‘ప్లాన్’ చేశాడు. వీలైనంత త్వరగా ఆ పోలీసు, బల్దియా అధికారులకు కలిసి సెటిల్ చేసుకుంటే ఉత్తమం అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ యజమాని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. -
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్గా గుర్తించారు. సైఫ్పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
రషీద్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు
-
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
Delhi Election: 150 సరిహద్దుల మూసివేత.. పారా మిలటరీ దళాల మోహరింపు
న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలోని 150 సరిహద్దులను మూసివేశారు. ఈ 150 సరిహద్దుల్లోని 162 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలతో పాటు, స్థానిక పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 162 చోట్ల దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులు 175 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ నుండి 250 కంపెనీల పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగనున్నాయి. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పికెట్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీ పోలీస్ ఎలక్షన్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో ముందుగా వచ్చిన వారికి తొలుత అనుమతినిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
ఆ నలుగురు రైతులను విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో సంబంధం ఉందంటూ అరెస్టు చేసిన నలుగురు రైతులను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వారి వద్ద రూ.25 వేల వ్యక్తిగత బాండ్ తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్కు సూచించింది. ఒకే అంశంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది (పీపీ)కి స్పష్టం చేస్తూ, తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా వేసింది.వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి బొంరాస్పేట్ పోలీస్ స్టేషన్లో రైతులు ముదావత్ రమేశ్, గోపాల్ నాయక్, మదారయ్య, మంగ్యా నాయక్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలి ఎఫ్ఐఆర్ 153లో వీరిని అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ 154, 155లోనూ వీరు నిందితులని పేర్కొంటూ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించారు. ఒకే అంశంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, కావాలని పోలీసులు మరో రెండు కేసులు పెట్టారని పేర్కొన్నారు. 154, 155లను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పేర్లు తప్ప వారి పాత్రపై వివరాలు ఏవీ? ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 154, 155 ఎఫ్ఐఆర్లలో పిటిషనర్లను పోలీసులు నిందితులుగా చేర్చారని చెప్పారు. అయితే పిటిషనర్ల పేర్లు ప్రస్తావించడం తప్ప వారికి వ్యతిరేకంగా ఏమీ పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్ల పాత్ర ఏంటో వివరించలేదన్నారు. పిటిషనర్లు వ్యవసాయదారులని, దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వారి వద్ద వ్యక్తిగత బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించారు.