breaking news
Police
-
కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి మహిళ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హతురాలు రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్న రోల్డ్ గోల్డ్ వస్తువులను నిజమైన బంగారమని భావించిన నిందితులు.. వాటిని దాచిన లాకర్ కీ ఆమె ఇవ్వకపోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులు హర్ష్, రోషన్లతో పాటు ఝార్ఖండ్లో వీరికి ఆశ్రయం కల్పించన రాజ్ వర్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. స్నేహితుడితో కలిసి.. కూకట్పల్లిలోని స్వాన్లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో ఉండే రాకే‹Ù, రేణు అగర్వాల్ దంపతుల ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన రాజ్ వర్మ పని చేసేవాడు. ప్రతిరోజూ ఇంట్లో కబోర్డులు శుభ్రం చేస్తుండగా నకిలీ బంగారు ఆభరణాలను చూసి, అవి నిజమైనవిగా భావించాడు. తాను పనిచేసే ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని స్నేహితుడు హర్ష్కు చెప్పాడు. వాటిని ఎలాగైనా దొంగిలించాలని భావించిన హర్ష్ పథకం వేశాడు. రేణు హత్యకు రెండు రోజుల ముందే రాజ్తో పని మాని్పంచి, ఆ స్థానంలో తాను పనిలో చేరాడు. అదే అపార్ట్మెంట్లో 14వ అంతస్తులో ఉంటున్న రాకేష్ సోదరుడి ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన రోషన్ పని చేసేవాడు. హర్ష్, రోషన్లు ఇద్దరూ స్నేహితులే. కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు ఈ నెల 10న రాకేష్, అతని కుమారుడు వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్లిపోయారు. రేణు అగర్వాల్ ఒంటరిగా ఉండటంతో హర్ష్, రోషన్లు ఇంట్లోకి చొరబడ్డారు. రేణు నోటిలో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని, డబ్బులు, బంగారం ఎక్కడెక్కడ దాచిపెట్టారో చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. సుమారు గంటకు పైగా ఆమెను చిత్రహింసలకు గురిచేసినా చెప్పకపోవడంతో.. ఆగ్రహానికి గురైన నిందితులు వంటింట్లోని కుక్కర్తో ఆమె తలపై బలంగా మోదారు. ఆపై కత్తితో గొంతుకోసి.. నుదురు, చేతులు, కడుపు, మెడపై 40సార్లు పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు, నగదు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, గడియారాలను ట్రావెల్ బ్యాగ్లో సర్దుకున్నారు. ఈ ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగ్తో యజమాని స్కూటీపై పరారయ్యారు.పోలీసులను చూసి.. ప్లాన్ మార్చి.. ఈ ముఠా నిత్యం రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తుంటుంది. హత్య చేసిన తర్వాత కూడా రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు పయనమయ్యారు. వీరికి హఫీజ్పేట రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు. దీంతో మార్గంమధ్యలో ఇద్దరు ముగ్గురిని అడిగి స్టేషన్కు దారి తెలుసుకున్నారు. స్టేషన్ బయటే స్కూటీని వదిలేసి.. లోపలికి వెళ్లి రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిపోయారు. రాంచీ వెళ్లేందుకు టికెట్లు తీసుకొని రైలు ఎక్కేందుకు స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేషన్ లోపల పోలీసులు ఉండటంతో అక్కణ్నుంచి బయటికి వచ్చారు. మళ్లీ హఫీజ్పేట చేరుకొని.. రాత్రి 1 గంట సమయంలో క్యాబ్ బుక్ చేసుకొని, రాంచీలోని రాజు వర్మ వద్దకు వెళ్లిపోయారు. రాంచీకి విమానంలో వెళ్లి నిందితుల పట్టివేత సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు పనివాళ్లే నిందితులని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అప్పటికే హత్య కేసు, అనుమానితుల ఊహాచిత్రాలు మీడియాలో వైరల్ కావడంతో నిందితులను రాంచీలో వదిలేసిన క్యాబ్ డ్రైవర్ దీన్ని గమనించాడు. దీంతో వెంటనే క్యాబ్ యజమాని సహాయంతో నిందితులు క్యాబ్ బుక్ చేసుకున్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు అందించారు. వెంటనే సైబరాబాద్ పోలీసులు నిందితుల కంటే ముందే విమానంలో రాంచీకి చేరుకున్నారు. హర్ష్, రోషన్, రాజ్లను అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, 16 వాచీలు, రెండు సెల్ఫోన్లు, రోల్డ్ గోల్డ్ వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.డ్రగ్స్కు బానిస హర్ష్నిందితుడు హర్ష్ డ్రగ్స్కు వ్యవసనపరుడని విచారణలో పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసే సమయంలోనూ హర్ష్ మత్తులో ఉన్నాడని కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కోల్కతాలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిషన్, చికిత్స చేయించుకున్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హర్ష్పై 2023లోనే రాంచీలో మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. స్థానికంగా జైలులో ములాఖత్కు వెళ్లి, బయటికి వచ్చేటప్పుడు హీరోగా రీల్స్ చేస్తూ ఉండేవాడని, అందుకోసమే చెయిన్స్, ఆయుధాలను కొనుగోలు చేశాడని సీపీ వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీపీ అవినాష్ మహంతిని, ఆయన బృందాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు. -
అత్తతో అల్లుడు.. పక్కింటామెతో మామ..!
ధర్మవరం అర్బన్: పట్టణంలో దారుణం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం భార్యను భర్త హతమార్చి పాతిపెట్టాడు. కాలనీ వాసుల గుసగుసలతో అప్రమత్తమైన పోలీసులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న వెంకట్రాముడు, సరస్వతమ్మ దంపతులు ఆటోలో చిప్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ పనిలో సహాయకుడిగా ప్రశాంత్ అనే యువకుడిని ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో సరస్వతమ్మ, ప్రశాంత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు సరస్వతమ్మ తన కుమార్తె మహాలక్ష్మిని ప్రశాంత్కు ఇచ్చి వివాహం చేసింది.ఆ తర్వాత కూడా ప్రశాంత్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రావడాన్ని వెంకట్రాముడు పసిగట్టాడు. తన భార్యపై అక్కసుతో తాము నివాసముంటున్న కాలనీలోనే మరో మహిళతో వెంకట్రాముడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతమ్మ, అల్లుడు ప్రశాంత్తో కలసి సదరు మహిళ కుమారుడుని కిడ్నాప్ చేసి.. వెంకట్రాముడు కిడ్నాప్ చేసినట్లుగా సదరు మహిళతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రాముడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి రెండు నెలల క్రితం వెంకట్రాముడు బయటకు వచ్చాడు. దీంతో ప్రశాంత్ తన భార్యను పిలుచుకుని అనంతపురానికి మకాం మార్చాడు. ఇంటికి చేరుకున్న వెంకట్రాముడు.. తనను జైలుకు పంపిన భార్యను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసి రెండు నెలల క్రితం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన స్నేహితుడు విజయ్ను పిలిపించుకుని మద్యం సేవించిన అనంతరం ద్విచక్ర వాహనంపై మధ్యలో మృతదేహాన్ని ఉంచుకుని గొళ్లొళ్లపల్లి సమీపంలోని వంకలో పాతి పెట్టాడు. సరస్వతమ్మ కనిపించకపోవడంతో కాలనీవాసులు గుసగుసలాడుకోవడం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంకట్రాముడు, విజయ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహం బయటపడగానే అరెస్ట్ చూపే అవకాశలున్నాయి. -
Gwalior: పట్టపగలు ‘లివ్ ఇన్’పై.. పోలీసుల నిర్లక్ష్యంతోనే..
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని కాల్చిచంపాడు.రక్తమోడుతున్న భాగస్వామి పక్కన తుపాకీ తిప్పుతూ..శుక్రవారం మధ్యాహ్నం అరవింద్ రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్నర్ నందినిని ఆపి, ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత రక్తంతో తడిసి, బాధతో విలవిలలాడుతున్న నందిని పక్కనే కూర్చుని తన తుపాకీని ఊపుతూ అటువైపుగా వెళుతున్నవారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు.పోలీసులనూ బెదిరించి..నిందితుడు అరవింద్ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో విలవిలలాడుతున్న నందినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు.‘నేను కోర్టు నుండి వస్తుండగా తుపాకీ శబ్దాలు విన్నాను. అతను వరుసగా మూడు బుల్లెట్లను ఆమెపైకి కాల్చడం చూశాను. జనం భయంతో స్తంభించిపోయారు. ఎవరూ అతన్ని పట్టుకునేందుకు సాహసించలేదు’ అని ప్రత్యక్ష సాక్షి, న్యాయవాది ఎంపీ సింగ్ తెలిపారు. పోలీసు అధికారి నాగేంద్ర సింగ్ సికార్వర్ మాట్లాడుతూ నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో పోలీసులను బెదిరించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు.మొదటి వివాహం, పిల్లలను దాచిపెట్టి..నిందితుడు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని, నందినితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని ఎస్పీ ధరమ్వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు తీసుకున్నారని, గతంలో లివ్ ఇన్లో ఉన్నారని, అరవింద్ తన మొదటి వివాహాన్ని, పిల్లలున్నారనన్న సంగతిని దాచిపెట్టి, నందినిని ఆర్య సమాజ్లో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయన్నారు. అయితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్పై నందిని పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.హత్యాయత్నం నుంచి తప్పించుకున్నా..2024, నవంబర్లో అరవింద్ అతని స్నేహితురాలు పూజ పరిహార్తో కలసి తనపై దాడి చేశాడని నందిని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుండి బయటపడింది. ఆమె ఫిర్యాదు దరిమిలా అరవింద్ను అరెస్టు చేసినప్పటికీ, ఆ తరువాత బెయిల్ పొంది, నందినిని వేధిస్తూ వస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్పై పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపై ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.మహిళల రక్షణపై సందేహాలుశుక్రవారం నాడు నందిని మరోమారు ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా, అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కళకళలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదేపదే పోలీసు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు.. అదీ వీఐపీ జోన్లో చోటుచేసుకున్న దారుణం అందరినీ కలచివేస్తోంది. మహిళల రక్షణపై పలు అనుమానాలు లేవదాస్తోంది.ఘ ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
శ్మశానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మాధవి..!
హైదరాబాద్: శ్మశానవాటికలో అయితే ఎలాంటి అనుమానం రాదనుకున్నదో ఏమో..ఓ మహిళ ఆ ప్రాంతాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చింది. యువతులను తీసుకువచ్చి విటులను ఆహా్వనించి ఆమె కొనసాగిస్తున్న వ్యభిచార గృహం గుట్టురట్టయ్యింది. నిర్వాహకురాలితో పాటు ఓ మహిళ, విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బేగంపేట శ్యాంలాల్బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉండడాన్ని గుర్తించారు. మారీ మాధవి (39) అనే మహిళ ఇక్కడి గదిని వ్యభిచార గృహంగా మార్చినట్లు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను తీసుకువచ్చి విటులకు సమాచారం అందించి రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో మాధవి ఒప్పుకుంది. దీంతో నిర్వాహకురాలు మాధవితో పాటు గదిలో ఉన్న మహిళ, విటుడిగా వచ్చిన బాలానగర్కు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి..హైదరాబాద్లో దారిదోపిడీ..
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.హైదరాబాద్కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్.. తన కారు డ్రైవర్..వ్యాపార భాగస్వామిని వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్,పార్టనర్ ఇద్దరు కలిసి వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్ వాహనం ఢీకొట్టింది.వెంటనే మెరుపు వేగంతో రాకేష్ అగర్వాల్ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్ డమ్మీదని గుర్తించారు. నెంబర్ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ ముగింపు వేడుక (ఫొటోలు)
-
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించిన ప్రిజన్ డ్యూటీ మీట్–2025 (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల ఓవర్ యాక్షన్
-
పోలీసులా లేక రౌడీలా.. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి
-
YSRCP అన్నదాత పోరుపై పోలీస్ ఆంక్షలు
-
మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం మత్తులో ఒక రౌడీషీటర్, మరో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రాజమహేంద్రవరంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళి ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా కోటిపల్లి బస్టాండ్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ జ్యూస్ షాప్ వద్ద రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కర్రి దుర్గా సూర్యప్రసన్నకుమార్, రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, ధవళేశ్వరానికి చెందిన వినోద్కుమార్ మద్యం మత్తులో వేరే వ్యక్తులతో గొడవపడుతున్నారు. వారిని నాగబాబు, కాళి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన సూర్యప్రసన్నకుమార్, హరీష్, వినోద్కుమార్ కలిసి కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళిపై దాడి చేశారు. దుర్భాషలాడుతూ అర్ధగంటకు పైగా కదలనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం కానిస్టేబుల్, హోంగార్డు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
తాడిపత్రి వదిలిపో.. పెద్దారెడ్డికి పోలీసుల లేఖ
-
17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
Mumbai: నాయర్ ఆస్పత్రికి బాంబు బెదిరింపు.. రెండు రోజుల్లో మరో కాల్..
ముంబై: మహానగరం ముంబై అంతటా 400 కిలోల ఆర్డీఎక్స్ మోసుకెళ్లే 34 మానవ బాంబులు అమర్చామంటూ రెండు రోజుల క్రితం వచ్చిన బెదిరింపు కాల్ను మరువకముందే ఇదే తరహాలో మరో బెదిరింపు కాల్ వచ్చింది. తాజాగా నగరంలోని నాయర్ ఆసుపత్రిలో బాంబు అమర్చినట్లు కాల్ రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిని పేల్చివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు హెచ్చరిక కాల్ అందిందని, వెంటనే భద్రతా దళాలు అప్రతమ్తమై బాంబుకోసం గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికారులు తెలిపారు.శనివారం రాత్రి 11 గంటలకు డీన్ అధికారిక చిరునామాకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబు గుర్తింపు, నిర్మూలన దళం (బీడీడీఎస్)తో కలిసి ఆస్పత్రి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించాక ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. ముంబై అంతటా వాహనాలలో 400 కిలోల ఆర్డీఎక్స్ మానవ బాంబులు అమర్చామంటూ బెదిరింపు కాల్ వచ్చిన రెండు రోజులకు తాజా ఘటన జరిగింది. లష్కర్ ఎ-జిహాదీ’ సంస్థ నుండి ఈ బెదిరింపు కాల్ వచ్చింది.మరోవైపు 10 రోజుల పాటు సాగిన గణేశ్ నవరాత్రుల ముగింపు సందర్భంగా మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. నిమజ్జనం సందర్భంగా జనసమూహ నియంత్రణ, నిఘా కోసం 21 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇటీవలి కాలంలో ముంబైని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్, ఈ- మెయిల్స్ రావడం అధికమయ్యింది. సోమవారం కల్వా రైల్వే స్టేషన్ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్ చేసిన 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. -
హైదరాబాద్లో కారు బీభత్సం.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ వాహనాన్ని కియా కారు ఢీకొట్టింది. లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో యువతి కశ్వి(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
తాడిపత్రికి చంద్రబాబు.. పెద్దారెడ్డిపై పోలీసుల కొత్త డ్రామా..
-
పెద్దారెడ్డి విషయంలో మరో ట్విస్ట్..! తాడిపత్రిలో పోలీసుల హైడ్రామా
-
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయ్యింది. 30 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో తయారు చేస్తున్న డ్రగ్స్ను దేశ, విదేశాలను సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న13 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, ఎక్స్టీసీ మోలీ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.32 వేల లీటర్ల రా మెటీరియల్ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహారాష్ట్ర పోలీసులకు విదేశీయుడు పట్టుబడ్డాడు. విదేశీయుడు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీయుడి నుంచి రూ.25 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్లో క్రైమ్ బ్రాంచ్ దాడులు చేసింది. వెయ్యి కిలోల కెమికల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్లు, మాన్యుఫాక్చరర్లు , డిస్ట్రిబ్యూటర్లు కలిసిన భారీ నెట్వర్క్ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు. -
రెడ్హ్యాండెడ్గా పోలీసులకు చిక్కిన హీరోయిన్
బెంగాలీ నటి 'అనుష్క మోనీ మోహన్ దాస్'(41) పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగాలీ సినీ పరిశ్రమలో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో నటించి ఆమె గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఆమెను మహారాష్ట్రలోని ఠాణే జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుష్క మోనీ(Anushka Moni mohan Das) కొంతమంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్తో ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే వ్యభిచార కూపంలో చిక్కుకున్న మరో ఇద్దరు నటీమణులను కూడా రక్షించారు. ఈ ఘటన బెంగాలీ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆమెపై గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.మొదట కస్టమర్స్ రూపంలో అనుష్క మోనీని పోలీసులే సంప్రదించారు. ఒక మాల్లో వారి నుంచి ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143(3) కింద, మానవ అక్రమ రవాణాకు సంబంధించి, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. రక్షించబడిన మహిళలను షెల్టర్ హోమ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార మూఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు ACP బల్లాల్ తెలిపారు. -
అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!
ఉత్తర్ప్రదేశ్లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్ను స్టేట్ పోలీస్ మీడియా సెంటర్కు పంపి పోలీసులను అలర్ట్ చేసింది. కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్–ఇన్స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది. ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది. పెరుగుతున్న ఆన్లైన్ సుసైడ్ అటెంప్ట్స్ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో సుడైడ్–రిలేటెడ్ పోస్ట్లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు. (చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి రూట్ మ్యాప్
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న హైదరాబాద్లో నిర్వహించే నిమజ్జనం ఏర్పాట్లలో నగర అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శోభాయాత్ర రూట్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిలతో కలిసి బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర రూట్ మ్యాప్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్యాంక్బండ్ వరకు జరిగే శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలాపూర్, చార్మినార్ సర్కిల్, మొజం జాహి మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ రూట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు, ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. బందోబస్తులో 30 వేలమంది పోలీసులు నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా 30 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సీవీ ఆనంద్ చెప్పారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీంలను సిద్ధం చేశామన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 2 వ తేదీ వరకూ నగరవ్యాప్తంగా 1,21,905 గణేశ్ ప్రతిమల నిమజ్జనం జరిగిందన్నారు. ఈ నెల 6వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. బాలాపూర్ గణేశ్ రూట్ మ్యాప్ కట్ట మైసమ్మ దేవాలయం– కేశవగిరి– చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్– మహబూబ్నగర్ ఎక్స్ రోడ్– ఇంజన్ బౌలి– అలియాబాద్– నాగుల్ చింత జంక్షన్ – హిమ్మత్పురా– చార్మినార్– మదీనా క్రాస్రోడ్– అఫ్జల్ గంజ్– ఎంజే మార్కెట్– అబిడ్స్ జీపీఓ– బీజేఆర్ విగ్రహం– బషీర్బాగ్ క్రాస్రోడ్– లిబర్టీ– అంబేడ్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్ ఖైరతాబాద్ గణేశుడి రూట్ మ్యాప్ బడా గణేశ్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్– తెలుగుతల్లి విగ్రహం– అంబేద్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్ -
నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్ల ఘర్షణ
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్)/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : మహిళతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై గొడవపడిన ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వీరిని అడ్డుకోబోయిన డ్యూటీ కానిస్టేబుల్తో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఘర్షణ పడ్డాడు. అంతేకాక.. డ్యూటీ కానిస్టేబుల్పై ఆ మహిళ పిడిగుద్దులు గుద్దింది. దీంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. వివరాలివీ.. నాలుగో పట్టణ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ సింగ్నగర్ డాబాకొట్లు సెంటర్ సమీపంలో ఉంటున్నాడు. మధురానగర్ పసుప తోటకు చెందిన ఓ మహిళతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సింగ్నగర్లో గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సింగ్నగర్ డ్యూటీ కానిస్టేబుల్ కోటేశ్వరరావు వీరిని అడ్డుకుని రోడ్లపై గొడవలేంటని ప్రశ్నించారు. తామిద్దరం బంధువులమని, తాను ట్రాఫిక్ కానిస్టేబుల్నంటూ శ్రీనివాస్ నాయక్ బదులివ్వడంతో అక్కడి నుంచి కోటేశ్వరరావు వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటికి వారిద్దరూ సింగ్నగర్ రైతుబజార్ వద్దకు వెళ్లి అదే రీతిలో కొట్టుకుంటుండగా కోటేశ్వరరావు వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో.. శ్రీనివాస్నాయక్, కోటేశ్వరరావు మధ్య మాటామాటా పెరిగింది. పోలీస్స్టేషన్కు రావాలంటూ శ్రీనివాస్నాయక్ను తీసుకొస్తుండగా సదరు మహిళ డ్యూటీలో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని పిడుగుద్దులు గుద్ది లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో విషయం పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దృష్టికెళ్లింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు. -
మళ్లీ తెరపైకి రాజ్ తరుణ్ ఎపిసోడ్.. పోలీసులకు లావణ్య ఫిర్యాదు!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నార్సింగి పీఎస్లో అతనిపై మరో కేసు నమోదైంది. కోకాపేట విల్లాలో ఉండగా రాజ్తరుణ్ అతని అనుచరులతో దాడి చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్తరుణ్తో పాటు అతని అనుచరులైన మణికంఠ, రాజశేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజపై కేసు నమోదు చేశారు. తనపై మూడు సార్లు దాడి చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుతో లావణ్య- రాజ్ తరుణ్ ఎపిసోడ్ టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది.కాగా.. 2016లో రాజ్ తరుణ్తో కలిసి కోకాపేట్లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా లావణ్య పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?
మా మామగారు నామీద ఒక చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకుముందు నా భార్య నా మీద గృహ హింస కింద కూడా అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కౌన్సెలింగ్ పేరుతో చాలాసార్లు పిలిచి పోలీసు వారు వేధించారు. ఆఖరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్త చీటింగ్ కేసు నెపంతో తరచుగా పోలీస్ స్టేషన్కు పిలిచి సెటిల్మెంట్ చేయవలసిందిగా ఒత్తిడి చేస్తూ నా ఆస్తి ఒకటి రాసిమ్మని అలాగే నా వద్దనే ఉన్న నా కొడుకుని కూడా ఇచ్చేయాలి అంటూ బలవంతం చేస్తున్నారు. గంటలకొద్దీ కూర్చోబెడుతున్నారు. మా మామగారికి పోలీసులలో చాలామంది పరిచయస్తులు ఉన్నారు. వారి సహాయంతో ఇదంతా చేస్తున్నారు అని, నేను ఏమీ చేయలేను అని అందరికీ చెప్తున్నారు. ఇటీవలే స్త్రీ – శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా బాబు కస్టడీ ఇవ్వాలి అంటూ ఒక నోటీసు అందింది. ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?– గణేష్, మేడ్చల్ఫ్యామిలీ కేసు, సివిల్ కేసు అనే తారతమ్యం కూడా లేకుండా పోలీసు వారు నిందితులను తరచుగా పోలీస్ స్టేషన్కు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టడం, సెటిల్మెంట్ చేసుకోవాలి అని ఒత్తిడి చేయడం సరైనది కాదు – అది అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది అంటూ పలు హైకోర్టులు చాలాసార్లు వివిధ పోలీసు అధికారులను మందలించాయి. ఒకవేళ మీ కేసులో కూడా ఇలాంటి ఒత్తిళ్లకు గురి చేస్తుంటే మీరు ముందుగా పై అధికారులకు ఫిర్యాదు చేయండి. అప్పటికీ కూడా మీకు పరిష్కారం లభించకపోతే పోలీసువారి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ, మిమ్మల్ని వేధించడానికి వీలు లేదు అని, నోటీసులు లేకుండా పోలీస్స్టేషన్కు పిలిచి గంటలు తరబడి కూర్చోబెట్టడం అన్యాయం అని డిక్లేర్ చేయమని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయండి. హైకోర్టు మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది. మీ కొడుకు మీ వద్దనే ఉన్నారు అని చెప్తున్నారు కానీ అతని వయసు చెప్పలేదు. మీకు స్త్రీ – శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చిన నోటీసు కూడా బహుశా సరైనది కాకపోవచ్చు. చిన్న పిల్లల పోషణకు, శ్రేయస్సుకు – రక్షణకు భంగం కలుగుతుంది అని కచ్చితమైన సమాచారం ఉంటే తప్ప, పిల్లల కస్టడీ విషయాలలో కేవలం ఫ్యామిలీ కోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఏది ఏమైనా మీరు హైకోర్టులో ఆ నోటీసును కూడా ప్రత్యేకంగా రిట్ పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేయండి. సరైన పరిష్కారం దొరుకుతుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)(చదవండి: రచయితలుగా పోలీసు అధికారులు..!) -
YSR వర్ధంతి సందర్భంగా అన్నదానం.. నందిగామ పోలీసుల ఓవర్ యాక్షన్
-
సాక్షిపై దాడులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘తొలుత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. -
అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
సనౌర్: పంజాబ్లోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్మజ్రాను అత్యాచారం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. హర్మిత్ సింగ్ మాజీ భార్య ఆయనపై అత్యచార ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఈ అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదుకాగా, మంగళవారం ఉదయం హర్యానాలోని కర్నాల్లో పంజాబ్లోని కర్నాల్లో ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జల వనరుల ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్పై సనూర్ ఎమ్మెల్యే విమర్శలు చేసిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10.17 గంటలకు పఠాన్మజ్రా మాజీ భార్య.. పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. ఆమె పేర్కొన్నా వివరాల ప్రకారం 2014,ఫిబ్రవరి 12 నుంచి 2024 జూన్ 12 వరకు ఈ నేరం జరిగిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేపై భారతీయ శిక్షాస్మృతిలోని 376, 420,506 సెక్షన్ల కింద అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల అభియోగాలపై కేసు నమోదు చేశారు.పఠాన్మజ్రాను అతని బంధువుల గ్రామమైన దబ్రీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠన్మజ్రా.. ఢిల్లీకి చెందిన ఆప్ నేతల లైంగిక కార్యకలాపాల వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వారు తనపై అత్యాచారం కేసు పెట్టారని, తాను కోర్టులో దానిని ఎదుర్కొంటానని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ-పంజాబ్ మధ్య కబడ్డీ ఆట జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. -
అర్ధరాత్రి ఆటోనగర్ సాక్షి ప్రధాన కార్యాలయానికి పోలీసులు
-
సీఐ వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్ ఫోర్స్: పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ కమ్మవారిపల్లికి చెందిన ఆదికేశవ కుమారుడు భాస్కర్నాయుడు సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నంచాడు. ఆ వీడియోలో ‘కొత్తచెరువు సీఐ జి. మారుతీశంకర్ కేసుల పేరుతో వేధిస్తున్నాడు. రోజూ స్టేషన్కు రావాలని కబురు పంపిస్తున్నాడు. రౌడీïÙట్ తెరిచామని.. స్టేషన్కు సకాలంలో రాకుంటే మరిన్ని కేసులు నమోదుచేస్తామని బెదిరించారు.అనవసరంగా నాపై కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నినట్లు అర్ధమవుతోంది. అందుకే సీఐ ద్వారా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకున్నా’.. అంటూ వివరించాడు. అనంతరం.. తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు సేవించాడు. స్థానికులు గమనించి అతనిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ నుంచి అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.కూటమి నేతల ఒత్తిళ్లతో.. కొన్ని రోజులుగా కొత్తచెరువు మండలంలో అనేకమందిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదుచేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసుల పేరుతో వేధిస్తుండడంతో ఇప్పటికే బాధితులు కొందరు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. తప్పు ఎవరిదనే విషయంపై ఆరా తీయకుండా.. కూటమి నేతలు చెప్పినట్లు విధులు నిర్వర్తిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు. -
సీఐ వేధిస్తున్నాడని యువకుడి ఆత్మహత్యాయత్నం
-
AP High Court: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట
-
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం
సుద్దపల్లి(చేబ్రోలు): వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా మూడు రోజుల కిందట రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తూ పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వడ్డెర కాలనీకి చెందిన మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో వడ్డెర కింగ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు.రెండు వర్గాల మధ్య వివాదం జరగడంతో పది మందికి గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాలకు చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓ వర్గం అధికార టీడీపీకి చెందిన వారు. అయితే, పోలీసులు తమ పిల్లలను మాత్రమే స్టేషన్కు తీసుకువెళ్లి హింసిస్తున్నారని వడ్డెర కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి వర్గీయులు రాత్రి సమయంలో తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలకుంట శ్రీను, వీరమ్మ దంపతులకు చెందిన ఇంటిపై దాడి చేశారని, రేకులు పగలకొట్టారని వాపోయారు. పల్లపు రాజాకు చేయి విరిగిందని, కొవ్వూరు శివశంకర్కు తల పగిలిందని, మరో ఐదుగురికి గాయాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల స్పందించి న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. -
ఖాకీనంటూ... మహిళలకు ట్రాప్!
నరసరావుపేట టౌన్: సీసీఎస్ ఎస్సైనని, తక్కువ ధరకు రికవరీ బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ మహిళలను వంచిస్తున్న నకిలీ ఖాకీ గుట్టు రట్టయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ మోసగాడి గురించి సేకరించిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన మేకల సాయికుమార్ తన పేరును ట్రూ కాలర్లో క్రైమ్ ఎస్ఐ విజయ్గా వచ్చేలా చేసి, మహిళా ఉద్యోగులు టార్గెట్గా ఫోన్లు చేస్తాడు. కాల్ చేసిన వెంటనే తాను ఎస్ఐ అంటూ పరిచయం చేసుకుని మాటలతో మభ్యపెడతాడు.కొన్ని రోజుల తర్వాత దొంగతనం కేసులో బంగారం రికవరీ చేశామని, ఇందులో కొంత పక్కకు తీశానని చెబుతాడు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికి వారి నుంచి నగదు కాజేస్తాడు. మరికొందరికి బంగారాన్ని ఆశగా చూపి లోబర్చుకుంటాడు. ఆ తరువాత వారితో సన్నిహితంగా ఉన్న ఆడియో, వీడియోలను చూపి బెదిరింపులకు పాల్పడి డబ్బులు, బంగారాన్ని బలవంతంగా గుంజుకుంటాడు.ఈ నేపథ్యంలో నరసరావుపేటకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు ఏడు మొబైల్స్ వినియోగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు అతని చేతిలో మోసపోయిన మహిళలు ఆరుగురు ముందుకొచ్చారని నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ తెలిపారు. -
'పోలీస్ పోలీస్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్స్టార్' (Jio Hotstar) నుంచి కొత్తకొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'పోలీస్ పోలీస్' (Police Police) అనే సిరీస్ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 19న స్ట్రీమింగ్ అవుతుందని ఒక ప్రోమోను పంచుకుంది. అయితే, ఈ వెబ్ సిరీస్ తమిళ్లో తెరకెక్కుతుంది. కానీ, తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు, లవ్, కామెడీ వంటి కాన్సెప్ట్తో ఈ సిరీస్ ఉండనుంది. -
ఏపీ పోలీసులకు హైకోర్టు చురకలు
-
సర్కారుకు ‘సుప్రీం’ షాక్! తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు..?
సాక్షి, అమరావతి: అధికార దుర్వినియోగం, కక్షపూరిత రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్నిచ్చింది. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చి ఉండేందుకు వీలుగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై పోలీసులు దాఖలు చేసిన అప్పీల్ను తేల్చాలని ధర్మాసనానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన పెద్దారెడ్డి... తన నియోజకవర్గమైన తాడిపత్రిలోకి వెళ్లేందుకు, అలాగే తన ఇంటిలో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్.. తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి నివసించే నిమిత్తం పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. అయితే వీటిని పోలీసులు బేఖాతరు చేయడంతో కోర్టు ధిక్కార పిటిషన్ను పెద్దారెడ్డి దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్... తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి ఉండేందుకు వీలుగా పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పోలీసులు పదే పదే అడ్డుకున్నారుపెద్దారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఓ పౌరుడి ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారమని నివేదించారు. పిటిషనర్ను తన సొంత నియోజకవర్గానికి, సొంత ఇంటికి రాకుండా పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని, ఆయన్నే పోలీసులు అడ్డుకుంటున్నారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యరి్థంచారు. ఓ వ్యక్తి తనకు నచ్చిన విధంగా, స్వేచ్ఛగా సంచరించే హక్కును రాజ్యాంగం ఇచ్చిందన్నారు. పెద్దారెడ్డి తన ఇంటికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్నారని, వాస్తవానికి వాటి పరిరక్షణ బాధ్యత పోలీసులదేనన్నారు. భద్రత ఖర్చును భరించేందుకు సిద్ధంపెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం పోలీసులు అమలు చేయలేదని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో పోలీసులపై పిటిషనర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ ధిక్కార పిటిషన్లో సైతం సింగిల్ జడ్జి పిటిషనర్ పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు ఇచ్చారన్నారు. పోలీసులు ఈ ఉత్తర్వులు మొత్తాన్ని సవాలు చేయకుండా, కొంత భాగాన్నే ఎంపిక చేసుకుని అప్పీల్ దాఖలు చేశారని దవే, సుధాకర్రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ అప్పీల్కు ఎలాంటి విచారణార్హత లేదన్నారు. తన భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాసనానికి దవే తెలిపారు. తాడిపత్రిలోని ఇంటికి వచ్చేందుకు పెద్దారెడ్డికి అనుమతినివ్వాలని కోర్టును కోరారు. సొంత భద్రత లేకుంటే అందుకయ్యే వ్యయాన్ని ఆయనే భరించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయినా ప్రభుత్వం పెద్దారెడ్డికి భద్రత కల్పిస్తుందనుకోవడం లేదని దవే నివేదించారు. అధికార పార్టీ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచించింది.ఏపీలో దారుణ పరిస్థితులు...!» ఓ పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారు» పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గానికి, ఇంటికి రాకుండా పదే పదే అడ్డుకుంటున్నారు» న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు అమలు చేయలేదు..» మాజీ ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించండి..» అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది» సుప్రీంకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు -
సివిల్ దుస్తుల్లో.. పోలీస్ విధులా?
సాక్షి, అమరావతి: పోలీసులు.. సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలా సివిల్ దుస్తుల్లో రావడానికి వీల్లేదని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పోలీసు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వస్తే వారు పోలీసులని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుందని నిలదీసింది. సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదంది. ఇంటెలిజన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ, వారి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వారున్నది కేవలం ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమేనని గుర్తు చేసింది. బనియన్లు, డ్రాయర్లు, టీ షర్టుల్లో వచ్చి తాము పోలీసులమంటే ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవీ పోలీసులకు లేవంది. కనీసం సఫారీ దుస్తుల్లో ఉన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునంది. ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులు కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వాహనం తనిఖీ సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి కేసు డైరీని కూడా తమ ముందుంచాలంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.నాపై కేసు కొట్టేయండి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న తనపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారంటూ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ కరణం మాలకొండయ్య ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు ప్రసన్నకుమార్రెడ్డి తదితరులపై అక్రమ కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ ప్రసన్నకుమార్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.సివిల్ దుస్తుల్లో వచ్చి... ఏమైనా చేస్తామంటే ఎలా? పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రూపేష్ కుమార్రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రసన్నకుమార్రెడ్డి లేరని, ఆయన ఎవరినీ తోసివేయలేదని తెలిపారు. ఫోటోలను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్న వారి గురించి ఆరా తీశారు. వారు పోలీసులని రూపేష్ చెప్పడంతో, న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం ఏమిటంటూ ప్రశ్నించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారన్న రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే న్యాయమూర్తి దీంతో విభేదించారు. పోలీసులు ఎప్పుడూ యూనిఫాంలోనే ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పోలీసు మాన్యువల్ను సైతం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సివిల్ దుస్తుల్లో వచ్చి ఏమైనా చేస్తామని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనలో ప్రసన్నకుమార్రెడ్డి పాత్ర కీలకమని, ఆయన ప్రోద్బలంతోనే కానిస్టేబుల్పై దాడి జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. గాయపడిన కానిస్టేబుల్కి సర్జరీ కూడా జరిగిందన్నారు.యూనిఫాంలో లేనప్పుడు పోలీసని గుర్తించడం ఎలా..? అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... గాయపడ్డారని చెబుతున్న కానిస్టేబుల్ పోలీసు యూనిఫాంలో లేరని గుర్తు చేశారు. యూనిఫాంలో లేనప్పుడు పోలీసని గుర్తించడం ఎలా? అని ప్రశ్నించారు. యూనిఫాం ధరించి చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆరోపణలకు బలం చేకూరుతుందన్నారు. ఇంటెలిజన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు యూనిఫాం ఉండదని పీపీ చెప్పగా, అలా అయితే మరి వారు లా అండ్ ఆర్డర్ విధులు ఎలా నిర్వర్తిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ, కేసు డైరీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెపె్టంబర్ 8కి వాయిదా వేశారు. -
‘విద్యుత్’ ఉద్యమంపై బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: బషీర్బాగ్ షహీద్చౌక్.. విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. 2000 సంవత్సరం ఆగస్టు 28న ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లో పోలీస్ కాల్పుల్లో ముగ్గురు నెలకొరిగారు. ఈ కాల్పుల ఘటనతో నాటి చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనకు ‘కౌంట్డౌన్’ మొదలైంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభు త్వం గ్రామీణ ప్రాంతాలు, రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి భయానక పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఆదు కునే దిశగా చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనేక జిల్లాల్లో కరువు తీవ్రత పెరిగినా పట్టించుకోలేదు. ఇదీ నేపథ్యం... ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ సంస్కరణల అమల్లో భాగంగా ప్రైవేటీకరణ విధానా లతో ప్రజలపై పెనుభారాన్ని పెంచేలా విద్యుత్ చార్జీలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిని వ్యతిరేకిస్తూ సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షపార్టీలు ప్రారంభించిన విద్యుత్చార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు, డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. వైఎస్ నిరవధిక దీక్షతో ప్రజా ఉద్యమంగా... కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్.రాజశేఖరరెడ్డి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. దీంతో ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకొని ప్రజాఉద్యమంగా రూపుదాల్చింది. చార్జీల పెంపుదల నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ సీఎం చంద్రబాబుకు నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ లేఖ రాశారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా చేపట్టిన ‘చలో అసెంబ్లీ’పై బషీర్బాగ్ చౌరస్తా వద్ద చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిరసనకారులు ముందుకు సాగే ప్రయత్నం చేయగా, పోలీసులు కాల్పులకు దిగడంతో రామకృష్ణ, విష్ణువర్దన్రెడ్డి, బాలస్వామి తూటాలకు బలయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం, పోలీసుకాల్పుల ఘటనలు పరోక్షంగా టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణమయ్యాయి.విద్యుత్ అమరవీరుల స్మారకార్థం ‘షహీద్చౌక్’ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. పాదయాత్రతో ప్రజల హృదయాల్లో నిలిచిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎల్బీస్టేడియంలో ప్రజల సమక్షంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అక్కడికక్కడే నిండు సభలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ను అమలు చేస్తూ తొలి సంతకంపై వైఎస్ సంతకం చేశారు. అనంతరం బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద పోలీసుకాల్పుల్లో ముగ్గురు మరణించిన చోట విద్యుత్ అమరవీరుల స్మారకార్థం ‘షహీద్చౌక్’ను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ప్రతీ ఏడాది ఆగస్టు 28న చంద్రబాబు పాలనలో కాల్పుల ఘటనను గుర్తు చేసుకుంటూ ముగ్గురు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, సంస్థలు నివాళులు అర్పిస్తూ వస్తున్నాయి. గురువారం షహీద్చౌక్ వద్ద విద్యుత్ అమరవీరులకు జోహార్ జోహార్, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ వామపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆనాటి విద్యుత్ ఉద్యమం నేటికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. -
పచ్చఖాకీ.. దౌర్జన్యకాండ
ముండ్లమూరు(దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ మండల కన్వినర్కు చెందిన దుకాణాల కూల్చివేతకు గ్రామానికి భారీగా తరలివచ్చారు. రావడం రావడంతోనే అరాచకానికి దిగారు. అడ్డొచ్చిన మహిళలను రోడ్డుపై ఈడ్చిపడేశారు. లాఠీలు ఝుళిపించారు. అరెస్టు చేసి పోలీసు జీపు ఎక్కించేందుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఎదురుతిరిగారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే.. వైఎస్సార్ సీపీ ముండ్లమూరు మండలం కన్వినర్ చింతా శ్రీనివాసరెడ్డి పసుపుగల్లు గ్రామంలో ఉంటున్నారు. ఆయనకు, ఆయన సోదరి భర్త రత్నారెడ్డి పేరున గ్రామ ప్రధాన సెంటర్లో రెండు సెంట్ల స్థలం ఉంది. వ్యాపారాలకు అనుకూలంగా ఉండడంతో 30 ఏళ్లుగా రేకుల షెడ్లు వేసుకుని దుకాణాలు నడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చడీచప్పుడు లేకుండా మంగళవారం తెల్లవారుజామున దర్శి ఎస్సై మురళి, ముండ్లమూరు ఎస్సై కమలాకర్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్తోపాటు సుమారు 30 మంది పోలీసులు పొక్లెయిన్లతో గ్రామానికి వచ్చారు. దుకాణాల కూల్చివేతకు యత్నించారు.శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరి, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ఇవి అక్రమ నిర్మాణాలని, కూల్చివేయాలని గ్రామ కార్యదర్శి మౌలాలి ఫిర్యాదు చేశారని ఎస్ఐలు చెప్పారు. దీంతో కార్యదర్శిని పిలిచి తమ దుకాణాలు కూల్చేందుకు ఎవరు తీర్మానం చేశారని ప్రశి్నంచగా ‘‘పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేం చేస్తున్నాం. పైవాళ్లు చెప్పినట్లు మేం వినాలిగా మాదేముంది’’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రిజిస్టర్డ్ భూమి అని కావాలంటే కొలతలు వేసి చూసుకోవాలని సూచించారు. అయినా కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని సెక్రటరీని, పోలీసులను నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులు ఫోన్లో సీఐ రామారావుకు తెలియజేయడంతో ఆయన వచ్చి వీరంగం చేశారు. ‘‘ఏయ్ ఎవడ్రా అడ్డు వచ్చేది? మర్యాదగా పక్కకు తప్పుకోండి. అడ్డొస్తే కేసులు పెడతాం’’ అంటూ చిందులు తొక్కారు. దీంతో పోలీసులు పైశాచికత్వం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా రోడ్డుపై పక్కకు లాగిపడేశారు. లాఠీలను ఝుళిపించారు. మహిళలను పక్కకు లాగేందుకు మహిళా పోలీసులు ఉన్నా.. మగ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మహిళలను అసభ్యంగా తిడుతూ లాగి పడేశారు. దీంతో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక టీడీపీ నాయకుడు బిజ్జం సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో తమ గ్రామంలో వైఎస్సార్ సీపీకి 248 ఓట్ల మెజార్టీ వచ్చిందని, దానిని సహించలేకే తమపై ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయినా సీఐ పట్టించుకోలేదు. సెక్రటరీతో మాట్లాడుకోవాలని పోలీసులు దౌర్జన్యాన్ని కొనసాగించారు. చివరకు గ్రామస్తులు పోలీసులపై తిరగబడడంతో చేసేది లేక రేకుల షెడ్ కూల్చివేసి అక్కడి నుంచి జారుకున్నారు. -
పచ్చఖాకీ..దౌర్జన్యకాండ
-
కుమార్తెలు, మరిదే హంతకులు.. వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
సాక్షి, అనకాపల్లి: బాటజంగాలపాలెంలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్ట్ 14 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి సొంత కుమార్తెలు, మరిదే హంతకులుగా తేల్చిన పోలీసులు.. మృతురాలు విశాఖలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్కు చెందిన బంకిళ సంతుగా గుర్తించారు.ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో చిన్నాన్న సహాయంతో హత్యకు ప్లాన్ చేసిన కూతుర్లు.. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి టవల్తో మెడ బిగించి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. డెడ్బాడీని కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాటజంగాలపాలెం దగ్గర ప్రెటోల్ పోసి తగలబెట్టారు. -
పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతేంటి?
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం.. .. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు. అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఈ సందులో తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. -
Anantapur: దివ్యాంగులపై పోలీసుల దురుసు ప్రవర్తన
-
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ సీరియస్
-
అయ్యన్న బూతు పురాణం
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ప్రొటోకాల్ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి రెచ్చిపోయారు. నేను వస్తున్నానంటే కూడా మీకు లెక్కలేదా అంటూ బూతులు లంకించుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.రావికమతం: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. మేమొస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ప్రొటోకాల్ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి పత్రికల్లో రాయలేని భాషలో విరుచుకుపడ్డారు. అయ్యన్న రెచ్చిపోయిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ఈ నెల 21న గ్రామ దేవత శ్రీదుర్గాలమ్మ పండుగ భారీ ఎత్తున జరిగింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు వివిధ ప్రాంతాల నుంచి .. వివిధ పార్టీలకు చెందిన దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. వేలాది మంది భక్తుల రాకతో గ్రామంలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో సీఐ, ఎస్ఐ సహా పోలీసులంతా బందోబస్తులో నిమగ్నమయ్యారు. అదే సమయంలో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున అనుచరులను వెంట బెట్టుకుని అయ్యన్న వచ్చారు. వచ్చీ రాగానే.. పోలీసులెక్కడ.. అని ప్రశ్నిస్తూ నోటికి పని చెప్పారు. పోలీసు అధికారులెవరూ తన వద్దకు రాలేదని ఆగ్రహించారు. ‘మేమొస్తుంటే సీఐ, ఎస్ఐ ఏం చేస్తున్నారు? తమాషాలు చేస్తున్నారా?.. నేను వచ్చినా కూడా ఇక్కడకు రారా..’ అంటూ బండబూతులతో రెచ్చిపోయారు. అయ్యన్న పోలీసులను తిడుతుంటే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మద్దతుగా కేకలు వేశారు. ఆ పక్కనే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి.. ‘సార్.. మేమిక్కడే ఉన్నామని చెబుతున్నా ఆయన వినిపించుకోలేదు. దీంతో పోలీసులు చిన్నబుచ్చుకున్నారు. -
ఏలూరు జిల్లా దెందులూరు అక్రమ కేసుల్లో పోలీసులకు ఎదురుదెబ్బ
-
‘గాజా సాయం’ పేరుతో నిధుల సేకరణ.. గుజరాత్లో సిరియన్ అరెస్ట్
అహ్మదాబాద్: ఇజ్రాయెల్ యుద్ధంతో పూర్తిగా దెబ్బతిన్న గాజాలోని పేదల కోసం భారత్లోని వివిధ మసీదుల నుండి నిధులు సేకరిస్తున్న సిరియన్ జాతీయుడిని గుజరాత్లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తూ వస్తున్న మరో ముగ్గురు సిరియన్ పౌరులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.నిందితునితో పాటు అతని సహచరులు గాజా బాధితుల పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బును వారి విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు వారు ఏదో ఒక ప్రయోజనం కోసం రెక్కీ నిర్వహించడానికి నగరంలో తిష్ట వేశారనే అనుమానాలున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంలో ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఒక హోటల్ నుండి అలీ మేఘత్ అల్-అజార్ (23) ను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. ఇదే హోటల్లో అనుమానిత సిరియస్లు జకారియా హైతం అల్జార్, అహ్మద్ అల్హబాష్, యూసఫ్ అల్-జహర్ బసచేసినట్లు పోలీసులు కనుగొన్నారు.‘ఒక నిఘా సమాచారం ఆధారంగా మేము డమాస్కస్ నివాసి అయిన అల్-అజార్ను అరెస్టు చేశాం. అతని వద్ద నుండి 3,600 అమెరికన్ డాలర్లు, రూ. 25,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని అరెస్టు తర్వాత మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారు దేశం నుండి పారిపోకుండా ఉండేందుకు వారిపై లుక్-అవుట్ నోటీసు జారీ చేశాం. ఈ నలుగురు సిరియన్లు పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి జూలై 22న కోల్కతాలో దిగారు. ఆగస్టు 2న వారు అహ్మదాబాద్ చేరుకున్నారు.వారు స్థానిక మసీదుల నిర్వహకులను సంప్రదించి, గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారి వీడియోలను చూపిస్తూ విరాళాలు సేకరించారు. గాజాలోని పేద లకు ఆహారం అందించేందుకు, నిధులు సేకరిస్తున్నామని వారు చెప్పేవారు. అయితే వారు గాజాకు నిధులు పంపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు’ అని అని శరద్ సింఘాల్ తెలిపారు. కాగా గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి అహ్మదాబాద్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ సిరియన్లు గుజరాత్కు రావడం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం ఏమిటి? స్థానిక మసీదుల నుండి సేకరించిన నిధులను ఎక్కడికి పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.నిందితుల కదలికలు, సంబంధాల గురించి మరింత తెలుసుకునేందుకు వారు బస చేసిన ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను స్కాన్ చేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ప్రాథమికంగా.. వారు రెక్కీ చేయడానికే ఇక్కడకు వచ్చారని, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోందని ఆయన తెలిపారు. అరెస్టయిన సిరియన్ జాతీయుడు, అతని సహచరులు పర్యాటక వీసా షరతులను ఉల్లంఘించారన్నారు. విచారణ సమయంలో నిందితుడు తమ విలాసవంతమైన జీవనశైలి కోసం ఈ నిధులు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. -
సామాన్యుడు విసిరిన సవాల్!
ప్రముఖ కంపెనీలు తమ వెబ్సైట్లు, డేటాబేస్ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో నిపుణులను నియమించుకుని రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆయా వెబ్సైట్లలో ఉన్న లోపాలను, హ్యాకింగ్కు ఆస్కారాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ పని చేస్తుంటాయి. అలాంటిది ఏకంగా విదేశాంగ శాఖ అధీనంలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వెబ్సైట్ను ఒక డిప్లొమా హోల్డర్ హ్యాక్ చేసి, సవాలు విసిరారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం 2010లో అత్యవసరంగా పాస్పోర్టులు పొందాలనుకునే వారి కోసం తత్కాల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీని కింద దరఖాస్తుదార్లు కేవలం ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. పెద్ద సంఖ్యలో స్లాట్స్ ఇస్తుండటంతో పనిభారం పెరిగిన పాస్పోర్ట్ కార్యాలయం ఆ ఏడాది ఫిబ్రవరిలో వాటి సంఖ్యను 350కి పరిమితం చేయడంతో తత్కాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని భావించిన చాలామందికి నిరాశే ఎదురయ్యేది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు దళారులు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన లతాధర్రావు ద్వారా హ్యాకింగ్ కథ నడిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన గోరంట్ల లతాధర్రావు అప్పట్లో నరసరావుపేటలో లలితా ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడు టీపీ వర్క్ కూడా చేస్తుండటంతో ఆ పనిలో భాగంగా అక్కడి గాంధీచౌక్లో ఆకాశ్ ట్రావెల్స్ నిర్వహించే షేక్ సుభానీతో పరిచయం ఏర్పడింది. లతాధర్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సుభానీ ఇతని సాయం తీసుకునేవాడు. ప్రతిఫలంగా ఒక్కో అప్లికేషన్కు రూ.100 చొప్పున చెల్లించేవాడు. అప్పట్లో పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చేపట్టేది. తత్కాల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన ఆన్లైన్ స్లాట్స్ను 2010 ఫిబ్రవరి నుంచి తగ్గించారు. దీంతో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించారు. త్వరగా ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందుకు వచ్చేవారు. దీంతో పాస్పోర్ట్ వెబ్సైట్ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లతాధర్ ఈ పని చేశాడు. వెబ్సైట్లోకి హ్యాకింగ్ ద్వారా ఎంటర్ అయిన లతాధర్ దాని నుంచి నేరుగా ఎన్ఐసీ సర్వర్కు కనెక్ట్ అయ్యేవాడు. రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరుల లాగాన్లో మార్పులు చేసేవాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేశాకనే మిగిలిన స్లాట్స్ను ఫ్రీ చేసేవాడు. నరసరావుపేటకు చెందిన సుభానీ, లతాధర్ల ద్వారా ఆన్లైన్ స్లాట్స్ వేగంగా దొరుకుతుండటం, పాస్పోర్ట్ అపాయింట్మెంట్స్ వస్తుండటంతో హైదరాబాద్కు చెందిన పాస్పోర్ట్ ఏజెంట్లు మహ్మద్ జహంగీర్, భూమా శ్రీహరి, గిడ్డా చిన్నా, సయ్యద్ వలీయుద్దీన్, కె.పెంచల్రెడ్డి, ఖలీమ్, శ్రీనివాస్లు వీరికి సబ్–ఏజెంట్స్గా మారిపోయారు. తత్కాల్ పాస్పోర్ట్స్ కోసం తమను ఆశ్రయించే వారి దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా వారిద్దరికీ పంపడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్నే వ్యాపారంగా చేసుకున్న ‘లతాధర్ అండ్ కో’ దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేసింది. సాధారణంగా తత్కాల్ దరఖాస్తుకు అప్పట్లో రూ.2 వేలు చెల్లిస్తే సరిపోయేది. అయితే ఈ ముఠా సభ్యులు మాత్రం అదనంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తంలో రూ.1000 నుంచి రూ.2000 వరకు సుభానీకి ఇచ్చే వారు. అతను ముఠా సూత్రధారి అయిన లతాధర్కు రూ.500 నుంచి రూ.1000 వరకు కమిషన్ అందించే వాడు. ఈ రకంగా లతాధర్ గ్యాంగ్ కేవలం రెండు నెల్లలో మూడువేల తత్కాల్ పాస్పోర్ట్ దరఖాస్తులు అప్లోడ్ చేశారు. అప్పట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చుట్టూ దాదాపు 20 మంది ఏజెంట్లు ఉండేవారు. ఆన్లైన్ బుకింగ్ స్లాట్స్ సంఖ్య తగ్గించినప్పటి నుంచి వీరిలో కేవలం జహంగీర్, శ్రీహరి, చిన్నా, వలీయుద్దీన్, పెంచల్రెడ్డిలకు మాత్రమే స్లాట్స్ దొరుకుతున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వరుసగా ఇలాగే జరుగుతుండటంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిపై నిఘా పెంచిన టాస్క్ఫోర్స్ పోలీసులు జహంగీర్కు చెందిన కంప్యూటర్ను సైబర్ నైపుణ్యం కలిగిన పోలీసులతో తనిఖీ చేయించారు. ఈ కంప్యూటర్ను ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లు గుర్తించేందుకు వీలు లేకుండా ప్రాక్సీ ఐపీలతో వాడుతున్నట్లు గుర్తించారు. మరోపక్క అనేక పాస్పోర్ట్ ఆన్లైన్ దరఖాస్తులు ఫార్వర్డ్ చేయకుండా ఫిల్ చేసి సిద్ధంగా ఉంచడాన్ని కూడా గుర్తించారు. దీంతో జహంగీర్ను అదుపులోకి తీసుకుని విచారించారు.పాస్పోర్ట్ దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా నరసరావుపేటకు చెందిన సుభానీకి పంపుతున్నట్లు జహంగీర్ చెప్పడంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం సుభానీని విచారించగా, లతాధర్రావు సహాయంతో చేస్తున్న పనిని బయటపెట్టాడు. లతాధర్రావును అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించగా ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్పోర్ట్ వెబ్సైట్కు చెందిన సోర్స్ కోడ్ను హ్యాక్ చేయడం ద్వారా స్లాట్స్ బ్లాక్ చేసి, వాటిని తమ ఏజెంట్ల ద్వారా ఫిల్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు లతాధర్రావు, సుభానీ, జహంగీర్లతో సహా ఏడుగురు నిందితులకు 2010 జూన్ 4న అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడిన పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వెబ్సైట్లో లోపాలు లేకుండా సరిచేసి పకడ్బందీగా తయారు చేశారు.· -
‘నాఫ్తలీన్’తో కప్పెట్టి.. పటకారుతో మోది.. దడపుట్టిస్తున్న రెండు ఘటనలు
వార్ధా: మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు అతనిని ఫోన్లో సంప్రదించారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో పోలీసులు నేరుగా వార్ధాలోని హింగాన్ఘాట్లోని వారి ఇంటికి వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వార్ధాలోని హింగాన్ఘాట్కు చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదును చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ ఇంటి సమీపంలో ఘాటైన వాసనను పోలీసులు గమనించారు.అది నాఫ్తలీన్ బాల్స్ వాసనగా వారు గుర్తించారు. అలాగే అక్కడ గుంత తవ్విన ఆనవాళ్లు వారికి కనిపించాయి. అక్కడ తవ్వి చూడగా, వారికి మహిళ మృతదేహం కనిపించింది. నాఫ్తలీన్ బాల్స్ ఘాటైన వాసన పోలీసుల దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడింది. ఈ హత్య ఎలా జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ కేసులో అదృశ్యమైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.పటకారుతో దాడి చేసి..హర్యానాలోని గురుగ్రామ్లో ఇటువంటి ఉదంతమే వెలుగు చూసింది. భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మనేసర్ ప్రాంతంలోని నహర్పూర్ కసన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్కు చెందిన నిషా బిష్ట్ రాజేంద్రలకు 2024, డిసెంబర్లో వివాహం జరిగింది. గురుగ్రామ్లో ఉంటున్న వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా మరోమారు నిషా, రాజేంద్ర గొడవపడ్డారు. ఈ సమయంలో రాజేంద్ర వంటగదిలోని పటకారుతో ఆమెపై దాడి చేశాడు. తరువాత రోకలిబండతో మోదాడు.ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు శుక్రవారం ఉదయం నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. రాజేంద్రను అరెస్టు చేశారు. అతను నేరం అంగీకరించాడు. పోలీసులు ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు. -
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసుల ఓవరాక్షన్
-
హైకోర్టు ఉత్తర్వులను కాదని.. పెద్దారెడ్డిని అడ్డగించిన ఖాకీ
తాడిపత్రి టౌన్/యల్లనూరు: హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ పోలీసులు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా నారాయణరెడ్డిపల్లిలో పెద్దారెడ్డిని పోలీసులు రోడ్డుపై అడ్డుకోవడంతో సోమవారం హైటెన్షన్ నెలకొంది. దీంతో ఆయన రోడ్డుపై కూర్చున్నారు. తన సొంతింటికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డిపల్లి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి బలవంతంగా తరలించారు. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం ఉదయం 10–11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 నెలల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రిలోని తన ఇంటికి బయలుదేరారు. అయితేకోర్టు ఉత్తర్వులనూ బేఖాతరు చేస్తూ టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకున్నారు. ఆ రోజునుంచీ ఇంతే.. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రాకుండా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పోలీసులు శాంతిభద్రతల సమస్య అంటూ కేతిరెడ్డికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. దీనిపై కేతిరెడ్డి పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కారు. చివరగా జిల్లా ఎస్పీ జగదీశ్, తాడిపత్రి సీఐ సాయిప్రసాద్పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.దీంతో హైకోర్టు సోమవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే అదనపు బలగాలను వినియోగించాలని ఆదేశించింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం తిమ్మంపల్లి నుంచి 5 వాహనాల్లో అనుచరులతో కలసి తాడిపత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలో పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు బలగాలతో కలసి రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఉంచి కేతిరెడ్డిని అడ్డుకున్నారు. 9 గంటలపాటు హైడ్రామా జేసీ ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసులపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా నన్నెందుకు తాడిపత్రిలోని నా ఇంటికి పంపించడం లేదు. పోలీసు శాఖకు ప్రభాకర్రెడ్డి పెద్దా? అలాగైతే చెప్పండి. అతనికే మొరపెట్టుకుంటా. నాయనా నువ్వు పరి్మషన్ ఇస్తేనే నన్ను పోలీసులు తాడిపత్రికి పంపుతారంట అని. పోలీసులందరికీ జీతాలు ఇస్తున్నావా అని అడుగుతా. పోలీసులంతా జేసీ ప్రభాకర్రెడ్డి సంతృప్తి కోసమే పని చేస్తున్నారు’ అని రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుని నిలదీశారు. ఏప్రిల్ నుంచి రెండుసార్లు కోర్టు ఆర్డర్ తెచ్చానని, అయినా తాడిపత్రికి పంపకపోవడం తగదన్నారు. తాడిపత్రిలో విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్దసంఖ్యలో టీడీపీ మద్దతుదారులు వచ్చారని, మిమ్మల్ని అక్కడికి పంపితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని డీఎస్పీ సమాధానమిచ్చారు.పోలీసుల తీరుకు నిరసనగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణరెడ్డిపల్లి వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపైనే బైఠాయించారు. దాదాపు 9గంటల పాటు అక్కడే ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకుని పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.సాయంత్రం 6 గంటల సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను బలవంతంగా అక్కడి నుంచి వెనక్కి పంపించారు. మరోవైపు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్ల సమీపంలోని వీధుల్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, వజ్ర వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఇద్దరు, ముగ్గురు గుమికూడినా హెచ్చరికలు చేస్తూ వెళ్లిపోవాలని సూచించారు. ఇది అనాగరిక చర్య: గోరంట్ల మాధవ్ కోర్టు ఉత్తర్వులతో తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని చూస్తే ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని స్పష్టమవుతోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రంలో కేవలం రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలో తిరగనివ్వకుండా, ఇంట్లో ఉండకుండా చేయడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డిని కంట్రోల్ చేయలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జేసీ ఆదేశాలతోనే అడ్డుకుంటున్నారు: కేతిరెడ్డి జేసీ ప్రభాకర్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. తాడిపత్రిలో మట్కా, గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో పోలీస్ అధికారులు విఫలమయ్యారన్నారు. తాను తాడిపత్రికి వెళితే జేసీ చేస్తున్న అవినీతి, అరాచకాలను బయట పెడతానన్న భయంతో అడ్డుకుంటున్నారన్నారు. జేసీ హంగామా కాగా.. సోమవారం తాడిపత్రిలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివుడి విగ్రహాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం నేరుగా ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపానికి వాహనాల్లో అనుచరులతో చేరుకుని.. అక్కడే ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ హంగామా చేశారు. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఇంటివరకు నడుచుకుంటూ వెళ్లారు.కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి ఉండేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట సోమవారం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. -
పోలీస్ ‘తిరుగుబాటు’
సాక్షి, అమరావతి: రెడ్బుక్ వేధింపులపై పోలీసు అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట చరిత్రలో తొలిసారిగా... వందమందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగంగా గళం వినిపించారు. పోస్టింగులు ఇవ్వకుండా సాధిస్తుండడంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. ఏడాదికిపైగా జీతాలు లేవు... కుటుంబాలను ఎలా పోషించేదని నిలదీశారు. పైగా... ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు అంటూ వేధింపులను మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు.అసలు పోస్టింగులే లేవు... ఇక మా కుటుంబాలు ఎక్కడ ఉండాలి? మేం బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలి? అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు ప్రధాన కార్యాలయంలోనే జరగడం గమనార్హం. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు అధికారులు కూడా నిరసన స్వరం వినిపించేంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మరోసారి స్పష్టమైంది. యావత్ పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం. ఇంతకూ ఏం జరిగిందంటే...?తీరు మార్చుకోకపోగా.. మరింత దారుణంగాచంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరుపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇది చాలదన్నట్లుగా... అదనపు ఎస్పీ నుంచి సీఐ స్థాయి వరకు పోస్టింగులు లేకుండా వెయిటింగ్లో ఉన్న వందమందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగుల విషయం తేలుస్తారని ఆశతో వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం ఆ అధికారులు అదనపు డీజీ మధుసూదన్రెడ్డిని కలిశారు. వెయిటింగ్లో ఉన్నవారంతా రోజూ ఉదయం, సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్రెడ్డి చెప్పారు. డీజీపీ హరీశ్కుమార్గుప్తా ఈ మేరకు ఆదేశించినట్లు తెలిపారు. ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరంఅదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో... ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారు. ‘‘డీజీపీ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తండ్రివంటివారు. ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకు తెలియదా? వందలమంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు ఎలా నిర్వరిస్తున్నారు? అని డీజీపీ ఏనాడైనా ఆలోచించారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వేధింపులు చాలవన్నట్టు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏమిటని ధ్వజమెత్తారు. ఎక్కడ ఉండాలి..?‘‘కుటుంబాలన్నీ మేం ఏడాది క్రితం పనిచేసిన పట్టణాలు, నగరాల్లో ఉండిపోయాయి. పోస్టింగ్ లేకుండా మేం కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి...? డీజీపీ కార్యాలయానికి రోజూ ఉదయం, సాయంత్రం ఎలా వచ్చేది?’’ అని సూటిగా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ‘‘పోస్టింగులు ఇవ్వండి. ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తాం. ఉదయం, సాయంత్రం ఏమిటీ...? రోజుకు పదిసార్లు బయోమెట్రిక్ వేయమన్నా వేస్తాం’’ అని స్పష్టం చేశారు. అంతేగానీ, పోస్టింగులు లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అమానవీయం అని వాపోయారు.⇒ పోలీసు అధికారుల ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏదీ లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు. వారి ఆవేదన పట్ల తనకూ సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలనే తాను చేరవేశానని అన్నారు. సమస్యను డీజీపీతోనే చర్చించాలని సూచించారు.తన మాటను నెగ్గించుకునేందుకే...‘‘వెయిటింగ్లో ఉన్నా పోస్టింగే’’ అనే తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న అధికారులు రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ, అనూహ్యంగా అధికారులు పూర్తిగా ఎదురు తిరగడంతో పోలీస్ బాస్లకు నోట మాట రాలేదు. కాగా, ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల రెడ్బుక్ కుట్ర, అందుకు వత్తాసు పలుకుతున్న పోలీసు బాస్ల తీరుతో తమ డిపార్ట్మెంట్ ఆత్మగౌరవం దెబ్బతింటోందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.పోస్టింగులపై హామీ ఇవ్వని డీజీపీఅదనపు డీజీ మధుసూదన్రెడ్డిని కలిసిన అనంతరం పోలీసు అధికారులు కొందరు జట్టుగా, మరికొందరు విడివిడిగా డీజీపీ హరీశ్కుమార్గుప్తా వద్దకు వెళ్లినట్లు సమాచారం. సమస్యలను ఆయనకు కూడా వివరించినట్లు తెలిసింది. పోస్టింగులపై డీజీపీ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అధికారులకు ఏడాదికి పైగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఇటీవల సమర్థించుకోవడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ‘‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉండడం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్డ్ పోస్టే’’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘‘...మరి వీఆర్లో ఉన్న పోలీసు అధికారులకు నెలనెలా జీతాలు ఇస్తున్నారా? ఏడాదిగా జీతాలివ్వకుండా పోస్టింగ్లో ఉన్నట్టే అని ఎలా ప్రకటిస్తారు’’? అని ప్రశ్నించారు. -
పీహెచ్డీ చేయాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు
నారాయణపేట: అసలు వారణాసిలో ఏమి జరిగిందంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ) మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ సీఎస్ రామచంద్రమూర్తిపై గత నెలలో జరిగిన దాడి కేసును వారణాసి పోలీసులు సీరియస్గా తీసుకొని .. 15 రోజుల్లోనే చేధించారు. ఈ నేపథ్యంలో అసలు ఏమి జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు కథ ... అంతర్గత వివాదమే దాడికి దారి ప్రొఫెసర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వివాదమే దాడికి దారి తీసిందనేది వారణాసి పోలీసుల విచారణలో వెల్లడైంది. కలత చెందిన మాజీ విభాగాధిపతి తెలంగాణకు చెందిన తన ఇద్దరు పూర్వ పరిశోధన విద్యార్థులు భాస్కర్, మోడ్గు కాసిం బాబుకు హెచ్ఓడీ తనను వేధిస్తున్నాడని, తనను పని చేయనివ్వడం లేదని తన బాధను వెలిబుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు ప్రయాగ్రాజ్లోని మహమ్మద్ కాసీం అనే పరిచయస్తుడిని సంప్రదించారు. ఈ ముగ్గురు కలిసి జూలై 25న వారణాసికి చేరుకొని కాంట్రాక్ట్ నేరస్తులను నియమించుకున్న గణేష్పాసిని కలిశారు. బీహెచ్యూ క్యాంపస్ వెలుపల ప్రొఫెసర్ మూర్తిపై దాడి చేయడమే అసలు పథకం. ముందుగా క్యాంపస్ లోపల దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. కట్చేస్తే ఫ్రొఫెసర్పై దాడి జరిగిందిలా.. జూలై 28న సాయంత్రం 6:30 గంటకు ప్రొఫెసర్ మూర్తి క్యాంపస్ నుంచి బ్రిజ్ఏన్క్లేవ్ కాలనీలోని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బిర్లా హాస్టల్ క్రాసింగ్ వద్ద ప్రొఫెసర్పై కడ్డీలతో దాడి చేశారు. దాడిలో ప్రొఫెసర్ రెండు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం దుండగులు హైవేపై పారిపోయారు. స్థానికులు గాయపడిన ప్రొఫెసర్ను చికిత్స నిమిత్తం బీహెచ్యూ ట్రామా సెంటర్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కటకటాల పాలయ్యాడు చిన్నప్పుడే భాస్కర్ తల్లిదండ్రులను కోల్పోయాడు. పెద్దనాన్న కిష్టప్ప పోషణలో పెరిగాడు. పీజీ వరకు టాప్ ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. పీహెచ్డీ ఎంట్రెన్స్లో సైతం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పీహెచ్డీ పూర్తి చేయాలనుకున్న భాస్కర్ విధి రాత.. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పెట్టిన ఆశతో కటకటాల వైపు తీసుకెళ్లినట్లు అవుసలోనిపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు. -
పక్కా ఏవిడెన్స్.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బాగోతం బట్టబయలు
హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. యూట్యూబర్పై 2,500 పేజీల ఛార్జ్షీట్ను హిసార్ కోర్టులో దాఖలైంది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్థారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సిట్ చార్జ్షీట్లో పేర్కొంది.జ్యోతి మల్హోత్రాపై అఫిషియల్ సీక్రెట్స్ చట్టంలోని సెక్షన్లు 3, 5తో పాటు బీఎన్ఎస్లోని సెక్షన్ 152 కింద కేసు నమోదైంది. ఈ చార్జ్షీట్ను పరిశీలించిన అనంతరం న్యాయపరంగా స్పందిస్తామంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టు 18న జరగనుంది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరిట ట్రావెల్ వ్లాగ్ నడిపేంది. ఆమెపై పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో.. మూడు నెలల పాటు సిట్ అధికారులు విచారణ చేశారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్లోని అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారన్న తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 2,500 పేజీలతో కూడిన చార్జ్షీట్ను హిసార్ కోర్టులో సిట్ శనివారం దాఖలు చేసింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ చార్జ్షీట్లో పేర్కొంది.ఆమె ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లన్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2024లో పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలకు ఆమె ప్రయాణించిన వివరాలను పోలీసులు చార్జ్షీట్లో నమోదు చేశారు. పాకిస్తాన్లో ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మేరియం షరీఫ్ను కలిసినట్లు సమాచారం. ఆమె మొబైల్ ఫోన్, డిజిటల్ డేటా ద్వారా గూఢచర్యానికి సంబంధించిన పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.కాగా, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకోగా.. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది.హిస్సార్కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ను నడిపేది. ఈ ఛానెల్కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్చేశారు. ఈమె ట్రావెల్విత్జో1 ఇన్స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది.అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్ ఆదేశానుసారం అలీ అహా్వన్ అనే వ్యక్తి ఈమెకు పాక్లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్బాజ్లతో పరిచయం పెంచుకుంది. షహ్బాజ్ ఫోన్నంబర్ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్ఫోన్లో జాట్ రంధావా అనే వేరే పేరుతో సేవ్చేసింది.వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాప్ యాప్లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్చేసింది. పాక్లో కతాస్ రాజ్ టెంపుల్ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. -
118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్విసెస్ విభాగంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎల్పీఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్–1లో 50 పోస్టులు, మల్టీజోన్–2లో 68 పోస్టులు భర్తీ చేయనున్నట్టు టీజీఎల్పీఆర్బీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు తేదీలను తర్వలోనే వెల్లడిస్తామన్నారు. ఎల్ఎల్బీ లేదా బీఎల్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. తెలంగాణలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు అడ్వొకేట్గా పనిచేసిన అనుభవం ఉండాలని సూచించారు.అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 34 ఏళ్లు మించి ఉండకూదని తెలిపారు. రిజర్వేషన్ల వారీగా మినహాయింపులున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు, ఎక్స్ సర్విస్మెన్ (ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ ఎయిర్ఫోర్స్ లేదా ఇండియన్ నేవీలో పనిచేసిన వారికి మాత్రమే) మూడేళ్ల సడలింపు వర్తిస్తుందని వెల్లడించారు. అదనపు వివరాలకు అభ్యర్థులు www.tgprb.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. దరఖాస్తు తేదీలు ప్రకటించిన వెంటనే హెల్ప్లైన్ను అందుబాటులోకి తెస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
సంచలన ఆడియో.. పోలీసులు, టీడీపీ నేతలే నన్ను చంపేశారు..
-
ఇద్దరు ఏపీ పోలీసు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/కర్నూలు/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్) : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు చెన్నుపాటి భద్రయ్య (ఎస్పీ), గోపు రాజీవ్కుమార్ (డీఎస్పీ) రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకానికి ఎంపికయ్యారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగి్నమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్విసెస్కు చెందిన మొత్తం 1,090 మంది అధికారులకు శౌర్య/సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 25 మంది ఏపీ అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు.కేంద్ర హోంశాఖ గురువారం ఈ జాబితా విడుదల చేసింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 233 మందికి శౌర్య పతకాలు (జీఎం), 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీఎస్ఎం), 758 మందికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు (ఎంఎస్ఎం) ప్రకటించింది. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, 20 మంది పోలీసులకు కరెక్షనల్ సర్విసెస్ కింద, ముగ్గురు అధికారులకు ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి.ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్టుచేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. ప్రతిభాపూర్వక సేవా పతకాలు రవికృష్ణ ఆకే (ఐజీ), శ్రీనివాసరావు వల్లూరి (డీఎస్పీ), వీరవెంకట ప్రతాప్కుమార్ తోట (డీఎస్పీ), కోదండ శ్రీరామచంద్రరాజు దెందుకూరి (అసిస్టెంట్ కమాండెంట్), గోవిందరావు మామిడి (ఇన్స్పెక్టర్), రామకృష్ణ గండెం (ఇన్స్పెక్టర్), శ్రీనివాసరావు బొడ్డు (హెడ్ కానిస్టేబుల్), సీతారాము కరిమకొండ (ఎస్ఐ), చంద్రశేఖర్ పెదిరెడ్డి (ఏఎస్ఐ), నాగమల్లేశ్వరరావు విశ్సరాపు (ఏఎస్ఐ), వెంకటరామశర్మ బుర్రా (ఏఎస్ఐ), ఉస్మాన్ గనిఖాన్ నయేబ్ (ఏఎస్ఐ), గోపాల్ కరువా (ఎస్ఐ), కోటేష్ కోట్టకోట (ఎస్ఐ), నాగేశ్వరరావు దొమ్మేటి (ఏఎస్ఐ), సీతారామాంజనేయులు పామర్తి (ఏఎస్ఐ), నాగబాబు కొప్పిశెట్టి (ఏఎస్ఐ), గోపాలకృష్ణ గుబ్బల (హెడ్ కానిస్టేబుల్), సురేష్ కుమార్ మురుగేశన్ (హెడ్ కానిస్టేబుల్), దానం గడ్డ (హెడ్ కానిస్టేబుల్), డా. వరప్రసాద్ మామిళ్లపల్లి (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్), రవికుమార్ కరణం (చీఫ్ హెడ్వార్డర్), వీరవెంకట సత్యనారాయణరావు తలపర్తి (హెడ్ వార్డర్)జమ్మూకశ్మీర్లో ఏపీ ఐపీఎస్కు కూడా.. ఇక జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కర్నూలుకు చెందిన ఐపీఎస్ అధికారి జీవీ సందీప్ చక్రవర్తి కూడా రాష్ట్రపతి పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. చక్రవర్తి అక్కడ అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే, గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఆరీ్పఎఫ్ డీఎస్పీ గొల్లమూడి మధుసూదనరావు, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కుక్కల రాజగోపాల్రెడ్డి కూడా రాష్ట్రపతి పోలీసు మెడల్స్కు ఎంపికయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, డీఆర్ఎం సుధేష్ట సేన్ వీరికి అభినందనలు తెలిపారు. -
కానిస్టేబుల్ నాయక్కు శౌర్య పతకం
సాక్షి , న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన కానిస్టేబుల్ కాట్రవత్ రాజు నాయక్ శౌర్య పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్ఐ మ్యాతరి సిద్ధయ్య, కానిస్టేబుల్ నిడమానూరి హుస్సేన్లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన మొత్తం 1,090 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ గురువారం ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.మరో 18 మందికి పతకాలుదేశవ్యాప్తంగా 226 మందికి శౌర్య పతకాలు (జీఎం), 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీఎస్ఎం), 635 మందికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు (ఎంఎస్ఎం) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఒకరికి శౌర్య పతకం, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు రాగా.. 11 మంది పోలీసులకు, నలుగురు అగ్నిమాపక శాఖ అధికారులకు, ఇద్దరు హోంగార్డులకు, కరెక్షనల్ సర్వీసెస్ కింద ఒకరికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి. ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్టు చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకాలను కేంద్రం అందజేస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు.ఉత్తమ ప్రతిభకు ‘ఉన్నత’ పతకంసిద్ధయ్య సేవలను గుర్తించిన కేంద్రంసంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని సింగింతం గ్రామానికి చెందిన మ్యాతరి సిద్ధయ్య రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. సిద్ధయ్య 1990లో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. తొలుత కొండాపూర్ పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరారు. ఆ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. సీఐడీ సంగారెడ్డి రీజనల్ ఆఫీస్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి వివిధ కేసుల సత్వర పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం విశిష్ట సేవా పతకానికి ఎంపిక చేసింది. సిద్ధయ్య గతంలో ఇండియన్ పోలీస్ మెడల్ పతకాన్ని పొందారు. ఇటీవల పదోన్నతి పొంది పటాన్చెరులో ట్రాఫిక్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అవార్డుకు ఎంపిక కావటంతో సిద్ధయ్యతో పాటు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.రక్తమోడుతున్నా ఉడుం పట్టు పట్టి..కరడుగట్టిన దోపిడీ దొంగను పట్టుకున్న రాజు నాయక్ హైదరాబాద్ (గచ్చిబౌలి): భార్యాభర్తలను హత్య చేసి దోపిడీకి పాల్పడి పరారైన కరడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ కట్రావత్ రాజు నాయక్కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్య పతకం ప్రకటించింది. 2023 జనవరి 5న నార్సింగి పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పాత నేరస్తుడు కరణ్సింగ్, మరో వ్యక్తితో కలిసి.. భార్యాభర్తలను హత్య చేశాడు. మరో వ్యక్తి వద్ద రూ.15 వేలు లాక్కుని ఇద్దరూ ఉడాయించారు. మాదాపూర్ ఎస్వోటీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజు మరో కానిస్టేబుల్తో కలి సి కరణ్ సింగ్ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యా రు. మరుసటి రోజు జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఉన్న ట్లు కనుగొని అక్కడికి వెళ్లారు. బైక్పై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న కరణ్సింగ్ను రాజు నాయక్ పట్టుకున్నారు. కరణ్సింగ్ తన వద్ద ఉన్న కత్తితో రాజు ఛాతీ, తలపై దాడికి పాల్పడ్డాడు. శరీరమంతా రక్తసిక్తమైనా కరణ్సింగ్ను రాజు వదలకుండా పట్టుకున్నారు. మరో కానిస్టేబుల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజు నాయక్ను ఆస్పత్రికి తరలించగా..మూడు సార్లు శస్త్ర చికిత్స తర్వాత కోలుకున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్తా వెంకటాపూర్కు చెందిన రాజు నాయక్ ఇటీవలే హెడ్ కానిస్టేబుల్ (3744)గా పదోన్నతి పొంది కొల్లూరు పీఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడం సంతోషంగా ఉందని రాజు నాయక్ ‘సాక్షి’తో అన్నారు. -
నటి పవిత్ర గౌడ అరెస్ట్
బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో గురువారం కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు. రేణుకా స్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలు పవిత్రా గౌడకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను.. గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో.. పోలీసులు నటి సప్తమిగౌడను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే హత్యకేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ను ఇవాళ సైతం దేశ అత్యున్నత న్యాయ స్థానం రద్దు చేసింది. బెయిల్ రద్దుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా.. కొద్ది సేపటి క్రితమే ఆర్ఆర్ నగర్లో ఉన్న పవిత్రగౌడను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. Kannada actor #DarshanThoogudeepa's friend #PavithraGowda on Thursday was arrested by the #BengaluruPolice after the #SupremeCourt cancelled her bail in connection to the #RenukaswamyMurderCase.pic.twitter.com/dlEovoXxFT https://t.co/y6tgvcfOep— Hate Detector 🔍 (@HateDetectors) August 14, 2025కర్ణాటక హైకోర్టు గతంలో దర్శన్, పవిత్ర గౌడ సహా ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. ఆ పిటిషన్పై గురువారం (ఆగస్టు14) జస్టిస్ జేబీ పార్దివాలా,ఆర్ మహాదేవన్ ఉన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది. సెషన్ కోర్టు (కర్ణాటక హైకోర్టు)ఇచ్చిన తీర్పులో అనేక లోపాలు ఉన్నాయని,ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి చట్టపరమైన కారణం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అదే సమయంలో దర్శన్ తూగదీపకు బెయిల్ ఇస్తే న్యాయ పరిపాలనను పట్టాలు తప్పే ప్రమాదం కలిగిస్తుందని పేర్కొంది. నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. విచారణ త్వరగా జరగాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జైలులో నిందితులకు ప్రత్యేక సౌకర్యాలఉ అందించాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్ ఆర్నగర్లో ఉన్న పవిత్రగౌడను.. మైసూర్లో ఉన్న దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.దర్శన్ వీరాభిమాని రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదే కారణంతో జూన్ 2024లో రేణుకా స్వామిని.. పవిత్ర గౌడతో పాటు దర్శన్ అతని అనుచరులు కిడ్నాప్ చేశారు. బెంగళూరులోని ఒక షెడ్లో మూడు రోజుల పాటు నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. చిత్రహింసలు తాళలేక రేణుకాస్వామి మరణించారు. డెడ్ బాడీని మురికి కాలువలో పడేసి పారిపోయారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. -
తెలంగాణలో త్వరలో ‘పర్యాటక పోలీసులు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో పర్యాటక పోలీసులు రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో పర్యాటక శాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం బుధవారం జరిగింది.ఈ సమావేశంలో టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్, టూరిజం ఎండి వి.క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి చ. ప్రియాంకతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ తెలిపారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ పేర్కొన్నారు.అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదాద్రి, పొచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఈ యూనిట్లు పనిచేయనున్నాయని.. షూటింగ్ పర్మిట్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని డీజీపీ ఆదేశించారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని డీజీపీ తెలిపారు. -
కాల్చి పడేస్తా.. నా కొడకా..! వైఎస్ జగన్ రియాక్షన్
-
రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్.. వీఆర్కు ఎస్ఐ రాజశేఖర్
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్పై వేటు పడింది. పోలీసు స్టేషన్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్ను వీఆర్కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న జయరాంనాయక్ను నియమించారు. నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్.. -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ
జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఖాకీలే పచ్చరౌడీల్లా తెగబడ్డారు. పోలీసు పహారాలోనే అధికారిక రిగ్గింగ్ యథేచ్ఛగా సాగిపోయింది. టీడీపీ కూటమి కుతంత్రాన్ని పచ్చ ఖాకీలు అంతా తామై అమలు చేశారు. రాజ్యాంగాన్ని నిర్భీతిగా కాలరాశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పోలీసులు సర్వం తామై ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఓటు వేసే ప్రజల రాజ్యాంగ హక్కును అడ్డుకున్నారు. దాడులతో తెగబడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. సామాన్యులు కనీసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ గూండాలు దాడులకు తెగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు దొంగ ఓట్లు వేసేందుకు రాచబాట పరిచారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి వత్తాసు పలకడమే విద్యుక్త ధర్మం అంటూ పోలీసులు కొత్త మాన్యువల్ను అమల్లోకి తెచ్చారు. పత్తేపారం చేస్తున్నారా అనే దిగజారుడు భాషతో పచ్చ ఖాకీల అధికారిక రౌడీయిజానికి డీఐజీ కోయ ప్రవీణ్ రింగ్ మాస్టర్గా వ్యవహరించారు. ఈయన ఓ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే కావడం గమనార్హం. లాఠీచార్జితో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయమని పచ్చ పైత్యం ప్రదర్శించారు. ఇక, కాల్చిపారేస్తా.. నా కొడకా అంటూ డీఎస్పీ మురళీనాయక్ పచ్చిరౌడీలా చెలరేగిపోయారు. ఎస్పీ అశోక్కుమార్ నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కుట్రలో భాగస్వామిగా మారింది. ఓటర్లను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్రమాలు, టీడీపీ రిగ్గింగ్కు అడ్డుఅదుపు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. రెక్కీ నిర్వహించి హత్యలు చేసే కిరాయి మూకల్లా ఖాకీలు పులివెందులపై పడ్డారు. వెయ్యిమందికిపైగా పోలీసులు మండలాన్ని అష్ట దిగ్బంధం చేశారు. వారం రోజులుగా పులివెందులలో పోలీసు మార్క్ రౌడీయిజంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ ప్రభుత్వ కుతంత్రంతో ఓ గ్రామంలోని ఓటర్లకు వేరే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి వద్దకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెళ్లకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడపడితే అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం పోలింగ్ సందర్భంగా పోలీసులు పూర్తిగా బరితెగించేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఓటర్లను లాఠీలు ఝళిపిస్తూ బూతులు తిడుతూ వెనక్కి పంపించేశారు. అయినా సరే తాము ఓట్లు వేస్తామని పట్టుబట్టినవారిపై విరుచుకుపడ్డారు. అనుమతించాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఓటర్ల చేతుల్లోని స్లిప్లను గుంజుకున్నారు. ‘‘మీ దగ్గర ఓటరు స్లిప్పులు లేవు కాబట్టి అనుమతించం’’ అని తర్వాత చెప్పడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఖాకీ గూండాగిరీ రాజ్యమేలింది. పోలీసు పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ టీడీపీ రిగ్గింగ్కు పోలీసులు రక్షాకవచంగా నిలిచారు. పులివెందులలోని అన్ని పోలింగ్ బూత్లలోని వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. కాగా, జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పోలింగ్ రోజున అనుమతించకూడదు. పోలీసులు అవేమీ పట్టించుకోకుండా కూటమి గూండాలకు రాచబాట పరిచారు. దీంతో పచ్చ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భారీగా ఓటర్లు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మరీ విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, సామాన్యులు ఓటు వేసేందుకు వెళ్లకుండా నిరోధించారు. స్లిప్పులను తీసుకుని చింపివేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వర్గీయులు, గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. పోలీసులే వారిని దగ్గరుండి తీసుకువెళ్లి మరీ దొంగ ఓట్లు వేయించడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేవరకు పోలీసుల పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ యథేచ్ఛగా కొనసాగింది. వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఖాకీల దండయాత్ర డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆశోక్కుమార్, ఏఎస్పీ ప్రకాష్ బాబు, డీఎస్పీ మురళీనాయక్, మరో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, వందలమంది పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. వారికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా లాఠీచార్జితో చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. తమను ఓట్లు వే సేందుకు అనుమతించాలని ఓటర్లు కాళ్లా వేళ్లా పడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ కార్యాలయం గేటుకు తాళం వేసి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ అవినాశ్రెడ్డిని నిర్బంధంలోనే ఉంచారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆయన పక్కనే కూర్చుని మరీ ఈ కుతంత్రాన్ని పకడ్బందీగా పర్యవేక్షించారు. రిగ్గింగ్ ఆధారాలు ఉంటే ఇవ్వండి: డీఐజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచామని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకు తెలిపారు. తాము బందోబస్తు కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిగ్గింగ్కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘం, కోర్టుకు ఇస్తారు కానీ డీఐజీకి ఎందుకు ఇస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కాల్చిపడేస్తా నా కొడకా.. అంటూ డీఎస్పీ రౌడీయిజంపులివెందుల డీఎస్పీ మురళీనాయక్ అయితే వైఎస్సార్సీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయడం లేదని, రిగ్గింగ్ను ఆపాలంటూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే యత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్, యూనిఫాం ఇక్కడ..’ అంటూ రౌడీ తరహాలో చెలరేగిపోయారు. పోలీసులు కుట్రపూర్వకంగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించడం.. పరుష వ్యాఖ్యలతో డీఎస్పీ మురళీనాయక్ చెలరేగిపోవడం.. ఇద్దరు, ముగ్గురు సీఐలు విరుచుకుపడడం అంతా పక్కా పన్నాగంతోనే సాగింది. కార్యకర్తలు ప్రతిఘటించి పరిస్థితి అదుపుతప్పితే.. అదే సాకుగా ‘తీవ్రమైన చర్యల’కు తెగించాలన్నది పోలీసుల కుతంత్రం. కాల్పులకూ తెగించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. పోలీసులు ఉద్దేశం గుర్తించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కార్యకర్తలను వారించారు. ‘ఎలాంటి ఉద్రిక్తతలు వద్దు. కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని హితవు పలికారు. రిగ్గింగ్ రింగ్ మాస్టర్ డీఐజీ కోయ ప్రవీణ్ మొన్న విపరీత వ్యాఖ్యలు.. నేడు అధికార దుర్వినియోగం పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్కు రింగ్ మాస్టర్గా డీఐజీ కోయ ప్రవీణ్ వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరితెగించారు. ఎస్పీ అశోక్ కుమార్తో పాటు యావత్ పోలీసు యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. పోలింగ్కు నాలుగు రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్యాదవ్, పార్టీ కీలక నేత వేల్పుల రాములపై హత్యాయత్నాన్ని డీఐజీ ప్రవీణ్ తక్కువ చేసి చూపించేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ‘ఒక ఊరివారు మరో ఊరికి ఎందుకు వెళ్లారు? పత్తేపారం చేయడానికా’ అంటూ వెటకారం ఆడారు. తద్వారా ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలకడమే తన ఉద్దేశం అని చాటారు. పోలింగ్ సందర్భంగా ప్రవీణ్ అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అక్రమ గృహ నిర్బంధం, వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి తరహాలో పోలీసులు చొచ్చుకుపోవడాన్ని ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి స్వయంగా ఆదేశించడం గమనార్హం. ప్రవీణ్ ఆదేశాలతోనే ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ మురళీనాయక్తో పాటు పోలీసులు అక్రమాలకు తెగబడ్డారు. తెల్లవారుజామునే పోలీసుమార్కు గూండాయిజం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అక్రమ నిర్బంధం పులివెందులలో మంగళవారం సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీశారు. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీ పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. -
నారీ స్వారీ!
శారీరక దృఢత్వం భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోగల మానసిక బలాన్నిపెంచి... కరిగిపోని కాన్ఫిడెన్స్ను ఇస్తుంది! అది జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది! ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేసే కొలువులున్నాయి.. వాటిల్లో రాణించే అమ్మాయిలున్నారు! ఆ ఫోర్సే.. మౌంటెడ్ పోలీస్.. పదిమంది నారీమణులతో కూడిన ఆ అశ్వదళం హైదరాబాద్ను పహారా కాస్తోంది.. సెల్ఫ్ ప్రోటెక్షనే కాదు.. శాంతిభద్రతల పర్యవేక్షణలోనూ స్త్రీ శక్తిని చాటుతోంది!ఇంట్లో ఆడపిల్ల వీథి చివరన ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా తమ్ముణ్ణి తోడు ఇచ్చే పంపే కాలానికిక చెల్లు ఏమో అనిపిస్తోంది.. హైదరాబాద్లోని కీలక్రపాంతాల్లో గుర్రాల మీద గస్తీ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అశ్వదళ మహిళా పోలీసులను చూస్తుంటే! నిజానికి వాళ్లను మహిళా పోలీస్ అంటే వాళ్లనలా తీర్చిదిద్దిన వాళ్ల దళాధిపతులు .. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితామూర్తి ఒప్పుకోరు.‘జాబ్కి జెండర్ ఏంటీ.. శక్తిసామర్థ్యాలు ప్రామాణికం కానీ..’ అంటారు. అందుకే తొలిసారిగా.. ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) పోలీస్లోని పదిమంది అమ్మాయిలను అశ్వదళంలోకి ఆహ్వానించి.. వారికి గుర్రపు స్వారీలో శిక్షణనిప్పించి విధులను అప్పగించారు. వీళ్లు ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ దగ్గర, రోజు విడిచి రోజు లేక్ డ్యూటీలు చేస్తున్నారు. ర్యాలీలు, పండగలు, గణేశ నవరాత్రులు, శోభాయాత్రలు వంటి సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.శక్తి చూపించింది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. ఈ దళంలోని పదిమంది అమ్మాయిలది భిన్న నేపథ్యం. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినప్పటికీ మౌంటెడ్ పోలీస్ అంటే వాళ్లెవరికీ తెలియదు.. ఆ ఫోర్స్ గురించి నోటీస్ వచ్చేదాకా. ఏఆర్ పోలీస్లో రెండువందల మందికి పైగా మహిళలుంటే మౌంటెడ్ పోలీస్లో చేరడానికి పదిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మౌంటెడ్ పోలీస్ అంటే ఏంటో రీసెర్చ్ చేశారు. ‘ట్రైనింగ్ టఫ్గా ఉంటుంది.. ఫిట్నెస్ చాలా అవసరం.. ఆసక్తి ఉంటేనే రండి’ అని ట్రైనర్ చెప్పాక దాన్నో సవాలుగా తీసుకున్నారు. శిక్షణలో గుర్రాల మీద నుంచి పడ్డారు. దెబ్బలు తగిలాయి. అయినా వెనుకడుగు వేయలేదు.గుర్రాలను మాలిమి చేసుకోవడంలో కొన్ని మెళకువలను కనుగొన్నారు. గుర్రాలు చెప్పినట్టు వినడం మొదలెట్టాయి. అలా శిక్షణలోని ఆంతర్యాన్ని పసిగట్టి.. తదనుగుణంగా ముందుకు సాగారు. ఆ ట్రైనింగ్ వాళ్ల ఆత్మస్థయిర్యాన్నే కాదు.. ఫిజికల్ ఫిట్నెస్నూ పెంచింది. జీవన దృక్పథాన్నే మార్చింది. విధి నిర్వహణలో వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకోవడం దగ్గర్నుంచి, తమ కమాండ్స్తో వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోవడం మొదలు.. జనసమ్మర్ధంలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసుకోవడం వరకు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. ఈ దళంలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్ అఖిల కూడా ఉన్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సభ్యులు సుభద్ర, హవంతిక ఈ కొత్త కొలువు గురించి వివరించారు. మగవాళ్లకే పరిమితమైన కొలువుల్లోకి మహిళలు వస్తే.. పనిప్రదేశం లో విమెన్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని ఈ అశ్వదళం నిరూపించింది.– సరస్వతి రమ – ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది.. ఎస్సై కావాలని, గృహ హింస మీద మహిళలకు అవగాహన కల్పించాలనేది నా లక్ష్యం. దానికోసమే రీసెంట్గా డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడేసరికి ఇందులో చేరిపోయాను. కొత్త పనులు చేయడమన్నా, నేర్చుకోవడమన్నా చాలా ఇష్టం. అందుకే మౌంటెడ్ పోలీస్ గురించి చెప్పగానే అందులో చేరడానికి అందరికన్నా ముందుగా నేను చెయ్యెత్తాను.అయితే నాకు రెండు డెలివరీలూ సిజేరియనే అవడంతో మౌంటెడ్ పోలీస్కి కావల్సినంత ఫిజికల్ ఫిట్నెస్ లేక ట్రైనింగ్ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. వెనక్కి వెళ్లిపోతే మిగిలిన అమ్మాయిలు నిరుత్సాహపడతారేమో అనిపించింది. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్ పట్ల అప్పటిదాకా నాకున్న దృక్పథమే మారిపోయింది. లేనిదాని గురించి దిగులుపడే బదులు ఉన్నదాని గురించి పాజిటివ్గా ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాను. జీవితంలోని కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది – అఖిలఉత్సాహం.. ప్రోత్సాహం.. చిన్నప్పటి నుంచీ విలక్షణంగా... విభిన్నంగా ఉండాలనే తపన. అందుకే ఈ పోలీస్ జాబ్లోకి వచ్చాను. అది రొటీన్ అయిపోతోందనుకుంటున్నప్పుడే మౌంటెడ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. గుర్రపు స్వారీ కష్టమని మా నాన్న వద్దన్నారు. కానీ ఆయన్ని ఒప్పించి ట్రైనింగ్లో చేరాను. నన్ను డ్యూటీలో చూసిన మా బంధువులు ‘నీ బిడ్డ ఠీవిగా భలే డ్యూటీ చేస్తోంద’ని తనతో చెబుతున్నారని మా నాన్న నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించే గర్వం చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఐపీఎస్ కావాలనే నా లక్ష్యానికి తగిన ప్రోత్సాహన్నిస్తుంది. – మర్రి హవంతికబ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను..చిన్నప్పటి నుంచీ నాకు టఫ్ టాస్క్స్ అంటే ఇష్టం. అందుకే కరాటే, టైక్వాండో నేర్చుకున్నాను. స్పోర్ట్స్లో కూడా ముందుండేదాన్ని. ఆ స్పిరిటే నన్ను పోలీస్ జాబ్ వైపు, మౌంటెడ్ పోలీస్ వైపు మళ్లేలా చేసింది. ఈ కొలువు నాకో కొత్త చాలెంజ్. గుర్రపు స్వారీతో లైఫ్ బ్యాలెన్సింగ్ను నేర్చుకున్నాను. నా భవిష్యత్ లక్ష్యం గ్రూప్ వన్ ఆఫీసర్. – సుభద్ర -
ఈవీఎంలతో గెలిచారు.. అందుకే వణుకుతున్నారు చంద్రబాబుపై అంజాద్ బాషా ఫైర్
-
నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు..
నెల్లూరు(క్రైమ్): ‘నంద్యాలకు చెందిన కె.రమేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడుగుతుండగా మొహం చాటేసి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరుకు చెందిన ఓ యువతి కోరారు. ‘వింజమూరు ప్రాంతానికి చెందిన బాబు ప్రేమిస్తున్నాని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరం కలిసి సహజీవనం చేశాం. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరిస్తున్నాడు’ అని ఉదయగిరికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 98 మంది విచ్చేసి తమ ఫిర్యాదులను ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచు రామారావు, డీటీసీ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫిర్యాదుల్లో కొన్ని..⇒ కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తానని అనంతసాగరానికి చెందిన తులసీధర్ నమ్మించాడు. రూ.3 లక్షల నగదు తీసుకుని కువైట్కు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వలేదు. ఇటీవల నిలదీయగా చంపుతానని బెదిరిస్తున్నాడని అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.⇒ నా భర్త మరణించాడు. అత్తింటివారు ఆయన ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాకు జీవనాధారం కష్టమైంది. అవస్థలు పడుతున్నానని కొండాపురానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు.⇒ నా కుమార్తె ఈనెల రెండో తేదీ నుంచి కనిపించడం లేదు. మా మండలానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం ఉంది. విచారించి కుమార్తె ఆచూకీని తెలియజేయాలని లింగసముద్రంకు చెందిన ఓ మహిళ కోరారు.⇒నాకు ముగ్గురు కుమారులు. నా పేరుపైనున్న ఆస్తులు పంచాలని కొడుకులు, కోడళ్లు వేధిస్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు.⇒ నెల్లూరుకు చెందిన పృథ్వీరాజ్తో నాకు వివాహమైంది. అతను వ్యసనాలకు బానిసై అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.⇒ నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. చైన్నెలో మరో వివాహం చేసుకున్నట్లు ఫొటోలు పంపాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రంకు చెందిన ఓ వివాహిత కోరారు. -
‘మమ్మల్ని ఆపకండయ్యా..’ పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు ఇష్టారాజ్యం రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్న టీడీపీ.. అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఖాకీలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు. పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ‘‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా’’ అంటూ అభ్యర్థించారు. అయినా పోలీసులు కనికరించలేదు. ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు. మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు?అంటూ గదమాయించారు. మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు. ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. -
నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..
సాక్షి టాస్క్ఫోర్స్: న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఓ గిరిజన మహిళను ఆ స్టేషన్ ఎస్ఐ లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే.. కేసులో న్యాయం చేస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించాడు. రాత్రి వేళల్లో పదే పదే వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. దీంతో బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్పగా.. ఆయన కూడా ఎస్ఐని బతిమాలినా ఆ ఎస్ఐ వెనక్కు తగ్గలేదు. ఆమె కదలికలపై నిఘా పెట్టి ఆమెను వెంబడించి వేధించేవాడు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ వేధింపులతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. వెంబడించి మరీ వేధింపులు గరుగుతండాకు చెందిన భార్యాభర్తల విడాకుల కేసులో భాగంగా ఆ భార్యకు రావాల్సిన భరణం గురించి మాట్లాడేందుకు ఇటీవల పట్నం పోలీస్స్టేషన్కు ఆమె బంధువులు వెళ్లారు. ఆ మహిళకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి వెళ్లిన పాపానికి ఎస్ఐ తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఎస్ఐ తనకు నగ్నంగా చేసిన వీడియో కాల్స్ను రికార్డ్ చేసినట్టుగా ఆమె చెప్పింది. ఇటీవల తాను వ్యక్తిగత పని మీద అనంతపురం వెళ్తే.. ఎస్ఐ రాజశేఖర్ తనను వెంబడించి తన వద్దకు వచ్చి వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతపెట్టాడని కన్నీటిపర్యంతమైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే తమను ఇలా వేధిస్తుంటే.. ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ బాధిత మహిళతో పాటు, ఆమె బంధువులు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. కాగా, ఎస్ఐ రాజశేఖర్ ప్రవర్తనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పోలీసులకు హైకోర్టు షాక్
సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ కీలక నేతలు లింగాల రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రిరెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. వీరిపై నమోదైన కేసులో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సోమవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీచేశారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేస్తున్న తమపై వైఎస్సార్సీపీ నేతలు లింగాల రామలింగారెడ్డి, మరికొందరు దాడిచేసి గాయపరిచారంటూ టీడీపీకి చెందిన ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. ఇది కొట్టేయాలని కోరుతూ రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు. ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడవ జరిగితే, దానిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేయడం చెల్లదన్నారు. పైగా.. బాధితుడు ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అయితేనే ఆ చట్టం కింద కేసు పెట్టడానికి వీలుంటుందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకే పిటిషనర్లపై పోలీసులు ఈ తప్పుడు కేసు నమోదుచేశారన్నారు.అనంతరం.. పోలీసుల తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సి ఉందన్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పిటిషనర్లపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. ఈలోపు ఫిర్యాదుదారు ధనుంజయకు నోటీసులు అందజేయాలని పీపీకి సూచించారు. -
దివ్యాంగుడని చూడకుండా.. గోడు వినకుండా
జగిత్యాల టౌన్: జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారులకు గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దివ్యాంగుడిని (లోకోమోటివ్ డిజార్డర్) కలెక్టరేట్ పోలీసులు, సిబ్బంది బయట వదిలేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన మర్రిపెల్లి రాజగంగారాం ప్రజావాణిలో తన సమస్య చెప్పుకునేందుకు చక్రాలబండిపై వచ్చాడు. కలెక్టర్ వస్తున్నారంటూ అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రాజగంగారాంను వీల్చైర్తో సహా బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఆడిటోరియం తలుపును పట్టుకున్న గంగారాం.. అక్కడే నేలపై పడుకుని నిరసన తెలిపే ప్రయత్నం చేశాడు.సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ దివ్యాంగుడిని పట్టించుకోకుండానే లోపలికి వెళ్లిపోయారు. తర్వాత రాజగంగారాంను సిబ్బంది ప్రజావాణి ప్రాంగణం నుంచి బయట వదిలేశారు. తన ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత సోమవారం కూడా నేలపై పడుకుని నిరసన తెలిపాడు.అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తిరిగి ప్రజావాణికి వచ్చి తన సమస్య వివరించే ప్రయత్నం చేయగా ఆయన్ను బయటకు తోసేయడం వివాదాస్పదంగా మారింది. వెన్నుపూస సంబంధిత వైకల్యంతో బాధపడుతున్న తాను ఎనిమిదేళ్లుగా ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని రాజగంగారం వాపోయారు. బాధ్యుడైన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలి: కవిత గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చుకెళ్లి బయట పడేయడం అత్యంత దుర్మార్గమని, ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆమె డిమాండ్ చేశారు. ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లడం ఏంటి?: వాసుదేవరెడ్డి సాక్షి, హైదరాబాద్: తనకున్న సమస్యను చెప్పుకుందామని ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఏంటని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేదా రాచరికమా అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ అని మండిపడ్డారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జగిత్యాల మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి ఆ దివ్యాంగుడి సమస్యను తీర్చాలని కోరారు. -
అపర్ణకు జనం సెల్యూట్!
తిరువనంతపురం: ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి అందుకు నిదర్శనంగా నిలిచారు. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడమే కాదు.. రోడ్డు మధ్యలో పరుగెత్తుతూ వాహనాలను పక్కకు జరుపుతూ సంకేతాలు ఇచ్చారు. ఆమె చేసిన ఈ చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఆగస్టు 9న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ అంబులెన్స్ జూబ్లీ మిషన్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో పోలీసు వాహనంలో వెళ్తున్న స్టేషనల్ హౌస్ ఆఫీసర్ అపర్ణా లవకుమార్ ఆ అంబులెన్స్ను గమనించారు. వెంటనే పోలీసు వాహనం నుంచి మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరడం,రోగికి చికిత్స అందడంపై అపర్ణా లవకుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.అపర్ణా మానవత్వం చూపించిన ఘటనలో కోకొల్లలు. 2019లో త్రిసూర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా ఐదోతరగతి చదువుతున్న చిన్నారి బాధడను చూడలేక ఆమె తన జుట్టును పూర్తిగా తీసేసి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేశారు. పోలీస్ శాఖ నియమాల ప్రకారం జుట్టు పూర్తిగా తీసేసుకోవడానికి అనుమతి అవసరం. ఆమె నిర్ణయాన్ని త్రిసూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్వాగతించారు.2008లో ఓ మృతదేహాన్ని విడుదల చేయించేందుకు ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజులను ఇచ్చారు. ఇలా విధులు నిర్వహిస్తున్న అపర్ణా లవకుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Big Salute to #Kerala police woman ASI Aparna Lavakumar. In Thrissur, she ran ahead of a stalled ambulance in heavy traffic, personally urging vehicles aside so that the emergency vehicle with the patient could proceed safely. Aparna was previously praised for pawning her gold… https://t.co/RoUqXSzwAv pic.twitter.com/mip2MMLO7k— Ashish (@KP_Aashish) August 11, 2025 -
పవన్ పై దాడి చేసిన దినేష్కు కానిస్టేబుల్ సహకరించినట్లు ఆరోపణలు
-
బంగ్లా యువతిని నిర్బంధించి.. వ్యభిచార కూపంలోకి దించి
హైదరాబాద్: విదేశీ యువతిని నిర్బంధించి వ్యభిచార కూపంలోకి దించిన ముఠా సభ్యులను పాతబస్తీ బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, బండ్లగూడ ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ ఢాకా కు చెందిన రూపా అనే మహిళ సమీపంలో ఉండే యువతిని హైదరాబాద్ నగరం నివాసం, జీవనోపాధికి బాగుంటుందని నమ్మించి ఆరు నెలల క్రితం అక్రమంగా పశి్చమ బెంగాల్ మీదుగా హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చాక మెహదీపట్నం మురాద్నగర్కు చెందిన షహనాజ్ ఫాతీమా(32) ఇంట్లో ఉంచింది. అనంతరం హఫీజ్బాబానగర్కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ సమీర్(23) బాధితురాలిని బండ్లగూడ ఇస్మాయిల్ నగర్కు చెందిన హజేరా బేగం (41) ఇంటికి తీసుకొచ్చి నిర్బంధించారు. ‘నీవు వ్యభిచారం చేయాలని, లేకుంటే భారత్కు అక్రమంగా వచ్చావంటూ ఫిర్యాదు చేస్తే జైలుకు వెళుతావంటూ’ తీవ్రంగా బెదిరించడంతో బాధితురాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించింది. ఇలా ఆరు నెలల నుంచి నగరంలోని పలు హోటళ్లకు బాధితురాలిని పంపించి వ్యభిచారం చేయించారు. చివరకు వారి చెర నుంచి తప్పించుకొని శుక్రవారం బండ్లగూడ పోలీస్స్టేషన్కు చేరుకొని జరిగిన విషయమై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రూపా, వీరికి సహకరించిన సర్వర్ అనే నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో డీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వీడియో వైరల్: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కాల్పుల కలకలం
న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా అలజడి రేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా.. వారిలో ఒక యువతి ఉన్నారు. వారిని బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో గన్ క్రైమ్ తగ్గుతోందన్న పోలీస్ కమిషనర్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్కు అమాయకులు బలైపోతున్నారు. గత నెల జులై 29న న్యూయార్క్లోని మాన్హట్టన్ ఆఫీస్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్వైపీడీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.@bufocalvinA teenager opens fire in the middle of Times Square (New York City) and injures three people... pic.twitter.com/w7zD4DX3vD— patomareao (@patomareao81945) August 9, 2025మరో ఘటనలో మే 27న ఫిలడెల్ఫియాలోని ఫెయిర్మౌంట్ పార్క్ కాల్పులు కారణంగా ఇద్దరు మైనర్లు మృతి చెందారుజ ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండగా.. రాత్రి 10:30 సమయంలో కాల్పులు జరిగాయి. -
పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు: పేర్ని నాని
-
Suryapet: టెన్త్ విద్యార్థినితో నాలుగో పెళ్లి
-
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అడ్డుకున్న పోలీసులు
-
ఇంటి పక్కనే ఉంటాడు.. నా భార్యను వేధిస్తున్నాడు..
జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. -
నిందితులుగా ఎవరినీ ఎందుకు చేర్చలేదు?
సాక్షి, అమరావతి: ‘‘కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి నిందితుల జాబితాలో ఎవరినీ ఎందుకు చేర్చలేదు? ప్రసన్న సమర్పించిన ఫొటోల్లో దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్పష్టంగా ఉన్నారు కదా? వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు..?’’ అని హైకోర్టు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దర్గామిట్ట పోలీసులను ప్రశ్నించింది.ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు పురోగతి వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంటిపై దాడి గురించి ఫిర్యాదు ఇచ్చినా సకాలంలో కేసు నమోదు చేయలేదని, తర్వాత కేసు నమోదు చేసినా, దాడి చేసినవారిని నిందితులుగా చేర్చలేదని, ఈ విషయంలో పోలీసులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రసన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు. ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతోనే దాడి... పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రూపేష్ కుమార్రెడ్డి వాదనలు వినిపించారు. దాడికి పాల్పడినవారి ఫొటోలను, ఆ ఘటన సీసీ ఫుటేజీని పిటిషనర్ పోలీసులకు సమర్పించారని తెలిపారు. అయినా పోలీసులు కేసు నమోదులో విపరీతమైన జాప్యం చేసి, దాడి బాధ్యులను నిందితులుగా చేర్చలేదన్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల స్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతో... పిటిషనర్ ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఎ.జయంతి వాదిస్తూ, ఎవరిని నిందితులుగా చేర్చాలన్నది పోలీసుల విచక్షణకు సంబంధించినదని తెలిపారు. దర్యాప్తు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్నది పిటిషనర్ నిర్దేశించలేరన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు జరిపారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలని పోలీసులను ఆదేశించారు. అలాగే నిందితులుగా ఎవరినీ ఎందుకు చేర్చలేదో కూడా చెప్పాలన్నారు. -
భార్య పేకాట ఆడుతుందంటూ భర్త ఫిర్యాదు
సాక్షి,విశాఖ: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట ముఠా గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పేకాట ఆడుతున్న మహిళలు స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆగడాల్ని తట్టుకోలేని పేకాట ఆడుతున్న ఓ మహిళ భర్త సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయారు. పేకాట ఆడటం.వాగ్వాదానికి దిగడం.. అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగబడ్డారు.ఈ క్రమంలో స్థానికులు వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
కాకినాడ: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్ (గబ్బర్సింగ్) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
అన్నమయ్య జిల్లా : రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట నందలూరు పోలీసులను ఆశ్రయించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని టంగుంటూరు గ్రామానికి చెందిన చలమాల నవీన్ కుమార్, పులివెందుల మండలం భాకరపురం గ్రామానికి చెందిన సయ్యద్ మనీషా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చి రాజంపేట సమీపంలోని పోలిచెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంనంతరం తమ బంధువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తమను ఆశ్రయించారని ఎస్ఐ తలెఇపారు. ఇరువురి కుటుంబీకులను పిలిపించి ఘర్షణలకు పాల్పడకుండా సామరస్యంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. -
దొంగను పట్టించిన శివుని టాటూ.. ఎంపీ సుధకు ఊరట
న్యూఢిల్లీ: లోక్సభ మహిళా ఎంపీ గొలుసును చోరీ చేసిన దొంగను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు శివుని టాటూ వారికి ఉపయోగపడింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సోహన్ రావత్ (60) ఈ చోరీకి పాల్పలడినట్లు పోలీసులు గుర్తించారు. సోహన్పై గతంలో26 దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. వాహన దొంగతనం కేసులో సోహన్ బెయిల్పై బయటకు వచ్చాడు.ఎంపీ సుధ గొలుసు చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదువేలకు పైగా సీటీవీ కెమెరాలను పరిశీలించారు.48 గంటల ఇంటెన్సివ్ ఆపరేషన్ తర్వాత, పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో బీఆర్టీ కారిడార్ సమీపంలో బంగారు గొలుసును పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా రావత్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.నిందితుడు సోహన్ రావత్ ఈ నేరానికి ఉపయోగించిన స్కూటర్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో అతని శరీరంపైనున్న టాటూ ఉపయోగపడింది. దీనిగురించి అతని బంధువులు పోలీసులకు సమాచార మిచ్చారు. అతని భార్య పోలీసులకు రావత్ మొబైల్ నంబర్ను అందించింది. ఫలితంగా రావత్ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐ తల నరికి చంపేశారు!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. నిందితుల కోసం ఆరు బృందాలు తీవ్ర వేటలో నిమగ్నమయ్యాయి. బాధిత కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించారు. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని అలంగియం పట్టికి చెందిన షణ్ముగ వేల్ కుడిమంగళం పోలీసు స్టేషన్లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులలో ఉండగా 100కు వచ్చిన కాల్తో విచారణ నిమిత్తం అదేగ్రామంలోని ఓ ఎస్టేట్ తోటకు వెళ్లారు. విచారణకు వెళ్లిన షణ్ముగ వేల్ దారుణ హత్యకు గురైన సమాచారం బుధవారం ఉదయాన్నే పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. తిరుప్పూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలను విచారణకు నియమించారు. విచారణలో సంబంధిత ఎస్టేట్ మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్కు చెందినదిగా తేలింది. భద్రత కోసం వచ్చి హతమయ్యాడు.. ఈ ఎస్టేట్లో దిండిగల్కు చెందిన మూర్తి (65), ఆయన కుమారులు తంగపాండి, మణిగండన్ పనిచేస్తుండడం, వారు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు నెలకొన్నాయి. విచారణలో ఈ తండ్రి కొడుకులు మద్యం మత్తులో తరచూ గొడవ పడుతున్నట్టు, మంగళవారం రాత్రి కూడా ఘర్షణకు దిగినట్టు వెలుగు చూసింది. ఒకర్ని మరొకరు కర్రలతో కొట్టుకుంటుండటంతో 100కు ఫోన్ వెళ్లింది. దీంతో షణ్ముగ వేల్ భద్రత నిమిత్తం అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నట్టు తేలింది. ఈ సమయంలో మణి గండన్ కొడవలితో షణ్ముగ వేల్పై దాడి చేసి నరికి పడేశాడు. తప్పించుకునేందుకు షణ్ముగ వేల్ యతి్నంచినా వదలకుండా హత్యకు పాల్పడ్డాడు. దీనిని షణ్ముగ వేల్తో పాటూ వాహనంలో వెళ్లిన డ్రైవర్ గజరాజు చూడడంతో అతడి మీద కూడా దాడికి యతి్నంచారు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్లో డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ పోలీసులు ఆ ఎస్టేట్లోకి పరుగులుతీశారు. షణ్ముగవేల్ మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తును పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేయించారు. ఈ సమాచారంతో ఎమ్మెల్యే మహేంద్రన్ ఎస్ఐ కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేశారు. ఇక సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేíÙయో ప్రకటించారు. బుధవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం షణ్ముగ వేల్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆయన భౌతిక కాయం వద్ద డీజీపీ శంకర్జివాల్తో పాటూ ఉన్నతాధికారులు నివాళులరి్పంచారు. కాగా, పోలీసులకే రాష్ట్రంలో భద్రత కరువైందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. -
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
Pulivendula : సతీష్ కుమార్ రెడ్డి VS DSP
-
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ?
జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి పరీక్షించారు. అతను మద్యం తాగినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. అయితే ఆ సమయంలో బైక్తోపాటు అతని సెల్ఫోన్ను కూడా లాక్కొని పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడున్న హోంగార్డు, మరో కానిస్టేబుల్ మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతని మరణానికి కారణం పోలీసుల దురుసు ప్రవర్తనేనని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. విచిత్రం ఏంటంటే.. ఆ వ్యక్తి తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేశారు.చింతపల్లి మండలం కూర్మేడ్ గ్రామంలో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటూ టీవీ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్ యాకయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎదుటి వారితో కుమ్మకై ్క భూవివాదం సెటిల్ చేసుకోవాలంటూ తమ వేధిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఉన్నా పోలీసుల సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గతేడాది శాలిగౌరారం ఎస్సైపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదంలో పోలీసుస్టేషన్కు వెళ్లిన మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైపై ఎస్పీ విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్లీ పోలిసింగ్ గాడి తప్పుతోంది. కొందరు పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. బాధితుల ఫిర్యాదులతో బయటకు వస్తున్న సంఘటనలు కొన్నే. పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు, సెటిల్మెంట్లు చేస్తూ దండుకుంటున్న వారు కొందరైతే, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. అదీ చాలదన్నట్లు ఇంకొందరైతే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సస్పెండ్ చేయడం, ఎస్పీ కార్యాలయాలకు అటాచ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. పైగా రాజకీయ పలుకుబడితో కొద్దిరోజుల్లోనే తిరిగి పోస్టింగ్ పొందుతున్నారు.ముడుపులే లక్ష్యంగా దందాలుకొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రాజకీయ నేతల అండదండలతో అవినీతి దందా కొనసాగిస్తున్నారు. ఏదైనా కేసు విషయంలో పోలీసు స్టేషనన్కు వెళితే చాలు న్యాయ అన్యాయాలు పట్టించుకోకుండా, ముడుపులు ముట్టజెప్పిన వారికి వంతపాడుతూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు ఎదురు తిరిగిన వారిపై చేయి చేసుకోవడం బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులను పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని ముసిపట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్లో బంధించి చితకబాదడమే కాకుండా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైనా చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.చర్యలు చేపడుతున్నా తీరు మారట్లే..⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంధ్యకు యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని మరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే ఎస్సై తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మే నెల 20వ తేదీన ఆమె మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో మృతురాలి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఎస్సైని బదిలీ చేశారు.⇒ సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థ సారధి రూ. 16లక్షలు లంచం డిమాండ్ చేసి మే 12న ఏసీబీకి పట్టుబడ్డారు.⇒ నూతనకల్ మండలం మిర్యాలలో చక్రయ్యగౌడ్ హత్య కేసులో అప్పటి డీఎస్పీ డబ్బులు తీసుకొని నిందితులను ప్రోత్సహించడంతో పాటు హత్య కేసులో పాల్గొన్న నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని కాదని తుంగతుర్తి సీఐకి బాధ్యతలు అప్పగించడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీని డీజీపీ ఆఫీస్కు, సీఐని ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు.⇒ నూతనకల్ పోలీస్ స్టేషనన్లో పనిచేసిన ఎస్ఐ వి.ప్రవీణ్కుమార్ అదే పోలీస్ స్టేషనన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను లైంగికంగా వేధించడంతో సదరు మహిళా కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ ప్రవీణ్కుమార్ను శనివారం డీఐజీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.⇒ నేరేడుచర్ల మండలం మేడారంలో ఓ భూవివాదంలో తమ హత్యకు కుట్ర చేశారంటూ ఒక వర్గం వారు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మరోవర్గం వారిపై నేరేడుచర్ల ఎస్సై రవీందర్నాయక్ కేసు నమోదు చేసి స్టేషన్కి పిలిపించి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆరోపించారు. అంతేకాదు అదే మండలంలోని కందులవారిగూడెంలో భూవివాదంలో ఎస్సై రవీందర్నాయక్ ఒక వర్గం వారిని విచారణ పేరుతో బాధితులను కొడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. విచారణ పేరుతో ఎందుకు కొడుతున్నారని అడిగితే తమపైనా దురుసుగా ప్రవర్తించారంటూ స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.⇒ గతేడాది భూవివాదంలో గుర్రంపోడు మండలంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో ఎదుటివారితో కుమ్మకై ్క సూసైడ్ కేసుగా నమోదు చేశారు. ఆ కేసును ఎస్పీ శరత్చంద్రపవార్ విచారణ జరిపించారు. ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఆ తరువాత సీఐపైనా విచారణ జరిపించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొట్టిన విషయంలో సీఐపై విచారణ జరిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.వివాదాల కేంద్రంగా చింతపల్లిచింతపల్లి మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదంలో జోక్యం చేసుకున్నారు. ఆ కేసులో ఓ వృద్ధున్ని పోలీసు స్టేషనన్కు తీసుకువచ్చి కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆ వృద్ధుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వృద్ధునికి గుండెపోటు వచ్చిందని, పోలీసులు కొట్టినందున ఆయన చనిపోలేదని, గుండెపోటు కారణంగానే అతను చేనిపోయాడని తేల్చారు. అయితే సదరు ఎస్సైని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయినా కొద్దినెలలకే రాజకీయ పలుకుబడితో ఆయన మరో కీలకమైన పోస్టింగ్ తెచ్చుకోగలిగారు.డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసుల అత్యుత్సాహంపోలీసుల అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణ కేంద్రాల్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగినా, తాగకపోయినా తనిఖీల సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనంతోపాటు సెల్ ఫోన్లు లాక్కోవడం, ఇష్టానుసారంగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నిబంధనల ప్రకారం ఏం చేయాలన్నది కాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
తురక కిషోర్ కేసులో పోలీసులకు షాక్
-
జయహో జకీయుద్దీన్..! సైకిల్పై ట్రాఫిక్ పోలీసు విధులు
అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రభుత్వం కేటాయించిన బ్యాటరీ సైకిల్పై విధులు నిర్వహిస్తూ సికింద్రాబాద్ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. సంధులు, గల్లీల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎండీ జకీయుద్దీన్. 2014 బ్యాచ్కు చెందిన జకీయుద్దీన్ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్, పాట్ మార్కెట్, ఓల్డ్గాస్ మండీ తదితర ప్రాంతాల్లో సైకిల్పై విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం బ్యాటరీ సైకిళ్లను అందజేసింది. అయితే చాలా స్టేషన్లలో వీటిని మూలనపడేశారు. విధుల కోసం డిపార్టుమెంట్ ప్రతి నెలా ఇచ్చే 25 లీటర్ల పెట్రోల్తో బైక్స్ వినియోగిస్తుంటారు.. అయితే ఇంధనం ఆదా చేయడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే తాను బ్యాటరీ సైకిల్ వినియోగిస్తున్నానని జకీయుద్దీన్ చెబుతున్నాడు. తాను క్రీడాకారుడిని కాబట్టి సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ ఉపయుక్తమవుతుందని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని సాక్షితో పంచుకున్నాడు. (చదవండి: ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..) -
శనిమందిరంలో దొంగబాబా తిష్ట.. మూడు ‘ఆధార్’లో పట్టుకున్న పోలీసులు
పట్నా: దేశంలో దొంగ బాబాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో పోలీసులకు పట్టుబడుతున్న నకిలీ బాబాల గణాంకాలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా మరో దొంగబాబా పోలీసులకు చిక్కాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఇమాముద్దీన్ అన్సారీ(55) బెంగాలీ బాబా అలియాస్ బాలక్నాథ్ పేరుతో చలామణీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ దొంగబాబా ఏకంగా మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డుతో పోలీసులకు చిక్కాడు.ఉత్తరప్రదేశ్లోని షామ్లీలోని థానా భవన్ పరిధిలోని మంతి హసన్పూర్ గ్రామంలోగల శని మందిర్లో బెంగాలీ బాబా తిష్ట వేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అతని అసలు గుర్తింపు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం అతనిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో అన్సారీ నుండి పోలీసులు మూడు ఆధార్ కార్డులు, ఒక పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆధార్ కార్డులో బంగాలీ నాథ్ పేరు, సహరాన్పూర్లోని ఒక ఆలయానికి సంబంధించిన చిరునామా ఉంది. మిగిలిన రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులలో అతని అసలు పేరు ఇమాముద్దీన్ అన్సారీ , పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్ జిల్లాలోని చిరునామా ఉన్నాయి.ఎస్పీ రాంసేవక్ గౌతమ్ మాట్లాడుతూ, నకిలీ పత్రాలు కలిగివుండటం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమనే ఆరోపణలతో నిందితునిపై కేసు నమోదు చేశామన్నారు. అతనిని కైరానా కోర్టు ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారని తెలిపారు. అన్సారీకి సంబంధించిన వివరాలను సేకరించేందుకు యూపీ పోలీసులు పశ్చిమ బెంగాల్కు ఒక బృందాన్ని పంపారు. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటన స్థానిక హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇలాంటివారిపై పోలీసులు కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పోలీసుల ఓవరాక్షన్... తిరగబడ్డ గ్రామస్తులు
ఉదయగిరి/వరికుంటపాడు: మైనింగ్ మాఫియాకు మద్దతుగా పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సై కె. రఘునాథ్ దురుసు ప్రవర్తనతో పోలీస్స్టేషన్ వద్ద రోజంతా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలివీ.. మండల కేంద్రం వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలోని పల్లతిప్పలో మైనింగ్కు వ్యతిరేకంగా, పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ ఏకమై వారం రోజులుగా పోరుబాట పట్టారు. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీకి చెందిన బూత్ కన్వీనర్ షేక్ పీరయ్యను విచారణకు రమ్మంటూ మూడ్రోజులుగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్రమంలో.. సోమవారం ఉ.6 గంటలకు ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చి పీరయ్య తన షాపులో ఉండగా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న కొంతమంది పీరయ్యను అనుసరిస్తూ స్టేషన్కు వెళ్లారు. అయితే, పోలీసులు పీరయ్యను ఒక్కడినే లోపలికి తీసుకెళ్లి, మిగతా వారిపై దురుసుగా ప్రవర్తించి పంపించివేశారు. ఎస్సై రçఘునాథ్ తెల్లకాగితంపై పీరయ్యతో సంతకం చేయించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పీరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఒంగోలు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు.స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులుఇది తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు మొత్తం స్టేషన్ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. స్టేషన్ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ ఎస్సై గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకోవడంతో వారు స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం జోరు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో భారీగా పోలీసు బలగాలను దించారు.ఎస్సై క్షమాపణతో శాంతించిన గ్రామస్తులుపీరయ్యను ఎందుకు స్టేషన్కు బలవంతంగా తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు నిలదీయగా, ఎస్సై రఘునాథ్ వచ్చి ఉద్యమంలో ఉన్న ఎనిమిది మందిపై కేసు నమోదుచేశామని, అందులో భాగంగా విచారణ కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు. అయినా శాంతించని గ్రామస్తులు రాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చర్చలకు అçహ్వానం పంపినా, ఎస్సైను సస్పెండ్చేసే వరకు స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. రాత్రి ఏడు గంటలకు ఎస్సై రఘునాథ్ వచ్చి గ్రామస్తులకు క్షమాపణ చెప్పడంతో వారు వెనుదిరిగారు. -
ఏం చేస్తాం.. వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే
సాక్షి, అమరావతి: ఎన్నిసార్లు చెప్పినా కూడా మేజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండడంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురైంది. ‘ఏం చేస్తాం.. వారికి మేం సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే’.. అంటూ నిర్వేదం వ్యక్తంచేసింది. వైఎస్సార్సీపీ నేత తురకా కిషోర్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని.. అయినా మేజిస్ట్రేట్ కళ్లు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది.ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీచేసిన ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్ట్, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ తదితరాలతో కూడిన పేపర్లను పిటిషనర్ (తురకా సురేఖ) తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి అందచేస్తుండగా, వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఎస్జీపీ) తిరస్కరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయింది.పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో, ఆ పేపర్లను తీసుకుని సీల్డ్ కవర్లో ఉంచి వాటిని తమ ముందుంచాలని రిజి్రస్టార్ (జ్యుడీషియల్)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి (నేటికి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తుటా చంద్రధనశేఖర్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పోలీసుల తీరుపై హైకోర్టుకు తురకా సురేఖ.. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం అసలు తురకా కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి.. వాటినెప్పుడు నమోదుచేశారు.. ఎప్పుడు, ఏ ఘటనలో అరెస్టుచేశారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే ఇప్పుడు అరెస్టా!? ఈ నేపథ్యంలో.. సురేఖ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. కిషోర్పై పోలీసు కేసులకు సంబంధించి ఎస్పీ తయారుచేసిన వివరాలను ధర్మాసనం ముందుంచారు. అందులో కొన్ని కేసులను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తంచేసింది. ఇందులో.. రెండు, మూడేళ్ల క్రితం ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు తురకా కిషోర్ను అరెస్టుచేసినట్లు గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను ప్రశ్నించింది. కిషోర్పై మొత్తం 16 కేసులు నమోదు చేశారని, ఇందులో మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన కేసులో ఇప్పుడు హడావుడిగా అరెస్టుచేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీసింది. కిషోర్తో బలవంత సంతకానికి యత్నం.. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ.. తురకా కిషోర్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలను అనుసరించలేదన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా వినలేదన్నారు. మేజిస్ట్రేట్ సైతం వాదనలు వినలేదని, దీనిపై అభ్యంతరం చెప్పడంతో అప్పుడు వాదనలు విన్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మేజి్రస్టేట్ యాంత్రికంగా రిమాండ్ విధించారన్నారు. అంతేకాక.. పోలీసులే నేరాంగీకార వాంగ్మూలాన్ని తయారుచేసి, దానిపై కిషోర్తో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారని, అయితే.. సంతకం చేసేందుకు అతను నిరాకరించారని తెలిపారు. -
Anil Kumar : నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు
-
అనిల్ కుమార్ యాదవ్ పై కక్ష సాధింపు
-
పోలీసులా రాక్షసులా వాళ్ళు.. చంద్రబాబుపై అశోక్ బాబు భార్య ఫైర్
-
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
-
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీలోని అలీపూర్ నివాసి సోనియా (34), సోనిపట్కు చెందిన రోహిత్(28)గా గుర్తించామని, ఈ కేసులో మరో కీలక నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హర్ష్ ఇండోరా మీడియాకు తెలిపారు.మృతుడు ప్రీతమ్ ప్రకాష్ (42) అలీపూర్కు చెందిన చరిత్రకారుడు. 2024, జూలై 5న ప్రీతమ్ ప్రకాష్ సోనిపట్లోని గన్నౌర్లో సోదరి ఇంటిలో ఉంటున్న సోనియాను తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రీతమ్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తపై ఆగ్రహంతో ఉన్న సోనియా తన బంధువు(బావ) విజయ్కి రూ. 50 వేలు ఇచ్చి, భర్తను హత్యచేయాలని కోరింది. ఇంతలో ప్రీతమ్ ప్రకాష్ తిరిగి వచ్చి, సోనియాను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రీతమ్ ప్రకాష్ టెర్రస్పై పడుకున్నాడు. ఇదే సమయంలో విజయ్ అతనిని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఒక పథకం ప్రకారం అగ్వాన్పూర్ సమీపంలోని కాలువలో పడేశాడు.జూలై 20న, సోనియా తన భర్త అదృశ్యమైనట్లు ఆలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది తర్వాత ప్రీతమ్ ప్రకాష్ ఉపయోగించిన ఫోన్ యాక్టివ్ మోడ్లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. సోనిపట్లోని రోహిత్ ఆ ఫోన్ను ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించగా, అతను తొలుత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించాడు. అయితే ఆ తరువాత నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అలాగే తనకు సోనియాతో సంబంధం ఉన్నదని, సోనియా, విజయ్లు ప్రీతమ్ను చంపడానికి కుట్ర పన్నారని రోహిత్ పోలీసులకు తెలిపాడు. భర్తను హత్యచేసేందుకు సోనియా.. విజయ్కు డబ్బులు ఇచ్చిందన్నాడు.ప్రీతమ్ ప్రకాష్ హత్య తరువాత సోనియా అతని ఫోన్ను రోహిత్కు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా సోనియాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రీతమ్ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. అనంతరం వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఇదే సమయంలో సోనియా, రోహిత్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కాగా రోహిత్పై గతంలో హత్య, ఆయుధాలు కలిగి ఉండటం తదితర నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతమ్ ప్రకాష్ను హత్యచేసిన విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ ఇండోరా తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేత అశోక్బాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. -
బాబును దత్తత మాత్రమే ఇచ్చాను.. సరోగసీ అని చెప్పలేదు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): సృష్టి ఆస్పత్రి కేసు వ్యవహారంలో కీలకమైన ఏ1 ముద్దాయి డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. పిల్లలు లేరని తన దగ్గరకు వచి్చన మహిళకు తాను కేవలం బాబును దత్తత ఇప్పించానని పోలీసులకు ఇచి్చన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. అది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆమె నోరు విప్పకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు పోలీసులు విచారించేందుకు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ, ఏసీపీతో పాటు గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు వివిధ అంశాల గురించి ఆమెను గుచి్చగుచ్చి ప్రశ్నించినా ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తను ఎలాంటి తప్పూ చేయలేదని, తనకు బిడ్డ కావాలని, తన భర్త విదేశాల్లో ఉంటారని ఓ మహిళ తన దగ్గరకు రాగా దత్తత ఇప్పించానని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అంతకుమించి ఆమె నుంచి ఎటువంటి వివరాలూ పోలీసులు రాబట్టలేకపోయారు. ఆస్పత్రినుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించినా డాక్టర్ నమ్రత తనకు గుర్తు లేదని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా మాత్రమే జరగడంతో చాలా కేసులు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇంకా నాలుగు రోజులపాటు పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. పోలీసు కస్టడీకి మరో ఇద్దరు నిందితులు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. శుక్రవారం వైజాగ్కు చెందిన ఏ3–కల్పన, అమీర్పేట్కు చెందిన ఏ6 సంతోషిలను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శనివారం వారిని పోలీసులు విచారించనున్నారు. బాబును అసలైన తల్లిదండ్రుల నుంచి తీసుకుని వచ్చి రాజస్తాన్కు చెందిన దంపతులకు అందించడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. -
జగన్ పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ YSRCP లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్
-
దమ్ముంటే ఆపు.. పోలీసులకి ఇచ్చిపడేసిన ప్రసన్నకుమార్ రెడ్డి
-
నెల్లూరు జిల్లాలో YSRCP నాయకులపై అక్రమ కేసులు
-
YS Jagan Nellore Tour : అవధులు లేని అభిమానం.. ఉరకలు పరుగులు (ఫొటోలు)
-
కానిస్టేబుల్ పై మంత్రి జనార్ధన్ రెడ్డి బంధువు మదన భూపాల్రెడ్డి దాడి
-
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్పై కూటమి మంత్రి సోదరుడి దాడి
సాక్షి,నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్రెడ్డి దాడి చేశారు.కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ బీసీ మదన భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.సెక్యూరిటీ రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ స్పెషల్ పార్టీ పోలీసులు మదన భూపాల్రెడ్డి, అతని అనుచరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు చెబితే లోపలికి పంపిస్తానని అన్నారు. అయితే తాను బీసీ జనార్ధన్రెడ్డి సోదరుడినని,నన్నే ఆపుతావా? అంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై చేయిచేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా,రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి దేవాలయాలకు చేరడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. డ్యూటీలో ఉన్న పోలీసులపై అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. -
మీరెవరు మమ్మల్ని ఆపడానికి.. పోలీసులపై అభిమాని ఫైర్
-
ఇది ఒక చీకటి రోజు.. రోడ్డుపై బైఠాయించిన నల్లపరెడ్డి
-
YS Jagan Nellore Tour: జనాలపై పోలీసుల లాఠిఛార్జ్
-
నెల్లూరు: పోలీసుల అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్నకుమార్రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తోసివేయడంతో ఆయన చేతికి గాయమైంది. మహిళలను కూడా పోలీసులు చితకబాదారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షల వలయంలో నెల్లూరు నగరాన్ని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. గుంటూరు రేంజ్, తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. చెవుడు గుంట జైలు నుంచి సుజాతనగర్లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడుగడుగునా భారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వైఎస్ జగన్ రానున్నారు. మెయిన్ రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందులో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు.రోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం మండిపడ్డారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు.తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారంటూ ప్రసన్నకుమార్రెడ్డి మండిపడ్డారు. ‘‘స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జనం రాకుండా రోడ్లు తవ్వేశారు. వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు’’ అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందన్న అంబటి.. రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా? అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్ని చూసేందుకు వస్తారు. జగన్ పర్యటనపై పోలీసులు, కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై ఉండే అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్ట దిగ్బంధనం చేసారు. చుట్టుపక్కల ఉన్న పల్లెలను పోలీసులతో చుట్టుముట్టారు. అయినా అభిమానులు, కార్యకర్తలు వస్తారని దారులను జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా గుంతలు తవ్వడం ద్వారా ప్రజలకు అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుంది...నెల్లూరు లో ప్రధాన రహదారులు, దారులలో ముళ్ల కంచెలు వేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తరంగాలు చూస్తే మంచి హాస్య నాటకం పోలీసులతో వేయిస్తున్నట్లు ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వస్తుంటే ఇన్నీ ఆంక్షలా.. అందరికీ నోటీసులు ఇచ్చి, అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు. ఎక్కడ ప్రజలు జగన్ కోసం వస్తారోనని ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులు, నిబంధనలు పెట్టిన జగన్ చూడటానికి సునామీలా వస్తారని బంగారుపాళ్యంలో రుజువైయింది. కూటమీ ప్రభుత్వం గుంతలు తవ్విన, ముళ్ల కంచెలు వేసిన జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం. ఆపడం ఎవరితరం కాదు’’ అని భూమన అన్నారు.రోడ్లను తవ్వడం దారుణం: అప్పలరాజురాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రోడ్లను తవ్వడం దారుణమన్నారు.వైఎస్ జగన్ అంటే భయమెందుకు?: అనంత వెంకటరామిరెడ్డివైఎస్ జగన్ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. సింహాన్ని చూసి భయపడినట్లు ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రులు... జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.సునామీని ఆపగలిగే శక్తి ఉందా?: ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషావైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. ప్రజలను, సునామీని ఆపగలిగే శక్తి ఉందా? అన్న ఇస్సాక్ భాషా.. ముందే నీ ఓటమిని ఒప్పుకుంటున్నవా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే వైఎస్ జగన్ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు. ప్రజలను రాకుండా మీరు చేస్తున్న పనులు హేయమైనవి, దుర్మార్గమంటూ ఆయన విమర్శించారు. మీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడం’’ అని ఇస్సాక్ భాషా తేల్చి చెప్పారు.ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు: వైఎస్ అవినాష్రెడ్డివైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కార్యకర్తలను అడ్డుకుంటుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం పెరిగిపోతోందన్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలను రాకుండా లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. మా ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డుకున్నామా..?. చంద్రబాబు స్వేచ్ఛగా తిరిగి ఎన్నెన్నో విమర్శలు చేశారు. ఏ హోదా లేని పవన్ కళ్యాణ్కి కూడా అన్నాడు మేము భద్రత ఇచ్చాం. వీళ్ళని మేము ఎక్కడా అడ్డుకున్నది లేదు. కానీ ఇప్పుడు జగన్ను అడ్డుకోవాలని చూడటం దారుణం.ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరు రాకూడదని 5 వేల మంది పోలీసులను వినియోగించారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. గుంటూరు, సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాళ్యం.. ఇలా రోజు రోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం ఎక్కువవుతోంది. మీరు ఎంత అపాలనుకున్నా.. వైఎస్ జగన్ కోసం వచ్చే జనాన్ని మీరు ఆపలేరు. జగన్ భద్రతపై ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆందోళన ఉంది. భద్రతపై కేంద్రాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన... సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం
-
అష్టదిగ్బంధనంలో నెల్లూరు నగరం
-
పోలీసుల వేధింపులతో.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్టౌన్ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం.. అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్ అండ్ ఆర్లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు. -
Jagan Tour: మునుపెన్నడూ చూడని ఆంక్షల చెర ఇది!
సాక్షి, నెల్లూరు: నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆయన ఆ పని స్వేచ్ఛగానే చేశారు. ఏనాడూ.. ఏ పర్యటనకు ఆటంకాలు ఎదురైంది లేదు.. ఆంక్షలు విధించింది లేదు. అలాంటిది జగన్ జనాల్లోకి వస్తున్నారంటే మాత్రం.. సింగపూర్ పర్యటనలో ఉన్నాసరే చంద్రబాబు ఎందుకనో వణికిపోతున్నారు!. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షల విధింపు కనిపిస్తోంది. జగన్ పర్యటన హైలైట్ కావొద్దని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులతో బెదిరింపులు చేయించింది. జనసమీకరణ జరగొద్దని మైకులతో ప్రచారం చేయిస్తోంది. పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది.ఇప్పటికే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నేతలకూ పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జగన్ పర్యటనకు రాకూడదంటూ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో.. కేసులు పెడతామంటూ కార్యకర్త స్థాయి వాళ్లకూ పోలీసు బెదిరింపులు వెళ్తుండడం గమనార్హం. మాజీ మంత్రి కాకాణితో ములాఖత్తో పాటు టీడీపీ గుండాల చేతిలో తృటిలో దాడి నుంచి తప్పించుకున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సి ఉంది. సాధారణంగానే.. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా తరలి వస్తారు. అందునా కూటమి ప్రభుత్వ వ్యతిరేకత అనేది జగన్ పర్యటన రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పర్యటనలకు జనాన్ని దూరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా.. జగన్ నెల్లూరు పర్యటనకి 113 మందికి మించకూడదని వింత ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీ, రోడ్ షోకి అనుమతి లేదంట. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే అనుమతి ఉందట. అంతకు మించి గుమిగూడితే.. కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే.. జగన్ పర్యటన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తాత్సారం చేసిన పోలీసులు చివరాఖరికి 10 మందికే అనుమతి ఉందంటూ చెప్పడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా షరతులు పెడుతున్న ఏపీ పోలీసులపై, వాళ్ల బెదిరింపులపై, నోటీసుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. -
ఏపీ పోలీసులపై హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు
-
జగన్ పర్యటనకు వస్తే.. కేసులు తప్పవు..!
-
పదే పదే జగన్ పర్యటనకు అడ్డంకులు.. ఇప్పుడు తాజాగా
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్కడ పర్యటిస్తున్నా.. కూటమి సర్కార్ (Kutami Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల చిత్తూరు బంగారుపాళ్యంలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. నెల్లూరులోనూ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్తో గురువారం(జులై 31) వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇందుకు వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో ఈ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.నెల్లూరు వ్యాప్తంగా జగన్ పర్యటన సందర్భంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది కూటమి సర్కార్. ఈ నెల మొదట్లోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. హెలిప్యాడ్ అనుమతులను నిరాకరించింది. ఇప్పుడేమో.. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు.కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పోలీసు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడ చూసినా చెక్పోస్టులు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనకు జనసమీకరణ చేసినా.. స్వచ్ఛందంగా జనం గుంపుగా వచ్చినా చర్యలు తప్పవంటూ అనౌన్స్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిసతే కఠిన చర్యలు, కేసులు తప్పవంటూ బెదిరిస్తున్నారు.జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసుల తీరుపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు.. కర్ఫ్యూను తలపించే ఆంక్షలతో అటు ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు
సాక్షి, అమరావతి: ‘‘తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో, బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. అలా అనుకోవడానికి మేమేమీ ఈఫిల్ టవర్ మీద కూర్చొనిలేము’’ అంటూ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది. దీనిని రోజూ చూస్తూ నే ఉన్నామని, పోలీసులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారి తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ పఠాన్ కరీంసా విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)ను ఆదేశించింది. ఒకవేళ జోక్యం చేసుకున్నట్లు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్హెచ్వోను హెచ్చరించింది. పిడుగురాళ్ల పోలీసుల అక్రమ నిర్భంధంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త పఠాన్ కరీంసా కోర్టు ఎదుట హాజరయ్యారు. దీనిని నమోదు చేసిన హైకోర్టు... తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కరీంసా భార్య పఠాన్ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ జగడం సుమతిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎస్హెచ్వో దురుసుగా వ్యవహరిస్తున్నారు...కరీంసాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం.. పఠాన్ కరీంసాను స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. కరీంసాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది. మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. కరీంసాను కోర్టులో హజరుపరిచారు. ‘‘పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఎప్పుడు వదిలేశారు?’’ తదితర వివరాలను ధర్మాసనం పఠాన్ కరీంసాను అడిగి తెలుసుకుంది. వ్యాజ్యాన్ని మూసేస్తామని ప్రతిపాదించింది. కరీంసా తరఫు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్కు సంబంధించిన సివిల్ వివాదంలో పిడుగురాళ్ల ఎస్హెచ్వో జోక్యం చేసుకుంటున్నారని వివరించారు. కరీంసా సైతం కల్పించుకుని వేరే వ్యక్తులపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్హెచ్వో తీవ్రంగా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని, దురుసుగా వ్యవహరిస్తున్నారని వివరించారు.మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుంది...కోర్టు హాలులోనే ఉన్న ఎస్హెచ్వోను ధర్మాసనం పిలిపించి.. పిటిషనర్ చెప్పింది నిజమా అని ప్రశ్నించింది. అవి కేవలం ఆరోపణలని ఎస్హెచ్వో సమాధానం ఇవ్వగా, ‘‘సహజంగా నిజం కాదనే చెబుతారు’’ అని వ్యాఖ్యానించింది. కౌన్సెలింగ్ పేరుతో వేధిస్తే, మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుందని ఎస్హెచ్వోను హెచ్చరించింది. మరోసారి ఫిర్యాదు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. పోలీసులు ఒత్తిడి తెస్తే తిరిగి కోర్టుకు రావొచ్చునని పఠాన్ కరీంసాకు ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది. -
ఆంక్షలతో జననేత జగన్ను అడ్డుకోలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు. పీ-4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని.. పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ భూమన దుయ్యబట్టారు.పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు భయపడంనెల్లూరు జిల్లా: ఆంక్షలతో జననేత వైఎస్ జగన్ను అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ పర్యటనలో పాల్గొనకూడదు అంటున్నారు. 31న నెల్లూరు పర్యటన విజయవంతం చేసి తీరుతాం’ అని చంద్రశేఖర్రెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. -
Vikarabad: పరిగిలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు
-
‘అగ్ని’ అవినీతికి నాన్ క్యాడర్ ఆజ్యం
సాక్షి, అమరావతి: ‘మా దారి అడ్డదారి...అందుకు నాన్ క్యాడర్ అస్మదీయ అధికారే పాత్రధారి’ అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమీప బంధువును హఠాత్తుగా తెరపైకి తెచ్చిది. రూ.252 కోట్ల టెండర్లకు తమ అనుయాయులకు కట్టబెట్టడమే లక్ష్యమని తేల్చిచెప్పింది. ఇప్పటికే తగిన గుర్తింపు, ప్రాధాన్యం లేదంటున్న డైరెక్టర్ జనరల్(డీజీ) స్థాయి అధికారుల అసంతృప్తిపై ఆజ్యం పోసింది. అగ్నిమాపక శాఖ డీజీగా పోలీసు శాఖకు సంబంధమే లేని పి.వెంకటరమణను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ పోస్టులో నాన్ క్యాడర్ అధికారి... రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్పై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకంటే కూడా ఆ పోస్టులో అసలు పోలీసు శాఖకు సంబంధమే లేని నాన్ క్యాడర్ అధికారి పి.వెంకట రమణను నియమించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకంటే అగ్ని మాపక శాఖ డీజీ పోస్టు ఐపీఎస్ అధికారులకు కేటాయించడం ఆనవాయితీ. డీజీపీతో నిమిత్తం లేకుండా నేరుగా హోమ్ శాఖ పరిధిలో విధులు నిర్వర్తించే ఆ పోస్టులో డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.252కోట్లు అగ్ని మాపక శాఖ ఆ«దునికీకరణ టెండర్ల వ్యవహారం నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ ఆనవాయితీకి తిలోదకాలు వదిలారు. మాదిరెడ్డి ప్రతిపాదన నచ్చకే బదిలీ వేటు భారీ పరిశ్రమలు వంటి వాటిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న నీటి ట్యాంకర్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో యూరోపియన్ దేశాల్లో అనుసరిస్తున్న కార్బన్ డైయాక్సైడ్ ట్యాంకర్లను కొనుగోలు చేయాలని మాదిరెడ్డి ప్రతాప్ ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వంలో కీలక మంత్రి సమ్మతించ లేదు. ఎందుకంటే ఆ టెండర్లను అడ్డగోలుగా తమ అనుయాయులకు కేటాయించేందుకు ఆ మంత్రి ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నారు. ఆ కంపెనీలు నీటి ట్యాంకర్లనే సరఫరా చేయగలవు.కార్బన్ డై యాక్సైడ్ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని నిర్ణయిస్తే తమ అనుయాయులకు టెండర్లు దక్కవు... తమకు భారీ కమీషన్లు రావనే ఆ మంత్రి అభ్యంతరం తెలిపారు. అంతేకాదు పరిశ్రమలు, వ్యాపార, విద్యా సంస్థలను తనిఖీల పేరుతో వేధించి భారీగా వసూళ్లకు పాల్పడేందుకు మాదిరెడ్డి ప్రతాప్ ససేమిరా అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేసి తమ అస్మదీయుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆ మంత్రి భావించారు. ఇంతలో డీజీస్థాయి అధికారులు ప్రభుత్వంపై అసమ్మతి గళం ఎత్తడంతో మరో ఎత్తుగడ వేశారు. మాదిరెడ్డి ప్రతాప్ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో అగ్ని మాపక శాఖ డైరెక్టర్గా ఉన్న పి.వెంకట రమణను పూర్తి అదనపు బాధ్యతలతో డీజీగా నియమించారు.ఆయన ఐపీఎస్ అధికారి కాదు. నాన్ క్యాడర్ అ«దికారి. అయినా సరే ప్రభుత్వంలో కీలక నేత ఆయన్ని డీజీగా నియమించడం విస్మయపరిచింది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారిని నియమించాల్సిన ఆర్టీసీ ఎండీగా రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును నియమించారు. విజయవాడలోని ఆర్టీసీ డిపోకు చెందిన 4.50 ఎకరాలను లులు మాల్ గ్రూప్నకు అడ్డగోలుగా కేటాయించేందుకే ఆయనకు ఆ పోస్టులో నియమించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ మరీ ఆ వ్యవహారాన్ని ద్వారకాతిరుమలరావు పూర్తి చేశారు.ఇక విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ నియామకంలోనూ ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదమైంది. డీజీపీ గుప్తానే విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించింది. అదే రీతిలో ప్రస్తుతం అగ్ని మాపక శాఖ డీజీగా ఐపీఎస్ని కాకుండా నాన్ క్యాడర్ అధికారిని నియమించడం గమనార్హం. రూ.252 కోట్ల కాంట్రాక్టును కొల్లగొట్టేందుకేనన్నది స్పష్టమవుతోంది.మంత్రి పయ్యావుల బంధువే మరి..ఆనవాయితీకి విరుద్ధంగా అగ్ని మాపక శాఖ డీజీగా నియమితులైన పి.వెంకట రమణ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సమీప బంధువు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఆయన్ని ఏరికోరి ఆ పోస్టులో నియమించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే మద్యం విధానం ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీ కోసం పయ్యావుల కేశవ్ బావ చంద్రశేఖర్ నాయుడును రిటైరైన తరువాత కూడా ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా నియమించారు. తాజాగా ఆయన బంధువు పి.వెంకటరమణను అగ్ని మాపక శాఖ డీజీగా నియమించడం ప్రభుత్వ కుతంత్రాన్ని బట్టబయలు చేస్తోంది. -
హైదరాబాద్లో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు
సాక్షి,హైదరాబాద్: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తాజాగా ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతోన్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తారామతి మీదుగా మూసీ నది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇటీవల మంచిరేవుల గ్రేహౌండ్స్లోనూ చిరుత ప్రత్యక్షమైంది. 4 బోన్లు, ట్రాప్ కెమెరాలు పెట్టిన చిరుత చిక్కలేదు.ఇక సిటీలోపలికి చిరుత రావడం భయాందోళనకు గురిచేస్తోంది. -
అధికారి పొరపాటు..17 ఏళ్ల పోరాటం
మెయిన్పురి: పోలీసు అధికారి పొరపాటు కారణంగా గ్యాంగ్స్టర్ చట్టం కేసులో ఇరుక్కున్న ఓ వ్యక్తి 17 ఏళ్లపాటు న్యాయ పోరాటం సాగించాడు. చిట్టచివరికి 62 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 22 రోజులపాటు జైలు జీవితం అనుభవించి, కనీసం 300 సార్లు కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగీ అలసిపోయిన అతడితో కుటుంబం సంబంధాలు తెంచుకుంది. బడికి వెళ్లాల్సిన ఒక్కగానొక్క కొడుకు రోజు కూలీగా మారాడు. అన్నిటికీ తోడు సొంతూళ్లో అవమాన భారం. ఇదంతా ఏ తప్పూ చేయకుండానే భరించాడు రాజ్ వీర్. దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుభవించిన వేదన పోలీసు అధికారి చేసిన చిన్న పొరపాటు ఫలితం కావడం గమనార్హం..! యూపీలోని మెయిన్పురి జిల్లా నగ్లా భంట్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవపై పోలీసులు నలుగురిపై 2008 ఆగస్ట్ 31న కేసు నమోదు చేశారు. వీరు మనోజ్ యాదవ్, పర్వేష్ యాదవ్, భోలా యాదవ్, రాంవీర్ సింగ్. అనంతరం వీరిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. రాంవీర్ సోదరుడే రాజ్ వీర్. కొత్వాలీ ఇన్స్పెక్టర్ రాం వీర్కు బదులుగా అతడి సోదరుడు రాజ్ వీర్ సింగ్ పేరు నిందితుల పేర్లలో చేర్చారు. దీంతో అతడి జీవితమే మారిపోయింది. రికార్డుల్లో ఉన్న ప్రకారం పోలీసులు రాజ్ వీర్ను పట్టుకెళ్లారు. పట్టుకోవాల్సింది రాంవీర్నని, తాను అమయాకుడిననీ ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. 22 రోజులపాటు జైలులో ఉన్నాక బెయిల్ లభించింది. అప్పటి నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి. అసలు దోషి తాను కాదని నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కేసు ఆగ్రా నుంచి మెయిన్పురి కోర్టుకు మారే వరకు దాదాపు 300 సార్లు వాయిదాలకు హాజరయ్యాడు. ‘నా క్లయింట్ గోడును ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏ కేసులూ లేవు. అయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవస్థపై ఇన్నేళ్లూ ఒంటరిగా పోరాటం సాగించాడు’అని లాయర్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘రాజ్ వీర్ కుటుంబం బాగోగులను చూసుకోలేకపోయాడు. ఇద్దరి కూతుళ్లకు ఎలాగోలా పెళ్లిళ్లు చేయగలిగాడు. కుటుంబ పోషణకు కుమారుడు వ్యవసాయ కూలీగా మారాడు’అని వివరించారు. గురువారం వాదనలు విన్న మెయిన్పురి కోర్టు రాజ్ వీర్ను నిర్దోషిగా ప్రకటించింది. జీవితంపై ఎంతో ఆశతో కష్టపడి పనిచేసే వ్యక్తి చట్టపరమైన చిక్కుల్లో పడిపోయాడు. దాచుకున్న డబ్బు హరించిపోయింది. పరువు పోయింది. కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. తన తప్పు లేకున్నా ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది రాజ్ వీర్. ఈ నెల 24న మెయిన్పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి స్వప్న దీప్ సింఘాల్ రాజ్ వీర్కు సాంత్వన నిచ్చేలా తీర్పు వెలువరించారు. ‘పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకుడు 22 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 17 ఏళ్లపాటు పోరాడాల్సి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారణమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలి’అని జడ్జి ఆదేశించారు. -
హైదరాబాద్లో మరో స్పెర్మ్ క్లినిక్ నిర్వాకం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్బాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఇవాళ (ఆదివారం) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశారు.అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వహిస్తూ.. వీర్య కణాలను, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్లో స్పెర్మ్ సేకరణ చేస్తున్నారు. స్పెర్మ్ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మరోసారి నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్లో ఓ విల్లాలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.కాగా, రెండు రోజుల క్రితం మాదాపూర్లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహించారు. నిర్వాకుడు నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పిల్లలు కావాలని వెళ్తే ఇంత మోసమా..?
-
కర్నూలు త్రీటౌన్ పీఎస్ లో ' సాక్షి'పై మరో అక్రమ కేసు
-
బిర్యానీ ప్రియులకు భారీ షాక్..!
కర్ణాటక: బెంగళూరు వాసులతో పాటు టూరిస్టులు మెచ్చిన ఫుడ్ స్పాట్ అంటే హొసకోటె కూడా ఒకటి. ఇందుకు కారణం అక్కడ లభించే మటన్, చికెన్ బిర్యానీ. తెల్లవారుజామున 4 ఏఎం బిర్యానీగా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇది పొద్దున్నే తినడం ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే ఆలోచన ఉండదు. ఇకపై 4 ఏఎం బిర్యానీ దొరకదు. బెంగళూరు నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉండే హొసకోటె గత కొన్నేళ్లుగా వేకువజాము బిర్యానీ వల్ల పేరుగాంచింది. చాలా మంది ఉదయాన్నే జాలీరైడ్కు వెళ్లి బిర్యానీ తిని రావడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. కుప్పలుగా క్యూలో నిలబడి తినే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిర్యానీ తింటూ సెల్ఫీలు, వీడియోలు తీసి ఎఫ్బీ, ఇన్స్టాలో పోస్టు చేయడం ట్రెండింగ్గా మారింది. అన్నీ సమస్యలే.. అందుకే ఈ వ్యాపారానికి స్థానిక పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీ అమ్మరాదు అని హోటళ్లవారిని హెచ్చరించారు. రెండు గంటలు లేటుగా 6 గంటలకు బిర్యానీ అమ్మకాలు షురూ చేయమని వారం నుంచి ఆదేశించారు. కారణాలపై పోలీసు అధికారులు స్పందిస్తూ 4 గంటలకే బిర్యానీ కోసం పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి. దీంతో తోపులాట, గొడవలు జరుగుతున్నాయి. రోడ్ల పక్కన బైక్లు, కార్లతో నిండిపోతోంది. బిర్యానీ తినాలనే ఆతృతతో రాత్రి 12 గంటల నుంచే బయల్దేరుతుంటారు. కొందరు మద్యం మత్తులో, గంజాయి మత్తులో వస్తుంటారు. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే వేళను మార్చాం అని తెలిపారు. దీంతో హోటళ్లవారు అయిష్టంగానే వేళలను మార్చారు. -
చింతమనేని ఆనందం కోసం పోలీసుల ఓవరాక్షన్..
-
Visakha : పోక్సో కేసులో పోలీసులు డబుల్ గేమ్
-
అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసుల నోటీసులు
-
నాతో బలవంతంగా సంతకాలు చేయించారు: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, నెల్లూరు: పోలీసులు చుట్టుముట్టి తనతో బలవంతంగా సంతకాలు చేయించారంటూ రుస్తుం మైన్స్ అక్రమ కేసులో అరెస్టయిన బిరదవోలు శ్రీకాంత్రెడ్డి.. గూడూరు మేజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదని.. వాళ్లే రాసి సంతకం పెట్టించారన్నారు. తనకు ఆరోగ్యం కూడా బాగోలేదన్నారు. శ్రీకాంత్రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న(సోమవారం, జూలై 21) అరెస్టైన శ్రీకాంత్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రుస్తుం మైన్స్ అక్రమ కేసులో ఆయన్ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్రీకాంత్రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేశారు.నిన్న మధ్యాహ్నం గం. 12.30 ని.లకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్ చేశామని మెసేజ్ పెట్టారని.. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తోంది. -
చచ్చేలా కొట్టి.. మూత్రం తాగించి..
ముంబై: మూత్రం తాగితే.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయి. షూతో మొహ పగలగొడితే కలిసొస్తుంది. చెట్లు ఆకులు తింటే కోరుకున్న సంస్థలో కోరుకున్నంత జీతం. ఇలా ఒకటేమిటి.. నేను చెప్పిన పని చేస్తే.. ఇక మీ జీవితంలో తిరుగుతుండదంటూ బాబా ప్రచారం.. అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజినగర్ జిల్లా శివూర్ గ్రామంలో బాబా,అఘోరీ బాబా అలియాస్ సంజయ్ పాగారే అమాయకులైన గ్రామస్తులపై దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పటికే జిల్లాలోని తనని నమ్మిన వారికి ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు ప్రసాదించానని, మీకు కూడా అలాగే స్వాంతన చేకూర్చుతానంటూ గ్రామంలో తిష్టవేశాడు.పలు సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు తన మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మించాడు. దీంతో మోసపోయిన బాధితులు అతని మూత్రం తాగాల్సి వచ్చింది. అంతే కాదు ,మహిళలు,పురుషుల్ని దండలతో దండించాడు. షూతో మొహం మీద దాడి చేశాడు. అంతటితో ఆగలేదు. స్థానికంగా ఉన్న ప్రార్ధినా మందిరం చూట్టూ ప్రదిక్షణలు చేయమన్నాడు. అక్కడి చెట్ల ఆకులు తినమన్నాడు. బాధితుల్ని పడుకోబెట్టి వారి ముఖంపై నడవడం, పసుపు పొడి చల్లడం, షూ వాసన చూపించడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు.ఈ క్రమంలో దొంగబాబాల్ని ఆటకట్టించే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టి సంజయ్ను పోలీసులకు పట్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
మమల్ని ఆపడానికి మీరెవరు.. పోలీసులపై లాయర్లు ఫైర్
-
ఏసీబీ కోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: ఎంపీ మిథున్రెడ్డిని జడ్జి ఎదుట సిట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాదులను కోర్టు లోపలికి అనుమతించని పోలీసులు.. కోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేశారు. కోర్టు ప్రధాన ద్వారం కూడా మూసేశారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది.కాగా, నిన్న (శనివారం) ఎంపీ మిథున్రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్రెడ్డిని ఇవాళ ఉదయం(ఆదివారం) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపర్చారు.సిట్ అధికారుల విచారణలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్ను పలు ప్రశ్నలు వేశారు.అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. -
తిరువూరు ఏఈఈ అదృశ్యంపై వీడిన మిస్టరీ.. సురక్షితంగా పట్టుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఆయన్ని తిరువూరు పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు. గత నెలలో బదిలీ అయినప్పటికీ రిలీవ్ కాకుండా ఉన్నతాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అడ్డుపడ్డారంటూ కిషోర్ రాసిన సూసైడ్ లేఖ సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో ఒక అధికారి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దారి తీయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.తిరువూరులో శుక్రవారం మధ్యాహ్నం మైనర్ ఇరిగేషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన ఏఈ కిషోర్ సెల్ఫోన్ సిగ్నల్స్ తొలుత ఖమ్మం జిల్లా వీఎం బంజరు వద్ద లభ్యమయ్యాయని ఆ శాఖ సిబ్బంది చెబుతుండగా, తర్వాత కొద్దిసేపటికి విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. తమ అల్లుడి ఆచూకీ తెలియలేదని, ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయారని ఏఈ మామ జామ ఆనందరావు తెలిపారు.ఆత్మహత్యకు తిరువూరు ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారుల వేధింపులే కారణమని శుక్రవారం రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువూరు నుంచి గౌరవరానికి ఏఈ కిషోర్ బదిలీ అయినప్పటికీ నెల రోజులుగా రిలీవ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి అదృశ్యమవడంతో కంగుతిన్నారు. శనివారం ఉదయం ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్ హుటాహుటిన ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వులు జారీచేశారు. రెండు రోజుల క్రితం క్రితం చివరగా ఖమ్మం జిల్లా వి.ఎం బంజర్ నెట్వర్క్ పరిధిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి సమీపంలో ఫోన్ ఆన్ చేసినట్లు సాంకేతికపరంగా పోలీసులు గుర్తించారు. చివరికి కిషోర్ను పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు. మరికొన్ని గంటల్లో ఏఈఈను తిరువూరుకు తీసుకురానున్నారు. -
కేసులకు భయపడే ప్రసక్తే లేదు: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి
-
కేటీఆర్ వ్యాఖ్యలు తగదు.. తెలంగాణ పోలీసు అధికారుల సంఘం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ జితేందర్ను ఉద్దేశించి.. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.‘ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని, మాకూ ఒకరోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యనీ సమీక్షిస్తామని’.. డీజీపీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ను ఖండించారు. తెలంగాణ పోలీసు నిక్కచ్చగా, నిజాయితీగా ప్రజల భద్రత, రక్షణ కోసం చట్టం నిర్దేశించిన పరిధిలో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల స్థాయిని దెబ్బతీసే వ్యాఖ్యలను మానుకోవాలని కోరారు. -
ఎయిర్ పోర్టులో పోలీసుల ఓవరాక్షన్.. YSRCP నాయకుల అడ్డగింత
-
సీనియర్ పోలీస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: వైఎస్ జగన్
-
బయటపడ్డ తాడిపత్రి పోలీసుల మాయాజాలం
-
‘టిట్ ఫర్ టాట్’: చలానా వేసిన పోలీసులు.. వాహనదారుడి అదిరిపోయే కౌంటర్!
ఫిరోజాబాద్: ఒకరు మనతో ఎలా వ్యవహరిస్తారో వారితో అదే మాదిరిగా వ్యవహరించడాన్ని ‘టిట్ ఫర్ టాట్’(దెబ్బకు దెబ్బ) అని అంటారు. దీని అర్థం ఎవరైనా మనకు దొంగ దెబ్బ తీసినప్పుడు వారికి అదే రీతితో సమాధానం ఇవ్వడం అన్నమాట. లౌక్యం కలిగిన వారు ఈ మాట తరచూ చెబుతుంటారు. అయితే దీనిని ఒక ఎలక్ట్రీషియన్ ఆచరించి చూపారు. ఇప్పుడు ఈ ఉదంతం వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ తనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎదురైన చేదు అనుభవాకి టిట్ ఫర్ టాట్ రీతిలో సమాధానం ఇచ్చారు. ఒకరోజు శ్రీనివాస్ తన ఉద్యోగ విధుల్లో అత్యవసరంగా బైక్పై వెళుతున్న సమయంలో, హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించారు. తన అత్యవసర పని గురించి వారికి చెప్పినప్పకీ, వారు ఏమాత్రం వినకుండా శ్రీనివాస్ చేతిలో జరిమానా రసీదు పెట్టారు. Fearless man☠️ pic.twitter.com/Y458CvTLHc— Aditya Tiwari ❤️👻 (@aditiwari9111) July 15, 2025దానిని ఆన్లైన్లో చెల్లించిన శ్రీనివాస్ తన ఇబ్బందిని గుర్తించని ట్రాఫిక్ పోలీసులకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. తనకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2016 నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని శ్రీనివాస్ కనుగొన్నారు. అది రూ. 6.6 లక్షలకు చేరుకున్న విషయాన్ని శ్రీనివాస్ గుర్తించారు. వెంటనే అతను ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఐదు గంటలపాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చీకటిలో ఉండేలా చేశాడు. పెండింగ్లో ఉన్న బకాయిల కారణంగానే ఈ పనిచేశామని, ఇది ప్రతీకారం కాదని శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బందికి తెలియజేశారు. కాగా శ్రీనివాస్కు నెలల తరబడి జీతం రావడంలేదని, అతని జీతం నెలకు రూ. 6,000 మాత్రమేనని, అందుకే అతనికి ట్రాఫిక్ జరిమానా చెల్లించడం భారంగా మారిందని అతని స్నేహితులు చెబుతున్నారు. -
జేసీ డైరెక్షన్లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పతనమయ్యిందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. వైఎస్సార్సీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పచ్చి అబద్ధం చెప్పిన విషయం కలెక్టర్ కార్యాలయం స్పష్టత ఇవ్వడంతో బయటపడింది. పైగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి డైరెక్షన్లోనే ఇది జరిగిందని సమాచారం. ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం జరగాల్సి ఉంది. అయితే అదే రోజున మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ పర్యటిస్తున్నారంటూ పోలీసులు వైఎస్సార్సీపీ సమావేశానికి అడ్డుపడ్డారు. పైగా సమావేశం నిర్వహించుకోవడం కుదరదంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాశారు. సాక్షాత్తూ ఐపీఎస్ అధికారి, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేరుతో లేఖ అందజేశారు. ఈ విజ్ఞప్తితో 18వ తేదీకి సమావేశాన్ని వైఎస్సార్సీపీ వాయిదా వేసింది. తీరా చూస్తే.. తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగింది సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. పోనీ దానికి మంత్రుల్లో ఒక్కరైనా వచ్చారా? అంటే అదీ లేదు. కేవలం లోకల్ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఈలోపు అసలు 15వ తేదీన మంత్రుల షెడ్యూల్ లేదని కలెక్టరేట్ వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం వైఎస్సార్సీపీ సమావేశం వాయిదా వేయించేందుకు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జేసీ ప్రభాకర్రెడ్డి ఈ చిల్లర డ్రామాకు తెర తీశారు. ఆయన డైరెక్షన్లో తాడిపత్రి పోలీసులు ఈ డ్రామా ఆడినట్లు ఇప్పుడు తేలింది.ఇదీ చదవండి: నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి -
YSRCP కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
-
పోలీసుల రాజకీయం.. బాబు కోసం ఇంత నీచమా
-
Anil Kumar: మేము CCTV ఫ్యూటేజీతో కేసు పెట్టి వారం రోజులు అయింది..
-
ముఖ్యమంత్రిని నెట్టిపడేసిన పోలీసులు
జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జమ్మూకశ్మీర్లో జూలై 13న అమరవీరుల దినోత్సవం. అయితే అమరవీరలుకు నివాళులు అర్పించేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఎప్పటిలాగా ఇవాళ అక్కడ స్థానికులు అమర వీరుల స్థూపంగా భావించే మజార్-ఎ-షుహదా వద్ద నివాళులర్పించేందుకు ప్రయత్నించారు. గోడదూకేందుకు ప్రయత్నించగా.. గవర్నర్ ఆదేశాలతో అప్పటికే మొహరించిన పోలీసులు ఆయన్ను పక్కకు లాగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, పోలీసుల తీరుపై సీఎం ఓమర్ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఏ చట్టవిరుద్ధమైన పని చేయలేదు. వీళ్లు (పోలీసులు) మమ్మల్ని ఆపాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ఇది స్వేచ్ఛా దేశమని చెబుతారు. కానీ వాళ్లు మమ్మల్ని బానిసలుగా భావిస్తున్నారు. మేము ప్రజలకు మాత్రమే బానిసలం. ఎవరికి బానిసలం కాదు’అని అన్నారు.కాశ్మీర్ అమరవీరుల దినోత్సవం. బ్రిటీష్ ఇండియాలోని జమ్మూ కశ్మీర్ డోగ్రా దళాల చేతుల్లో 1931, జూలై 13 న 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పిస్తూ ప్రతి ఏడాది జులై 13న అధికారికంగా అమరవీరుల దినోత్సవం జరుగుతుంది. పబ్లిక్ హాలుడే. ప్రభుత్వం,ప్రతిపక్ష పార్టీలు.. అమర వీరుల స్థూపం వద్ద అధికారికంగా నివాళులర్పించేవి. సీఎం నేతృత్వంలో అధికారిక నివాళి కార్యక్రమం జరిగేది. జమ్మూ కాశ్మీర్ పోలీసు దళాలు సైతం ఇందులో పాల్గొనేవి. కానీ ఆగస్టు 5, 2019న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ మరుసటి ఏడాది నుంచి అంటే జూలై 2020లో ఈ సెలవు దినంతో పాటు అధికారిక నివాళులు రద్దయ్యాయి.ఈ క్రమంలో ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు అమరవీరులకు నివాళులర్పించేందుకు ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ సీఎం ఓమర్ అబ్దుల్లా నివాళులర్పించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. This is the physical grappling I was subjected to but I am made of sterner stuff & was not to be stopped. I was doing nothing unlawful or illegal. In fact these “protectors of the law” need to explain under what law they were trying to stop us from offering Fatiha pic.twitter.com/8Fj1BKNixQ— Omar Abdullah (@OmarAbdullah) July 14, 2025పోలీసులు బంకర్లు ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. -
ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై కేసు నమోదు