love marriage
-
టీడీపీ నేత కుమార్తెతో ప్రేమ.. పెళ్లి చేసుకున్నాడనే కారణంతో..
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. -
పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్ రివర్స్..
లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్లో కప్పి పెట్టారు. ఈ క్రైమ్ సీన్ చూసి అక్కడికి వెళ్లిన పోలీసులే ఖంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని మీరట్కు చెందిన సౌరవ్ కుమార్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. సౌరవ్.. ముస్కాన్ను ప్రేమించి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌరవ్కు, తన కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, మూడు సంవత్సరాల క్రితం, సౌరభ్ తన భార్య ముస్కాన్తో కలిసి ఇందిరానగర్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ రెండో తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.చిగురించిన మరో ప్రేమ..అయితే, నేవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్.. విధులకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ముస్కాన్కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో, వారిద్దరి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అడ్డుగా ఉన్న భర్త సౌరవ్ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. దీని కోసం సౌరవ్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్లోని వచ్చిన వెంటనే అతడిని హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్లో దాచిపెట్టారు.#Meerut: Wife Muskan Rastogi along with her boyfriend Sahil Shukla stabbed her husband Saurabh Rajput,The two then chopped up his body into 15 pieces, placed the remains in a drum, and sealed it with cement. After committing the crime, she allegedly went on a vacation with sahil. pic.twitter.com/qs6xnwWpa0— Dilip Kumar (@PDilip_kumar) March 19, 2025పక్కా ప్లాన్తో హత్య..మరోవైపు.. భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్.. భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. దీంతో, వారికి ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత ముస్కాన్ ఒక్కరే కనిపించడంతో సౌరవ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. ముస్కాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరభ్ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టిందని పోలీసులు తెలిపారు. This is very painful,Saurabh Kumar, who works in the Merchant Navy, had a love marriage with his wife. He had come to #UttarPradesh's #Meerut from #London 22 days ago.In Meerut, his wife along with her boyfriend killed Saurabh. Both of them cut the body into pieces and1/2 pic.twitter.com/gdiwwaZDHP— Siraj Noorani (@sirajnoorani) March 18, 2025 -
ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చింది
అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్క్లేవ్లోని నంది క్లబ్ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
నాకు ధైర్యం చెప్పే మేనకోడలు.. ఈరోజు విగతజీవిలా మారిపోయింది..!
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆరు నెలల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగినే ప్రేమ వివాహం చేసుకున్న దేవిక.. ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ దారుణానినికి పాల్పడి ఉంటుందని ఆరోపిస్తున్నారు.అతనొక ఉన్మాది..దేవికను ప్రేమించి పెళ్లిచేసుకున్న శరత్ చంద్ర అనే వ్యక్తి ఒక ఉన్మాది అని, అతనికి ఉరిశిక్షే సరైనదని దేవిక మేనమామ అంటున్నారు. ‘సాక్షి’తో మాట్లాడిన దేవిక మేనమామ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎప్పుడూ అందరికీ ధైర్యం చెప్పే తన మేనకోడలు.. ఈరోజు ఇలా విగత జీవిలా పడి ఉండటం తమను ఎంతగానో బాధిస్తుందన్నారు. తానొక రైతునని, తనకు ఎప్పుడు కష్టం వచ్చినా ధైర్యం చెప్పే మేనకోడలు ఈరోజు లేదన్నారు. నేటి సమాజంలో ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. తన మేనకోడలు ఎంతో గట్టి మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, కానీ భర్త వల్ల ఎంతగా కృంగిపోతే ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థమైందన్నారు. అతన్ని కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు మేనమామ.మండే వస్తా మమ్మీ అంది.. శవమై వచ్చింది నా బిడ్డ..!తన కూతురు ఆత్మహత్యపై తల్లి పడే రోదన అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తానన్న బిడ్డ, శవమై వచ్చిందంటూ ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డ తనకు ప్రతీ రోజూ ఫోన్ చేసేదని, తిన్నావా మమ్మీ, ఎలా ఉన్నావ్ మమ్మీ అనే అడిగేదని కన్నీటి పర్యంతమయ్యారు తల్లి. ‘మొన్న పోయిన సండే ఇంటికి రా బిడ్డా అని అడిగితే, లేదు మమ్మీ మండే వస్తానంది.. వచ్చి నన్ను ఆస్పత్రిలో చూపిస్తానంది. మండే నాడు శవమై వచ్చింది నా కూతురు’ అంటూ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి..కాగా, వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్లో నివాసం ఉంటున్నారు.అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చంపింది ప్రియురాలి భర్త, మామలే!
నిడమర్రు(పశ్చిమ గోదావరి): బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.పోలీసుల విచారణలో...బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది.పథకం ప్రకారం హత్యనిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.అత్యంత దారుణంగా హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు -
హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు
నిడమర్రు (పశ్చిమ గోదావరి): నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్లో ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది. -
సురేష్.. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా..!
కె.కోటపాడు: ప్రేమించి పెళ్లి(Love marriage) చేసుకున్న తరువాత తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న నెపంతో ముఖం చాటేసిన భర్త గుదే సురేష్ వైఖరికి నిరసనగా స్వాతి(Swathi) అత్తవారింటి వద్ద మౌన పోరాటానికి దిగింది. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా అని ఆమె భర్తను ఆవేదనగా ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. మధురవాడ ప్రాంతానికి చెందిన తాను, రొంగలినాయుడుపాలెం గ్రామానికి చెందిన సురేష్ విశాఖపట్నం కృష్ణా కళాశాలలో కలిసి చదువుకున్నామని, 2013 నుంచి తమకు పరిచయం ఉందని తెలిపింది. తనను ప్రేమిస్తున్నట్లు సురేష్ తెలపడంతో ఇద్దరం ఇష్టపడినట్లు పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 9న మధురవాడలో రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నామని, అదే ప్రాంతంలో అద్దె ఇంటిలో కాపురం సాగించామని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదంటూ సురేష్ తమ ఇంటికి గత ఏడాది డిసెంబర్ నుంచి రావడం లేదని ఆమె పేర్కొంది. దీంతో కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో గ్రామ పెద్దలకు సురేష్తో జరిగిన వివాహం గురించి తెలిపి ఇద్దరినీ ఒక్కటి చేయాలని కోరినట్టు స్వాతి తెలిపింది. భర్త నుంచి తనను వేరు చేసి తన జీవితాన్ని అన్యాయం చేయవద్దని ఆమె కోరింది. బాధితురాలికి న్యాయం జ రిగేంత వరకూ పోరాటం చేయనున్నట్లు విశాఖపట్నం, కె.కోటపాడు సీఐటీయూ నాయకులు పి.రాజ్కుమా ర్, ఎర్రా దేముడు, గండి నాయుడుబాబు చెప్పారు.రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం -
సూర్యాపేటలో పరువు హత్య!
సూర్యాపేట టౌన్: సూర్యాపేటకు చెందిన యువకుడిని గుర్తుతెలియ ని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై పడేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కులాంతర ప్రేమ వివాహమే హత్యకు కారణం కావొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్నేహితుడి ఫోన్తో బయటకు వెళ్లి.. శవంగా మారి..సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (30) అలియాస్ మాల బంటి, సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. తరచూ నవీన్ ఇంటికి వస్తూండే కృష్ణ.. అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరు కావడంతో వారు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కృష్ణ, భార్గవి గత ఏడాది ఆగస్టులో నకిరేకల్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణ సూర్యాపేటలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్గవితో కలిసి ఉంటున్నాడు.సూర్యాపేట జిల్లా ఆస్పత్రి వద్ద రోదిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బైరు మహేశ్ అనే మిత్రుడి నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. భార్గవి మహేశ్కు రాత్రి 11 గంటలకు ఫోన్ చేయగా లిప్ట్ చేయలేదు. సోమవారం ఉదయం కెనాల్ కట్టపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లుగా గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణకు ఉరేసి హత్య చేసిన దుండగులు, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్, హత్య కేసు నమోదు కులాంతర వివాహం(inter caste marriage) చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్లు భార్గవి ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ తండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భార్గవి తండ్రి సైదులు, సోదరులు వంశీ, నవీన్, కృష్ణ స్నేహితుడు బైరు మహేశ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నలుగురు పరారీలో ఉండగా రెండు బృందాలు గాలింపు చేపట్టాయి. కృష్ణపై గతంలో రెండు హత్యాయత్నం కేసులు ఉండగా, బైరు మహేశ్పై రౌడీషీటర్ కేసు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత కక్షలా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ రవి చెప్పారు. న్యాయం చేయాలని ధర్నా కృష్ణ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో మాలమహానాడు, దళిత సంఘాల నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్(Himani Mor)తో జనవరి 16న అతడి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ షేర్ చేసిన తర్వాతే.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.ఈ నేపథ్యంలో నీరజ్ భార్య హిమానీ మోర్ బ్యాగ్రౌండ్తో పాటు.. అత్తామామల నుంచి అతడు తీసుకున్న కట్నకానుకలు, అల్లుడిగా అందుకున్న బహుమతులు ఏమిటన్న అంశాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.ప్రేమ పెళ్లి‘‘దేవుడి దయ వల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు. దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో నా కూతురి పెళ్లి కావడం సంతోషంగా ఉంది. నీరజ్, హిమానీలకు గత రెండేళ్లుగా పరిచయం ఉంది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు’’ అని మీనా మోర్ దైనిక్ భాస్కర్కు తెలిపారు.‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?అదే విధంగా.. తమ అల్లుడు తమ నుంచి కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడని హిమానీ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇది కాకుండా ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు.. ఆఖరికి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, దుస్తులను కూడా స్వీకరించలేదని తెలిపారు. తమ కూతురిని అచ్చంగా వాళ్లింటి అమ్మాయిని చేసుకున్నారని సంతోషంతో పొంగిపోయారు.కాగా హర్యానా అథ్లెట్లు నీరజ్- హిమానీల వివాహం హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇక ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 14న నిశ్చితార్థం జరుగగా.. జనవరి 15న హల్దీ, మెహందీ, సంగీత్ నిర్వహించారు. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తికాగా.. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇక కొత్త జంట ఇప్పటికే హనీమూన్కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎవరీ హిమానీ మోర్?హర్యానాలోని లార్సౌలీ హిమానీ స్వస్థలం. సోనిపట్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ఫిజికల్ సైన్స్లో పట్టా పుచ్చుకుంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు హిమానీ అమెరికాకు వెళ్లింది.ప్రస్తుతం హిమానీ మెక్కోర్మాక్ ఐసెంబర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చదువుతోంది. 2018లో హిమానీ ఆలిండియా టెన్సిస్ అసోసియేషన్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. కెరీర్లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది.నికర ఆస్తుల విలువ?కాగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో గల ఖాంద్రా గ్రామంలో నీరజ్ చోప్రా ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గతంలో ఆర్మీ సుబేదార్గా పనిచేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా.. ‘గోల్డెన్ బాయ్’గా ప్రసిద్ధి పొందాడు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నీరజ్ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి. మనసులు కలవడానికి భాషా, సంస్కృతులు అడ్డంకులు కాబోవని చాటింది. తాను ఇష్టపడిని పరదేశీయుడిని పెద్దల అనుమతితో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమపెళ్లిని అందరూ మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు చెబుతున్నారు.సేలం : కోవైకు చెందిన మహిళ నెదర్లాండ్ దేశానికి చెందిన తన ప్రియుడిని కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకుంది. కోవై జిల్లా పెరియ నాయకన్ పాలయానికి చెందిన ప్రమీలా.. నెదర్లాండ్ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్లో పని చేస్తున్న స్టీన్హీస్ అనే యువకుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. ఆ మేరకు ఇరు కుటుంబీకుల సమ్మతితో ప్రమీలాకు, నెదర్లాండ్ యువకుడికి కోవైలో తమిళ సాంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. நெதர்லாந்து நாட்டு இளைஞரை காதலித்து தமிழ் பாரம்பரியப்படி தாலி கட்டி கரம் பிடித்த தமிழ் பெண்..#Coimbatore | #Netherland | #marriage | #TamilCulture pic.twitter.com/QPzEn6aPCY— Polimer News (@polimernews) January 20, 2025video credit To Polimer Newsచదవండి: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ! -
తెలంగాణ అబ్బాయి.. కేరళ అమ్మాయి
మెట్పల్లిరూరల్(జగిత్యాల జిల్లా): దుబాయ్లో పరిచయమైన తెలంగాణ అబ్బాయి.. కేరళ అమ్మాయి పెళ్లితో ఒక్కట య్యారు. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం అ ల్లూరి సీతారామరాజు తండాకు చెందిన గుగ్లావత్ అజయ్ నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ తాను పని చేస్తున్న కంపెనీలో కేరళకు చెందిన అజితతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని, తమ పెద్దలను ఒప్పించారు. ఆదివారం కేరళలో అక్క డి సంప్రదాయం ప్రకా రం పెళ్లి చేసుకున్నారు. -
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
కృష్ణుడు నవ్వడు. తెగ నవ్విస్తాడు. కృష్ణుడు అమాయకంగా కనిపిస్తాడు. కానీ అల్లరల్లరి చేస్తాడు. ‘అయ్ బాబోయ్... మా రాజోలులో ఇలా కాదండీ’ అనేది ‘వినాయకుడు’ సినిమాలో కృష్ణుడి మార్క్ డైలాగ్. కృష్ణుడు నటుడు మాత్రమే కాదు ్రపొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ‘కూడా’కు మరో ‘కూడా’ కలిపితే వంటలు చేయడంలో దిట్ట కూడా! కృష్ణుడు కోనసీమ బిడ్డ. ఉమ్మడి కుటుంబాల విలువ తెలిసిన కృష్ణుడు ఈస్ట్, వెస్ట్ స్పెషల్ పాకుండల గురించి నోరూరించేలా చెబుతాడు. అంతేనా! ‘అయ్ బాబాయ్. మా రాజోలులో అలా కాదండి. ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ఎలా చేయాలో కూడా చెబుతామండీ’... మరి ఆయన మాటల్లోనే... పాకుండలు, పెద్ద చెగోడీలతో పాటు... తన స్వీట్ ఫ్యామిలీ కబుర్లు...కనుల పండగ చేసే రంగవల్లులే కాదు... సంక్రాంతి అంటే కమ్మని కర కరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ్రపాంతానికి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. పెద్ద పండగ రోజు ఆ కరకరల స్వరాలు వినాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న గీతాభాస్కర్ చేసే సకినాల రుచి ఇంతా అంతా కాదు. కృష్ణుడు అంటే అల్లరి. వెండితెర కృష్ణుడు అంటే నవ్వుల సందడి. కోనసీమ బిడ్డ కృష్ణుడు పాకుండల గురించి చెబితే తీయగా నోరూరాల్సిందే. తమకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పడమే కాదు... ఎలా చేయాలో కూడా చెబుతున్నారు గీతాభాస్కర్, కృష్ణుడు. ఆ కబుర్ల కరకరలు... కృష్ణుడు: ట్రెడిషనల్ పిండి వంటలు చేయడం అనేది నాకు చిన్నప్పుడు అలవాటు. మా అమ్మ చేసేవారు. అలాగే మా ఇంట్లో సుబ్బయ్య అని కుక్ ఉండేవారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. బియ్యం నానబెట్టి, తర్వాత ఆరబెట్టి, దంచేవాళ్లు. నా చిన్నప్పుడు బాగా గుర్తున్నది అంటే ఇదే. ఇప్పుడంటే మిషన్లో పిండి ఆడిస్తున్నారు కానీ అప్పట్లో దంచడమే. మన చిన్నప్పుడు మనం తిన్నంత టేస్టీగా ఇప్పుడు ఉండటంలేదు. చిన్నప్పుడు టేస్ట్ చూశాం కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్కి ఆ తేడా తెలియదు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి రోజుకొక ఇంటికి అన్నట్లు వండేవారు. అది చాలా బాగుండేది.మాకు పాకుండలు ఫేమస్మేం ఈ సంక్రాంతికి పాకుండలు చేశాం. మాకు అదే ప్రత్యేకత. ఈస్ట్, వెస్ట్లో సంక్రాంతికి పాకుండలు ఫేమస్. విడిగా పెద్దగా చేయరు. ఈ పండగకే చేస్తుంటారు. అరిసెల పిండి ఫార్మాట్లోనే పాకుండల పిండి కూడా ఉంటుంది. బియ్యాన్ని ఓ రోజంతా కానీ 30 గంటలు కానీ నానబెట్టి, పిండి పట్టించుకోవాలి. బెల్లం పాకం పట్టి చేసుకోవాలి. పాకం సరిగ్గా కుదరడానికి కొలతలు ముఖ్యం. నాలుగు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల బెల్లం వాడాలి. ఒక అరగ్లాసు నీళ్లు పోసి, పాకం పట్టాలి. పాకుండలలో కొబ్బరి ముక్కలు వేస్తారు. అది టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి అరిసెలు ఉంటాయి కానీ కోనసీమ జిల్లాల్లో పాకుండలనే ప్రిఫర్ చేస్తారు.ఆ మంచు... అదో అందంచిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ఇరుగుపొరుగు కలిసి పిండి వంటలు వండుకోవడం... ఊర్లో ఇలాంటి సందడి ఉండేది. ఇప్పటికీ ఊళ్లో ఉన్నాయి. కానీ సిటీలో అంత సందడి కనిపించదు. చిన్నప్పుడు ఆ మంచులో భోగి మంటలు వేయడం, హరిదాసులు రావడం, పెద్ద పెద్ద ముగ్గులు చూడటం... అంతా ఓ అందంగా ఉండేది. అదో మంచి అనుభూతి. సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి మంటలు అవి వేస్తారు కానీ ఊళ్లో ఉన్నంత సందడి ఇక్కడ కనిపించదు. అందుకే చాలామంది పండగలకి ఊరు వెళ్లిపోతుంటారు. నేను కూడా వీలున్నప్పుడల్లా వెళుతుంటాను. మా పాపకి ఆ కల్చర్ తెలియాలని తనని కూడా తీసుకెళుతుంటాను. ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీల్లో స్థిరపడుతున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది పండగకి ఊరికి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అంటే అందర్నీ కలిపే పండగ. బయటి ఫుడ్ తినదుమాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ (లలితా గాయత్రి) వాళ్లది నిజామాబాద్. ఆ వంటల స్టయిల్ వేరు. ఏ ్రపాంతం రుచి ఆ ్రపాంతానిది. నేను బేసిక్గా ఫుడ్ లవర్ని. బాగా వండిన ప్రతిదీ నాకు ఇష్టం. ఇక మా ఆవిడకి కూడా పాకుండలు చేడయం వచ్చు. నిజానికి పెళ్లయ్యాక నేను వంట చేయడం మానేశాను. అయితే అప్పుడప్పుడూ చేస్తుంటాను. ఈ పండగకి నేనే చేశాను... తను పక్కనే ఉండి, కాస్త హెల్ప్ చేసింది. మా పాపకు నచ్చిన పిజ్జా, గార్లిక్ బ్రెడ్ అవన్నీ కూడా చేస్తుంటాను. మా పాప బయటి ఫుడ్ దాదాపు తినదు. ఇంట్లోనే చేసి పెడతాం.పండగకి పెద్ద చెగోడీలూ చేస్తాంసంక్రాంతికి మేం పాకుండలతో పాటు పెద్ద చెగోడీలు చేస్తుంటాం. మా రాజోలులో ఈ చెగోడీలు ఫేమస్. కారపొ్పడితో చేస్తాం. చాలా సాఫ్ట్గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఊరెళ్లినప్పుడుల్లా తింటాను. ఇప్పుడు పాకుండలతోపాటు అవి కూడా వండాను. చెగోడీలకు కూడా బియ్యం పిండినే వాడతాం. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసు నీళ్ల రేషియోతో చేయాలి. పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర... మూడూ నూరి, వేడి నీళ్లలో కలిపి, ఉప్పు వేసి, అందులో బియ్యం పిండి వేసి, కలపాలి. ఆ తర్వాత చెగోడీలను లావుగా వత్తి, పెసరపప్పు అద్ది, నూనెలో వేసి వేయించుకోవాలి. -
విద్యార్థినితో లెక్చరర్ ప్రేమపెళ్లి
మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. -
12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు లాటిన్ కవి జువెనాల్. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్గా మారింది. పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్ ఏంటంటే..12 ఏళ్ల క్రితం ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్గా మారింది. ఘర్ కా కాలేశ్ అనే యూజర్ ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బిహార్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024 ; -
కన్నతల్లిని కాదని.. ప్రియుడి వెంట నడిచి..
రొంపిచెర్ల: ప్రేమ వివాహం వద్దని ప్రియుడు కట్టిన తాళిబొట్టును తెంచినా ఆ యువతి కన్నతల్లిని ఎదిరించి ప్రేమికుడి వెంట వెళ్లిన సంఘటన రొంపిచెర్ల మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గానుగచింతకు చెందిన యువకుడు రెడ్డెప్ప (21), తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన చిట్టి ప్రసన్న(19) అన్నమ్మయ్య జిల్లా పీలేరులో డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే చిట్టి ప్రసన్నకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో చిట్టి ప్రసన్న ఇంటి నుంచి మంగళవారం ఉదయం రొంపిచెర్లకు చేరుకుని జరిగిన విషయం ప్రియుడు రెడ్డెప్పకు చెప్పింది. దీంతో వారిద్దరూ కట్టకింద శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిట్టి ప్రసన్న తల్లి కుమారై మెడలో ఉన్న తాళిబొట్టును తెచ్చి ఇంటికి రావాలని కుమారైను పిలిచింది. అయితే దీనికి కుమారై అంగీకరించలేదు. దీంతో ఈ పంచాయితీ రొంపిచెర్ల పోలీసుస్టేషన్కు చేరింది. ఎస్ఐ సుబ్బారెడ్డి ప్రేమికులను విచారించారు. పోలీసుల విచారణలో ప్రేమికురాలు తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాని తెలిపింది. తాను మేజర్నని తనకు తన భర్త కావాలని తెగేసి చెప్పింది. దీంతో పోటీసులు చేసేదేమీ లేక వారిని కలసి ఉండమని చెప్పారు. దీంతో ఇరువురు గానుగచింతకు చేరుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మానకొండూర్: తల్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. తండ్రి 10 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో ఐదేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఆ దంపతుల పాప, బాబు అనాథలయ్యారు.. ఈ విషాద ఘటన మానకొండూర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కోండ్ర పవన్కల్యాణ్, ప్రహర్ష(24) 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప, బాబు సంతానం. ఈ క్రమంలో పవన్కల్యాణ్ 10 నెలల క్రితం ఇంట్లో ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రహర్ష కరీంనగర్లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పని చేస్తోంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పిల్లలను స్కూల్కు పంపించి వస్తానని మామ లక్ష్మణ్తో చెప్పి, వెళ్లింది. తిరిగి రాకపోవడంతో అతను చుట్టుపక్కల వెతికాడు. సమీప బావిలో ఆమె శవమై కనిపించింది. అయితే, ఉదయం ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి, ప్రహర్షతో మాట్లాడి వెళ్లాడని మృతురాలి అత్త భాగ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రహర్ష చనిపోవడానికి ఆ వ్యక్తే కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని మృతురాలి సోదరి నిర్మిట్ల ప్రసన్న అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పసితనంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూసి, వారి నానమ్మ, తాతయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. అది చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. -
ప్రేమ పెళ్లితో ఒక్కటైన అత్తా,కోడలు
మేనకోడలిపై మనసు పారేసుకున్న ఓ అత్త భర్తను వదిలేసింది. మేనకోడల్ని మనువాడింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలో బెల్వా గ్రామంలో వింతఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉండే అత్త తన మేనకోడలిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను విడిచిపెట్టింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నఈ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. బంధువుల సమక్షంలో స్థానిక దుర్గా భవాని ఆలయంలో అత్త మేనకోడలు వివాహం చేసుకున్నారు. కోడలి మెడలో అత్త మంగళ సూత్రం కట్టింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. ఏడు జన్మలు ఒకరితో ఒకరు కలిసుంటామని వాగ్దానం కూడా చేశారు. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతో మేన కోడలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చిందని, వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అత్త,మేనకోడలి వివాహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. Shockingly, an aunt and her niece got married in Bihar’s Gopalganj.The two had been having an affair for three years, which has now culminated in marriage. pic.twitter.com/TllfEUf7K0— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) August 12, 2024 -
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపెట్టిన లావణ్య..
-
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
అత్తారింటికి దారేది?
శంకరపట్నం (మానకొండూర్): పొరుగింటి వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు తమ కూతురుపై కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై ఇటుకలతో గోడకట్టారు. దీనిపై గ్రామ పెద్దలతో చెప్పించినా వారు వినకపోవడంతో కూతురు తన తల్లిదండ్రులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లుసైతం తన సమస్యను పట్టించుకోవడం లేదని శుక్రవారం మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింటి వ్యక్తి అయిన కనకం రత్నాకర్ను 2023 ఫిబ్రవరి 16న ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ కేశవపట్నంలో అద్దెకుంటున్నారు. అక్కడే జిరాక్స్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివాసం ఉంటున్నారు. మమత తల్లి ఇంటి ఎదుట నుంచే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబసభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఇప్పటి నుంచి దొడ్డిదారి గుండా నడుస్తున్నామని, తన అత్తారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి, ఇబ్బందులు పెడుతున్న తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని మమత నాలుగు రోజల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మమత కోరింది. -
ప్రేమ పరీక్షలు పెట్టా!
‘‘మథియాస్తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మథియాస్ కన్నా ముందు నేను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ మథియాస్ పరిచయమై, తనతో మాట్లాడటం మొదలుపెట్టాక ఫైనల్గా నా అభిప్రాయానికి తగ్గ మనిషిని కనుగొనగలిగాను అనిపించింది’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్, తాప్సీ ఈ ఏడాది మార్చి 23న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు.ఈ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. అయితే మథియాస్తో ప్రేమలో పడే ముందు కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టానని తాప్సీ చెబుతూ – ‘‘నాకు క్రీడాకారులంటే ఇష్టం. దేశం కోసం వాళ్లు ఆడుతుంటారు. ఇక మథియాస్తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అలాగే ఒక నెలలో పుట్టిన ప్రేమ కూడా కాదు. మా మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టాను. అన్నింటిలోనూ మథియాస్ గెలిచాడు.ఒక అనుబంధం బలంగా నిలవడం ముఖ్యం. అందుకే నేను తొందరపడలేదు. అంతకు ముందు నాకు పరిచయం ఉన్న అబ్బాయిలు వేరు... మథియాస్ వేరు. ఆ అబ్బాయిల్లో ఏ ఒక్కరినీ మథియాస్తో పోల్చలేం. పరిణతి, భద్రతాభావం... ఇవే అతను నాకు సరైన వ్యక్తి అని నిర్ణయించుకునేలా చేశాయి’’ అన్నారు. -
Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా
బంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్నగర్లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
కర్ణాటక: ఇది అలాంటి ఇలాంటి పెళ్లి కాదు. గొప్ప ప్రేమ పెళ్లి అని అందరూ కొనియాడిన మూడు ముళ్ల కథ ఇది. ఈ జంట 25 సంవత్సరాలు ప్రేమించుకుని ఐదు పదులు దాటాక మాంగళ్య ధారణ చేసుకున్నారు. జిల్లాలోని తరికెరె సమీపంలోని అమృత్పూర్లోని అమృతేశ్వరస్వామి ఆలయంలో తోటలో నిరాడంబరంగా సుధ (54), మోహన్కుమార్ (52)ల వివాహం జరిగింది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాకు చెందిన మోహన్కుమార్, సుధది అజ్జాపూర్. ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగులు వీరిద్దరూ మైసూరులోని అబ్దుల్ నజీర్సాబ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చే రిసోర్స్ మాస్టర్ ట్రైనర్లుగా పనిచేస్తున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాగా, ఆమె మరాఠీ మహిళ. మోహన్కుమార్ యువకునిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల పట్ల ఆకర్షితులై సీపీఎంలో చేరారు. చిక్కమగళూరు జిల్లాలో రైతు సంఘంలో పోరాటం, ఉద్యమంలో పాల్గొన్న వారు. 90వ దశకం ప్రారంభంలో బి.కె.సుందరే కి ఇష్టమైన శిష్యునిగా ఉండేవాడు. తరువాత బెంగళూరు హెచ్ఏఎల్లో కార్మికుడిగా పనిచేశారు నవ కర్ణాటక ప్రచురణలో వ్యాసాలు రాసేవారు. అదే సమయంలో సుధ కూడా కమ్యూనిస్టు కార్యకర్తగా సామాజిక ఉద్యమాలలో పాల్గొనేవారు. అలా ఇద్దరికీ పరిచయమై గాఢమైన ప్రేమగా మారింది. 2005లో ఇద్దరూ మైసూరులో పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రిసోర్స్ పర్సన్లుగా ఎంపికయ్యారు. మోహన్, సుధ అన్యోన్యతను చూసిన అక్కడి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వీరిద్దరూ భార్యాభర్తలై ఉండొచ్చని అనుకునేవారు. అయితే అనేక ప్రేమ కథల్లో ఉన్నట్లే వీరి ప్రేమను కూడా కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి చేసుకోకుండానే ప్రేమను కొనసాగించారు. సన్నిహితుల చొరవతో చివరికి ఈ అపురూప జంటకు పెళ్లి చేసి ప్రేమకు సార్థకత తేవాలని కొందరు ఆప్తులు, స్నేహితులు నిర్ణయించారు. వారి ప్రోత్సాహంతో గత గురువారం అత్యంత నిరాడంబరంగా సుధ మెడలో మోహన్కుమార్ తాళి కట్టారు. ఈ పెళ్లి నేటిరోజుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేసే గ్రాండ్ వెడ్డింగ్లకు భిన్నంగా సరళంగా ఉంది. ఆథిత్యం పేరుతో విపరీతంగా ఖర్చుపెట్టి కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కథలున్నాయి. ఈ నిరాడంబర జంటను బంధుమిత్రులు సుఖీభవ అని ఆశీర్వదించారు. -
శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి
రాయికల్: ఉద్యోగం కోసం జోర్డాన్ దేశం వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూసాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మెట్పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి గ్రామానికి చెందిన జొరిగె అశోక్ ఉద్యోగం కోసం జోర్దాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ శ్రీలంక దేశానికి చెందిన సమన్వి పరిచయమైంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో అశోక్ అక్కాబావలైన రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన చేగంటి శేఖర్–పూజితలు హిందూ సాంప్రదాయ ప్రకారం భూపతిపూర్లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వీరి వివాహం జరిపారు. దంపతులను ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ సర్పంచులు వాసరి రవి, మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వర్రావు ఆశీర్వదించారు. -
లవ్ మ్యారేజ్ ఆపై విడాకులు.. మరో వ్యక్తితో పెళ్లి.. మళ్లీ మొదటి భర్తతో..
మల్యాల(చొప్పదండి): వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య కలాహాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో యువతిని మరో వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. అయినప్పటికీ ఆమె తన మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఆమెను గొంతునులిమి హతమార్చి చెట్లపొదల్లో పడేశాడు. ఈ సంఘటన మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన కరిపే అంజలి.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబకలహాల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనంతరం అంజలిని సిద్దిపేటకు చెందిన వ్యక్తికిచ్చి మరో పెళ్లి చేశారు. అయినా మొదటి భర్త నరేశ్ అంజలితో ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడు. రెండురోజుల క్రితం సిద్దిపేట నుంచి జగిత్యాలలోని పుట్టింటికి వచ్చిన అంజలికి ఫోన్ చేసిన నరేశ్.. ఈనెల 17న తన బైక్పై తీసుకెళ్లాడు. మ్యాడంపల్లి శివారులోకి చేరగానే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె గొంతునులిమి చంపి చెట్లపొదల్లో పడేశాడు. సోమవారం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
చెల్లెలి భర్తను నరికి చంపిన యువకుడు
సాక్షి, చైన్నె: తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని ఓ అన్న తన స్నేహితులతో కలిసి హతమార్చాడు. ఈ పరువు హత్య చైన్నె శివార్లలో కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని పళ్లికరణై పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. స్థానిక అంబేడ్కర్ వీధికి చెందిన ప్రవీణ్(26) ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఎలిటియన్ పేటకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో ఈ ప్రేమ జంట గత ఏడాది చివర్లో ఇంటి నుంచి పారిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. తమ కుటుంబ పరువును బజారు కీడ్చిన ప్రవీణ్పై ఆ యువతి కుటుంబం కక్ష పెంచుకుంది. ఆమె సోదరుడు దినేష్(24) తన మిత్రులతో కలిసి ప్రవీణ్ కదలికలపై నిఘా పెట్టాడు. శనివారం రాత్రి వేళచ్చేరి నుంచి పళ్లికరణై టాస్మాక్ రోడ్డు వైపుగా వెళ్తున్న ప్రవీణ్ను దినేష్ తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టాడు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి పడేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న దినేష్ను ఆ పరిసర వాసులు 108లో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పళ్లికరణై ఇన్స్పెక్టర్ నెడుమారన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. అతడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించింది. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పారి పోయిన మార్గంలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయాన్నే దినేష్తో పాటు అతడి స్నేహితులు చిత్తాల పాక్కం శ్రీరాం(23), స్టీఫన్(24), విష్ణు రాజు(23), జ్యోతిలింగం(23) మాంబాక్కం వద్ద ఓ చోట తలదాచుకుని ఉండడంతో వారిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. తన చెల్లెల్ని కులాంతరం వివాహం చేసుకున్నందుకే ప్రవీణ్ను మట్టుబెట్టినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ప్రేమజంటకు పెద్దల బ్రేక్
సాక్షి, బళ్లారి: కూతురు మరో కులం యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపగించుకున్న తల్లిదండ్రులు వారి రిజిస్టర్ పెళ్లిని అడ్డుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీకెరెలో జరిగింది. వివరాలు.. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్, పద్మజ అనే ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుని గత వారం క్రితం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కులాలు వేర్వేరని వారి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రేమికులిద్దరూ మంగళవారం రిజిస్టర్ పెళ్లి చేసుకోవాలని మొళకాళ్మూరుకు బయల్దేరారు. ఇంతలో పద్మజను వారి బంధువులు అడ్డుకుని బలవంతంగా బైక్పై తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అయింది. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్నాయక్ ఎస్టీ అయితే, కోనసాగర గ్రామానికి చెందిన పద్మజ బీసీ కులం యువతి. పద్మజ మంగళూరు నర్సింగ్ కళాశాలలో అతిథి లెక్చరర్గా పని చేస్తుండేది. ఆమె బంధువులు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రవీణ్ ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Valentines Day: వ్యాపార దిగ్గజాలు.. ఈ ప్రేమ పక్షులు
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. ఆపినా ఆగదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమికుల రోజును వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కానీ నిత్యం వ్యాపారం చేస్తూ ప్రేమికులుగానే ఉండనున్నట్లు కొన్ని ప్రేమవివాహం చేసుకున్న జంటలు తెలుపుతున్నాయి. ఆ ప్రేమజంటలు చేస్తున్న వ్యాపారం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ - షుగర్ కాస్మోటిక్స్ వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ 2015లో షుగర్ కాస్మొటిక్స్ను స్థాపించారు. వీరు అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో కలిసి చదువుకున్నారు. బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు - మొబిక్విక్ ఉపాసన టకు, బిపిన్ ప్రీత్ సింగ్ 2009లో మొబిక్విక్ కంపెనీని ప్రారంభించారు. ఇది మొబైల్ ఫోన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్లతో సహా అనేక రకాల సేవలను అందించే కంపెనీ. ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ - వెడ్మి గుడ్ ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్క్లైన్లో ఇంటర్న్షిప్ సమయంలో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జంటకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో బ్యాండ్-బాజా, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్స్ వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో వారి పెళ్లి అనంతరం వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం అందిస్తూ దాన్ని బిజినెస్గా మలుచుకున్నారు. తర్వాత 2014లో వెడ్మి గుడ్ కంపెనీను స్థాపించారు. శుభ్ర చద్దా, వివేక్ ప్రభాకర్-చుంబక్ శుభ్ర, వివేక్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముదురు రంగుల్లో ఉండే ‘కిట్చీ-చిక్’ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాని అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఏకంగా తమ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. 2009లో చుంబక్ కంపెనీను స్థాపించారు. ప్రత్యేకమైన గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. గజల్ అలఘ్, వరుణ్ అలఘ్-మామా ఎర్త్ గజల్ అలఘ్ టాక్సిన్ ఫ్రీ బేబీ కేర్ ఉత్పత్తులను తయారుచేయాలని భావించి హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మామాఎర్త్ను ఆగష్టు 2016లో తన భర్త వరుణ్ అలఘ్తో కలిసి స్థాపించారు. తల్లిదండ్రులు, పిల్లల కోసం సహజమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు మామాఎర్త్ తెలిపింది. రోహన్, స్వాతి భార్గవ - క్యాష్కరో ఇదీ చదవండి: దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి.. స్వాతి, రోహన్ భార్గవ క్యాష్కరో, క్యాష్బ్యాక్, కూపన్ వెబ్సైట్ను స్థాపించారు. ఏప్రిల్ 2011లో వీరు యూకేలో పోరింగ్ పౌండ్స్ పేరుతో క్యాష్బ్యాక్ వెబ్సైట్ను ప్రారంభించారు. 2013లో లండన్ నుంచి గుర్గావ్కు తిరిగి వచ్చిన తర్వాత అదే బిజినెస్ మోడల్ను క్యాష్కరో పేరుతో భారత్లో ప్రారంభించారు. క్యాష్కరోలో టాటా, కలారీ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాయి. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. టాలీవుడ్ ప్రేమ జంటలు!
మరో ఏడాదిలో వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్తో ఉంటారు. ప్రేమ అనే రెండు అక్షరాలను.. పెళ్లి వరకు తీసుకెళ్లిన వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. రెండు అక్షరాలతో మొదలై.. అదే రెండక్షరాల పెళ్లిగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ సక్సెస్ అయిన ప్రేమకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాగార్జున-అమల: మొదట కిరాయి దాదా మూవీ సెట్స్లో కలుసుకున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992లో (జూన్ 11న) వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కూడా ఒకటి,రెండు సినిమాల్లో నటించింది. 2. రాజశేఖర్-జీవిత: తెలుగు స్టార్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే రాజశేఖర్కు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్మాస్టర్, అంకుశం, బావ మరుదుల సవాల్ లాంటి చిత్రాలు వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. 3. శ్రీకాంత్-ఊహా: 1994లో ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997 జనవరి 20న పెళ్లితో పదిలపర్చుకున్నారు. వీరి పెళ్లయిన ఏడాది తర్వాత ఆయనగారు చిత్రం విడుదలైంది. 4. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్: 2000వ సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్ - నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్గా తమ బంధాన్ని కొనసాగించారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 5. అల్లు అర్జున్-స్నేహ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా.. అల్లు అర్జున్ ఓ స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం.. రోజూ ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్- స్నేహరెడ్డిల 2011న మార్చి 6న జరిగింది. 6. రామ్ చరణ్-ఉపాసన: మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరేంజ్’ సినిమా నుంచి వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమాలతో సంబంధం లేదు. 7. లక్ష్మి మంచు-ఆండీ శ్రీనివాసన్: మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు.. ఆండీ శ్రీనివాసన్ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి వివాహానికి షాపింగ్కు వెళ్లినప్పుడు అతన్ని మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆండీ, లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట ఆగస్ట్ 4న 2006లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 8. నాని-అంజనా యలవర్తి: టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రేమజంట నాని-అంజనా యలవర్తి. నాని భార్య అంజన సాఫ్ట్వేర్ ఇంజినీర్. నాని విశాఖపట్నంలో వీడియో జాకీ(వీజే)గా ఉన్నప్పుడు అంజనా ఓ పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్లో స్నేహితులుగా మారిన వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించారు. ఐదేళ్లపాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత చివరకు 27 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు. 9. నాగ చైతన్య-సమంత: 2009లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్స్లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. చైతూ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంలో సామ్ అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే 2021లోనే నాగచైతన్య- సమంత తమ వివాహాబంధానికి ముగింపు పలికారు. 10. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్.. నవంబర్ 1న 2023న పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో జంటగావరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. 11.మంచు మనోజ్- భూమా మౌనిక టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. మంచు లక్ష్మీ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. 12.సూపర్ స్టార్ కృష్ణ- విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. ఇద్దరి మనసులు కలవడంతో 1969లో రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు ఇంకా టాలీవుడ్లో ప్రేమవివాహం చేసుకున్నా స్టార్స్ కూడా ఉన్నారు. సుమంత్- కీర్తి రెడ్డి, బాలాజీ-మధుమిత, వరుణ్ సందేశ్- వితికా షేరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. -
ప్రేమ వివాహం.. కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు
తమిళనాడు: తిరుపూర్ జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన పెరుమాళ్ కూతురు ఐశ్వర్య (19). పూవలూరుకు చెందిన భాస్కర్ కుమారుడు నవీన్ (19). డిప్లమో చదివాడు. చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తిరుపూర్ జిల్లా అరవప్పాలయంలోని ఓ ప్రైవేటు బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు వర్గాలకు చెందిన వీరిద్దరూ గత డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వాట్సాప్లో వైరల్గా మారింది. ఈ విషయమై ఐశ్వర్య తండ్రి పెరుమాళ్ పల్లడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ తేదీన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో పంపారు. ఈ స్థితిలో గత 3వ తేదీన ఐశ్వర్యని ఆమె తండ్రి, బంధువులు కొట్టి వేధించి హత్య చేసి దహనం చేసినట్లు నవీన్కు అతని స్నేహితులు సెల్ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఒరత్తనాడుకు వచ్చిన నవీన్ ఈ విషయాన్ని వట్టతిక్కోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెయ్వడుతి, పూవలూరు గ్రామంలో బుధవారం తంజావూరు ఎస్పీ అసిస్రావత్ ఆధ్వర్యంలో పోలీసులు ఐశ్వర్య మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటికను సందర్శించారు. మృతదేహాన్ని దహనం చేసిన తరువాత బూడిద కూడా లేకపోవడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, భార్య రోజా, ఐశ్వర్య అమ్మమ్మ మలర్, అతని సోదరి అగదాసి, 16 ఏళ్లబాలిక సహా 11 మందిని అరెస్టు చేసి విచారణ కోసం వట్టతిక్కోట్టై పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
సినిమాకు మించిన ట్విస్టులు.. కారులో పెళ్లి.. అంతలోనే..
సాక్షి, బళ్లారి: సినిమా తరహాలో కారులోనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవడం సంచలనం కలిగించింది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన కిరాతక సినిమాలో ప్రేమ పెళ్లి జరిగిన విధంగా నగరంలో ఓ ప్రేమజంట కారులో మూడుముళ్లు వేసుకోవడం చూసి నగరవాసులు ఔరా అని నోరెళ్లబెట్టారు. కులాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వల్ల ప్రేమపక్షులు ఇలా చేశాయి. కొప్పళ అమ్మాయి, బళ్లారి అబ్బాయి.. వివరాలు... కొప్పళ జిల్లాకు చెందిన యువతి అమృత, బళ్లారి జిల్లాలోని తెక్కలకోటకు చెందిన యువకుడు శివప్రసాద్ ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరంటూ యువతి తల్లిదండ్రులు అడ్డు చెబుతూ వచ్చినా వారు పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని బళ్లారి నగరంలోని శాంతిధామ సాంత్వన కేంద్రం వద్దకు చేరారు. ఇద్దరు కారులో పూలదండలు మార్చుకొని పెళ్లి అయిందనిపించారు. ఇరువర్గాల వాగ్వాదం.. ఇంతలో ఇరువర్గాల పెద్దలు వారిని అటకాయించారు. యువతి కొంతసేపు తనకు తల్లిదండ్రులు కావాలని, మరి కొంతసేపు ప్రేమికుడు కావాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం నడిచింది. వధూవరులు కూడా గొడవలో తలదూర్చడంలో హైడ్రామా సాగింది. పోలీసులు వచ్చి ప్రేమికులను తెక్కలకోట పోలీస్ స్టేషన్కు తరలించి మాట్లాడారు, తరువాత యువతిని శాంతిధామ కేంద్రానికి తరలించారు. ఈ పెళ్లి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లయిన క్షణాల్లోనే జంటను విడదీయడం విశేషం. -
నవ దంపతుల ఆత్మహత్య
అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మండలంలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరూ ఇంట్లో బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ నాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం
చెన్నై: తమిళనాడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోటి కలలతో ఏడు అడుగులు వేసిన జంటను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక పరువు హత్యలను గుర్తుకు తెచ్చింది. తమకంటే పేదవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నవదంపతులను సొంత తండ్రే హత్య చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం..కోవిల్పట్టికి చెందిన మరిసెల్వం (24), ఎం కార్తీక (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. రక్షణ కోరుతూ కోవిల్పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని బుధవారం వరకు కోవిల్పట్టిలో ఉన్నారు. సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా, వీరి పెళ్లి ముందు ఇరు కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ పెళ్లి తరువాత, సెల్వం కుటుంబం కొత్త జంటను ఆదరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సెల్వం తన భార్య కార్తీకతో కలిసి జిల్లాలోని మురుగేషన్ నగర్ ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న దుండగులు పథకాన్ని పక్కాగా అమలు చేశారు. మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని ముఠా మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి నవ దంపతులపై దాడి చేసి హత్య గావించింది ఆ తరువాత అక్కడినుంచి అక్కడి నుండి పారిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని తూత్తుకుడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ తెలిపారు. అలాగే అమ్మాయి తండ్రి ముత్తు రామలింగం కిరాయి హంతకులతో వారిద్దరినీ హత్య చేయించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మూడు ప్రత్యేక బలగాలతో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
భార్య, మామపై అల్లుడి హత్యాయత్నం
వైఎస్సార్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేస్తుండగా అడ్డొచ్చిన మామపై కూడా అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. సీఐ శివాంజనేయులు, ఎస్ఐ గాయత్రి కథనం మేరకు వివరాలు.. మండలంలోని దేవులచెరువు పంచాయతీ రాజుగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్, వసంతమ్మ కుమార్తె అపూర్వ(25)కు అదే గ్రామానికి చెందిన దేవరాజుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరంతా అపూర్వ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం టమాట డబ్బులు రూ. 2 లక్షలు అల్లుడు వాడుకున్నాడని మామ చంద్రశేఖర్ అడగడంతో అప్పుల వాళ్లకు కట్టినట్లు చెప్పాడు. డబ్బుల విషయమై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో అత్తామామల ఇంట్లో ఉండకుండా భార్య, పిల్లలతో దేవరాజు వేరుగా కాపురం పెట్టాడు. డబ్బుల విషయంపై తరచూ దేవరాజుకు, అతని భార్య అపూర్వకు మధ్య గొడవ జరిగేది. దీంతో రెండు రోజుల క్రితం ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. డబ్బు విషయమై తనను అవమానించారని భార్య, మామపై కక్ష పెంచుకున్న దేవరాజు తన భార్య అపూర్వ పొలం వద్ద పనులు చేసుకుంటుండగా ఆమైపె కత్తితో దాడికి దిగాడు. గమనించిన మామ చంద్రశేఖర్ అడ్డురావడంతో మామపై కూడా దాడిచేసి పారిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం తంబళ్లపల్లె పీహెచ్సీకి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో తిరుపతికి తరలించారు. సీఐ శివాంజనేయులు రాజుగారిపల్లెకు వెళ్లి జరిగిన సంఘటనపై విచారించారు. అపూర్వ తల్లి వసంతమ్మ ఫిర్యాదుతో దేవరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి ముందు వరకు నాకు ఆ విషయం తెలియదు: అనసూయ
యాంకర్ అనసూయ గురించి అందరికి తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్ క్వీన్గా పేరు సంపాదించి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఏ విషయం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడడం అనసూయకు అలవాటు. తన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్గానే షేర్ చేసుకుంటుంది. తాజాగా తన భర్త భరద్వాజ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. 9 ఏళ్లుగా ప్రేమలో అనసూయది ప్రేమ వివాహం. ఇంటర్లో ఉన్నప్పుడు భరద్వాజ్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత భరద్వాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే అనసూయ వెంటనే ఓకే చెప్పలేదు. ఏడాదిన్నర తర్వాత ఆయన ప్రేమను అంగీకరించింది. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2010లో వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి వివాహానికి కుటుంబం సభ్యులు ఒప్పుకోలేదు. కానీ ఇద్దరూ పట్టుపట్టి మరీ ఒప్పించారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కొడుకులు. భరద్వాజ్ కులం ఏంటో తెలియదు: అనసూయ తొమిదేళ్లుగా ప్రేమలో ఉన్నా.. వీరిద్దరి మధ్య కుల ప్రస్థావన ఒక్కసారి కూడా రాలేదట. లగ్న పత్రిక రాసే ముందు వరకు భరద్వాజ్ కులం ఏంటో అనసూయకు తెలియదట. ‘పెద్ద కాపు – 1’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కుల మతాలను నేను ఎక్కువగా పట్టించుకోను. తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నప్పటికీ.. భరద్వాజ్ కులం ఏంటో నాకు తెలియదు. లగ్న పత్రిక రాసే ముందు గోత్రం, కులం అడిగారు. అప్పుడు ఆయన పలాన కులానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. మేమిద్దరం కులమతాలను పట్టించుకోం’ అని అనసూయ చెప్పుకొచ్చింది. -
బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు..
సైదాబాద్(హైదరాబాద్): వైద్యానికైన బిల్లు చెల్లించేస్తోమత లేక నిరుపేద దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. ఐదురోజులుగా ఎంత ప్రయత్నించినా ఆదుకునేనాథుడులేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో నివసించే నితిన్, ప్రవల్లిక ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. నితిన్ కిరాయి ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. 13 రోజుల క్రితం వారికి కూతురు జన్మించింది. అయితే పసిపాపకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రిలో చేర్చారు. ఏడురోజుల చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంది. వైద్యానికిగాను రూ.లక్షా 16 వేల బిల్లు అయింది. అయితే వారి వద్ద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బులు కట్టడానికి సహాయం కోసం ఎవరిని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో బిల్లు కట్టలేక ఆ దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. గత ఐదు రోజులుగా తమను ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సేవాలాల్ బంజారా సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ దాతలు ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆసుపత్రి బిల్లు కట్టేందుకు సాయం చేయాలని కోరారు. -
కూతురుకి ప్రేమ పెళ్లి చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
-
కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్కుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు. ఆయనే స్వయంగా పల్లవి, పవన్కుమార్లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారికి రిజిష్టర్ మ్యారేజీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్కుమార్ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట్రపకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు. చదవండి: ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం -
కూతురికి ప్రేమ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్రీవిద్య అనుమానాస్పద మృతి
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే సర్వం అని ఆ యువతి అతని వెంట నడచింది. వివాహం జరిగి ఆరు నెలలు కూడా తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కన్నవాళ్లు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల దళితవాడకు చెందిన నరసింహులు, ఉషారాణి దంపతుల కుమార్తె శ్రీవిద్య (22) మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. నీరుగంటివారిపల్లిలో కాపురం ఉండే మల్లీశ్వరి, మారపరెడ్డి దంపతుల కుమారుడు విజయ్ కుమార్రెడ్డి (23)తో కాలేజీ రోజుల్లోనే ప్రేమ మొదలైంది. యువకుని కుటుంబీకులు అడ్డుచెప్పినా ఇద్దరూ ఈ ఏడాది మార్చి నెలలో మదనపల్లిలోని ఓ ఆలయంలో దండలు మార్చుకుని అనంతరం అక్కడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి నమోదు చేసుకున్నారు. బెంగళూరులో కాపురం తరువాత బెంగళూరులోని మునిరెడ్డిపాళ్యలో కాపురం పెట్టారు. యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండగా యువకుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం ఏం జరిగిందో ఏమో శ్రీవిద్య ఇంట్లోనే మంచంపై శవమై తేలింది. విజయ్కుమార్రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రులు మృతదేహాన్ని సోమవారం మల్లెలదళితవాడకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనేది అక్కడి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
విదేశీ యువతులు.. తెలుగింటి కోడళ్లు..
ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం. ►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. (టేలర్ డయానా – అభినయ్రెడ్డి) ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి.. (హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్) ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్ల్యాబ్లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్లోకొత్తకాపురం మొదలుపెట్టారు. ►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి.. (కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్) మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్కు, మయన్మార్కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్లోని జిన్న్వేథేన్ నగరంలో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు. -
అక్కాతో వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్య..
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే మోసం చేసిందనే ఆవేదనతో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బీబీఎంపీలో పౌర కార్మికుడిగా పని చేస్తున్న లోకేశ్ చిక్కమారనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. 11 ఏళ్ల క్రితం శశికళ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు చిన్నారులున్నారు. ఇతనికి చిరంజీవి అనే స్నేహితుడు ఉన్నాడు. శశిళకళను అక్కా అక్కా అని పిలిచేవాడు. అయితే శశికళ, చిరంజీవి సన్నిహితంగా ఉండటాన్ని గమనించి లోకేష్ షాకయ్యాడు. శశికళ తనను మోసం చేసిందనే బాధతో తోట వద్దకు వెళ్లాడు. శశికళ చేసిన మోసాన్ని సూసైడ్ నోట్ రాసి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వస్తాడని తల్లి ఎదురు చూస్తుండగా పెంపుడుకుక్క లోకేశ్ విగతజీవిగా ఉన్న చోటుకు తీసుకెళ్లింది. నెలమంగల గ్రామాంతర పోలీసులు వచ్చి మృతదేహాన్ని, ఘటన స్థలంలో పడి ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కలకాలం తోడుంటానని చెప్పి..
కిర్లంపూడి: బైక్పై వెళ్తున్న ఆ ఇద్దరి పైకి ట్రాలీ రూపంలో మృత్యువు దూసుకువచ్చింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కిర్లంపూడి ఎస్సై బి.ఉమామహేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని సింహాద్రిపురం అడ్డురోడ్డు నర్సరావు కాలనీకి చెందిన గొడుగుల దుర్గామల్లేశ్ (21) అడ్డురోడ్డులో మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇసుకపల్లి బాల వీర వెంకట సత్య దుర్గసాయి అలియాస్ బాలు (15) ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ కలసి శుక్రవారం అర్ధరాత్రి ప్రత్తిపాడు వైపు బైక్పై వెళ్తున్నారు. అదే మార్గంలో ఎదురుగా వస్తున్న ట్రాలీ జగపతినగరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వీరి బైక్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలు అక్కడికక్కడే మరణించాడు. ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గా మల్లేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, లారీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు. వివాహమైన కొద్ది నెలల్లోనే.. ఈ ప్రమాదంలో మృతుడు దుర్గా మల్లేశ్ 15 నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏలేశ్వరం మండలం మొక్కారావు కాలనీకి చెందిన కొండేటి సోమరాజు కుమార్తె దేవి, మల్లేశ్ ప్రేమించుకుని, గత ఏడాది మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తితో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని దేవి ఎన్నో కలలు కంది. ఆ కలలు నెరవేరకుండానే ట్రాలీ రూపంలో మృత్యువు తన భర్తను బలిగొందని దేవి పెద్ద పెట్టున విలపిస్తోంది. మృతుడు మల్లేశ్కు భార్యతో పాటు తల్లిదండ్రులు నాగమణి, చిన్నరామస్వామి, సోదరి ఉన్నారు. అతడి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రయోజకుడిని చేయాలని.. శివమ్మ, వీరబాబు దంపతులకు బాలు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క సంతానం. దీంతో అతడిని ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు కొడుకు పడకూడదనే ఉద్దేశంతో వడ్రంగి పనికి వెళ్తూ.. బాలును వారు బాగా చదివించుకుంటున్నారు. పెద్దయ్యాక ప్రయోజకుడై తమకు ఆసరాగా నిలుస్తాడని జీవిస్తున్న తమ ఆశల్ని మృత్యువు చిదిమేసిందంటూ బాలు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. -
కులాంతర వివాహం చేసుకున్నాడని దాడి
ప్రకాశం: తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న యువకుడి తల్లి, అక్కపై యువతి తల్లిదండ్రులు దాడిచేసి గాయపరిచిన సంఘటన దర్శి మండలం బొట్లపాలెం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. డీఎస్పీ అశోక్వర్ధన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమార్తె భార్గవి ఎస్సీ కులానికి చెందిన అనురాధ కుమారుడు సాయిరాం మార్చి 2వ తేదీన వివాహం చేసుకున్నారు. వారి వినతి మేరకు రక్షణ కల్పించాలని ఎస్పీ మలికాగర్గ్ దర్శి పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేసి ఎలాంటి గొడవలు పడవద్దని చెప్పి పంపారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ కలిసి అర్ధరాత్రి ఎస్సీ కాలనీకి వెళ్లి యువకుడి తల్లి అనూరాధ, ఆమె కుమార్తె మౌనిక కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. మౌనికను కత్తితో పొడవబోగా చేయి అడ్డు పెట్టడంతో ఆమె చేతికి గాయమైంది. ఇనుపరాడ్డుతో తలపై కొట్టి గతంలో ఉన్న కేసులు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. వారిద్దరినీ కొట్టుకుంటూ బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకువెళ్లి కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో తాళ్లతో కట్టేసి ఉన్న అనూరాధ, అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను గుర్తించారు. వారిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి దర్శి సీహెచ్సీలో వైద్యం అందించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ అశోక్వర్థన్ తెలిపారు. బాధితులను ట్రైనీ ఎస్పీ అంకితా సురానా పరామర్శించారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. -
ఒకరితో ప్రేమ.. మరొకరితో రహస్య వివాహం
విశాఖపట్నం: ట్రయాంగిల్ లవ్స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని పేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. వివాహం చేసుకున్న వాడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ.. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక(16) ఇటీవల ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలున్నాయి. ఆదర్శనగర్కు చెందిన సీపాన సూర్యప్రకాష్రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్కు చెందిన లెంకా సాయికుమార్ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె సూర్యప్రకాష్తో చనువుగా ఉండడంతో సాయికుమార్కు నచ్చలేదు. అలాగే సాయికుమార్తో చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్కు నచ్చలేదు. దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్గా గుర్తించారు. లంకా సాయికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ప్రియుడి కోసం ప్లాన్.. తండ్రిని కారు ఆపమని, హఠాత్తుగా వెనుక నుంచి..
ముంబై: తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని ఓ కూతురు దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి ప్లాన్ కూడా చేసింది. అందుకోసం కొందరిని మాట్లాడుకుని సఫారీ కూడా ఇచ్చింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. అసలేం జరిగిందంటే.. పోలీసుల కథనం ప్రకారం.. షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా వ్యాపారి. అతని కుమార్తె సాక్షి. ఆమె చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమకు తన తండ్రి అంగీకరించడని భావించిన సాక్షి.. ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.అయితే తన తండ్రి నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని.. ఏకంగా కన్న తండ్రినే అడ్డుతొలగించుకోవాలనుకుని పథకం వేసింది. అందులో భాగంగా పూణె వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి మాదాకు తిరిగి వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి తన తండ్రిని రమ్మని పిలిచింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చాడు. తర్వాత తిరిగి వెళ్తుండగా వడచివాడి గ్రామ సమీపంలో సాక్షి తండ్రిని కారు ఆపమంది. అసలు విషయం తెలియన ఆ తండ్రి కారు ఆపగానే.. హఠాత్తుగా రెండు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. వారు అతన్ని తీవ్రంగా కొట్టారు, అతని రెండు కాళ్ళు విరిచారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచాడు. మహేంద్ర గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉపసర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి సంఘటనా స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కుమార్తె ప్రధాని నిందితురాలిగా తేలింది. ఈ కుట్రలో ఆమె ప్రియుడు కూడా హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Hyderabad: అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య ఆత్మహత్య -
కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్కు గురైంది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వివరాలు.. ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఆటోలో వెళ్తున్న దంపతులను కారులో ఛేజ్ చేసిన దుండగులు..భర్తపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. భార్యను ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి కారణాలతోనే తనపై దాడి చేసి, భార్యను కిడ్నాప్ చేశారని భర్త సన్నీ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!
వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి.. నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన టాలీవుడ్ జంటల్లో మహేశ్బాబు-నమ్రత ఒకరు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా ఈ జంటకు పేరుంది. వీరి రీల్ అండ్ రియల్ లవ్ మొదలైంది వంశీ సినిమాతోనే! ఈ మూవీ షూటింగ్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వంశీ బాక్స్ఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ వీరి మనసులు ఒక్కటయ్యేలా చేసింది. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే సందర్బంగా ఈ జంట ప్రేమకథపై ఓ లుక్కేద్దాం. అక్కడే ప్రేమ చిగురించింది వంశీ అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లింది. దాదాపు 25 రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి పరిచయం స్నేహంగా, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చాక ఫస్ట్ నమ్రతనే ప్రపోజ్ చేసింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో మరోమారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ కుటుంబం మొదట్లో అంగీకరించకపోవడం లవ్ జర్నీకి బ్రేక్ పడింది. నమ్రతనే తన భార్యగా ఊహించుకున్న మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. ఇకపోతే నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. (ఇది చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) మంజులదే కీలకపాత్ర నమ్రత-మహేశ్ల పెళ్లి జరగడంలో మంజుల కీ రోల్ ప్లే చేసింది. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి మరీ వివాహం చేసుకున్నారు మహేశ్. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ గతంలో వెల్లడించాడు. కానీ నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా' అని చెప్పుకొచ్చింది నమ్రత. కాగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. సితార, గౌతమ్తో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్తూ ఉంటారు మహేశ్ దంపతులు. సినిమాల్లో ఎంజ బిజీగా ఉన్నా సరే.. ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తు చిల్ అవుతుంటారు టాలీవుడ్ ప్రిన్స్. (ఇది చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
ప్రేమ పెళ్లి.. భర్త నిద్రపోతుంటే రాత్రి లేచి
అన్నానగర్: కుణ్ణం సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పెరంబలూరు జిల్లా కుణ్ణం సమీపంలోని పుదువైట్టికుడి గ్రామానికి చెందిన దేవేంద్రన్ కుమారుడు దేవరాజ్ (28). పుదువెట్టికుడి సమీపంలోని కాడూరు గ్రామానికి చెందిన దురైరాజ్–ముత్తులక్ష్మి కుమార్తె సత్య(23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు సంజీవ్ దేవ్ ఉన్నాడు. ఈ క్రమంలో దేవరాజ్, సత్య మధ్య తరచూ కలహాలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన సత్య, భర్త నిద్రపోతుంటే ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సత్య తల్లి ముత్తులక్ష్మి కుణ్ణం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుణ్ణం సబ్ ఇన్స్పెక్టర్ పిచ్చుమణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతితో ఏడాది కుమారుడిని చూసి అక్కడి వారు కంటతడి పెట్టారు. -
మూడేళ్ల బంధం.. ముగ్గురి హత్యలతో విషాదాంతమైన లాక్డౌన్ ప్రేమ..
కరోనా లాక్డౌన్లో చిగురించిన ప్రేమను పెళ్లితో భద్రపరుచుకున్నారు. కానీ వారి సంబరం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మూడేళ్ల ప్రేమ బంధం.. ముగ్గురి హత్యలతో షాదాంతంగా ముగిసింది. ట్రిపుల్ మర్డర్ అనంతరం నిందితుడు తొమ్మిది నెలల శిశువును చంకలో ఎత్తుకొని పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన నజీబుర్ రెహ్మాన్(25), 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్లు 2020లో ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అదే సంవత్సరం అక్టోబర్లో ఇద్దరూ కోల్కతాకు పారిపోయారు. తరువాత సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్కతా కోర్టులో నజీబుర్ను వివాహం చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాతి ఏడాది సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ సొంత కుమార్తెపైనే దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ రావడంతో తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చదవండి: హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు జనవరి 2022లో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ ఇంట్లో నుంచి పరారయ్యారు. అయిదు నెలలపాటు ఇద్దరూ చెన్నైలో నివాసం ఉన్నారు. తరువాత ఆ జంట ఆగస్టులో గోలాఘాట్కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతిగా ఉంది. వీరిద్దరూ నజీబుర్ ఇంటిలో జీవించడం ప్రారంభించారు. గత నవంబర్లో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు నెలల తర్వాత సంఘమిత్ర తన కొడుకుతో ఈ ఏడాది మార్చిలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. నజీబుర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నజీబుర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, నజీబుర్ తన కొడుకును కలిసేందుకు ప్రయత్నించగా.. సంఘమిత్ర కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. అనంతరంఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్పై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల కొడుకును చేతిలో ఎత్తుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులపై హత్యా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
ప్రేమఖైదీ.. పాకిస్తాన్ వ్యక్తితో నంద్యాల మహిళ ప్రేమ పెళ్లి
సాక్షి, గడివేముల: నంద్యాల జిల్లా మహిళను ప్రేమించిన ఓ పాకిస్తాన్ పౌరుడు ఆమె కోసం దేశంలోకి అక్రమంగా వచ్చాడు. ఆపై ఇక్కడ ప్రేమౖ‘ఖెదీ’గా మారాడు. వివరాల్లోకి వెళ్తే... పాకిస్తాన్లోని సియాకోట్ జిల్లా కుల్లులార్ గ్రామానికి చెందిన గుల్జార్ఖాన్కు 2008లో రాంగ్ కాల్ ద్వారా నంద్యాల జిల్లా గడివేములకు చెందిన దౌలత్బీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే దౌలత్బీకి భర్త చనిపోయాడు. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ గుల్జార్ తాను ప్రేమించిన దౌలత్బీ కోసం 2011లో తాను పనిచేస్తున్న సౌదీ అరేబియా నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. గడివేములకు చేరుకుని 2011, జనవరి 25న కర్నూలులో దౌలత్బీని వివాహం చేసుకున్నాడు. సమీప గ్రామాల్లో పెయింటింగ్ పనులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు జని్మంచారు. గుల్జార్, అతని భార్య, పిల్లలకు గడివేములలోనే ఆధార్ కార్డులు పొందారు. వాటి ఆధారంగా తనతోపాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లేందుకు వీసా తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్కు వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ మేరకు 2019లో సౌదీ వెళ్లేందుకు గడివేముల నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకోగా, అక్కడ పోలీసులు గుల్జార్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆరు నెలలు అనంతరం విడుదల చేశారు. అప్పటి నుంచి గుల్జార్ గడివేములలోనే ఉంటున్నాడు. అయితే, 2022, ఫిబ్రవరి 9న మళ్లీ గుల్జార్ను అరెస్టు చేసి మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో దౌలత్బీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగి తన భర్తను కండీషన్ బెయిల్పై ఈ నెల 20న బయటకు తీసుకువచ్చింది. గడివేముల వచి్చన గుల్జార్ను ఆదివారం పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. ఈ నెల 27న హైదరాబాద్ కోర్టులో గుల్జార్ హాజరుకావాల్సి ఉందని దౌలత్బీ తెలిపింది. ఇది కూడా చదవండి: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. -
ప్రేమికులపై పోలీస్స్టేషన్లోనే దాడి.. ఎస్పీ కార్యాలయానికి పరుగులు
సాక్షి, గద్వాల: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసు కున్న ఓ జంటపై యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడ్డ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం చెప్పారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్ పోలీస్స్టేషన్కు మంగళవారం చేరుకున్నారు. పోలీస్స్టేషన్లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను స్టేషన్కు పిలిపించి నచ్చజెప్పారు. అయితే యువతి కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. ఆమె కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి యువకుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది అడ్డుకోగా.. వెంటనే రక్షణ కోసం సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి రోడ్డు వెంట ఆ ప్రేమజంట పరుగులు తీసింది. ఎస్పీ సృజన వద్దకు వెళ్లి జరిగిన విషయం వివరించారు. వెంటనే ఎస్పీ ఆ ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్శాఖపై ఉందన్నారు. భవిష్యత్లో వారిపై దాడి చేయడం, అవమానపర్చడం, విడదీసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులను పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
మౌనమే మంత్రమై..
నరసన్నపేట: పెళ్లి మంత్రాలు ఇద్దరూ వినలేరు. కానీ మౌనాన్నే మంత్రంగా చేసుకున్నారు. ఒకరి పేరు ఒకరికి చెప్పుకోలేరు. కానీ ఒకరి మనసును ఒకరు గెలుచుకున్నారు. నరసన్నపేట నాయుడు వీధికి చెందిన కిరణ్, విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన అద్దంకి అలేఖ్యలు బధిరులు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ప్రేమలో పడిన ఈ జంట స్నేహితుల సాయంతో నరసన్నపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఒక్కటైంది. స్నేహితులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరుడి తరఫున బంధువులు రాగా వధువు తరఫున స్నేహితులే బంధువులయ్యారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయిందంటే చాలు అందులో నటించిన హీరోహీరోయిన్ల పెయిర్ బాగుందని మెచ్చుకుంటారంతా! వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడుతారు అభిమానులు. అయితే ఆన్స్క్రీన్పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్స్క్రీన్లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే! చాలామటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్లో ప్రేమలో పడి నెక్స్ట్ సినిమాకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలామందే ఉన్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రేమపెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను పారాయణం చేద్దాం.. కృష్ణ-విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ అందగాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికి ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. దీంతో శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవిత-రాజశేఖర్ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ప్రేమ, పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకనిర్మాతలు రాజశేఖర్కు షాకిస్తూ అతడినే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నాగార్జున- అమల తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేశ్ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు. మహేశ్బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేశ్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గానూ నటించారు. 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. నయనతార- విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్ 2022, జూన్ 7న విఘ్నేశ్తో ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కొన్ని ప్రేమకథలు గొడవలతో మొదలువతాయంటారు కదా! ఆ జాబితాలోకే వీరి లవ్ స్టోరీ కూడా వస్తుంది. ఆది-నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా! షూటింగ్ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న మూడుముళ్ల బంధంతో ఆఫ్స్క్రీన్ జంటగా స్థిరపడిపోయారు. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సాయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్ అలీ ఖాన్, దీపికా- రణ్వీర్ దంపతులు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలే! ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: కోలీవుడ్ నుంచి పిలుపు, నో చెప్పిన శ్రీలీల -
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం. -
ప్రేమ పెళ్లి వద్దని తాళి తీసిన యువతి
అన్నానగర్: తిరుపూర్ పూండి రింగ్రోడ్కు చెందిన యువతి (23). ఈమెకి ఆరు నెలల ముందు కోయంబత్తూర్ జిల్లా అన్నూర్ ఒటర్పాళయంకు చెందిన 29 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలిసి పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో గత 17వ తేదీ యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఐదున్నర సవర్ల నగలు, రూ.5 లక్షల నగదు తీసుకుని వెళ్లింది. తల్లిదండ్రులు వెలంపాళయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఇంటి నుంచి అన్నూర్కి వెళ్లి ప్రియుడిని కలుసుకుంది. అనంతరం అక్కడే గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భద్రత కల్పించాలని ప్రేమికులు ఇద్దరు అన్నూరు పోలీసులను ఆశ్రయించారు. అన్నూర్ పోలీసులు ప్రేమ జంటను వెలంపాళయం పోలీస్స్టేషన్ కు పంపారు. అక్కడ పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు స్టేషన్న్కు చేరుకుని కుమార్తెను చూసి బోరున విలపించారు. యువతి మనసు మారి తల్లిదండ్రులతో వెళుతూ ప్రియుడిని తప్పులేదని చెప్పి తాళి తీసి అతనికి ఇచ్చి వెళ్లింది. పోలీసులు యువకుడికి సర్ది చెప్పి పంపించేశారు. -
చైనా అమ్మాయితో నగరి అబ్బాయి ప్రేమ.. హిందూ సంప్రదాయంలో పెళ్లి
నగరి: చిత్తూరు జిల్లా నగరి అబ్బాయికి చైనా దేశానికి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. నగరి మున్సిపాలిటీ పరిధి కొత్తపేటకు చెందిన వీఎన్ కృష్ణన్, లత దంపతుల కుమారుడు వీకే పురుషోత్తమన్ బీఈ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి చైనాలోని బెల్జింగ్లోని బీఎండబ్ల్యూ గ్రూప్ ఆసియా లిమిటెడ్లో ఉద్యోగం చేస్తున్నాడు. బెల్జింగ్కు చెందిన వాంగ్ డిసెంగ్, యాంగ్ కనియింగ్ దంపతుల కుమార్తె డబ్ల్యూ.మింగ్ మింగ్ అదే కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీస్లో ఉద్యోగం చేస్తోంది. ఈ యువతితో కృష్ణన్కు పరిచయం ఏర్పడి..అది కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. సంప్రదాయ వ్యవహారాల అడ్డు తొలగించుకునే విషయంలో ఇరువురు విజయం సాధించారు. కృష్ణన్ తల్లి, బంధువుల కోరిక మేరకు నగరిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరపడానికి వధువు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో చైనా నుంచి నగరికి వచ్చిన అమ్మాయికి వరుని తరఫు వారు హిందూ సంప్రదాయం ప్రకారం నలుగు పెట్టి, చీరకట్టి పెళ్లికూతురిలా ముస్తాబు చేసి స్థానిక ఏజేఎస్ కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. -
ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం: రమ్యతో బంధం తెంచుకోవాలని..
అన్నానగర్: గర్భిణిని హత్య చేసిన కేసులో ఆమె భర్త, అత్తమామలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన సతీష్ కుమార్ (31) డ్రైవర్. తేని జిల్లా కడమల కుందూకు చెందిన నర్సు రమ్య(25)ను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం వేళాచ్చేరి మునియంతిపురంలోని కురింజినగర్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో రమ్య గర్భం దాల్చింది. అయితే సతీష్కుమార్, రమ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రమ్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో బంధువులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు. శనివారం సతీష్ కుమార్ మరోసారి రమ్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో నిర్మాణ పనులకు ఉపయోగించే దుంగతో కొట్టాడు. రమ్య తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. తిరుపరంగున్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సతీష్కుమార్ తల్లిదండ్రులు రమ్యతో బంధాన్ని తెంచుకోవాలని ఒత్తిడి చేశారని.. ఈ క్రమంలోనే ఆమైపె దాడి జరిగిందని తెలిసింది. ఆదివారం రాత్రి రమ్య మృతదేహాన్ని మదురై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. సతీష్కుమార్ (31), అతని తండ్రి సెల్వం (55), తల్లి పంచవర్ణంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రేమకు తలొగ్గిన కోర్టు..లవర్ను పెళ్లి చేసుకునేందుకు హత్యకేసు దోషికి పెరోల్
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రేమికుల మనసును గెలుచుకున్నాయి. 'ఇతడ్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు.. తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం.' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన ఇతని పేరు ఆనంద్. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది. అయితే నీతా అనే యువతి, ఆనంద్ 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా ఈమెకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల కానున్నాడు. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది. చదవండి: మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని బిత్తరపోయిన మహిళ -
నా కూతురినే పెళ్లి చేసుకుంటావా.. నీకు ఎంత ధైర్యం
తమిళనాడు: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని కత్తులతో నరికి హత్య చేసిన సంఘటన కృష్ణగిరిలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి సమీపంలో వున్న కిడామ్పట్టికి చెందిన చిన్నయ్యన్ కుమారుడు జగన్ (28) టైల్స్ అతికించే పనిచేస్తుంటాడు. ఇతను కృష్ణగిరి జిల్లా ములంగళ్కు చెందిన శంకరన్ కుమార్తె శరణ్య (21)ను ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారి ప్రేమను ఒప్పుకోలేదు. ఆమెకు మరొక యువకుడితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో జగన్, శరణ్య ఒక క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో శరణ్య కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జగన్ మోటారు సైకిల్పై ధర్మపురి, కృష్ణగిరి రోడ్డులో వెళుతుండగా శరణ్య తండ్రి శంకరన్, తన బంధువుతో కలిసి అతన్ని అడ్డగించారు. కత్తులతో దాడి చేశారు. జగన్ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కావేరి పట్టణం పోలీసులు అక్కడికి చేరుకుని జగన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. యువకుడి తల్లిదండ్రులు లీసులను అడ్డుకుని న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఎస్పీ సరోజ్కుమార్ ఠాగూర్, సహాయ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ తమిళరసి అక్కడికి చేరుకుని హంతకులను త్వరలోనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత మృతదేహాన్ని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్ మామ శంకరన్, బంధువులు అరులు, గోవిందరాజు, తిమ్మరాయ కోసం గాలింపు చర్యలు చేపట్టగా శంకరన్ మంగళవారం రాత్రి కృష్ణగిరి అదనపు మహిళా పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి
మాచారెడ్డి: అమెరికా అమ్మాయి మాచారెడ్డి అబ్బాయి వివాహానికి కామారెడ్డి పట్టణం వేదికైంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన సిద్దంశెట్టి గంగ, రమేశ్ల పెద్ద కుమారుడు సాయి సంకేత్ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ సహాధ్యాయి అయిన కన్సిలో ఎలిజబెత్, ఫ్రాన్సిస్కో ఎర్నిస్టోల కూతురు రిషికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురూ తమ తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో శనివారం రాత్రి కామారెడ్డిలోని సత్య గార్డెన్లో వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. (చదవండి: TSPSC: పేపర్ లీక్లో కొత్త కోణం.. ఉద్యోగికి హానీట్రాప్!) -
బిల్గేట్స్కు తాతగా ప్రమోషన్
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తాతయ్యారు. అవును.. ఆయన కూతురు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, నయెల్ నాసర్ దంపతులు పండంటి మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బేబి ఫేస్ను కవర్ చేస్తూ తీసిన పాదాల ఫొటోల్ని జెన్నిఫర్ గేట్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది జెన్నిఫర్కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jennifer Gates (@jenniferkgates) ‘సెండింగ్ లవ్ ఫ్రమ్ అవర్ హెల్తీ లిటిల్ ఫ్యామిలీ’ అనే క్యాప్షన్ జోడిస్తూ..పోస్ట్చేసిన ఫోటోలపై బిల్ గేట్స్ స్పందించారు. జెన్నీఫర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమ జంట 2021 అక్టోబర్లో నయెల్ నాజర్ను జెన్నిఫర్ గేట్స్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం ప్రేమించుకున్న వీరిద్దరి వివాహానికి బిల్గేట్స్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక బిల్ గేట్స్ అల్లుడు నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్ లో స్థిరపడగా, నాసర్ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉంది. హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరఫున 2020 ఒలింపిక్స్లో కూడా ఆడారు. చదవండి👉 ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది -
Valentine's Day: తీరం చేరిన ప్రేమకథలు.. లవ్, లైఫ్లో గెలిచిన జంటలు
సాక్షి , కరీంనగర్: ప్రేమ.. కులమతాలకు అతీతమైన భావన. టీనేజీ వయసులో మొదలయ్యే ప్రేమకథలు ఆకర్షణతో మొదలై.. అక్కడితో ముగుస్తాయి. కానీ, పరిణితితో కూడిన ప్రేమకథలు కచ్చితంగా విజయతీరాలు చేరతాయి. ఒక చేత్తో కెరీర్, మరో చేత్తో ప్రేమను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఖండాలు దాటినా, ఏళ్లకు ఏళ్లు గడిచినా ఎదురుచూపుల్లోనే బతికేస్తారు. చివరికి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆ తరువాత పెద్దల్ని ఒప్పిస్తారు. కొందరికి ఈ అవకాశం లేకపోవచ్చు. అయినా వీరు చేరుకున్న విజయతీరాలు, సమాజంలో వీరికి దొరికే స్థానం వీరిపై ఉన్న వ్యతిరేక భావనను క్రమంగా దూరం చేస్తుంది, అందరినీ దగ్గర చేస్తుంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై కథనం. మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాక మా స్నేహితులతో మా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలి్సన అవసరం రాలేదు. అందరినీ ఒప్పించి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం. నా భార్య దివ్యాన్షీ కంటి డాక్టర్. ఈ తరం యువతకు నేను చెప్పేది ఒక్కటే.. కెరీర్పై దృష్టి పెట్టి లక్ష్యం సాధిస్తే అన్ని మనవద్దకు వచ్చి చేరుతాయి. ఆకర్షణకు గురైతే లైఫ్ ఆగమవుతుంది. – సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్– డాక్టర్ దివ్యాన్షీ దంపతులు ఖండాలు దాటిన ప్రేమ నేను ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నక్రమంలో నాకు రమేశ్ పరిచమయ్యాడు. రోజూ మా కాలేజీకి వచ్చేవాడు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. అయితే, జీవితంలో పైకి రావాలన్న నా కలను వివరించాను. అయినా తను వెనకడుగు వేయలేదు. నాకు పూర్తిగా సహకరించాడు. ఉన్నత విద్య కోసం నేను బ్రిటన్ వెళ్లాను. పీజీ పూర్తయి ఉద్యోగంలో చేరాక ఇండియా వచ్చాను. నా కోసం ఎదురుచూస్తున్న రమేశ్తో వివాహం జరిగింది. కులాలు వేరుకావడంతో మొదట్లో మా పెద్దలు వ్యతిరేకించినా.. కెరీర్లో నిలదొక్కుకున్న తీరుకు మా ప్రేమను అంగీకరించారు. ఇపుడు లండన్లో రెండు రెస్టారెంట్లు, ఒక కేక్షాప్ నడుపుతున్నాం. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నం. ఏటా మా ఇద్దరి పిల్లలతో ఇండియాకు వస్తాం. – సుష్మ– రమేశ్ నేనే ప్రపోజ్ చేశా.. ఏదో సందర్భంలో తన ఫ్రెండ్ ప్రశాంత్ను పరిచయం చేశారు. ఆ పరిచయమే కొన్నాళ్లకు ఇష్టంగా మారింది. ధైర్యం చేసి నేనే పెళ్లి ప్రేమను ప్రతిపాదించా. అమ్మానాన్న అంగీకరించలేదు. గొడవలు కూడా అయ్యాయి. సొంతంగా నిర్ణయం తీసుకుని అగ్రహారం ఆంజనేయస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల తరువాత ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించి కలిసిపోయారు. ప్రస్తుతం అంతా సంతోషంగానే ఉంది. – లహరి, ప్రశాంత్ అనాథ యువతికి అన్నీ తానై.. కథలాపూర్(వేములవాడ): అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు ఓ సామాజిక సేవకుడు. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు శేఖర్ షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని అదే గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించాడు. 2013లో శేఖర్, రమ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని ఆమెకు అన్నీ తానయ్యాడు. వీరికి శ్రీహర్ష, రిషికేశ్ ఇద్దరు కుమారులు. శేఖర్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో 2018లో గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. కులాంతరమే కాదు.. అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శేఖర్ను పలువురు అభినందించారు. ప్రేమ కోసం దేశంలోనే.. మాది మంథని, మా వారిది కరీంనగర్. నేను అపుడు పీజీ చదువుతున్నా. మా ఆయన ప్రభాకర్ అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒక పెళ్లి వేడుకలో అనుకోకుండా కలిశాం. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాం. మాకు ఇపుడు ఒక పాప. మా ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు చివరికి మమ్మల్ని క్షమించేశారు. హైదరాబాద్లో ఓ ఇంటి వారిమయ్యాం. విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా మా పేరెంట్స్ను చూసుకునేందుకు మా ప్రభాకర్ వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు. ఏమాత్రం సెలవు దొరికినా మా పేరెంట్స్కే టైం కేటాయిస్తాం. – స్వప్న– ప్రభాకర్ అప్పట్లో చాలా కష్టపడ్డాం నాది జగిత్యాల, ఆమెది కరీంనగర్. డిగ్రీ చదువుకునే రోజుల్లో మాకు ఎన్సీసీలో పరిచయం. పీజీకి వెళ్లాక కూడా కొనసాగింది. అపుడే ఎస్సై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తనకు దాదాపుగా ఏడాది దూరంగా ఉండి ప్రిపేరయ్యా. ఈ లోపు విషయం ఇంట్లో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించారు. నేను ఎస్సైగా సెలెక్ట్ అయ్యాక మరో ఏడాది దూరంగా ఉన్నాం. పోస్టింగ్ తీసుకున్నాక వెళ్లి వారిని ఒప్పించా. తొలుత వ్యతిరేకించినా... కొన్నిరోజులకు కలిసిపోయాం. ఇపుడు నేను సీఐగా మానుకోటలో విధులు నిర్వహిస్తున్నా. మాకిద్దరు పాపలు. కులాలు వేరైనా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటే అంతా ఆమోదిస్తారు. – సుష్మ– రవిరాజ్ ప్రేమ ముందు ఓడిన వైకల్యం పెద్దపల్లిరూరల్: ‘నా స్వాతి బంగారం.. నేను మరుగుజ్జుగా పుట్టినా నాకు ఆ భగవంతుడు స్వాతి రూపంలో మంచి జీవితాన్నే ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు రవికిరణ్. స్వాతి కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి పెద్దపల్లికి వలస వచ్చింది. వారు రవికిరణ్ ఇంటి సమీపంలో అద్దెకు రావడంతో స్వాతితో ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది. స్వాతి కుటుంబీకులు వ్యతిరేకించడంతో అప్పటి సీఐ హబీబ్ఖాన్ను ఆశ్రయించగా ఠాణాలోనే పెళ్లి జరిపించారని రవికిరణ్, స్వాతి పేర్కొన్నారు. వారికి ఓ బాబు, ఇద్దరు కూతుళ్లు జన్మించినా అనారోగ్య కారణాలతో బాబు, ఓ కూతురు చనిపోయారని బాధపడ్డారు. అయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆశాజ్యోతిని తమకున్నంతలో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. మరుగుజ్జునైన తనకు ప్రభుత్వం నుంచి దివ్యాంగ పింఛన్ అందుతోందని, మెప్మాలో పనిచేసినందుకు మరో నాలుగు వేలతోనే నెట్టుకొస్తునన్నాడు. టీనేజ్ ప్రేమతో సమస్యలు చదువు పూర్తికాకుండానే టీనేజ్లో ప్రేమలో పడుతున్న వారు చాలా మంది ఆ తరువాత కాలంలో ప్రేమ, ఆకర్షణ తేడాలు తెలుసుకుని తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరిలో ఏ ఒక్కరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నా ఇంకొకరు గౌరవించే రీతిలో ప్రేమ ఉండాలి. అంతే కాని ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లు, వాట్సాప్ల్లో పెడతానని బ్లాక్మెయిలింగ్ దిగడం సరికాదు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తే కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. – రాజశేఖర్రాజు, సీఐ, కోరుట్ల -
Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో నివసించే హర్షవర్ధన్ అచ్చమైన తెలంగాణ అబ్బాయి. చదువుకునే సమయంలో తమిళనాడుకు చెందిన ‘అరు’ అనే యువతి ప్రేమలో పడ్డాడు. పెళ్లి తంతు మొత్తం తమిళ బ్రాహ్మణ సంప్రదాయంలో జరగడం.. ఆమెతో పెళ్లి కోసం అతను చేసుకున్న సర్దుబాట్లలో ఒకటి మాత్రమే. అతని భార్యగా మారాక అరు కూడా ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు తగ్గట్టుగా తన వంతుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ ముందు సంస్కృతీ సంప్రదాయాలు కూడా తలవంచుతాయి అని ఇలాంటి జంటలు నిరూపిస్తున్నాయి. ఖండాంతరాలు దాటిన ప్రేమ ‘మేం ఇద్దరం ఆరేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేం పరిచయమయ్యే నాటికి నా వయసు 18 ఆయనకు 25పైనే’ అంటూ గుర్తు చేసుకున్నారు సెలీన్ (41). ప్రస్తుతం నగరంలోని మణికొండలో నివసిస్తున్న సెలీన్, ఆమె భర్త కాకుమాను విక్రమ్ను ఫ్రాన్స్లోనే కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ పెద్దలు, మతాలు వంటి అవాంతరాలు దాటి 2006లో జరిగిన పెళ్లితో సుఖాంతమైంది. పెళ్లి అనంతరం ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సాధించిన విక్రమ్ ప్రస్తుతం ఓ ఫ్రెంచ్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తుండగా సెలెన్ నగరంలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయిని. తనకెంతో ఇష్టమైన తెలుగు వంటలు వండటం భార్యకు రాకపోయినా విక్రమ్ సర్దుకుపోతుంటే.. భర్తతో కలిసి తిరుపతి వంటి హిందూ దేవుళ్ల ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం సెలెన్ అలవాటు చేసుకున్నారు. ఇక్కడి ఫంక్షన్లకు చక్కగా చీర కట్టుకుని మరీ హాజరయ్యే సెలెన్ను చూసినవారెవరైనా ఫ్రెంచ్ జాతీయురాలు అంటే నమ్మడం కష్టం. హైదరాబాద్ వాతావరణం చాలా నచ్చిందని, తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్నానని చెబుతున్న సెలెన్.. తన భర్తకు నచ్చే విధంగా అత్తయ్యా, మావయ్యా అంటూ ఆయన తల్లిదండ్రులను సంబోధిస్తూ సంతోషపెడతారు. ఆపం, పుట్టు అతనికి.. ఇడ్లీ.. దోశ ఆమెకి.. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో నగరానికి చెందిన దేవేందర్ ఫార్మాసిస్ట్గా.. కేరళకు చెందిన శశికళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ.. ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కేరళ–హైదరాబాద్ మధ్య దూరం తరిగిపోయింది. సెటిలయ్యాకే పెళ్లి అనుకున్నారు కాబట్టి పెద్దలు ససేమిరా అని అడ్డం పడినా ఆ అభ్యంతరాలన్నీ దూది పింజలైపోయాయి. పెళ్లి తర్వాత కొబ్బరినూనెతో వండే కేరళ తరహా వంటలు దేవేందర్ ఇష్టపడక తప్పలేదు. అత్తగారి ఊరెళ్లాక అక్కడి వస్త్రధారణ అయిన పంచెకట్టులోనే గుళ్లూ గోపురాలూ తిరగడం అతనికి అలవాటైంది. మరోవైపు కొబ్బరినూనె లేకుండా వండే వంటలు శశికళ తినక తప్పలేదు. అయితే తర్వాత తర్వాత అక్కడి కోకోనట్ ఆయిల్తో వంటలు ఆరోగ్యకరమని గ్రహించిన దేవేందర్ తనకు తన పిల్లల వరకూ అదే ఆయిల్ని వాడడం కోసం కేరళ నుంచి 4 కిలోల నూనెను ప్రత్యేకంగా తెప్పిస్తారు. పుట్టు, ఆపం వంటి కేరళ వంటలతో పాటే దేవేందర్కు మలయాళం, ఇక్కడి ఇడ్లీ, పూరిలతో పాటే శశికళకు తెలుగు భాష కూడా వంటబట్టేశాయి. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నా...పరస్పరంప్రేమ ముందు ఇలాంటి సర్దుబాట్లు చిన్నవే అంటోందీ జంట. కేరళ అబ్బాయి.. తమిళ అమ్మాయి అమెజాన్ కంపెనీలో పనిచేస్తూనే ప్రేమలో పడిన ప్రియాంక తమిళమ్మాయి, అబ్బాయి శ్రీకాంత్ది కేరళ. ఇద్దరూ ప్రేమను పంచుకున్నారు. మరి పూర్తిగా భిన్నమైన సంప్రదాయాలను ఎలా పంచుకుంటున్నారు? అంటే.. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు ఏది బెటరయితే అది ఫాలో అయిపోవడమే అంటూ సింపుల్గా చెప్పేస్తారిద్దరూ. ఉదాహరణకి వీరి పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలి? అనే చర్చ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. కేరళ సంప్రదాయంలో పెళ్లి పట్టుమని 15 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి కాస్త గుర్తుంచుకునేలా ఉండడానికి ఇక్కడి సంప్రదాయాన్నే ఎంచుకున్నారు. ‘ప్యారా’నాపూల్ చార్మినార్: ప్రేమకు గుర్తుగా మూసీ నదిపై పురానాపూల్ వంతెనను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘ప్యారా’నాపూల్ అనేవారు. తాను ప్రేమించిన భాగమతి దక్షిణ మూసీ ప్రాంతంలో ఉండటంతో.. ఉత్తరం వైపు ఉన్న గోల్కొండ నుంచి ప్రాణాలకు తెగించి నదిని దాటుకుంటూ వచ్చి వెళ్లేవాడు మహ్మద్ కులీ కుతుబ్ షా. ఇలా నది నీటిలో ఈదుకుంటూ వెళ్లి రావడం ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మహ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూసీపై కొత్తగా వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు. మూసీ నదిపై వంతెన నిర్మిస్తే తన కుమారుడు క్షేమంగా ఇవతలి నుంచి అవతలికి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. అతను ప్రేమించిన భాగమతిని కలిసి వస్తాడని భావించి 1578లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. దీంతో మూసీ నదిపై భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ వంతెనను నిర్మించాడు. అప్పట్లో ప్యారానాపూల్గా ప్రసిద్ధి గాంచిన ఈ వంతెన.. అనంతర కాలంలో పురానాపూల్గా వాడుకలోకి వచ్చింది. -
ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. మూవీ రేంజ్ లవ్స్టోరీ
ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. ఆస్ట్రేలియాలో ప్రేమ.. వీరిది ట్విస్టులతో కూడిన సినిమా రేంజ్ లవ్స్టోరీ. పెద్దలను ఒప్పించడానికి ఏకంగా 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. వారు ఒప్పుకున్నాకే విశాఖలోని రుషికొండలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. కాస్తా లేట్ అయినా కుటుంబంలో ఆనందం నెలకొంది. ఇంతకీ వీళ్ల పరిచయం ఎక్కడ.. ఎలా జరిగిందంటే.. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వేడంగికి చెందిన కోట సూర్యప్రకాశరావు 15 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. కాగా, సూర్యప్రకాశరావుకు భవానీ ప్రసాద్ మూడో కుమారుడు. అయితే, భవానీ ప్రసాద్.. ఉన్నత చదువుల కోసం 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ మలేషియాకు చెందిన ఐక్వేతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పాలని డిసైడ్ అయి వారి మనసులో మాట చెప్పారు. అయితే, చాలా మంది ఫ్యామిలీల్లో జరిగినట్టే వీరి ప్రేమకు కూడా కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో, పెద్దల మాటలను గౌరవించి.. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని ఐక్వే చెప్పింది. ఈ క్రమంలో భాను ప్రసాద్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, ఇద్దరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఉన్నత చదవుల తర్వాత.. ఇద్దరూ మంచి ఉద్యోగాలు పొందారు. కొద్దిరోజుల్లోనే భాను ప్రసాద్ జాబ్కు గుడ్బై చెప్పి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. దీంతో, ఐక్వే కూడా జాబ్ మానేసి.. భాను వ్యాపార వ్యవహారాలను చూస్తున్నారు. ఇలా ఏకంగా 12 సంవత్సరాల కాలం గడిపోయింది. ఇంట్లో వాళ్లు ఇద్దరికీ సంబంధాలు చూసినప్పటికీ నో చెబుతూ వచ్చారు. ఇలా ఇద్దరికీ 41 ఏళ్ల వయస్సు వచ్చింది. ఈ క్రమంలో ఐక్వే కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమకు ఓకే చెప్పి.. పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య విశాఖలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. -
‘మీకు పెళ్లయిపోయింది..పోండి’
అనంతపురం: ప్రేమ పేరుతో ఓ బాలికలను యువకుడు వంచించగా, గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు. ఆ బాలిక మెడలో పసుపుతాడు కట్టించారు. ఈ పెళ్లి తంతుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దృష్టిసారించారు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమపేరుతో వంచించాడు. తరచూ బాలిక ఇంటివద్దకు వెళ్తుండటంతో బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నెల 18న పంచాయితీ చేశారు. బాలిక ఇంటి ముందు యువకుడి చేత తూతూ మంత్రంగా పసుపుతాడు కట్టించారు. ‘‘మీకు పెళ్లయిపోయింది..పోండి’ అంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు : బాలిక మెడలో పసుపుతాడు కడుతున్న యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి స్పందించారు. ఉరవకొండ రూరల్ సూపర్వైజర్ తిరుపాల్భాయిని ఆమిద్యాలకు పంపగా...ఆమె బాలికను విచారించారు. బాలికను చైల్డ్ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ బాల్యవివాహలు చట్టరీత్యా నేరమని, 8వతరగతి చదివే బాలిక పెళ్లి చెల్లుబాటు కాదన్నారు. బాలికలను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్ అయ్యే వరకూ చదివిస్తామన్నారు. మరోవైపు పోలీసులూ ఈ ఘటనపై స్పందించారు. బాలిక మెడలో పసుపుతాడు కట్టిన యువకుడితో పాటు అందుకు ప్రోత్సహించిన గ్రామపెద్దలను పోలీసు స్టేషన్కు పిలిపించినట్లు తెలుస్తోంది. -
ఖమ్మం అమ్మాయి.. నెల్లూరు అబ్బాయి.. పారిపోయి వచ్చి..
సాక్షి, నెల్లూరు(కొండాపురం): ప్రేమించి వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కొండాపురం పోలీసులను గురువారం ఆశ్రయించింది. వివరాలు.. పామూరు మండలం కుంటపల్లికి చెందిన గురవయ్య, వరలక్ష్మి దంపతులు. వారు కుమారుడు గురుబ్రహ్మంతో కలిసి తెలంగాణం రాష్ట్రం ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. అక్కడ పీ సంధ్య అనే యువతితో గురుబ్రహ్మానికి పరిచయం ఏర్పడింది. ఇరువురు ఏడాది పాటు ప్రేమించుకున్నారు. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి ఐదు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కొండాపురంలోని యువకుడి బంధువుల వద్దకు చేరుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇరువురు మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేశామని ఎస్సై ఖాజావళి తెలిపారు. చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..) -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ప్రియుడి ఇల్లును దగ్ధం చేసిన ప్రియురాలి బంధువులు
-
కరీంనగర్లో దారుణం.. లవ్ మ్యారేజ్ చేసుకున్నారని..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఇందిరానగర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు. అయితే తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఘటనలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చదవండి: (ఎయిమ్స్లో సీటు సాధించాలనే కోరిక.. ఆ ఒత్తిడితోనే..) -
యువకుణ్ణి హతమార్చి.. ఆనక నిప్పంటించారు
కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన గాడిబండ ఆమోస్(26) దారుణ హత్యకు గురయ్యాడు. కల్లూరు మండలం శరీన్ నగర్ శివారులోని హంద్రీ నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమోస్ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేక మొదట్లో ఘర్షణలు జరిగాయి. దీంతో ఆమోస్ దంపతులు ఊరు వదిలి వచ్చేసి కొన్నాళ్లు ఆదోని, మరికొన్నాళ్లు ఎమ్మిగనూరులో కాపురం చేశారు. రెండేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి కల్లూరు ఎస్టేట్లో నివాసముంటూ సిటీ స్క్యేర్ మాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదృశ్యమైన రెండు రోజులకే.. ఆమోస్ రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా.. శనివారం ఉదయం శరీన్నగర్ శివారులోని హంద్రీనది ఒడ్డున శవమై కనిపించాడు. జనసంచారం లేని ముళ్లపొదల చాటున మృతదేహం పడివుండగా.. బహిర్భూమికి వెళ్లినవారు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ కేవీ మహేష్, సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే!.. నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా?
ప్రేమ వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన దర్శక నటుడు పార్తీపన్, నటి సీత మనస్పర్థల కారణంగా 11 ఏళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తాము విడిపోవడానికి సీతనే కారణమని పార్తీపన్, ఆయన చెప్పినదంతా అబద్ధమని సీత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పాండ్యరాజన్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయిన ఆన్పావం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న ఈమె ఆ తరువాత వరుసగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం తదితర భాషల్లో అవకాశాలు దక్కించుకుని హీరోయిన్గా మంచి స్థాయికి చేరుకున్నారు. దర్శకుడు భాగ్యరాజ్ శిష్యుడు పార్తీపన్ తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమైన పుదియపాదై చిత్రంలో సీత నాయకిగా నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడచింది. దీంతో 1990లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2001లో విడిపోయారు. ఆ తరువాత సీత 43 ఏళ్ల వయసులో బుల్లితెర నటుడు సతీష్ను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే వీరిద్దరూ విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీత మొదటి భర్త పార్తీపన్ ఆమె గురించి ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి కారణం సీత అత్యాసే కారణమని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీత స్పందించారు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నటిని అని, ఒక చిత్రంలో నటి సుహాసిని చెప్పినట్లు నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. పార్తీపన్ చెప్పినవన్నీ అసత్యాలే అన్నారు. -
సిరిసిల్ల: షాలిని ప్రేమ-పెళ్లి వ్యవహారం సుఖాంతం?!
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారిన యువతి కిడ్నాప్ వ్యవహారం.. ఆపై ఇష్టపూర్వక వివాహంగా మారి ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని షాలిని ప్రకటించడం, ఆమెను బెదిరించి ఉంటారన్న తల్లిదండ్రుల అనుమానాలతో కేసు ఉత్కంఠగా మారింది. అయితే.. సాయంత్రం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను కలిసిన నవ దంపతులు.. రక్షణ కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో.. ఆ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఆయన.. పెద్దలను పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. తన ఇష్ట ప్రకారమే తన ప్రియుడితో వెళ్లానని తెలిపిన ఎస్పీకి షాలిని వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాదు నాలుగైదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఏడాది కిందట ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే.. షాలిని అప్పటికి మైనర్ కావడంతో.. వివాహం చెల్లదని చెబుతూ పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. ఈ క్రమంలో.. మైనార్టీ తీరాక వివాహం చేసుకుందామని షాలినితో చెప్పాడు జ్ఞానేశ్వర్. త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని ఆమెకు ముందుగానే సమాచారం ఇచ్చాడు. అయితే.. షాలిని గుడికి వెళ్తుందనే సమాచారం జానీకి ముందే తెలుసు!. అందుకే ఆమెను తీసుకెళ్లే యత్నం చేశాడట. కానీ.. ముఖానికి అడ్డుగా కర్చీఫ్ ఉండడంతో ఎవరో అనుకుని ఆమె భయపడి ప్రతిఘటించినట్లు షాలిని వెల్లడించింది. తీరా కారులోకి వెళ్లాక.. అది అతనే అని తెలిసి వెంట వెళ్లినట్లు చెప్పింది. తమ ఇష్టప్రకారమే వివాహం జరిగిందని, తల్లిదండ్రుల నుంచి ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని ఆ నవ దంపతులు జిల్లా ఎస్పీని కోరారు. దీంతో.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కిడ్నాప్ గురైందనుకున్న యువతి షాలిని.. పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మా బిడ్డను మా ముందు నిలబెట్టండి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నానని చెప్తున్న షాలిని వ్యవహారంలో తమ గోడును కూడా వినాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బలవంతంగా షాలినిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని ఉంటాడని, తమ బిడ్డను తమ ముందు నిలబెడితే అసలు విషయం తేలుతుందని షాలిని తల్లిదండ్రులు వాపోతున్నారు.భయపెట్టి లేదంటే తమను చంపుతామని బెదిరించి.. తమ కూతురితో జానీ అలా చెప్పించి ఉంటారని షాలిని తల్లిదండ్రులు చంద్రయ్య-పద్మ ఆరోపిస్తున్నారు. -
Medchal: పెళ్లై ఆరు నెలలు గడవకముందే యువకుడి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో కాపురం పెట్టాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వినయ్ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. కాగా అయిదు రోజుల క్రితమే వినయ్ ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లైన ఆరు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వినయ్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే భార్య వేధింపుల కారణంగానే వినయ్ ప్రాణం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు..
శ్రీకాళహస్తి(తిరుపతి): ఓ తండ్రి క్షణికావేశం ముక్కు పచ్చలారని మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకొంది. భార్యతో గొడవతో సహనం కోల్పోయిన ఆ తండ్రి.. బిడ్డను గోడకేసి కొట్టడంతో ఆ పసిప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో భార్యాభర్తలు మునిరాజా, స్వాతి నివాసముంటున్నారు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల తర్వాత వీరికి నిఖిల్ పుట్టాడు. ప్రస్తుతం నిఖిల్ వయసు మూడు నెలలు. నాలుగు రోజుల కిందట పిల్లాడికి న్యుమోనియా సోకడంతో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఇందుకోసం తన బైక్ను అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత బిడ్డకు మళ్లీ జ్వరం రావడంతో.. నువ్వు ఆస్పత్రిలో సరిగా చూపించలేదంటూ భార్య గొడవకు దిగింది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన తండ్రి బైక్ను తీసుకురాగా.. అప్పటికే వాళ్ల మధ్య విభేదాలుండటంతో ఆ బైక్ ఎక్కేందుకు ఆమె నిరాకరించింది. అంతేగాక తన తల్లిదండ్రుల మీద ఆమె నోరు పారేసుకోవడంతో మునిరాజా సహనం కోల్పోయాడు. అదే సమయంలో బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండటంతో మునిరాజా.. బాలుడి కాళ్లు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ సీఐ అంజుయాదవ్ చెప్పారు. -
కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..
సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసలు, బాధితురాలు తెలిపిన వివరాలు.. హెచ్.మురవణి గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య(24) గత ఏడాది డిసెంబర్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓ(కమ్మునిటీ హెల్త్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేష్(28)ను ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అమ్మా యి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేష్ తన భార్యను రోజూ ఉదయం ద్విచక్ర వాహనంపై హెచ్.మురవణికి వెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకొని వచ్చేవాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం తన భార్యను బైక్పై తీసుకొస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ కింద పడిపోవడంతో వీరేష్పై విచక్షణ రహితంగా దాడిచేసి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసులకు చెప్పింది. రహదారిలో వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో పాటు చికిత్స నిమిత్తం వీరేష్ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని తల్లిదండ్రులు మందలించి ఇంటికి తీసుకురాగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని ఇందిరానగర్కు చెందిన బి.లక్ష్మయ్య,నాగలక్ష్మిల కూతురు హేమలత (19) నల్గొండకు చెందిన వరుణ్కు ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న పెళ్లి చేసుకుంది.అదే రోజు అక్కడి పోలీసులు హేమలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు నల్గొండకు వెళ్లి పోలీసుల సమక్షంలో కూతురికి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం హేమలత నాయనమ్మ యాదమ్మ ఇంటి బయటకు కూర్చుని ఉండగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన యాదమ్మ కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వచ్చి చూసేసరికి యువతి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను కత్తితో పొడిచి హత్య) -
పెళ్లి ఆలోచన లేదు.. సంతోషంగా జీవించాలనుకుంటున్నా..
చెన్నై: కోలీవుడ్లో సంచలన నటిమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమెపై ఇప్పటికే చాలా వదంతులు వచ్చాయి. గ్లామరస్గా నటించడానికి ఏ మాత్రం సంకోచించని బోల్ట్ అండ్ బ్యూటీ అండ్రియా. ఒకరిని నమ్మి సహజీవనం చేసి, చాలా మోసపోయానని ఆ మధ్య తనే స్వయంగా ఓ భేటీలో పేర్కొంది. శారీరకంగా మానసికంగానూ వేదనకు గురయ్యారని కూడా చెప్పుకొచ్చింది. అలా కొంతకాలం నటనకు దూరమైన ఈ ఆంగ్లో ఇండియన్ భామ ఆ తర్వాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈమె రెండు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మి ష్కిన్ దర్శత్వంలో నటించిన పిశాచి 2, రెండోది అనల్ మేలే పని తులి. దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన ఈ చిత్రానికి కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇది శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పిశాచి 2 చిత్రం కూడా త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆండ్రియా ఒక భేటీలో ప్రేమ పెళ్లి అంశాలపై పేర్కొంటూ తను 20 ఏళ్ల వయసులోనే ఒక అతన్ని ఇష్టపడ్డానని తెలిపింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాననీ, అయితే ఆ ప్రేమ వర్కౌట్ కాలేదని చెప్పింది. ఆ తర్వాత ఎవరిని ప్రేమించలేదని చెప్పింది. నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది యువతులు సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లికి దూరంగా చాలా మంది చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు నటి ఆండ్రియా పేర్కొంది. తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, జీవితంలో ఆనందంగా గడపాలని తాను భావిస్తున్నట్లు చెప్పింది. చదవండి: ‘డేంజరస్’ .. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? -
Viral Love Story: ఆయన వయసు 70, ఆమెకు 19.. ఇద్దరిది ఒకటే టేస్టు...
‘మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటారు. వివాహానికి ఈడు జోడు కుదరాలి అంటారు. అయితే, కొన్ని పెళ్లిళ్లు వింతగా విడ్డూరంగా జరుగుతుంటాయి. ముదిమి వయసులో ఉన్న వ్యక్తులకు యవ్వనులకు ముడిపడుతుంది. ఇటువంటి ప్రత్యేక వివాహాలకు సంబంధించి యూట్యూబర్ సయ్యద్ బాసిత్ వీడియోలు చేస్తుంటాడు. కొద్ది నెలల క్రితం పాకిస్తాన్లో 19 ఏళ్ల యువతిని 70 ఏళ్ల వ్యక్తి మనువాడాడు. అది తాజాగా వైరల్గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం! లిఖత్ అలీ (70) లాహోర్లోని ఓ పార్కుకు మార్నింగ్ వాక్ వెళ్తుండేవాడు. అక్కడకు షుమైలా (19) కూడా వస్తుండేది. అనుకోకుండా చోటుచేసుకున్న ఓ సన్నివేశం వారి మనసుల్ని కలిపింది. షుమైలా ముందు నడుస్తుండగా.. ఆ వెనకే వెళ్తున్న లిఖత్ అలీ ఓ పాటను హమ్ చేస్తున్నాడు. దాంతో మ్యూజిక్ అంటే చెవికోసుకునే ఆ యువతి.. లిఖత్ పాటకు ఫిదా అయింది. అలా వారిద్దరి మనసులు కలిశాయి. (చదవండి: ఏడుగురికి ఉరి శిక్ష..షాక్లో మానవ హక్కుల సంఘాలు) ‘ప్రేమ వయసు భేదాల్ని పట్టించుకోదు. అలా జరిగిపోతుంది అంతే!’ అని షుమైలా సిగ్గుపడుతూ చెప్పింది. మరి మీ పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకున్నారా? లేక ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అని అడగ్గా.. ‘తొలుత ఒప్పుకోలేదు. వయసులో అంత తేడా ఉన్న వ్యక్తిని పెళ్లాడటం వద్దే వద్దు అని తేల్చిచెప్పారు. కానీ, నేను, లిఖత్ వారిని ఒప్పించగలిగాం’ అని కొత్త పెళ్లికూతురు బదులిచ్చింది. వయసులో భారీ తేడాలతో పెళ్లిచేసుకున్నవారిని దయచేసి నిందించవద్దని కోరింది. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు ఎంచుకుంటారని చెప్పుకొచ్చింది. ఆత్మాభిమానం, వ్యక్తిత్వమే రెండు మనసుల కలయికకు, పెళ్లికి సోపానమని తెలిపింది. చెడు తిరుగుళ్లు తిరిగే బదులు మనసుకు నచ్చినవాడితో మనువు ఎంతో మంచిది కదా అని ఆమె సూచించింది. ఇక శరీరానికికే వయసు 70 అని.. తన మనసుకు కాదని లిఖత్ పేర్కొన్నాడు. ఎప్పుడూ హోటళ్లలో భోజనం చేసే తనకు.. భార్య రాకతో మరో కొత్త లోకం పరిచయమైందని అన్నాడు. ఇదిలాఉండగా.. గత ఆగస్టులో కూడా ఇటువంటి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. 55 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. బాబీ డియోల్ పాటనే తమను ఒక్కటి చేసిందని వారు చెప్పడం గమనార్హం. (చదవండి: ‘ఈ సలహా నా భార్య ఎప్పుడో చెప్పింది’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్) -
ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించిన తల్లిదండ్రులు
సాక్షి, జగిత్యాల: కన్న కూతురు అని కూడా చూడకుండా తల్లిదండ్రులు హద్దు మీరారు. కోడలూ అనే విషయం మరచి మేన మామ మరింత కఠినంగా ప్రవర్తించారు.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడు నెలల తరబడి అక్కసు బయట పడింది.. తమ ఇష్టాన్ని కాదని వేరే యువకుడిని పెళ్లి చేసుకుందని కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు.. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంగా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా కడకు కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది జగిత్యాలలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి కిడ్నాప్ చేశారు.. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషషన్కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది.ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. -
ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాక్షి, చెన్నై(అన్నానగర్): ప్రేమ వివాహం చేసుకున్న చెన్నై ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని తాంబరానికి చెందిన సురేష్ కుమార్ (30) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇతను, విల్లుపురం జిల్లా కోటకుప్పం ప్రాంతానికి చెందిన గోమతి (30) పెరంబలూరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. గోమతి ప్రస్తుతం కోటకుప్పంలో మున్సిపల్ ఉద్యోగినిగా పని చేస్తోంది. వారి కుటుంబసభ్యులకు కూడా వీరిద్దరి ప్రేమ గురించి తెలిసింది. ఈ క్రమంలో సురేష్ కుమార్, గోమతి తల్లిదండ్రుల అంగీకారంతో ఆమెను శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలాపట్టు ప్రాంతంలో ఉన్న బాలమురుగన్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. తరువాత సాయంత్రం కోటకుప్పంలోని ఓ ప్రైవేట్ హాలులో వీరి రిసెప్షన్ జరగాల్సి ఉంది. చదవండి: (బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?) ఈ స్థితిలో వరుడు సురేష్ కుమార్ కుటుంబం చెన్నైకి చెందిన వారు కావడంతో రిసెప్షన్కు ముందు కొత్తకుప్పంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బస చేశారు. తర్వాత సురేష్ కుమార్ దుస్తులు మార్చుకుని, వస్తానని చెప్పి గదిలోకి వెళ్లాడు. చాలాసేపటికి అతను బయటకు రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూశారు. ఆ సమయంలో సురేష్ కుమార్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు సురేష్ కుమార్ను పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే సురేష్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు సురేష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కీచక ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పదేపదే గదికి పిలిపించి...) -
మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?
సాక్షి, చెన్నై(వేలూరు): ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రానికి చెందిన గాయత్రి (32) వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న తూత్తుకుడికి చెందిన సెల్వకుమార్ను ప్రేమించి, నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ తొర్రపాడిలోని గాంధీనగర్లో కాపురం ఉంటున్నారు. దంపతులకు సంతానం లేక పోవడంతో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దంపతులు ఇద్దరికీ మార్చి, మార్చి డ్యూటీలు ఉండడంతో వీరు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉండడం లేదు. ఇదిలా ఉండగా సెల్వకుమార్ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆదివారం సాయంత్రం భార్యకు సెల్వకుమార్ ఫోన్ చేయగా ఫోన్ తీయలేదు. దీంతో ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ సెల్వకుమార్ ఇంట్లో పరిశీలించగా అప్పటికే గాయత్రి ఒక గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించి, బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. మహిళా డాక్టర్ సంతానం లేకపోవడంతోనే మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేక వేరే ఏమైనా కారణాలున్నాయా ?అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చదవండి: (Khammam: వివాహేతర సంబంధమే ఆమె ప్రాణం తీసిందా..?) -
83 ఏళ్ల వృద్ధురాలితో 28 ఏళ్ల వ్యక్తి ప్రేమ వివాహం
ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు వంటి డైలాగులు సినిమాల్లో చూస్తుంటాం. కానీ కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అన్నానంటే అతడి 28 ఏళ్లు, ఆమెకు 83 ఏళ్లు వారి మధ్య విడదీయరాని ప్రేమ చిగురించడం అంటే వినేందుకు కాస్త విడ్డూరంగా ఉంది కదూ. కానీ ఆ ఇద్దరు ఒకరినొకరు విడిచి జీవించలేమంటూ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే....పోలాండ్కి చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు పాకిస్తాన్కి చెందిన 28 ఏళ్ల హఫీజ్ నదీమ్తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఒకరికొకరు జీవితాంతం కలిసే ఉండాలని వాగ్దానం చేసుకుని మరి ఒకటవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఐతే సదరు వృద్దురాలు మాత్రం నదీమ్ని విడిచి ఉండలేనంటూ ప్రియుడు కోసం ఏకంగా పాకిస్తాన్ వచ్చేసింది. ఆ తర్వాత ఈ జంట పెద్దలను ఒప్పించి పాకిస్తాన్లోని హఫ్జాబాద్లో కాజీపూర్లో అక్కడ సంప్రదాయపద్ధతిలో నవంబర్ 2021న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తామెంతో సంతోషంగా ఉన్నామంటూ పలు ఇంటర్వూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పెళ్లిలో తలెత్తిన గొడవ...నలుగురు మృతి) -
బీటెక్ విద్యార్థిని ప్రేమవివాహం.. గ్రామంలోకి వచ్చి బలవంతంగా..
సాక్షి, ప్రకాశం(కొత్తపట్నం): వారు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అమ్మాయి కన్నవారికి నచ్చలేదు.. వెంటనే అమ్మాయి ఆచూకీ కనుగొని బలవంతంగా తీసుకెళ్లడానికి యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారందరినీ అదుపులోనికి తీసుకున్నారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన జీవిత శివకుమారి గూడురు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన కారాని రాజేష్ తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శినానికి వెళ్లాడు. అదే సమయంలో చెన్నై నుంచి వారి బంధువులతో జీవిత శివకుమారి కూడా దర్శినానికి వచ్చింది. ఇలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమదాకా దారి తీసింది. ఇటీవల సింగరాయకొండలో వివాహం చేసుకున్నారు. తరువాత కొత్తపట్నం పోలీస స్టేషన్కు వచ్చి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకున్నారు. అప్పటికే యువతి తల్లిదండ్రులు గూడూరు పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశారు. వారు కొత్తపట్నంలో ఉన్నారని తెలుసుకున్న గూడూరు టూటౌన్ ఎస్సై, కొత్తపట్నం పోలీస్స్టేషన్కు వచ్చి ఇద్దరినీ తీసికెళతానని చెప్పాడు. వెంటనే గుండమాల గ్రామస్తులు కలుగచేసుకుని ఇద్దరూ మేజర్లు అయితే ఎలా తీసికెళతారని ప్రశ్నించారు. దీంతో ఏమీ చేయలేక ఎస్సై వెనుతిరిగాడు. అయితే వారం రోజుల తరువాత మళ్లీ కొత్తపట్నం పోలీస్ స్టేషన్కు వచ్చి ఇద్దరూ గూడూరు రావాలని కోరాడు. కానీ యువతి నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 19న సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం గూడూరు నుంచి 30 మంది వాహనాల్లో వచ్చి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసికెళ్లారు. గ్రామస్తులు అడ్డగించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ కారాని జయరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారిలోనే వారిని పోలీసులు అడ్డగించి ఒంగోలు టూటౌన్కు తీసుకొచ్చారు. అయితే పెండ్లి కుమార్తె తండ్రి కారాని శ్రీను.. కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ కోడలను ఆమె మేనమామలు భాస్కర్రెడ్డి, భరత్రెడ్డి మరి కొంత మంది బలవంతగా తీసికెళ్లారని యువకుని తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఎస్సై కొక్కిలగడ్డ మధుసూదన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వింత పెళ్లి; అతనికి 52.. ఆమెకు 20.. ప్రేమ ఎలా చిగురించిందంటే..
ప్రేమ మనుషుల జీవితాలనే మార్చేస్తుంది. ఎప్పుడు, ఎవరిని తన వైపు లాగుతుందో చెప్పడం అసాధ్యం. కొందరి లవ్ స్టోరీలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ జంట. తండ్రి వయసున్న వ్యక్తిని ఓ యువతి మనువాడింది. ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నఈ వార్త అక్షర సత్యం. ఈ వింత పెళ్లి పాకిస్థాన్లో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతి 52 ఏళ్ల ఓ టీచర్ను వివాహం చేసుకుంది. అయితే వయసులో యువతి కంటే అతను 32 ఏళ్లు పెద్దవాడు కావడం విశేషం. అంతేగాక వ్యక్తి అద్భుత వ్యక్తిత్వానికి ఫిదా అయి అతనితో ప్రేమలో పడినట్లు చెబుతోంది. వీళ్లిద్దరూ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ పెళ్లి విషయం ప్రపంచానికి తెలిసింది. జోయా నూర్ అనే యువతి డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో తన టీచర్ సాజీద్ అలీతో ప్రేమలో పడింది. ఇంకేమంది వెంటనే తన ప్రేమ విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలియజేయగా అతను సున్నితంగా తిరస్కరించాడు. దీనికి ఇద్దరి మధ్య 32 ఏళ్ల వ్యత్యాసం ఉండటమే కారణమట. తర్వాత ఆమె పట్టువదలని విక్రమార్కుడిలా తన పప్రేమ కోసం పోరాటం చేసింది. యువతి ప్రేమకు మంత్రముగ్దుడైన వ్యక్తి ఆమెకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే ఒకవారం సమయం కావాలని కోరాడు. చివరికి యువతితో పెళ్లికి పచ్చజెండా ఊపాడు. చదవండి: ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి... మరొసారి మాజీ భార్యతో .... ఈలోగా జోయా తన పప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వాళ్లు ససేమిరా అన్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులను కాదని ఆమె సాజిద్ను పెళ్లి చేసుకుంది. జోయా అద్భుతంగా వంట చేస్తుందని, ఆమె వండే ఆహారం తెగ ఇష్టమని సాజిద్ తెలిపాడు. అంతేగాక ఆమె చేసే టీకి తాను అభిమానినని చెప్పాడు. ప్రస్తుతం వీళ్ల లవ్స్టోరి నెట్టింట్లో వైరల్గా మారింది. వీరికి మద్దతుగా నిలుస్తూ కొత్త జంటపై నెటిజన్లు ప్రేమను కురిపిస్తున్నారు. -
మతిచెడి వచ్చారు.. మనసిచ్చిపుచ్చుకున్నారు.. ఇద్దరూ పట్టభద్రులే!
మోడువారిన చెట్టు చిగురిస్తే.. బీడు భూమిని వర్షపు చినుకు పలకరిస్తే.. ఆ ఆనందమే వేరు. ఆ అనుభూతికి ఏదీ సరికాదు. ఇది అక్షరాల నిజం అంటోంది.. ఆ జంట. అవును.. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలుతిని వారు మానసిక రోగులయ్యారు.. చివరికి.. తమవారెవరో కూడా గుర్తించలేని దుస్థితికి చేరుకున్నారు. చికిత్స పొందే సమయంలో ఒకరిపై ఒకరు ఆప్యాయత పెంచుకున్నారు. తమకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది సాయంతోనే నేడు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉన్నత చదువులు చదివినా.. జీవితమనే వెకుంఠపాళిలో చిక్కి.. శల్యమై.. భవిష్యత్పై ఆశలు వదిలేసుకున్న రెండు మనస్సులు.. బాధలను దిగమింగి.. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాయి. వారికి మనమూ చెబుతాం.. ఆల్..ది..బెస్ట్..! సాక్షి, చెన్నై: ప్రేమ.. ఈ రెండక్షరాల పదం.. ఇద్దరి మనస్సులను ఒక్కటి చేస్తుంది. పాతాలానికి పడిపోయినా.. ప్రపంచాన్ని ఎదిరించగలమనే శక్తినిస్తుంది. దీన్ని అక్షరాల నిజం చేసింది ఆ జంట. వివరాలు.. చెన్నై కీల్పాకం మానసిక రోగుల ఆసుపత్రికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ వందలాది మంది మానసిక రోగులు చికిత్స తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇందులో చెన్నైకు చెందిన పీజీ పట్టభద్రుడైన మహేంద్రన్ (42) కూడా ఉన్నాడు. కుటుంబ గొడవలతో అతడు మానసిక రోగిగా మారాడు. ఇతడిని చికిత్స నిమిత్తం స్థానికులు కీల్పాకం మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడే వేలూరుకు చెందిన టీచర్ దీప (36) కూడా చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణంతో తీవ్ర మనో వేదన గురై.. ఆమె మానసిక రోగిగా మారారు. ఈ ఇద్దరికీ ఆసుపత్రి డైరెక్టర్ పూర్ణ చంద్రిక నేతృత్వంలోని సిబ్బంది చికిత్స అందించారు. ఈ సమయంలో మహేంద్ర, దీప కలిసి మెలిసి ఉండేవారు. వెళ్లనని మారం చేసి మరీ... సేవలోకి.. రెండేళ్ల చికిత్స తర్వాత మహేంద్రన్, దీప సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారు. ఆసుపత్రి జీవితం నుంచి బయటి ప్రపంచంలో విహరించేందుకు వీరికి అవకాశం వచ్చింది. అయితే, తాము ఆసుపత్రి నుంచి వెళ్లబోమని, మిగిలిన వారికి సాయం చేస్తూ.. జీవితాన్ని సాగిస్తామని పట్టుబట్టి.. అక్కడే పనిలో చేరారు. రోగుల శిక్షణ కేంద్ర పర్యవేక్షణ పనుల్లో మహేంద్రన్, వంట పనుల్లో దీప భాగమయ్యేవారు. ఈ క్రమంలో వారు మరింతగా ఒకరిపై ఒకరు ఆప్యాయత పెంచుకున్నారు. ఓ రోజు మహేంద్రన్ ప్రేమిస్తున్నట్లు దీపాకు చెప్పాడు. ఆమెకు కూడా అంగీకరించడంతో ఈ విషయాన్ని డైరెక్టర్ పూర్ణ చంద్రికకు చెప్పి..తన భవిష్యత్కు కొత్త బాట వేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. వీరి ప్రేమను గుర్తించిన ఆస్పత్రి వర్గాలు తామే దగ్గరుండి వివాహం చేస్తామని ఆ జంటకు హామీ ఇచ్చాయి. ఆస్పత్రి ఆవరణలోని సిద్ధి , బుద్ధి వినాయకుడి ఆలయంలో శుక్రవారం వివాహానికి ఏర్పాట్లు చేశారు. కాగా వివాహ అనంతరం ఈ దంపతుల కొత్త జీవితానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను తమ సొంత నగదుతో కొనుగోలు చేసి అందించాలని ఆసుపత్రి సిబ్బంది నిర్ణయించడం విశేషం. దీపావళి వేళ నిశ్చయం అయిన వీరి వివాహం.. దీప.. మహేంద్రన్ జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపాలని మనమూ కోరుకుందాం. -
ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగరంలోని పుట్టేనహళ్ళి పొలీస్ స్టేషన్ పరిధిలో నిహారిక అనే యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాలు... స్థానికంగా ఉండే నిహారిక (25), కార్తీక్లు గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలు మాట్లాడుకుని ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఘనంగా పెళ్లి జరిపించారు. నిహారిక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పని చేస్తుండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త నిత్యం వేధింపులు కోటి ఆశలతో కాపురానికి వచ్చిన నిహారికకు భర్త, అత్తమామల నిజస్వరూపం కొద్దిరోజులకే అర్థమైంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు. అత్తమామలు కూడా అతనికే వంత పాడేవారు. దీంతో విరక్తి చెంది ఆదివారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పుట్టేనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపుల వల్లనే తమ బిడ్డ చనిపోయిందని నిహారిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
ప్రేమపెళ్లి: తిరుపతి జిల్లా బుచ్చినాయుడిపల్లిలో దారుణం
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరపు వారు దాడి చేశారు. రెండు నెలల క్రితం డాక్టర్ సుష్మా, వంశీకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నారు. దీంతో పెళ్లి ఇష్టంలేని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం ఆ యువతిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ('ఆ పాత్ర చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఒసామాబిన్ లాడెన్ గుర్తొస్తున్నారు') -
కుమార్తె డ్రైవర్తో వెళ్లిపోయిందని.. ఫ్యామిలీ మొత్తం..
సాక్షి, బెంగళూరు: కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో మంగళవారం జరిగింది. శ్రీరామప్ప (69) తన భార్య సరోజ (55), కుమారుడు మనోజ్ (25), కూతురు అర్చనతో హండిగనాళలో ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్ నారాయణ స్వామిని ప్రేమించిన అర్చన సోమవారం ఇల్లు వదిలి అతనితో వెళ్లిపోయింది. అర్చన ఒక్కలిగ అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి కాగా, నారాయణస్వామి దళిత వ్యక్తి. కూతురు కనిపించడం లేదని అదే రోజు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో తమ పరువు పోయిందని, ఇక జీవించలేమని నిర్ణయించుకున్నారు. తమ మరణానికి అర్చనే కారణమంటూ సూసైడ్నోట్ రాసి పురుగుల మందు తాగి శ్రీరామప్ప, భార్య, కుమారుడు ప్రాణాలు తీసు కున్నారు. అదనపు ఎస్పీ కుశాల్ చౌక్సే, పోలీసు లు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే అందరం చచ్చిపో తామని అక్కకు తమ్ముడు మనోజ్ పంపిన మెసేజ్లను ఫోన్లో పోలీసులు గుర్తించారు. చదవండి: (భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై..) -
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. పెళ్లి ఫోటోలు వాట్సాప్లో పెట్టడంతో.
సాక్షి, నల్గొండ: తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామానికి చెదిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాలు.. గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను భాను అదే గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్ను రద్దు చేసిన హైకోర్టు -
ప్రేమ పెళ్లి, గల్ఫ్ వెళ్లి ఏడాది కిందట వచ్చాడు.. ఏమైందో గానీ
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం): ఇద్దరూ ప్రేమించుకున్నా రు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కలకాలం తోడుంటాడని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె ప్రాణం తీ శాడు. ఏ చేత్తో తాళి కట్టాడో అదే చేతితో భార్య ను హతమార్చాడు. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామం కుమ్మరి వీధికి చెందిన నర్సింగ బెహరా మూడేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన భవానీ బెహరా(25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత గల్ఫ్ వెళ్లిన నర్సింగ ఏడాది కిందట మళ్లీ స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఒక గుడిసెలో కాపురం ఉంటున్నారు. ప్రేమ వివాహమే అయినా నర్సింగ తరచూ భార్యతో గొడవపడేవాడు. అత్తామామలతోనూ సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నర్సింగ సహనం కోల్పోయి ఇంటిలో ఉన్న డ్రిల్లింగ్ మిషన్ ఆన్ చేసి కర్కశంగా దాడి చేశాడు. దీంతో ఆమె ముఖమంతా నుజ్జునుజ్జైపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను హుటాహుటిన ఇచ్ఛాపురం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అక్కడి నుంచి బరంపురం రిఫర్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవానీ మృతి చెందింది. ఈ విష యం తెలుసుకున్న భర్త ఇంటి వద్ద బ్లేడ్తో గంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడిని 108లో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసు గల ఓ కుమారుడు ఉన్నాడు. సీఐ డీవీవీ సతీష్బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర! -
టిక్టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
సాక్షి, తిరుపతి: భర్త మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేదు భార్య. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భర్తకు ప్రియురాలిని ఇచ్చి భార్య దగ్గరుండి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో జరిగింది. టిక్టాక్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. వెతుక్కుంటూ వచ్చిన యువతితో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. ఈ అరుదైన వివాహం గురించి తెలుసుకుందాం రండీ... డక్కిలి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్టాక్లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు.. ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది. కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు.. తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్! -
ఆ యువతితో ఉన్న 10 రోజులు మరుపురానివి.. తల్లిదండ్రులు..
వేలూరు (చెన్నై): రాణిపేట జిల్లా వాలాజ పేట మండపం వీధికి చెందిన శక్తివేల్(26) సుంగాసత్రంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమించి.. ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చర్చించుకుని ఇద్దరిని ఒకటిగా చేర్చారు. ఇటీవల భార్యతో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో చేరేందుకు బస్సులో వెళ్లాడు. గమనించిన యువతి బంధువులు కారులో వెంబడించి శక్తివేలుపై దాడి చేసి యువతిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీటిపై శక్తివేల్ వాలాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి మనో వేదనతో ఉన్న శక్తివేల్ ఇంటిలో ఓ లేఖ రాసి పెట్టి ఎలుకల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వేలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన శక్తివేల్ ఇంటిలో ఒక లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో తన వివాహానికి సాయం చేసిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తాను యువతితో జీవించిన 10 రోజులు మరుపురానివని, అయితే వారి తల్లిదండ్రులు ఇంతటి దారుణం చేస్తారని అనుకోలేదని వాపోయినట్లు తెలుస్తోంది. చదవండి: (స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ) -
ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..
నాది కాని జీవితానికి నన్ను బానిసను చేశావు నన్ను నన్నుగా మెచ్చి నాలో ఆశలు రేపావు నా నవ్వులో దాగిన నువ్వు.. నన్ను నలుగురిని కలిపింది నువ్వున్నావన్న నమ్మకమే.. నన్ను నన్నుగా నిలిపింది నీవు లేని జీవితం వ్యర్థమని.. నిన్ను విడిచి వెళ్లనని అంతులేని కలగా మిగిలిపోయావు నువ్వు లేని ఈ బతుకు వ్యర్థం... అందుకే నేనూ వస్తున్నా... అంటూ భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన గురువారం సాయంత్రం కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): స్థానిక శంకరప్ప తోటకు చెందిన నాగరాజు, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గణేష్ (23) బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బేల్దారి పని కోసం కర్ణాటకలోని వైఎన్హెచ్ కోటకు వెళ్లాడు. ఆ సమయంలో గగనశ్రీ (24)తో అతనికి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం గగనశ్రీని తల్లిదండ్రులు మంగళూరులోని ఏజే ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించారు. విషయం తెలుసుకున్న గణేష్ కూడా మంగళూరుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం అక్కడే కాపురమున్నారు. పెద్దలకు తెలియకుండా గగనశ్రీ బీటెక్ ద్వితీయ సంవత్సరం మధ్యలో ఆపేసి ఐదు నెలల క్రితం భర్తతో కలసి కళ్యాణదుర్గానికి వచ్చేసింది. జ్వరం బారిన పడి... ఇటీవల గగనశ్రీ జ్వరం బారిన పడింది. స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో చేర్పించారు. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి. జ్వరం తీవ్రత పెరుగుతుండడంతో పరీక్షించిన వైద్యులు ఆమె డెంగీతో బాధపడుతున్నట్లు ఈ నెల 6న గుర్తించారు. విషయాన్ని గణేష్కు తెలపడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గణేష్ కుటుంబసభ్యులే తమ కుమార్తెను చంపేశారంటూ గగనశ్రీ తల్లిదండ్రులు నాగరాజు, హనుమక్క కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?') ట్రూ లవ్ నెవర్ ఎండ్స్ నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదు అనే నానుడిని గణేష్ నిజం చేశాడు. తన భార్య అనారోగ్యంతో మృతి చెందిదన్న విషయాన్ని జీర్ణించుకోలేని అతను గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులతో ఆస్పత్రి ఆవరణం కిక్కిరిసింది. రోదనలు మిన్నంటాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరినీ తీసుకెళ్లావా.. దేవుడా ఎంత పని చేశావంటూ రోదిస్తుండడం అందరినీ కలిచివేసింది. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ
సాక్షి, జనగామ: ప్రేమించిన అమ్మాయితో వివాహానికి ఎకరం భూమి ఇవ్వాలని ఆమె తండ్రి డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన ప్రేమికుడు, అతని తల్లి పురుగుల మందు తాగారు. ఈ సంఘటనలో ప్రేమికుడు కన్నుమూయగా..అతని తల్లి ప్రాణాపాయం నుంచి బయట పడింది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు..జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన దండు సాయికుమార్(24), గోపిరాజుపల్లికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. గత మే 13న పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో సాయికుమార్ దంపతులు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉభయుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు.. తన ఇంటి దగ్గరే వివాహం ఘనంగా చేస్తామని చెప్పి కూతుర్ని తీసుకెళ్లారు. ఈనెల 1న అమ్మాయి భర్తకు ఫోన్చేసి తనను తీసుకెళ్లాలని కోరగా, 3న సాయికుమార్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించగా.. తన కూతురును సాయి పోషించలేడని, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈనెల 4న సాయికుమార్ అన్న దండు బాబు, అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తన కూతురు పేరిట ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేయాలని తండ్రి డిమాండ్ చేయగా, అందుకు సాయికుమార్, అతని అన్న బాబు అంగీకరించారు. కాగా, పెద్ద మనుషుల మాటలతో మనస్తాపానికి గురైన సాయి తల్లి అక్కమ్మ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగు మందు తాగింది. దాంతో వేదనకు గురైన సాయి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా సాయికుమార్ చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లి ప్రాణా పాయం నుంచి బయటపడింది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. సాయికుమార్ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు పోలీసులు పెద్దపహాడ్ గ్రామంలోనే ఉన్నారు. -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి.. కట్చేస్తే రెండేళ్ల తర్వాత..
తిరువళ్లూరు (చెన్నై): ఫేస్బుక్లో పరిచయమైన దాదాపు రెండేళ్ల ప్రేమ వ్యవహరాన్ని నడిపి కులాంతర వివాహం చేసుకున్న యువతిని అత్తారింటి వాళ్లు గెంటేయడంతో న్యాయం చేయాలని బాధిత యువతి ఎస్పీ పకెర్లా సెఫాస్ కల్యాణ్కు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం యూనియన్ విరయూర్ గ్రామానికి చెందిన అంథోనిరాజ్ కుమార్తె అన్బరసి(25). ఇంజినీరింగ్ పూర్తి చేసి పెరంబలూరులోని ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పని చేసేది. 2018లో ఫేస్బుక్ ద్వారా తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడు యూనియన్ చిన్నకలకాటూరు గ్రామానికి చెందిన జయరామన్ కుమారుడు లక్ష్మణన్ పరిచయమయ్యాడు. రెండేళ్ల ప్రేమించుకున్న అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి మార్చి13, 2020న తిరువళాంగాడులోని ప్రైవేటు కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. వీరికి ప్రస్తుతం రష్మిక(01) అనే కూతురు వుంది. వివాహం సమయంలో రూ.1.30 లక్షల నగదు, పది సవర్ల బంగారు నగలు కట్నంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వివాహమైన కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కుటుంబంలో కులాంతర చిచ్చు రేగింది. వినతిపత్రం చూపుతున్న అన్బరసి అన్బరసి దళిత కులానికి చెందిన యువతి కావడంతో ఆమెకు ప్రత్యేక గ్లాస్, ప్లేటును ఇచ్చి ప్రత్యేక గదిలో ఉంచి వేధింపులకు గురి చేశారు. తరచూ కులం పేరుతూ దూషిస్తుండడంతో ఆరు నెలల క్రితం బాధితురాలు తిరుత్తణి మహిళ పోలీసు స్టేషన్ను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి జీవించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అన్బరసిపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులు మరో సారి దాడికి దిగారు. దీంతో బాధితురాలు మంగళవారం ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. తనను, కూతురిని కులం పేరుతో దూషిస్తున్నారని, తిండి పెట్టకుండా వేధిస్తున్నారని, భర్త లక్ష్మణ్, అత్త దేవకితో పాటు మరో ఐదు మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేసిన వీడియోను సైతం ఎస్పీకి అందించింది. ఈ సంఘటనపై స్పందించి తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి పోలీసులను ఎస్పీ ఆదేశించారు. చదవండి: (వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..) -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబ్నగర్: పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమజంట పురుగు మందు తాగిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం ఎత్తంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన గోలగుంట సాయికుమార్(22) అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి తరపు కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న సాయికుమార్ ఆందోళన చెంది పురుగు మందు తాగాడు. కుటుంబీకులు కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయంలో రెండు కుటుంబాల వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఎస్ఐ నరేందర్రెడ్డిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. చదవండి: ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
షాకింగ్ లవ్స్టోరీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న 'ఇద్దరమ్మాయిలు'
చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళ బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇద్దరు తమ తండ్రుల ఒడిలో కూర్చుని పూలదండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుబిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్కు చెందిన టీనా దాస్. ఈ వివాహానికి తమ కుటుంబసభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని సుబిక్ష ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈమె తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరీలో సెటిల్ అయ్యారు. సుబిక్ష భార్య టీనా దాస్ బంగ్లాదేశ్లోని కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఈమె కూడా కల్గేరీలోనే నివసిస్తున్నారు. ఆరేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెద్దలను ఒప్పించడానికి ఇంత సమయం పట్టిందని సుబిక్ష చెప్పారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో తమ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చార్టెట్ అకౌంటెంట్గా పనిచేస్తున్న సుబిక్ష.. తాను బైసెక్సువల్ అని నిర్మొహమాటంగా చెప్పింది. 19 ఏళ్ల వయసులోనే తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపింది. మాకు అప్పటిదాకా తెలియదు.. సుబిక్ష తల్లి పూర్ణపుష్కల కల్గేరీలో ప్లే స్కూల్ను నడుపుతున్నారు. తాను మదురైలో పెరిగానని, తర్వాత ఖతార్లో కొన్నాళ్లు నివసించినట్లు ఆమె వెల్లడించారు. కెనడా వెళ్లిన తర్వాతే తమకు ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసిందని వివరించారు. సుబిక్ష ప్రేమ విషయం తెలిస్తే బంధువులు, స్నేహితులు తమను ఎక్కడ దూరం పెడతారో అని భయం వేసిందని చెప్పారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలియక తల్లిందడ్రులు తనను అర్థం చేసుకోలేకపోయారని టీనా దాస్ వెల్లడించారు. తనకు ఏదో వ్యాధి ఉందనుకున్నారని పేర్కొన్నారు. పెళ్లయితే అన్నీ సర్ధుకుంటాయని భావించి 19 ఏళ్ల వయసులో తనకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారని వెల్లడించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. సుబిక్షను కల్గేరీలోనే కలిసినట్లు వివరించారు. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. ఆర్నెళ్లకే మనస్పర్థలు రావడంతో
సాక్షి, వరంగల్: ప్రేమించుకున్న వారిద్దరినీ వివాహ బంధం ఒక్కటి చేసింది. ఆతర్వాత మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకున్నాడు. ఎస్సై గుగులోతు వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి రజినీకాంత్(29) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రజినీకాంత్ కూలీ పనులు, బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2017లో శివనగర్కు చెందిన యువతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఆర్నెళ్లకే భార్య, భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. గొడవలు తీవ్రతరం కావడంతో 2021లో విడాకులు పొందారు. ప్రేమించిన అమ్మాయి దూరమవడంతో రజినీ కాంత్ మనస్తాపానికి గురై తాగుడుకు బానిసయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: మైనర్పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..
చెన్నై: ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తక్కువ కులానికి చెందిన యువతిగా తెలియడంతో గెంటేసిన భర్తను మూడు నెలల తరువాత పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తన్నీర్కులం గ్రామానికి చెందిన మోహన్ కుమార్తె దివ్య(26) ఈకాడులోని పాత సామాన్లు విక్రయించే దుకాణంలో పని చేసింది. అదే దుకాణంలో తూత్తుకుడి జిల్లా తెన్తిరుపేరై గ్రామానికి చెందిన చిత్రవేలు కుమారుడు శివనైంద పెరుమాల్(29) పని చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 24న దివ్యను తూత్తుకుడికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలానికి ఎస్టీ కులానికి చెందిన యువతిగా తెలియడంతో అత్తింటివారు వేధించడంతో పాటు ఇంటి నుంచి గెంటేశారు. విధి లేని పరిస్థితుల్లో అక్కడే తలదాచుకున్న యువతి, స్థానికుల సాయంతో అల్వార్ తిరునగరి పోలీసులు, శ్రీవైకుంఠం మహిళా పోలీసులను ఆశ్రయించింది. అప్పట్లో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాక యువతికి అత్తారింటి వేధింపులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. చదవండి: (వివాహేతరం సంబంధం తెలిసి హెచ్చరించాడు.. పసరు కోసం వెళ్తే..) ఈ నేపథ్యంలో భర్త సైతం యువతిని అక్కడే వదిలేసి చెన్నై పల్లావరంలోని అక్క ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో యువతి తన బంధువుల సాయంతో గత మే నెలలో తూత్తుకుడి నుంచి తన సొంత గ్రామానికి చేరుకుని తిరువళ్లూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి వివాహం చేసుకోవడంతో పాటు కులం పేరుతో ధూషించి గెంటేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ శక్తివేల్ నేతృత్వంలో తూత్తుకుడి వెళ్లి మూడు నెలలుగా పరారీలో ఉన్న శివనంద పెరుమాల్ను అరెస్టు చేసి తిరువళ్లూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’) -
కూతురు ప్రేమపెళ్లి.. హాజరుకాని భార్య.. తిరిగి ఇంటికి రావడంతో...
చెన్నై: కూతురు ప్రేమ వివాహం ఓ తల్లి హత్యకు కారణమైంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తాండరామ్ పట్టు సమీపం పుదుచెక్కడి పంచాయతీ జాంబొడై గ్రామానికి చెందిన పళని (47). ఇతని భార్య రాణి (43). వీరికి రాజపాండి (24), శివ (22) అనే ఇద్దరు కుమారులు, భరణి (21) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో భరణి మదురైకి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. సోమవారం పళని బంధువులు వారికి ప్రేమ వివాహం జరిపించారు. రాణికి ఈ విషయం నచ్చకపోవడంతో వివాహానికి హాజరుకాలేదు. ధర్మపురి జిల్లా కోటపట్టిలోని సోదరి ఇంటికి వెళ్లి మంగళవారం వచ్చింది. కుమార్తె వివాహానికి హాజరు కాకపోవడంపై రాణితో పళని గొడవపడ్డాడు. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసి పళణిని అరెస్టు చేశారు. చదవండి: (స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
సాఫ్ట్వేర్ లవ్స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..
సాక్షి, తిరుపతి: రక్షణ కల్పించాలంటూ తిరుపతి ఎస్పీని ప్రేమ జంట ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రులు నుండి తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అంగీకరించలేదు. చంద్రగిరి మండలం మల్లయ్యగారి పల్లికి చెందిన పవన్, అదే గ్రామానికి చెందిన నీరజను ప్రేమించి బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రగిరి పోలీస్స్టేషన్లో యువతిపై మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును విచారించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? -
పక్కా ప్లాన్! జెండా వందనం చేశాక మాట్లాడాలని పక్కకు పిలిచి..
చిగురుమామిడి(హుస్నాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానమే పెనుభూతమై స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేశాక కత్తితో భార్య గొంతు కోసి, కడతేర్చాడు ఓ భర్త.. ఈ ఘటన చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేవపట్నం మండల కేంద్రానికి చెందిన అరెపల్లి రవి–యాదమ్మ దంపతుల పెద్ద కూతురు శిరీష. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్ డిగ్రీ, శిరీష(27) ఇంటర్ చదివారు. చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ప్రవీణ్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, పెద్దల సమక్షంలో 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు శరణ్య, కుమారుడు శశివర్దన్ ఉన్నారు. 2018లో శిరీష అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలం తన విధులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించింది. ఈ క్రమంలో గత 6 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ నిత్యం శిరీషను అనుమానించేవాడు. విచక్షణారహితంగా కొట్టేవాడు. భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. (చదవండి: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. ఎంతకూ మాట వినకపోవడంతో తోటి హిజ్రాలతో కలిసి..) పెద్ద మనుషులు ఒక్కటి చేసినాగొడవలు ఆగలేదు.. నిత్యం గొడవలు పడుతున్న వీరిని పెద్ద మనుషులు ఒప్పించి, ఒక్కటి చేశారు. దీంతో కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శిరీష 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. కోర్టును ఆశ్రయించి, భర్త ప్రవీణ్కు విడాకుల నోటీసు పంపించింది. కేశవపట్నం పోలీస్స్టేషన్లోనూ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 45 రోజులు అంగన్వాడీ విధులకు హాజరు కాలేదు. అధికారుల మందలింపుతో ఈ నెల 3 నుంచి తన తండ్రి రవిని వెంట తీసుకొని, కేశవపట్నం నుంచి బైక్పై అంగన్వాడీ సెంటర్కు వస్తోంది. అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. శిరీషను చంపాలని ప్రవీణ్ పథకం వేశాడు. ఇందుర్తిలో అతనికి ఇల్లు ఉన్నా అంగన్వాడీ సెంటర్ పక్కన మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అవకాశం కోసం చూసిన ప్రవీణ్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన పథకాన్ని అమలు చేశాడు. వివరాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సైలు చంపవద్దని బతిమిలాడినా వినలేదు సోమవారం స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన శిరీషను ప్రవీణ్ జెండా వందనం పూర్తయ్యాక మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువకుడిపైనా అదే ఆయుధంతో దాడి చేసి, గాయపరిచాడు. తననేమీ చేయొద్దని శిరీష ఎంత బతిమిలాడినా వినకుండా ప్రాణాలు తీశాడు. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ను పట్టుకునేలోపే పారిపోయి, చిగురుమామిడి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని తిమ్మాపూర్ సీఐ శశిధర్రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్రావు ఆస్పత్రికి వెళ్లి, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె బంధువులతో మాట్లాడారు. మృతురాలి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. (చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి) -
స్కూల్లోనే ఆమెను ప్రేమించాను.. లవ్స్టోరి సీక్రెట్ చెప్పిన తేజస్వీ
Tejashwi Yadav's Comments On Wife Rachel Godinho.. బీహార్లో అనూహ్య పరిస్థితుల మధ్య నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం, సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తేజస్వీ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన భార్య.. రాచెల్ గొడిన్హో(రాజ్ శ్రీ)తో ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన లవ్ ట్రాక్ గురించి తేజస్వీ యాదవ్.. తన తండ్రి లాలూ ప్రసాద్కు..‘ఈ(రాచెల్) అమ్మాయితో నేను డేటింగ్ చేస్తున్నాను. ఈమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాచెల్.. క్రిస్టియన్’ అని చెప్పాను. ఆ సమయంలో మా నాన్న(లాలూ ప్రసాద్) ఓకే, నో ప్రాబ్లమ్ అన్నట్టుగా తమ పెళ్లికి ఆమోదం తెలిపారంటూ తేజస్వీ చెప్పుకొచ్చారు. అలాగే.. తన భార్య రాచెల్ వివరాలు చెబుతూ.. హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన ఆమె.. తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్ అని.. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచిందన్నారు. ఇక, తమ పెళ్లి తర్వాత రాచెల్ హిందుత్వంలోకి మారిందని.. అప్పుడే తన పేరును రాజ్ శ్రీగా మార్చుకుందని జాతీయ మీడియాలో కథనాల్లో పేర్కొన్నారు. కాగా, లాలు, రబ్రీదేవి దంపతులకు తొమ్మిది మంది సంతానం ఉన్నారు. వారిలో తేజ్ప్రతాప్, తేజస్వి యాదవ్ అబ్బాయిలు కాగా, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరిలో చిన్నవాడు తేజస్వీ యాదవ్. ఇక, తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. -
రష్యా వరుడు, ఉక్రెయిన్ వధువు.. ధర్మశాలలో ఒక్కటైన ప్రేమజంట
యుద్ధమంటే మనిషికీ, మనిషికీ మధ్య విభజన రేఖ. ప్రేమతో ఆ విభజన రేఖను చెరిపేశారు రష్యా యువకుడు, ఉక్రెయిన్ యువతి. ఆరు నెలలుగా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ఆ ద్వేషాన్ని ప్రేమతో జయించొచ్చని నిరూపించారు రష్యాకు చెందిన సెర్జెయ్ నొవికోవ్ ఇజ్రాయెల్లో స్థిరపడ్డాడు. ఉక్రెయిన్కు చెందిన ఎలోనా బమ్రోకా. వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది కాలంగా హిమాచల్ప్రదేశ్లోని ధరంకోట్లో నివాసం ఉంటున్నారు. అయితే ధర్మశాలలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు సొంత ఇంటిదగ్గరే ఉన్నామన్న భావన కలిగించేలా స్థానికులే సంప్రదాయ క్రతువులన్నీ పూర్తి చేశారు. జానపద నృత్యాలతో పండుగను తలపించారు. ధర్మశాల సమీపంలోని దివ్య ఆశ్రమ్ ఖరోటాలో పండితుడు సందీప్ శర్మ వేద మంత్రాలు చదువుతుండగా ఇద్దరూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారి పొరుగునే ఉంటున్న వినోద్ శర్మ... కన్యాదానం చేశారు. పెళ్లికి వధూవరుల మిత్రులు కూడా హాజరై విదేశీ పెళ్లిని పక్కా దేశీ స్టైల్లో ఘనంగా జరిపించారు. చదవండి: 42 అడుగుల గోళ్లు.. గిన్నిస్ రికార్డు బద్దలు -
సినిమాను తలపించిన లవ్స్టోరీ.. పెళ్లి.. కిడ్నాప్.. ఛేజింగ్..
మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం మోర్రిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కిడ్నాప్ కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన యువతి లక్ష్మిని జన్నారం మండలం మోర్రిగూడెం గ్రామానికి చెందిన కోట నాగేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు మోర్రిగూడ గ్రామంలోని అబ్బాయి ఇంటిలోకి చొరబడి అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎస్సై సతీష్.. కిడ్నాప్ వాహనాలను వెంబడించి దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద మూడు వాహనాలను, 17 మంది నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. -
మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని
సాక్షి, కరీంనగర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా వద్దని బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. ఆ సమయంలో అక్కడే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కరీంనగర్కు చెందిన ఎండీ.ఫారూఖ్ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఫారూఖ్ మతం మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. అయిపోయిందేదే అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది. నిరసన తెలుపుతున్న దుర్గ మొదటి భార్యతో కలిసి వేధింపులు.. ఫారూఖ్తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. తాను పని చేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు. అలుగునూర్లో ఉంటున్నట్లు తెలుసుకొని.. ఫారూఖ్ ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్లు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు -
తమిళ్సెల్వి అదృశ్యం కేసు విషాదాంతం.. అస్థిపంజర స్థితిలో మృతదేహం
సాక్షి, చెన్నై/తిరుపతి: తమిళనాడుకు చెందిన తమిళ్సెల్వి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. నారాయణవనం కైలాసనాథకోన అడవిలో శవమై కనిపించింది. కట్నం కోసం వేధించి, అందుకు భార్య అంగీకరించిక పోవడంతో హత్య చేశాడు. ఆపై తప్పించుకోవాలని చూశాడు. తమిళ్సెల్వి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. వివరాలు ఇలా.. తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని పుజిల్కు చెందిన తమిళ్సెల్వి(18) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. చెన్నై రెడ్హిల్స్లో మెకానిక్గా పనిచేస్తున్న మదన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సంసారం సజావుగా సాగింది. వరకట్నం తేవాలంటూ మదన్ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో జూన్ 25న తమిళ్సెల్విని తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసనాథకోనకు తీసుకొచ్చాడు. కత్తితో పొడిచి హతమార్చాడు. అయితే చాలా కాలంగా కుమార్తె కనిపించకపోవడంతో తమిళ్సెల్వి తల్లిదండ్రులు బల్గిత్, మాణిక్యం రెడ్హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మదన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. చదవండి: ప్రేమ పెళ్లి, మూడేళ్లు సంసారం.. బయటకు వెళ్దామని తీసుకెళ్లి.. దీంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం తమిళనాడు పోలీసులు నారాయణవనం పోలీసుల సహాయంతో కైలాసనాథకోనలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. జూన్ 23వ తేదీ వీరిద్దరూ కొండపైకి వెళ్లినట్లు, కొంత సమయానికి మదన్ ఒక్కడే కొండ నుంచి కిందకు వచ్చి మోటార్సైకిల్పై వెళ్లినట్లు గుర్తించారు. స్థానికుల సాయంతో గాలించగా అస్థిపంజర స్థితిలో తమిళ్సెల్వి మృతదేహం కనిపించింది. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని నారాయణవనం ఎస్ఐ పరమేశ్నాయక్ తెలిపారు. కాగా మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడమే కాకుండా తాగుడు, గంజాయికి బానిసైన మదన్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిడండ్రులు కోరారు. -
వీడని మిస్టరీ.. పోలీసులకే సవాల్
తిరువళ్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు సంసారం చేశాడు. ఆ తరువాత వరకట్నం కోసం భార్యను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో భార్యను చిత్తూరు జిల్లా నారాయణవనం కైలాసకోనకు తీసుకెళ్లాడు. హతమార్చి మృతదేహం కనిపించకుండా మాయం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం ప్రాంతానికి చెందిన మదన్, తమిళ్సెల్వి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం, వరకట్నం వేధింపుల వైపు వెళ్లింది. వరకట్నం తేవాలంటూ మదన్ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గత జూన్ 25న తమిళ్సెల్వి మాయమైంది. దీంతో ఆందోళన చెందిన తమిళ్సెల్వి తల్లిదండ్రులు మణిగండన్, పల్గీస్ సెంగుడ్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అసిస్టెంట్ కమిషనర్ మురుగేషన్, ఇన్స్పెక్టర్ రమేష్ తమిళ్ సెల్వి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కైలాసకోన వైపు కదిలిన కేసు విచారణలో భాగంగానే పోలీసులు మదన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గత నెలలో తమిళ్సెల్వితో కలిసి చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసకోనలోని కొండపైకి వెళ్లానని, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిపాడు. కోపంలో కత్తితో తమిళ్సెలి్వని దారుణంగా పొడిచానని, తీవ్రంగా గాయపడడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. ఆంధ్రాలో పోలీసుల దర్యాప్తు మదన్ ఇచ్చిన వాగ్మూలంతో సెంగుండ్రం పోలీసుల బృందం 20 రోజుల క్రితం కైలాసకోనకు వెళ్లింది. నారాయణవనం పోలీసుల సాయంతో కైలాసకోన కొండపై గాలించారు. ఫలితం కనిపించలేదు. అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కొండపైకి తమిళ్సెలి్వ, మదన్ జంటగా వెళ్లినట్టు నిర్ధారించారు. సుమారు రెండు గంటల తరువాత మదన్ ఒంటరిగా వచ్చినట్లు వీడియోలో రికార్డయింది. కానీ మృతదేహాం కనిపించకపోవడంతో విచారణలో పురోగతి కనిపించలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసినా ఫలితం కనిపించలేదు. గత నెలలో మదన్ ఫోన్లో ఎక్కువ సార్లు మాట్లాడిన సంతోష్, బందారవిని సైతం విచారణ చేశారు. అయినా తమిళ్సెల్వి ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇది కూడా చదవండి: గర్ల్ఫ్రెండ్ కోసం డబ్బులు కావాలని ఏటీఎం చోరికీ ప్లాన్.. -
ప్రేమ జంట ఆత్మహత్య
అబ్దుల్లాపూర్మెట్: తమ పెళ్లికి పెద్దలు అంగీకరంచరేమోననే భయంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రమాదేవి పబ్లిక్ స్కూల్ వెనకాల రెండు మృతదేహాలు ఉన్నాయన్న సమాచారం మేరకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ యువతి, యువకుడి మృతదేహాలను పరిశీలించారు. సంఘటనా స్థలంలో లభించిన టీఎస్ కాప్ అప్లికేషన్ పత్రాలు, బైక్, సెల్ఫోన్ ఇతర ఆధారాల సాయంతో వివరాలు సేకరించారు. మృతులిద్దరూ నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలెపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పోలెపల్లికి చెందిన వెంకటయ్య కుమారుడు సతీష్ బైక్ మెకానిక్. వీరి ఇంటి సమీపంలో ఉండే శంకర్ కూతురు శిరీష (23) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోననే అనుమానంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లాపూర్మెట్ శివారులోని ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!) -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..
మైసూరు: ప్రేమించి పెళ్లాడిన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం పెడుతున్న వేధింపులను తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోణి హెచ్.డి.కోటె తాలూకాలోని మచ్చూరుకి చెందిన ఆనంద్ భార్య జ్యోతి (22). వీరు నాలుగేళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దానిని మనసులో పెట్టుకొని అత్తమామలు కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించేవారు. ఈ విషయం ఆమె.. భర్తకు చెప్పినా పట్టించుకునే వాడు కాదు. ఈ క్రమంలో జ్యోతి విరక్తి చెంది రెండు రోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరకుని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి -
ప్రేమ జంటలను ఇలా కాపాడుకోవచ్చు..
కులం, మతం, తెగ అనే వివిధ సముదాయాల లోపలే పెళ్లిళ్ళు జరగాలి అని కోరుకునే సంస్కృతి బలంగా ఉన్న దేశం మనది. సముదాయానికి బయట ఉండే మనుషుల పట్ల ఇష్టాలు, ప్రేమలు అనేకం వివాహం వరకు పోకపోవడానికి ఈ సంస్కృతే కారణం. అదేమీ గొప్ప సాంస్కృతిక విలువ కాదు. సము దాయం లోపలి పెండ్లి అన్ని తీరులా గొప్పదీ, సముదాయం బయట పెండ్లి అనేక తీరుల్లో మంచిది కాదూ అనేది తప్పుడు ఆలోచన. ఒకటి మాత్రం వాస్తవం. ఇటువంటి వివాహాలను మెచ్చుకుని ఒప్పుకునే వాతావరణం మన దగ్గర పెరగలేదు. అందునా విలోమ వివాహాల పట్ల మరింత వ్యతిరేకత ఉన్నది. ఈ తరహా వివాహాలు మనుగడ సాగించాలంటే కొన్ని ప్రధాన కార్యక్రమాలు వివిధ స్థాయిల్లో జరగాలి. చదవండి: సర్కారీ కొలువుల జాతర సముదాయాంతర వివాహాలను కాపాడుకోవడంలో ముందుగా వివాహం చేసుకున్న జంటకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారు ఆ బాధ్యతను నెరవేర్చుకునే దానికి సహ కారం, సలహాలు, మద్దతును కూడగట్టుకోవాలి. సామాజిక కట్టుబాట్ల సరిహద్దు దాటిన జంటలు తొలి మూడు నాలుగు ఏండ్లు చాలా జాగ్రత్తగా, మెలకువగా మసలుకోవాలి. సామా జిక కట్టుబాట్లను ఉల్లంఘించి ఏర్పడిన జంట, హింసకు గురి కాగల, ఒక ప్రమాదాన్ని ఎదుర్కొనే అల్ప సంఖ్యాక జంటగా మారుతుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ జంట మీద సామజిక కట్టుబాట్ల పరిరక్షకులుగా ఉండే హింసాత్మక మెజారిటీ వర్గంవారు వివిధ రూపాలలో దాడి చేసే అవకాశం ఉంటుంది. ముందుగా వారు వేరే ఎవ్వరి మీద ఆధారపడకుండా మెరుగుగా, తమ సంసారాన్ని గడిపే దానికి కావలిసిన రోజువారీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టాలి. రెండు మూడు ఏండ్ల వరకు ఇటువంటి జంటలు పిల్లలను కనకుండా జాగ్రత్త పడాలి. వివాహంలో సామాజిక అంశాలు ఉంటాయి, కానీ వివాహం ముఖ్యంగా జంట వ్యక్తిగత వ్యవహారమనేది మరిచిపోకూడదు. ఆడపిల్లను ఆస్తిగా, గౌరవంగా, కుల మత, తెగ పవిత్రతను, పరిశుద్ధతను రక్షించే క్షేత్రంగా చూసే దృష్టి ప్రతి సముదాయంలో బలంగా ఉంది కనుక... సము దాయ కట్టుబాట్లు దాటిన వివాహాలలో జంటలకు ఆడ వారి బంధువుల నుండి ప్రమాదం అతి ఎక్కువగా ఉంటున్నది. ఈ వాస్తవాన్ని జంటలు గమనంలో ఉంచుకోవాలి. సముదాయాంతర వివాహాల పట్ల సానుకూలంగా ఉండే వారు, తాము నివాసం ఉంటున్న చోట తమవంటి వారితో కలుస్తూ ఉండాలి. ఒక భావ సారూప్య బృందంగా లేక కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్గా రూపొందాలి. ప్రతి చిన్న ప్రాంతంలో ఇటువంటి వివాహాల మద్దతు బృందాలు ఏర్ప డాలి. తమ ఎరుకలో ఉండే అటువంటి జంటలకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇలాంటి బృందాలు ఉన్నాయన్న విషయం బాగా ప్రచారం కావాలి. సముదాయాంతర జంట లకు సహకరించే నెట్వర్క్ ఉంది అని నమ్మకాన్ని ఇవ్వడం ముఖ్యం. అట్లనే అటువంటి జంటలు ఎదుర్కొనే ఎమో షనల్ సమస్యలను తట్టుకునేదానికి సలహాలు ఇచ్చే ఏర్పాటుగా ఈ సామాజికుల బృందం ఉండాలి. వామపక్ష ఉద్యమాలు తరచుగా సముదాయం బయటి వివాహాలను ప్రోత్సహించినాయి. ఇప్పుడు బాగా ప్రాచు ర్యంలో సాగుతున్న గుర్తింపు ఆధారిత ఉద్యమాలు– అందునా పీడిత సముదాయాల సామూహిక శక్తిని పెంపు చేసే దానికి నడుస్తున్న ‘గుర్తింపు– సయోధ్య’ (ఐడెంటిటీ– అలయన్స్) అనే సూత్రం పునాదిగా సామాజిక క్షేత్రంలో ఉద్యమాలు చేస్తున్నవారు సముదాయాంతర వివాహాల వైపు తమ తమ అనుయాయులకు అవగాహన కలిగించాలి. తమ సొంత సముదాయాలు దాటి పెళ్లి చేసుకోవడాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయన్న నమ్మకం ప్రజల్లో కలిగిం చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి వావాహాలను ప్రోత్సహిస్తూ... కొన్ని ప్రోత్సాహ కాలు ఇస్తున్నప్పటికీ అవి చాలవు. ఈ వివాహాల పరిరక్షణకు అవసరమైన చట్ట పర, పాలనాపర, విధానపర ఏర్పాట్లు ఉండాలి. ఇప్పటికే ఉన్న ఇటువంటి వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణనిచ్చే చట్టాల గురించీ, వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ పథకాల గురించీ విస్తృత ప్రచారం కల్పించాలి. ఈ జంటలు తమకు మతం లేదు కులం లేదు అని ప్రకటించు కోదలిస్తే... అటు వంటి పత్రాలు ఇచ్చే ఏర్పాటు ఉండాలి. ప్రమాదంలో ఉన్న జంటలకు రక్షణ కల్పించడానికి పోలీ సులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రసార మధ్యమాలలో పనిచేసే వారికి సముదాయం బయట జరిగే వివాహాల ప్రాధాన్యత, అవి ఎదుర్కునే సమస్యల గురించిన అవగాహన ఉండాలి. సముదాయం బయట జరిగిన పెళ్లి... హత్యలకో, మరో రకం హింసలకో దారి తీసినప్పుడు మాత్రమే అది వార్త అనుకునే దుఃస్థితి ఈ రోజు ప్రసార మాధ్యమాలలో ఉంది. ప్రసార మాధ్యమా లలో పనిచేసే వారికి, సముదాయం దాటి చేసుకునే వివా హాలకు సానుకూలంగా ఉండే నిరంతర అవగాహన కార్య క్రమాలు ఉండాలి. ఇలాంటి వివాహాలు చేసుకుని విజయవంతంగా జీవితం గడుపుతున్న వివాహితుల గురించిన శీర్షికలు, పరి చయ కార్యక్రమాలు విరివిగా పత్రికలు, టీవీల్లో రావాలి. వాస్తవానికి సముదాయానికి బయట వివాహం చేసు కోవడం ప్రతి సందర్భంలోనూ హింసతో ముగిసిపోవడం లేదు. అటువంటి చాలా వివాహాలు విజయవంతంగా సాగుతూ ఉంటాయి. ఈ అంశానికి తగిన ప్రచారం ప్రసార మాధ్యమాలు ఇవ్వాలి. కుల, మత, జాతి భేదాలు చూడకుండా నచ్చినవారిని వివాహం చేసుకునే వివాహాలు నాలుగు కాలాల పాటు మనుగడ సాగించాలంటే.. జంటల వ్యక్తిగత స్థాయిలోనే కాక, పౌర సమాజం, ప్రభుత్వ స్థాయిల్లో అప్రమత్తత. మద్దతు, రక్షణ ఉండాలి. సమాచార ప్రచార మాధ్యమాల తోడ్పాటూ ఎప్పటికప్పుడు అందాలి. హెచ్. వాగీశన్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా -
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లికి చెందిన ఓదెలు కుమారుడు నారుకట్ల రమేష్ (26) బీటెక్ పూర్తి చేసి గచ్చిబోలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. చదువుకునే సమయంలో స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గురువారం ఘట్కేసర్–చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
3 నెలల కిత్రమే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి.. భర్తతో గొడవపడి
సాక్షి, రంగారెడ్డి: తల్లిదండ్రులు లేనిది చూసి ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, పుల్జాల గ్రామానికి చెందిన బులిగం బాలరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ సమీపంలో నివాసం ఉండేవారు. బాల్రాజ్కు సాగరిక అనే కుతురు ఉంది. మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ఎడ్ల అంజి అనే యువకుడిని ప్రమ వివాహం చేసుకుంది. అప్పట్లోనూ మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఉప్పునుతల మండలం, అయ్యవారిపల్లిలో నివాసం ఉండేవారు. అంజితో సాగరిక గొడవపడి పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 5న ఇంట్లో ఎవరి లేని సమయంలో సాగరిక(19) బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందోనని కుటుంబ సభ్యులు చుట్టూ ప్రక్కల వారిని బంధువులను అడిగిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి బాలరాజు సోమవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు విచారిస్తున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
స్నేహితుని చెల్లితో ప్రేమ.. ఆపై పెళ్లి.. కానీ కొన్ని రోజులకే..
క్రిష్ణగిరి(బెంగళూరు): స్నేహితుని చెల్లెలిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కొత్త వరుని హత్యకు కారణమని తేలింది. సొంత బావ అనే జాలి లేకుండా రక్తం కళ్లచూశారు. బి.కొత్తపల్లికి చెందిన సంతోష్ (23) హత్య కేసులో నిందితులను అరెస్టు చేశారు. సంతోష్, హోసూరు కుముదేపల్లికి చెందిన మురుగేషన్ (24) మిత్రులు. గత ఏడాది క్రితం సంతోష్, మురుగేష్ సహోదరి మీనాను ప్రేమించాడు. అది తెలిసి మురుగేష్ సంతోష్ను నిలదీశాడు. అయినప్పటికీ సంతోష్ మీనాను ఇటీవల పెళ్లి చేసుకొన్నాడు. ఇది సహించని మురుగేష్... సంతోష్ను హత్యకు కుట్ర పన్నాడు. గత శనివారం అతని మిత్రుల సహాయంతో బి. కొత్తపల్లి వద్ద మామిడి తోటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులు మురుగేష్, అతని మిత్రుడు సంతోష్కుమార్ (24), 17 ఏళ్ల బాలున్ని అరెస్ట్ చేశారు. చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి.. -
ఆదిలాబాద్లో మరో పరువు హత్య.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని
నార్నూర్: పరువు కత్తికి మరో ప్రాణం బలైంది. కనిపెంచిన తల్లిదండ్రులే.. కన్నప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించారు. కూతురు వేరే మతం యువకుడిని ప్రేమించిందని కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్కొండకి చెందిన పవార్ దేవీదాస్, సావిత్రీబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేశారు. చిన్నకూతురు రాజేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన సలీం ప్రేమించుకున్నారు. సలీం, రాజేశ్వరి పొలాలు గ్రామంలో పక్కపక్కనే ఉన్నాయి. 7వ తరగతి వరకు చదివిన రాజేశ్వరి తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలం వద్దకు వచ్చే సలీంతో స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. తల్లిదండ్రులు లేని సమయంలో రాజేశ్వరి తరచూ పొలం వద్దకు వెళ్లి సలీంను కలిసేది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేరే మతం యువకుడితో ప్రేమ వద్దని కూతురిని మందలించారు. తమను పెద్దలు కలవనీయరని భావించిన వారు మూడు నెలల క్రితం పారిపోయారు. మహారాష్ట్రలోని సలీం బంధువుల ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో యువతి తండ్రి పవార్ దేవీదాస్.. సలీంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నెల రోజులుగా అతడు ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు. దీనిపై రాజేశ్వరి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేది. తాను సలీంనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చచ్చిపోతానని బెదిరించేది. తమ కూతురు అతడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గురువారం కూరగాయల కత్తితో రాజేశ్వరి గొంతుకోసి హతమార్చారు. ఆత్మహత్యగా నమ్మించే యత్నం... శుక్రవారం ఉదయం దేవీదాస్ సర్పంచ్ సునీత ఇంటికి వెళ్లి తమ కూతురు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించగా.. అవి ఇంటి చుట్టూ తిరిగి దేవీదాస్, సావిత్రీబాయి వద్దకు వచ్చి ఆగిపోయాయి. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తామే చంపామని వారు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. దేవీదాస్, సావిత్రీబాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. చదవండి: యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి.. -
ప్రేమించి పెళ్లి.. సంతానం కలగకపోవడంతో.. సోదరుల సమాధుల వద్ద
సాక్షి, కరీంనగర్: మండలకేంద్రం గన్నేరువరంకు వెదిర ప్రవీణ్(25) మంగళవారం అర్ధరాత్రి తన సోదరుల సమాధుల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సురేందర్ కథనం ప్రకారం.. గన్నేరువరం గ్రామానికి చెందిన వెదిర కనుకయ్య–కనుకవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు చంద్రమోహన్ గతంలో కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కనుకయ్య కుటుంబ కరీంనగర్లో నివాసం ఉంటోంది. కాగా, రెండునెలల క్రితం రెండో కుమారుడు రాజ్కుమార్ అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై కరీంనగర్లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నవాడైన ప్రవీణ్ నాలుగేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆటో నడుపుకుంటూ సిద్దిపేట జిల్లాలో జీవనం సాగిస్తున్నాడు. సంతానం కలగకపోవడంతో పాటు ఇద్దరు సోదరులు మృతి చెందడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే, ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని ప్రవీణ్ తన ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. ముగ్గురు కుమారులు ఒకే తరహాలో మృతిచెందడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. -
సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్లో పరువు హత్య చేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సరూర్ నగర్లో బుధవారం రాత్రి పరువు హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు, అశ్రీన్ దంపతులు బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్తో తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు మృతుడు నాగరాజు భార్య అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా తన భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్తో విచక్షణారహితంగా కొట్టి చంపారని తెలిపింది. హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టి తలను తీవ్రంగా గాయపరిచారని వాపోయింది. ‘నాగరాజును కొట్టొద్దంటూ నేను అతని మీద పడ్డాను. నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారు. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చినరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి’ అని మీడియా ముందు వాపోయింది. ఇద్దరే నిందితులు: ఏసీపీ నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకంటామని ఏసీపీ తెలిపారు. నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు: డీసీపీ ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో గత రాత్రి నాగరాజు అనే వ్యక్తి పై ఇద్దరు దుండగులు దాడి చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసామన్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించి ఇద్దరిని ట్రెస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ లుగా గుర్తించామన్నారు. వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లి చెందిన బిల్లపురం నాగరాజు జనవరిలో మోబిన్ అహ్మద్ సోదరి సుల్తానా అశ్విన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో వాళ్లు నాగరాజు పై కక్ష్య పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు. నిన్న నాగరాజు పనిచేస్తున్న మలక్ పేట మారుతి షోరూం వద్ద మోబిన్ గుర్తించాడు. జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి హత్య చేశారని చెప్పారు. బంధువు మసూద్ తో కలిసి మోబిన్ సుల్తానా ను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డు తో దాడి చేసి పారిపోయారని డీసీపీ తెలిపారు. ఫాస్ట్రాక్ కోర్టు లో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..
దొడ్డబళ్లాపురం: మత్తు పదార్థాలకు బానిసైన భర్త వేధింపులను తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని త్యాగరాజనగర్లో చోటుచేసుకుంది. కోర్టు రోడ్డులో నివసిస్తున్న గౌతమ్ (28), వందన (24)ను ఒకటిన్నర ఏడాది క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కాగా, వందనా అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, గౌతమ్ సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరిది కులాంతర వివాహం కావడంతో అత్తగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. భర్త మత్తు పదార్థాలకు బానిసై వేధించేవాడు. దీంతో విసిగిపోయిన వందనా రెండు నెలల క్రితం భర్తను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కానీ భర్తలో మార్పు రాలేదు. మంగళవారంనాడు ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దొడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా? -
కాలేజీ బస్సు డ్రైవర్తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..
సాక్షి, బాపట్ల(వేమూరు): ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్కు గురైన ఘటన సోమవారం అనంతవరంలో చోటుచేసుకుంది. పోలీసులు, యువతి భర్త కథనం మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం శివలూరుకు చెందిన ఆళ్ల లక్ష్మీపూజిత, తెనాలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివే సమయంలో అదే కళాశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న కొల్లూరు మండలం అనంతవరానికి చెందిన దేవరాజుగట్టు విశ్వనాథ్లు ప్రేమించుకున్నారు. యువతి చదువు పూర్తయిన అనంతరం గత నెల 11న పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుని కొల్లూరు పోలీసులను ఆశ్రయించారు. అప్పట్నుంచి తన భర్త రాజవిశ్వనాథ్తో కలసి అనంతవరంలో ఉంటుంది. యువతిని బలవంతంగా లాక్కెళుతున్న తండ్రి, సోదరుడు, బంధువులు తల్లికి అనారోగ్యమని.. లక్ష్మీపూజిత తల్లికి ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఉదయం అనంతవరంలోని లక్ష్మీపూజిత అత్తగారింటికి తాతయ్య, మేనత్త, పిన్ని వచ్చారు. ఇకపై ఇరు కుటుంబాలు కలసి మెలసి ఉందామని నమ్మబలికారు. దీంతో లక్ష్మీపూజిత ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న యువతి తండ్రి శ్రీనివాసరెడ్డి, సోదరుడు నిరంజన్రెడ్డి, కొంతమంది యువకులు లక్ష్మీపూజితను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. అడ్డువచ్చిన భర్త, అత్తపై దాడికి పాల్పడ్డారు. భర్త రాజవిశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ కె.బాబూరావు తెలిపారు. చదవండి: ఊరుకాని ఊరులో.. మానవత్వానికి సలాం -
ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. విడిపోవడానికి కూతురు అడ్డొస్తుందని..
సాక్షి, జగిత్యాల: మానవత్వం లేని తండ్రి బిడ్డను వదిలించుకోవాలని చూశాడు. పేగుతెంచుకు పుట్టిన బిడ్డ కనిపించక పోవడంతో తల్లి కంటి మీద కునుకులేకుండా వెదికింది. చివరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా బిడ్డ ఎక్కడుందో గుర్తించి పోలీసుల సాయంతో అక్కున చేర్చుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన సాయి, చైతన్యను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకునాడు..వీరికి ఐదేళ్ల పాప లక్కీ. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరికీ తరచూ గొడవ లవుతున్నాయి. చైతన్యతో ఎలాగైనా విడిపోవాలని సాయి నిర్ణయించుకున్నాడు. విడిపోవడానికి పాప లక్కీ అడ్డొచ్చే ప్రమాదం ఉందని భావించాడు. తాము విడిపోతున్నామని, పాపను పెంచుకోవాలని.. పిల్లల్లేక బాధపడుతున్న జగిత్యాలలోని విద్యా నగర్కు చెందిన తన స్నేహితుడు క్రాంతి, కవిత దంపతులకు లక్కీని అప్పగించాడు. బిడ్డ కనిపించకపోయేసరికి...‘పాపను ఏం చేశావు’ అంటూ భర్తను నిలదీసింది చైతన్య. ‘అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, హాస్టల్లో చేర్చాను’ అంటూ అబద్ధాలు చెప్పాడు. భార్య ఒత్తిడి చేయడంతో ఫోన్ ఆఫ్ చేసిన సాయి.. తప్పించుకుని తిరుగుతున్నాడు. హైదరాబాద్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చైతన్య...సామాజిక మాధ్యమాల్లోనూ వెదకడం మొదలుపెట్టింది. తన కూతురు జగిత్యాలకు చెందిన కవితతో ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్లో గుర్తించి, జగిత్యాలకు చేరుకుంది. క్రాంతి, కవితల అడ్రస్ కనుక్కొని, కవిత జగిత్యాల ప్రభు త్వాస్పత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించి.. వెళ్లి తన పాపను తనకు ఇవ్వాలంటూ వేడుకొంది. బిడ్డ తనను గుర్తించలేక పోవడంతో... స్థానిక సీఐ కిశోర్ ను కలిసి సమస్యను వివరించింది. చైతన్య, క్రాంతి, కవితలను విచారించిన సీఐ... పాపను చైతన్య బిడ్డగా నిర్ధారించారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు విచారణలో ఉందని, చైతన్య ఆమె బిడ్డ లక్కీ, క్రాంతి–కవితలను అక్కడికి పంపించారు. బిడ్డ దొరకడంతో చైతన్య సంతోషానికి అవధులు లేవు. చదవండి: Hyderabad: ఇంట్లో నుంచి ప్రేమికుల పరార్.. ఇద్దరి జాడ చెప్పాలంటూ.. -
విషాదంగా ప్రేమ పెళ్లి.. ఇంటి నుంచి వెళ్లిపోయి..
సాక్షి, హసన్పర్తి: ప్రేమ పెళ్లి విఫలమైంది. రెండేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఆ వివాహిత తనువు చాలించింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గురువారం వడ్డెపల్లి చెరువులో శవంగా లభ్యమైంది. అంతకుముందు భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వివరాలు.. నగరంలోని 56వ డివిజన్ గోపాలపురానికి చెందిన నిఖిలేశ్వర్, హనుమకొండ కాపువాడకు చెందిన లలిత(23) ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో ప్రేమలొ పడ్డారు. కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిలేశ్వర్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానం.. కాగా, కొంతకాలంగా భార్య లలితపై నిఖిలేశ్వర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడని బాధిత కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఈనెల 20న లలిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలించారు. భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిఖిలేశ్వర్ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉదయం తాను చనిపోతానని లేఖ రాసి వెళ్లిపోయాడు. బైక్, సెల్ఫోన్ ఇంట్లోనే ఉన్నాయి. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. కాగా, కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన తల్లి యాదలక్ష్మి గురువారం రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చెరువులో తేలిన మృతదేహం.. ఇదిలా ఉండగా, లలిత మృతదేహం గురువారమే వడ్డెపల్లి చెరువులో లభ్యమైంది. అయితే గుర్తు తెలియని మృతదేహంగా ఎంజీఎంలో కాజీపేట పోలీసులు భద్రపరిచారు. శుక్రవారం ఆ మృతదేహం లలితదిగా కుటుంబసభ్యులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు నిఖిలేశ్వర్ ఆచూకీ లభ్యం కాలేదు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం: ప్రియాంక
సాక్షి, గుంతకల్లు రూరల్: బుగ్గసంగమేశ్వరాలయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంట తహసీల్దార్ రామును గురువారం ఆశ్రయించింది. వివరాలు.. మైదుకూరుకు చెందిన ప్రియాంక అనే సచివాలయ ఉద్యోగి, గుంతకల్లు పట్టణానికి చెందిన సుమంత్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఈనెల 18న గుంతకల్లు సమీపంలోని బుగ్గ సంగమేశ్వరాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కూతురు కిడ్నాప్ అయ్యిందని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ జంట తహసీల్దార్ను కలిసి తామిద్దరూ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని యువతి ప్రియాంక తహసీల్దార్కు తెలిపింది. తహసీల్దార్ సమక్షంలో మరోమారు దండలు మార్పించి ఒక్కటి చేశారు. చదవండి: (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
మైనర్తో ప్రేమ, పెళ్లి.. నెల నుంచే బాలికను వేధిస్తూ
సాక్షి, అమీర్పేట: ప్రేమ పేరిట బాలిక వెంటపడి, పెళ్లి చేసుకుని వేధిస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్లో నివాసముంటున్న 16 ఏళ్ల మైనర్ బాలిక 2017లో వేసవి సెలవుల్లో ఎల్లారెడ్డిగూడలో తాత, అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఎరోళ్ల వివేక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను గతేడాది నవంబర్ 8న వెంట తీసుకుని వెళ్లి 12న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి వచ్చి ఎల్లారెడ్డిగూడలో కాపురం పెట్టాడు. 5 నెలల నుంచి బాలికను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో బుధవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ను పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడిన వివేక్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మూడు రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలో వధువు..
తిరువొత్తియూరు: చెన్నై ఆవడిలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నై ఆవడి గోవర్ధనగిరి నగర్కు చెందిన ఉదయ (24) ఎంబీఏ పూర్తి చేసి పూందమల్లి సమీపం కాట్టుపాక్కంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతను అదే కంపెనీలో పని చేస్తున్న పూందమల్లి కుమరన్ నగర్కు చెందిన బీఏ గ్రాడ్యుయేట్ అనిత (26)ను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసి అనిత తల్లిదండ్రులు కుమార్తెకు మరో యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో అనిత ఈనెల 6వ తేదీన చెన్నై రాయపురంలో ఉన్న రిజిస్టర్ కార్యాలయంలో ఉదయను ప్రేమ వివాహం చేసుకుంది. వధూవరులు గోవర్ధనగిరి నగర్లోని ఉదయ ఇంటి మిద్దెపై ఉంటున్నారు. ఈ క్రమంలో అనిత శుక్రవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న ఆవడి పోలీసులు అక్కడికి చేరుకుని అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆవడి పోలీసులు, తిరువళ్లూరు ఆర్డీవో విచారణ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. -
ప్రేమ పెళ్లి.. ఏమైందో గాని.. ఉద్యోగానికని చెప్పి జారుకున్నాడు
మద్దిపాడు (ప్రకాశం) : ఉద్యోగం చేసే ప్రాంతంలో స్నేహంతో ప్రారంభమై ప్రేమగా మారి పెద్దలకు తెలియకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తనను వదిలేసి ఇంటికి వచ్చేశాడని ఓ యువతి ఆరోపిస్తోంది. తన భర్త గ్రామానికి వచ్చి నిరసన దీక్ష చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన సునంద అనే యువతి బెంగళూరు సమీపంలోని ఓ గార్మెంట్స్ కంపెనీలో పని చేస్తోంది. మండలంలోని దొడ్డవరానికి చెందిన కాట్రగడ్డ అనిల్ అదే కంపెనీలో పని చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గత డిసెంబర్లో వీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి, ఆమె కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన బెంగళూరులో వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నుంచి ఇంట్లోని సామగ్రిని అనిల్ ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నాడు. అనిల్ తన దుస్తులు సర్దుకుని హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. చేసేది లేక సునంద బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. భర్త ఎంతకూ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానించింది. తన బంధువుల సాయంతో సునంద ఎట్టకేలకు దొడ్డవరం చేరుకుంది. కుమారుడి గురించి అత్తమామలను ప్రశ్నించింది. తమకు సంబంధం లేదని, మీరే మా వాడిని ఏదో చేసి ఉంటారని ఇబ్బందిగా మాట్లాడారు. తనను ఇంట్లోకి కూడా రానివ్వలేదని ఆ యువతి వాపోయింది. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. ఎస్ఐ కలగజేసుకుని బాధితురాలితో మాట్లాడారు. అనిల్ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సునందతో కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం తాము కూడా గాలిస్తామని చెప్పారు. -
ఏడాది ప్రేమ.. ఆపై పెళ్లి, వారం రోజుల తర్వాత..
తుమకూరు(బెంగళూరు): తిపటూరు తాలూకాలోని హిండిస్కెర గ్రామంలో పెళ్లి చేసుకున్న కొన్నిరోజులకు ప్రియుడు కమ్ వరుడు పరారయ్యాడు. వివరాలు.. తాలూకాకు చెందిన వేర్వేరు కులాల వారైన నిఖిల్, చైత్ర ఏడాదిగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తురువెకెరెలో ఒక మొబైల్ షోరూంలో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఫిబ్రవరి 4వ తేదీన గుడిలో దండలు మార్చుకుని, మరో మూడు రోజులకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇండిస్కెరె గ్రామంలో ఇల్లు బాడుగకు తీసుకుని కాపురం పెట్టారు. ఫిబ్రవరి 10న తల్లికి అనారోగ్యంగా ఉందని, చూసివస్తానని చెప్పి నిఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎన్నిరోజులైనా జాడ లేకపోవడంతో చైత్ర అతనికి కాల్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో పరవగొండనహళ్ళిలో ఉన్న నిఖిల్ ఇంటికి చైత్ర వెళ్లింది. నిఖిల్ తండ్రి బసవరాజు ఆమెను దూషిస్తూ తరిమికొట్టాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం కిబ్బనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: Hyderabad Crime: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది -
ఇన్స్టాలో పరిచయం.. ప్రేమ.. చెల్లి పెళ్లిలో ఇంట్లో వాళ్లకు పరిచయం.. చివరికి!
సాక్షి, కామారెడ్డి: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకునిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివారాలిలా ఉన్నాయి.. రాజంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతిని లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమించాడు. ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు బయట తిరిగారు. ఈ నెల 23న అనిల్ చెల్లి పెళ్లి ఉండడంతో సదరు యువతిని రాంపల్లికి పిలిపించి చెల్లి స్నేహితురాలుగా తల్లిదండ్రులకు చెప్పాడు. రెండు రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని యువతి కోరగా అనిల్ నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు -
వెంటపడి వేధించి నాలుగేళ్ల క్రితం పెళ్లి.. మాంసం వండాలని ఒత్తిడి, చివరకు
హుబ్లీ: బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకొని మతం మార్పించి వేధించడంతోపాటు మచ్చుకత్తితో నరికిన కిరాతక భర్త నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని గదగ్కు చెందిన అపూర్వ పురాణిక్ అనే మహిళ మంగళవారం మీడియాతో మొరపెట్టుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే భర్త వేధింపులను ఏకరవు పెట్టింది. ఆమె మాటల్లోనే.. నిత్యం కాలేజీకి హిజాజ్ అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేదాన్ని. ఈ క్రమంలో తనను శారీకంగా వేధించి ఆ దృశ్యాలను వీడియో తీసి నా తల్లిదండ్రులకు చూపెడతానని బెదిరించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై విజయపుర తీసుకెళ్లి రాక్షసంగా వ్యవహరించాడు. మత మార్పిడి చేసుకుంటేనే కాపురం చేస్తానని బెదిరించి మతం మార్పించాడు. మాంసాహారం వండాలని, తానూ తినాలని ఒత్తిడి చేసేవాడు. కొడుకు పుట్టగా అతనికి మాంసం తినిపించేవాడు. నన్ను హిప్నటైజ్ చేశాడు. అతను చెప్పినట్లే నడుచుకునే దాన్ని. అతడికి ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లా. ఈనెల 12న గదగ్కు వచ్చి మాట్లాడుదామని చెప్పి పిలుచుకొని వచ్చి మచ్చుకత్తితో 23 సార్లు నరికాడు. అతని వల్ల తనకు, తన బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. -
మూడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. తీవ్ర మనో వేదనతో తల్లికి విషయం చెప్పి ఫోన్ కట్..
సాక్షి, చెన్నై : భర్త చేసిన అప్పులు భార్యను మనోవేదనకు గురిచేసింది. అప్పులు ఇచ్చిన వారు తరచూ ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచుతుండడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకుంటే పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో వారిని హతమార్చి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన శీర్గాలిలో మంగళవారం వెలుగు చూసింది. మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని మూలనాయనూరుకు చెందిన కార్తిక్ (27) మూడేళ్ల క్రితం భారతి(21)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు కౌశిక్(3), కుమార్తె భవధరణి(1) ఉన్నారు. కంటైనర్ డ్రైవర్ అయిన కార్తిక్ తరచూ పుణె, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లేవాడు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. అప్పులు క్రమంగా పెరగడంతో తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన వాళ్లు తరచూ ఇంటి రావడంతో భారతి మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లి చిత్రకు ఫోన్చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి కట్ చేసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పిల్లలు, భారతి ఉరికి వేలాడుతూ కనిపించడంతో కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. మంగళవారం వేకువజామున సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శీర్గాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుజరాత్కు వెళ్లిన కార్తిక్కు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మంత్రికి షాక్ ఇచ్చిన కూతురు!
ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కూతురని తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. హై ప్రొఫైల్ కేసుగా ఇప్పుడిది మీడియాకు ఎక్కింది. ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. తమిళనాడు మంత్రి శేఖర్బాబు కుమార్తె డాక్టర్ జయకళ్యాణి ప్రేమవివాహం చేసుకుంది. బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో సోమవారం సతీష్ను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కిడ్నాప్ కేసు! కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ తమిళ మీడియాలో హెడ్లైన్స్గా మారింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ లోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది జయకళ్యాణి. బంధించారు.. వేధించారు సతీష్ ఆ ఇంటి డ్రైవర్. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం జయకళ్యాణిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్ను అడిగాడు. డ్రైవర్, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా. ఇందుకు సంబంధించి గతంలో సతీష్ రిలీజ్ చేసిన ఓ వీడియో మీడియా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది జయకళ్యాణి. The News Minute సౌజన్యంతో వీడియో తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటోంది. కాగా తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్బాబు.. సీఎం స్టాలిన్కు అత్యంత సన్నిహితుడు కూడా. -
ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..
సాక్షి, మైసూరు: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువజంట ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా సింగర మారనహళ్లిలో జరిగింది. హుణసూరు తాలూకా బిళికెరె హోబళి సింగరమారనహళ్లి గ్రామానికి చెందిన అర్చన (18), రాకేశ్ (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను కాదని ఐదు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి వేరోచోట పెళ్లి చేసుకున్నారు. మైసూరులో కాపురం పెట్టారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదనివారి తల్లిదండ్రులు సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అర్చన, రాకేశ్లు మంగళవారం రాత్రి సింగరమారనహళ్లి గ్రామానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో బుధవారం ఉదయానికి ఊరు శివార్లలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. బిళికెరె ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?) -
విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తూ.. ప్రేమ పేరుతో నమ్మించి..
యశవంతపుర: విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తున్న కారు డ్రైవర్ ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న ఘటన విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో జరిగింది. విజయపురలో ఒక కుటుంబం వద్ద కారు డ్రైవర్గా పని చేస్తున్న సోమలింగ ఆ కుటుంబానికి చెందిన అక్షతను రోజూ బైక్పై కాలేజీ వద్ద వదిలేవాడు. ఈ సమయంలో మాయమాటలు చెప్పి ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. అయితే సోమలింగకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. బీకాం పూర్తి చేసిన అక్షత మేజర్ కావడంతో ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకుని రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా నమోదు చేసుకున్నారు. సోమలింగ, అతని మొదటి భార్యతో కలిసి అన్యోన్యంగా జీవిస్తానని అక్షత చెప్పడం గమనార్హం. పుట్టింటి నుంచి హాని ఉందని ఆదివారం జిల్లా ఎస్పీకి రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ తతంగం చూసి జిల్లావాసులు ఆశ్చర్యపోయారు. -
కుటుంబాన్ని కబళించిన ప్రేమ వివాహం
సాక్షి, చెన్నై: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ఓ కుటుంబాన్ని కబళించింది. అవమానానికి గురైన ఆ కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులను కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఉదంతం నాగపట్టినం జిల్లాలో చోటు చేసుకుంది. విక్కనాపురానికి చెందిన లక్ష్మణన్ (55), భువనేశ్వరి (40) దంపతులకు కుమార్తెలు ధనలక్ష్మి (23), వినోదిని (20), అక్షయ (18) ఉన్నారు. ఇంటి ముందు ఓ టీ బంకు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమార్తె ధనలక్షి అదే ప్రాంతంలోని వేరే సామాజికవర్గానికి చెందిన విమల్రాజ్ (25)ను ప్రేమించగా లక్ష్మణన్ అభ్యంతరం తెలిపాడు. దీంతో మూడు నెలల క్రితం ధనలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయి విమల్రాజ్ను పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్రమనస్తానికి గురైన లక్ష్మణన్ టీ దుకాణం నడపకుండా ఇంటి పట్టునే ఉండేవాడు. చదవండి: (తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..) తెల్లవారుజామున 4 గంటలకే టీ బంకు తెరిచే లక్ష్మణన్ శుక్రవారం ఉదయం 7 గంటలైనా తెరవకపోగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో స్థానికులు అనుమానంతో ఇంటిలోకి చూడగా భార్య, ఇద్దరు కుమార్తెలు రోకలి బండతో తలపై మోది హత్యకు గురైన స్థితిలో, లక్ష్మణన్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక కుటుంబ పెద్దే భార్య, ఇద్దరు కుమార్తెలను హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
నాలుగేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దల అంగీకారం..4 రోజుల్లో పెళ్లి.. చివర్లో ట్విస్ట్!
సాక్షి,మల్కాపురం(విశాఖ పశ్చిమ): వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను గుర్తించిన పెద్దలు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. నాలుగు రోజుల్లో పెళ్లి అనగా.. వరుడు అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మల్కాపురం సమీపంలోని ప్రకాష్నగర్కు చెందిన యువతి, 58వ వార్డు పరిధి అజంతా కాలనీలో ఉంటున్న మణికంఠ ఒకరినొకరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకుని.. ఈ నెల 10వ తేదీన స్థానిక కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిర్ణయించారు. చదవండి: అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి: సీఎం జగన్ ఇరు కుటుంబాలు బంధువులకు పెళ్లి కార్డులను అందించి ఆహ్వానించారు. ఇంతలో వరుడు అదృశ్యమయ్యాడు. ఆదివారం సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించకుండా పోయాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. ఫలితం లేకపోవడంతో వధువు తల్లిదండ్రులకు తెలిపారు. పెళ్లికి నాలుగు రోజులుండగా.. ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో వారు ఆందోళనకు చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాత కేసు నమోదు చేస్తామని మల్కాపురం పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక మునుపే ఆ ఇంట మృత్యుఘోష -
కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి
సాక్షి, కామారెడ్డి: కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. పట్టణంలోని హరిజనవాడ కాలనీకి చెంది బుంది గంగయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి భార్య గంగవ్వ (42) కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తరుణ్ కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గంగవ్వ మానసికంగా కుంగిపోతోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసుదన్గౌడ్ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని.. -
ప్రేమ వివాహం: తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం రేపింది. పట్టణానికి చెందిన కొల్లి వెంకటేష్ (26) ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్మ చేసుకున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతని భార్య లక్ష్మి తులసి కూడా ఆత్మహత్య చేసుకొంది. వెంకటేష్, లక్ష్మి తులసిది ప్రేమ వివాహం. ఇద్దరు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నావంటూ ఇరుగుపొరుగు వారు తన భార్యను వేధించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైతం స్పందించలేదని ఆరోపించాడు. ఈ వివాదాలతో పాటు తనకు రూ.7 లక్షలు అప్పు కూడా ఉన్నట్లు వెంకటేష్ సూసైడ్ నోట్లో వివరించాడు. చదవండి: (శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా..) -
ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో
సాక్షి, మిర్యాలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు కుమార్తె ప్రియాంక, అదే గ్రామానికి చెందిన తుర్క సందీప్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు మేజర్లు అయినప్పటికీ, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఎవరికీ తెలియకుండా గత నెల 20న హైదరాబాద్లోని జీడిమెట్ల ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. బుధవారం ఈ విషయం ప్రియాంక ఇంట్లో తెలియడంతో ఇద్దరూ కలసి మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. చదవండి: మూడేళ్లుగా కానిస్టేబుల్తో ప్రేమ.. మాయమాటలతో లోబర్చుకొని.. మరో వ్యక్తితో పెళ్లైనప్పటికీ వారి వద్ద వివరాలు తీసుకున్న డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు కార్యాలయంలో మహిళా పోలీసులు లేనందున మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వారు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు డీఎస్పీ కార్యాలయం గేటు వద్దకు చేరుకునే లోగా అక్కడికి చేరుకున్న వైస్ ఎంపీపీ సైదులు అనుచరులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ జంట తిరిగి డీఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏఎస్ఐని రక్షణగా ఉంచి పోలీస్ వాహనంలో వారిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. కాగా ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్గా పట్టుకొని నిలదీయడంతో.. -
ప్రియుడితో పిజ్జాహట్కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్(హిమాయత్నగర్): విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న భార్యపై మోజు తగ్గలేదు. వెంటపడుతూ వేధిస్తుండటంతో..గతంలో ఒకసారి ఊచలు కూడా లెక్కపెట్టాడు. అయినా బుద్ధిమారలేదు. మరో మారు మాజీ భార్యపై దాడి చేసి జైలు కెళ్లాడు.. చందులాల్ బారాదరికి చెందిన ఎండీ అక్బర్. అందరూ చూస్తుండగా మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. అక్బర్, హబీబా 9ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే హబీబా కంటే ముందే అక్బర్ అనీజ్ ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అక్బర్ హబీబా కలిసి ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అయితే ఆమెపై మోజు తగ్గక ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంబడించేవాడు అక్బర్. గతంలో రాంగోపాల్పేట పీఎస్ పరిధిలో హబీబాపై దాడి చేయగా..రెండు రోజుల పాటు జైలుకు వెళ్లొచ్చాడు. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) కొద్దిరోజులుగా ఆ కేసును వాపస్ తీసుకోమని వెంటపడుతున్నాడు. మంగళవారం హబీబా తనకు కాబోయే భర్తతో హిమాయత్నగర్లోని పిజ్జాహట్కు వచ్చింది. అక్కడికి వచ్చిన అక్బర్ తన మొదటి భార్య అనీజా ఫాతిమాతో హబీబా వీడియో తీయించాడు. తన వీడియో ఎందుకు తీస్తున్నారంటూ హబీబా అడగడంతో అందరూ చూస్తుండగా అక్బర్ ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అక్బర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు అడ్మిన్ ఎస్సై సంధ్య తెలిపారు. చదవండి: (మిసెస్ ఇండియా తెలంగాణగా ఇందూ అగర్వాల్) -
కూతురు ప్రేమ పెళ్లి.. బతికుండగానే పిండం పెట్టిన తండ్రి.. వైరల్
సాక్షి, మహబూబ్నగర్: ఎంతో ప్రేమగా చూసుకున్న కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంట.. తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని పెద్దలను కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 13న పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమను కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు. కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. చదవండి: మైనర్పై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. 7 నెలల గర్భిణి అంతటితో ఆగకుండా తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలాఉండగా.. కూతురి ఇష్టం మేరకు పెళ్లి చేస్తానని సదరు తండ్రి చెప్పినా.. ఆ యువతీ, యువకుడు వినలేదని స్థానికంగా ప్రచారం సాగుతోంది. తండ్రి మాటపై నమ్మకం లేకనే ఆ యువతి గుడిలో ప్రేమ పెళ్లి చేసుకుందని కొందరు చెప్తున్నారు. అందుకనే తన మాటకు విలువ ఇవ్వని బిడ్డపై అతను పిండ ప్రదానం చేసి ఆక్రోషం వెళ్లగక్కాడని అంటున్నారు. చదవండి: Hyderabad City Bus: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’ -
ప్రేమించి పెళ్లి చేసుకుందని చెల్లెలిపై కత్తితో దాడి
కోవూరు: ప్రేమించి పెళ్లి చేసుకుందని పోలీస్స్టేషన్ ఎదుటే చెల్లెలిపై అన్న దాడి చేసి కత్తితో పొడిచిన ఘటన సోమవారం రాత్రి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్స్టేషన్ వద్ద జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలేనికి చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇద్దరూ మేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి. ఈ విషయం కోవూరు పోలీస్స్టేషన్కు చేరింది. ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి కావడంతో వారిని వెళ్లిపోయి మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారిగా చెల్లెలుపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. హరీష్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. -
'పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..?'
ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే ఆ భర్త పూర్తిగా మారి సైకోలా తయారయ్యాడు.ఆ యువకుడు అగ్రకులానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని గ్రామస్తులు ఎగతాళి చేస్తున్నారని పునరాలోచనలో పడ్డాడు. భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే నువ్వు అంటరానిదానివని సదరు యువతిని కులం పేరుతో దూషించాడు. తనను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తే అలాంటి మాట అనడంతో ఆ భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్లోని మెహ్సానా జిల్లా జోతానా తాలుకాకు చెందిన సదరు జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి వయసు 20 ఏళ్లు. యువకుడి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం అహ్మదాబాద్లో మెమాగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం.. కాగా యువకుడు అగ్ర కులానికి చెందిన వాడు. ఐనప్పటికీ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా సూటిపోటి మాటలతో వేధించేవారు. అలా అందరూ తనను వెక్కిరించడంతో అతడు కూడా సదరు యువతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని భావించాడు. పెళ్లికి ముందు బంగారం అని పిలిచిన వాడే పెళ్లి చేసుకున్నాక అంటరానిదానివని అనడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురయింది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి అతడు శృంగారం కోసం వస్తే ఆమె నిరాకరించింది. నన్ను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను నీతో శృంగారం చేయనని తెగేసి చెప్పింది. ఇక దాంతో అతడు కోపంతో భార్యను ఇష్టానుసారం కొట్టి బలవంతంగా అనుభవించసాగాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఆ యువతిని రేప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే ఇదే క్రమంలో ఇటీవల ఐరన్ రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె ఆస్పత్రి పాలయింది. అనంతరం మెహ్సానాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత గత్లోడియా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అబ్దుల్లాపూర్మెట్లో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. 6 ఏళ్లకు
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో వివాహిత భర్తకు గాయలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. అబ్దుల్లాపూర్మెట్ లష్కర్ గూడకు చెందిన రాజు, అదే గ్రామానికి చెందిన మరో మైనారిటీ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపతో శుక్రవారం హాస్పిటల్కు వెళ్ళి తిరిగి వస్తుండగా వివాహిత మేనమామ జహంగీర్.. మహిళ, ఆమె భర్త రాజుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో రాజుకు తీవ్ర గాయాలవ్వగా హయత్ నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు జహంగీర్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఉప్పల్లో దారుణం: నా భర్త కామపిశాచి.. కన్నకొడుకుపై కర్కషంగా.. -
భర్త ఇంటి ముందు 40 రోజుల పోరాటం విషాదాంతం
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): కట్టుకున్నవాడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన నరహరి సుజిత్రెడ్డి కడప జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి (32)కి 2011లో ఆన్లైన్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి ప్రస్తావన రాగానే పలుమార్లు సుజిత్ దూరం పెట్టడంతో సుహాసిని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2020 నవంబర్లో హైదరాబాద్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సిటీలో కొంతకాలం కాపురం చేశాడు. తల్లిదండ్రులను ఒప్పించి తీసుకెళ్తానని ఊరికెళ్లాడు. ఆ తర్వాత ఎంతకూ తాను రాకపోవడంతో సుహాసిని హుజూరాబాద్ వెళ్లి భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది. అయినా భర్త, అత్తమామల మనసు కరగలేదు. మరోవైపు సుజిత్ మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసి మనస్తాపం చెంది బుధవారం భర్త ఇంటి ఎదుట గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. సుజిత్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో సుహాసిని పేర్కొంది. తన చావుకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించి తన అవయవాలను దానం చేయాలని చెప్పింది. మృతురాలు సోదరుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లాడింది.. కానీ ఆరు నెలలకే..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్న యువతి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆనేకల్లో చోటుచేసుకుంది. జిగణి సమీపంలోని రాజాపుర నివాసి యశవంత్, బెంగళూరు టీచర్స్కాలనీ కి చెందిన రాణి (28) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యశవంత్ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇతడికి ఇది రెండవ పెళ్లి. బుధవారం రాణి భర్త ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శవమైంది. భర్త, కుటుంబసభ్యులు కనీసం పట్టించుకోలేదు. కులాంతర పెళ్లి కావడంతో భర్త, అత్తమామలు చంపి ఉంటారని రాణి కుటుంబసభ్యులు ఆరోపించారు. జిగణి పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొడుకు ఆత్మహత్య.. కారణం కోడలేనని.. వెంటాడి మరీ మామ దారుణం
కోటపల్లి(చెన్నూర్): కోడలిని మామ హత్య చేయడం మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. కొడుకు కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేక.. కుమారుడి ఆత్మహత్యకు కోడలే కారణమన్న కక్షతో కత్తితో ఆమె గొంతు కోసి దారుణానికి పాల్పడ్డాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం.. లింగన్నపేటకు చెందిన రాళ్లబండి సాయికృష్ణ, బోరగళ్ల సౌందర్య ప్రేమించుకున్నారు. ఇద్దరిది వేర్వేరు సామాజికవర్గాలు కావ డంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఏడాది క్రితం వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకు న్నారు. కొన్నాళ్లు మంచిర్యాలలో, అనంతరం కోటపల్లిలో జీవనం సాగించారు. ఈ క్రమంలో అప్పు లు పెరిగిపోవడంతో సాయికృష్ణ మద్యానికి బానిస గా మారి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తన కుమారుడి మరణానికి కోడ లే కారణమని సాయి కృష్ణ తండ్రి తిరుపతి కక్ష పెం చుకున్నాడు. తన కుమారుడు ఆ యువతిని పెళ్లి చేసుకోవడం వల్ల గ్రామంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నానని స న్నిహితులతో చెబుతుండేవాడు. ఈ నేపథ్యంలో తమ కూతురికి ప్రాణహాని ఉందని గ్రహించిన సౌందర్య తల్లిదండ్రులు ఆమె ను వేరే గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంచారు. ఇటీవల సౌందర్య తల్లిదండ్రులను చూడడానికి రావడంతో హత్య చేసేందుకు తిరుపతి పథకం వేశాడు. సోమ వారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లగా మంచంపై దుప్పటి కప్పుకుని తండ్రి లస్మయ్య, సౌందర్య వేర్వేరుగా నిద్రిస్తున్నారు. సౌందర్య ఎక్కడుందో తెలియక మొదటగా తిరుపతి కత్తితో లస్మయ్యపై దాడి చేశాడు. వెంటనే అతడు తేరుకుని కేకలు వే యడంతో పక్కనే నిద్రిస్తున్న సౌందర్య(24) ప్రాణభయంతో బయటకు పరుగెత్తింది. అయితే తిరుప తి ఆమెను వెంబడించి మరీ అతి కిరాతకంగా గొం తుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సౌందర్య మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి దాడిలో తీవ్ర గా యాలైన లస్మయ్య చికిత్స పొందుతున్నాడు. జైపూ ర్ ఏసీపీ నరేందర్ ఆస్పత్రిలో లస్మయ్యతో మాట్లా డి వివరాలు సేకరించారు. నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడి ని తమకు అప్పగించాలని, అప్పటివర కు తాము పోలీసులకు ఫిర్యాదు చేయబోమని మృ తురాలి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. -
ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి.. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని..
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమజంట మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వివరాలు.. మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్టకు చెందిన కిరణ్(23), రూరల్ మండలం అంకిశెట్టిపల్లె కుసుమ(22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి వివాహానికి అంగీకరించలేదు. దీంతో సోమవారం ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన ఎస్పీ కార్యాలయం సిబ్బంది మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు.