koyyalagudem
-
కొయ్యలగూడెం రోడ్ షో లో చంద్రబాబుకు నిరసన సెగ
-
పశ్చిమ గోదావరిలో చేతబడి కలకలం
-
అర్థరాత్రి దున్నపోతును బలి ఇచ్చి...
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలులో చేతబడి కలకలం రేపుతోంది. ఓ మహిళ చేతబడి చేస్తూ జామాయిల్ తోటలో దున్నపోతును బలిఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఒక బాలుడి బొమ్మని చిత్రీకరించి దాని ముందు గొయ్యి తవ్వి నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు గత మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. క్షుద్రపూజలు చేసినట్లు భావిస్తున్న మహిళకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. తోటలోకి తీసుకెళ్లి సామాగ్రి అంతా కాల్చి తగులబెట్టారు. వారం రోజుల నుంచి గ్రామంలో చేతబడి జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ విషయం బయట పడింది. దున్నపోతు తల నరికి గొయ్యి తీసి పెట్టడంత, క్షుద్రపూజు చేసిన సామాగ్రిని గోతిలో పాతిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. చేతబడి కలకలం స్థానికులను భయానికి గురి చేస్తోంది. -
వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం
సాక్షి, బయ్యనగూడెం: తమ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాల పట్ల నాయీ బ్రాహ్మణులు సంతృప్తి వ్యక్తం చేశారు. సెలూన్లకు ఏడాదికి రూ. 10 వేలు సాయంగా ఇవ్వాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పోతన తాతారావు, తుమ్మలపల్లి గంగరాజు, మీసాల సూర్యానారాయణ, కంభంపాటి బుజ్జిబాబు పాల్గొన్నారు. లింగుశెట్టి సురేశష్, లింగుశెట్టి అంజిబాబు, పొలకంపల్లి శ్రీనివాస్, మాధవరం సర్వారాయుడు, లింగుశెట్టి అప్పారావు తదితర నాయీ బ్రాహ్మణ నేతలు ర్యాలీకి హాజరయ్యారు. -
అది చిరుత కాదు హైనానే
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : గంగవరం అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుతపులి తిరుగుతుందన్న వార్త కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అది చిరుతపులి కాదని హైనాగా అటవీశాఖాధికారులు నిర్ధారించారు. గత ఐదు రోజులుగా చిరుత సంచారం ప్రచారంతో గ్రామస్తుల్లో భయాందోళనలు గురయ్యారు. దీంతో అధికారులు పాదముద్రలు పరిశీలించి చిరుత లేదా హైనావి కావచ్చని నాల్రోజుల క్రితం చెప్పారు. అయితే ఏలూరు నుంచి తీసుకొచ్చిన సాంకేతిక పరికరాల సాయంతో ఆ పాదముద్రల్ని పరిశీలించి హైనావిగా నిర్ధారించారు. కన్నాపురం, ఏలూరు ఫారెస్ట్ సెక్షన్ అటవీశాఖాధికారులు, వైల్డ్ లైఫ్ సిబ్బందితో కలిసి హైనాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే అటవీప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో బోనులు ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల జంతువు పాదముద్రలను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్పారు. -
చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది
-
ఎన్నికలను బహిష్కరించిన ‘కొయ్యలగూడెం’
చౌటుప్పల్ (మునుగోడు) : చేనేత వస్త్రాల తయారీకి పెట్టిన పేరుగా నిలిచిన మండలంలోని కొయ్యలగూడెం గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా కులమతాలు, వర్గ విభేదాలకు తావు ఇవ్వకుండా ఏకతాటిపై నిలిచారు. అందరు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుపడ్డారు. గతేడాది జరిగిన నూతన గ్రామపంచాయతీల విభజన సమయంలో కొయ్యలగూడెం గ్రామానికి అ న్యాయం జరిగిందని.. గ్రామపంచాయతీ ఎన్ని కలను బహిష్కరించాలని ఈనెల 7న నిర్ణయిం చారు. ఏ ఒక్కరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలి యపర్చాలని తీర్మాణించారు. అధికారులు నచ్చజెప్పినా తలొగ్గకుండా పంతాన్ని నెరవేర్చుకున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యలగూడెంలో ఆ గ్రామంతో పాటు ఎల్లంబావి, జ్యోతినగర్, గజ్జెలోనిబావి గ్రామాలు ఉండేవి. పంచాయితీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 4600 జనాభా, 2837 మంది ఓటర్లు ఉండేవారు. గతేడాది ఈ గ్రామపంచాయతీ నుంచి ఎల్లంబావి, జ్యోతినగర్ను వేరు చేశారు. 1287 మంది జనాభా, 976 మంది ఓటర్లతో కలిపి నూతనంగా ఎల్లంబావి పేరిట గ్రామపంచాయతీని ఏర్పాటైంది. ముందుగా అధికారులు చేసిన మార్కింగ్ ప్రకారంగా కాకుండా అకస్మాత్తుగా మరో మార్కింగ్తో విభజించి గెజిట్ను పూర్తిచేశారు. ఇక అప్పటి నుంచి గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయం గురించి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయో తప్ప ఫలితం మాత్రం దక్కలేదు. విభజనతో ఆగమైన కొయ్యలగూడెం.. విభజనతో కొయ్యలగూడెం గ్రామం పూర్వపు తన ఆనవాళ్లను కోల్పోయింది. గతేడాది మార్చిలో జరిగిన ప్రక్రియలో ఎల్లంబావికి 13–57, 701–705, 438, 441, 473, 708 సర్వే నంబర్లే కేటాయించాలి. కానీ ఆ తర్వాత జరిగిన తతంగంతో అధనంగా 10, 694, 695, 696, 697, 698, 699, 700 సర్వే నంబర్లను కేటాయించారు. 1,287 మంది జనాభా ఉన్న ఎల్లంబావికి 650ఎకరాలను కేటాయించారు. 2,313 మంది జనాభా కలిగిన కొయ్యలగూడెం గ్రామానికి మాత్రం 700 ఎకరాల రెవెన్యూని మాత్రమే కేటాయించారు. దీంతో కొయ్యలగూడెం గ్రామంలోనికి వెళ్లే ప్రధాన రహదారి, కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న శ్మశాన వాటిక కూడా ఎల్లంబావి పరిధిలోకి వెళ్లింది. విఫలమైన అధికారుల ప్రయత్నాలు ఎన్నికల్లో గ్రామస్తులతో నామినేషన్లు వేయించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని కొంత మందికి బరోసా ఇచ్చారు. అందులో భాగంగా డి.నాగారం క్లస్టర్ వద్ద ఏసీపీ బాపురెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చిల్లా సాయిలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏదో జరుగుతుందని పసిగట్టిన కొయ్యలగూడెం గ్రామస్తులు ఎవరూ నామినేషన్లు వేయకుండా గస్తీ నిర్వహించారు. క్లస్టర్ వద్ద కాపుకాశారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామం నుంచి ఎలాంటి నామినేషన్ దాఖలవ్వలేదు. ప్రయత్నాలు విఫలమవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. బహిష్కరించాలని నిర్ణయం.. తమకు జరిగిన అన్యాయంపై సుమారు 7 నెలలుగా గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. అయినా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరో వైపు ప్రజాప్రనిధులు కనీసం స్పందించలేదు. దీంతో తమ నిరసన తీవ్రస్థాయిలో ఉండాలని గ్రామస్తులంతా భావించారు. అందులో భాగంగా ఈనెల 7న సమావేశమై పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ మాటకు ప్రజలంతా కట్టుబడ్డారు. -
ఒక్క సర్వే రాయి వేసినా ఊరుకోం
కొయ్యలగూడెం: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ సర్వే పనుల్లో ఒక్క సర్వే రాయి పడినా సహించేది లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం రాజవరం స మీపంలో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే పనుల వద్ద నిరవధిక ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వందల ఎకరాల్లోని పచ్చని పంటలు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన మద్దతు ధరను ఇవ్వమనడం కూడా ప్రభుత్వానికి తప్పుగా కనిపిస్తోందని, రైతుల కడుపుకొట్టి చంద్రబాబు సర్కార్ కడుతున్న కట్టడాలు కూల్చివేస్తామని బాలరాజు పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువను అమలు చేసి దానికి రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారాన్ని అందజేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ కలుగుతుందని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు అధికంగా జీవనాధారమైన భూములు కోల్పోతే వారి బతుకులు, కుటుంబాలు అధోగతిపాలవుతాయని బాలరాజు ఆందోళన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు సైతం తమ బాధలను బాలరాజు వద్ద మొరపెట్టుకున్నారు. అనంతరం బాలరాజు జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు రావాల్సిందిగా కోరారు. దీంతో ఈనెల 16న రాజవరానికి వచ్చి బాధిత రైతులతో బహిరంగ చర్చావేదికను నిర్వహిస్తామని జేసీ పేర్కొన్నారు. మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీను, దాసరి విష్ణు, మైనార్టీసెల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాజీ, మాజీ సర్పంచ్ పాముల నాగ మునిస్వామి, వైఎస్సార్సీపీ నాయకులు కె.సూరిబాబు, బల్లె నరేష్, చింతలపూడి కిషోర్, గద్దే సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
కులాన్ని తిట్టినా కోపం రావడం లేదా : పవన్ కల్యాణ్
సాక్షి, పశ్చిమగోదావరి : కొయ్యలగూడెం బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆడపడుచులు, మహిళలు, పోలీసులు, 85 ఏళ్ల వృద్ధులను కొడుతూ, కులం పేరుతో దూషించే నాయకులకు ప్రజలను పాలించే అర్హత లేదన్నారు. ‘జవహర్ నీ కులాన్ని తిడితే నీకు కోపం రావడం లేదేమో.. నాకు వస్తోంది’ అని ఏపీ ఎక్సైజ్శాఖ మంద్రి కేఎస్ జవహర్ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు దళితులపై ఆనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. (చింతమనేని అనుచరుల హల్చల్) భయపడి ఎన్నికలు పెట్టడం లేదు... ‘కొయ్యలగూడెంలో ఒక్క డిగ్రీ కాలేజీ కుడా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే జనసేన గ్రామాల్లో పాతుకు పోతుందనే భయం చంద్రబాబును పట్టుకుంది. నేను ముఖ్యమంత్రి అవటానికి రాలేదు. పోరాటం చేయడానికి వచ్చా’ అని పవన్ చెప్పారు. ప్రాజెక్టుల కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు రాళ్ల భూములు, నీటి సౌకర్యం లేని భూములు, నాణ్యత లేని గృహాలు అంటగడుతున్నారని పవన్ ధ్వజమెత్తారు. -
షాక్: కోడిపందేల రాయుళ్లకు జైలు
సాక్షి, తణుకు: కోడిపందేల రాయుళ్లకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. జైలు శిక్ష, జరిమానా విధించింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో కోడిపందేలు నిర్వహించిన 93 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష, రూ. 200 చొప్పున జరిమానా విధించించారు. నిందితులను తణుకు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కోడిపందేలపై పోలీసులు దాడి పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 2010 నగదు, 2 కోళ్లు, 2 కత్తులును స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పశ్చిమ గోదావరి జిల్లా / కొయ్యలగూడెం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో శనివారం మధ్యాహ్నం వివాహ రిసెప్షన్కు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న లారీ మరొక లారీని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న రెడ్డియ్య బైక్ను ఢీకొంది. దీంతో సత్యవతి అదుపు తప్పి లారీ చక్రాల కింద పడింది. రెడ్డియ్య బైక్పై నుంచి అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెడ్డియ్యను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఏలూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. రెడ్డియ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్టీఆర్ గృహలబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు
-
తెల్లవార్లూ కోడిపందేలు
జంగారెడ్డిగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగో రోజు రాత్రి ప్రారంభమైన కోడిపందేలు తెల్లవార్లూ పెద్దెత్తున ఫ్లడ్లైట్ల వెలుతురులో యథేచ్ఛగా సాగాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు కోడిపందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని కోడిపందాల వద్దకు పోలీసులు వెళ్లినా కోడిపందాల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. మంత్రులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ పందాలు నిర్వహించినట్టు సమాచారం. గతంలో భోగి, సంక్రాంతి, కనుమ రోజు మాత్రమే నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ముక్కమనాడు కూడా పందేలు నిర్వహించడం విశేషం. -
జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం
కొయ్యలగూడెం : జిల్లా ఫుట్బాల్ అసోసియేష న్ కోటగిరి విద్యాధరరావు ఫౌండేష న్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కొయ్యలగూడెంలో ఫ్లో(ఫుట్బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి)–2017 మ్యాచ్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం– నరసాపురం జట్లు హోరాహోరీగా ఈ ఈ మ్యాచ్లో తలపడ్డాయి. చివరకు జంగారెడ్డిగూడెం జట్టు 1–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 1.30 గంటల వ్యవధిలో ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించలేకపోవడంతో ఆటను అర్ధ గంట పాటు పొడిగించడం విశేషం. విశాఖపట్నానికి చెందిన జంగారెడ్డిగూడెం జట్టులోని సభ్యుడు పవ న్ ఆట ఆఖరి నిమిషంలో గోల్ సాధించి విజయాన్ని చేకూర్చాడు. టోర్నీ నిర్వాహకులు ఫౌండేష న్ వ్యవస్థాపకుడు కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మ్యాచ్ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మొత్తం 15 లీగ్మ్యాచ్లో భాగంగా 9వ మ్యాచ్ కొయ్యలగూడెంలో నిర్వహించామని ఫ్లో సీఈవో ఆర్.రాజేష్ రావూరి, జిల్లా ఫుట్బాల్ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావులు తెలిపారు. 16న పాలకొల్లు, 17న నరసాపురంలో సెమీ ఫైనల్స్, 18న ఏలూరులో ఫైనల్స్ జరపనున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఏఎంసీ చైర్మపి.రామారావు, అఫెడా మాజీ డైరెక్టర్ గొడవర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న కారు
కొయ్యలగూడెం : ఓ స్కూల్ బస్సును గురువారం కారు ఢీకొట్టింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. గవరవరం గ్రామానికి చెందిన అగ్జీలియం స్కూల్ బస్సు యర్రంపేట నుంచి స్కూల్కు వస్తుండగా.. మేఘలాదేవినగర్ వద్ద విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆగింది. దీనిని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. కారు ముందుభాగం దెబ్బతింది. స్కూల్ బస్సుకు, అందులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అగ్జీలియం సిబ్బంది తెలిపారు. -
'టాలెంట్తో పాటు అదృష్టం ఉండాలి'
సినీహీరో సాయి కిరణ్ కొయ్యలగూడెం : సినిమాల్లో హీరోగా రాణించడానికి టాలెంట్తో పాటు అదృష్టం కూడా తోడు ఉండాలని, ముఖ్యంగా తెలుగు చలన చిత్రసీమలో ఇది చాలా అవసరం అని సినీ హీరో విస్సంరాజు సాయికిరణ్ అన్నారు. సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో డాక్టర్ దిలీప్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సినీ హాస్య నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణతో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ డాక్టర్ దిలీప్కుమార్ తాను క్లాస్మేట్స్ అని, తమ మిత్రత్వం కారణంగా చెన్నై నుంచి నేరుగా కొయ్యలగూడానికి గోపాలకృష్ణతో కలిసి వచ్చానని చెప్పారు. తమిళంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రగా నిర్మితమవుతున్న చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నందికొండ, మారాజు, తొలికిరణం తదితర తెలుగుచిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి ప్రఖ్యాత గాయకుడు రామకృష్ణకు స్వర్గీయ నందమూరి తారకరామారావు అందించిన చేయూత వల్ల విఖ్యాత గాయకునిగా ఎదిగారని సాయికిరణ్ పేర్కొన్నారు. ప్రముఖ హీరో రవితేజను ఆదర్శంగా తీసుకుని తనవంతు కృషిచేస్తున్నానని నేటి యువతకు తగ్గట్టు శరీర సౌష్టవాన్ని మార్చుకుని హీరోగా స్థిరపడాలని శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల ఒక సినిమా నిర్మాణంలో తనకు ప్రమాదం సంభవించడంతో మెడకు తీవ్ర గాయమైందని, దాని వల్ల కొంత విరామం వచ్చినట్టు చెప్పారు. యోగా, మెడిటేషన్ వల్ల పూర్తిగా కోలుకోగలిగినట్టు చెప్పారు. తాను నటించిన చిత్రాల్లో సత్తా, ప్రేమించు చిత్రాలు తనకు బాగా ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక టెలీఫిలింలు ఎక్కువగా చేస్తున్నట్టు చెప్పారు. కళలకు పుట్టినిల్లు గోదావరి జిల్లాలు అని అన్నారు. హాస్యనటులు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు 52 తెలుగు చలన చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. సోగ్గాడే చిన్నినాయనా, రాజా చెయ్యివేస్తే చిత్రాల్లో మంచి పేరు వచ్చిందన్నారు. అనంతరం నటులిద్దరినీ డాక్టర్ దిలీప్కుమార్ దంపతులు ఘనంగా సత్కరించి మెమొంటోలు అందించారు. -
ఆమెను చూస్తే.. ‘అవ్వా’క్కవుతారు..!
వందేళ్ల వయసులోనూ చురుగ్గా ఓ బామ్మ నా అన్నవాళ్లు లేకపోయినా ధైర్యంగా జీవిస్తోన్న వైనం మనం చదివిన చిన్నప్పటి కథల్లో పేదరాసి పెద్దమ్మ గుర్తుందా? ఇంచుమించు అలాగే ఒక బామ్మ బ్రిటీషు వారి కాలం నాటి సంగతులను గడగడా చెప్పేస్తోంది. కాలనుగుణంగా మారిన ఆహారపు అలవాట్లును వివరిస్తోంది. సుమారు 100 సంవత్సరాల వయసు కలిగిన ఈ బామ్మ ఉత్సాహం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అన్నట్టూ ఇంకోమాట! ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిలోనే ఈమె చాన్నాళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె చెప్పిన ఆనాటి సంగతులకు ఊకొడతారో.. లేక అవాక్కవుతారో అంతా మీ ఇష్టం. - కొయ్యలగూడెం బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం ఉప్పరిల్లలో వేట్ల చిన్నమ్మ ఒక్కామె నివసిస్తోంది. సమీప గిరిజనులు ఈమెను ముని అవ్వ అని పిలుస్తుంటారు. పోలవరం మండలం గడ్డపల్లి తన స్వగ్రామమని 9వ ఏటనే వివాహం జరగడంతో ఉప్పరిల్లకు వచ్చి స్థిరపడ్డట్టు చిన్నమ్మ తెలిపింది. అదే సమయంలోని మండలంలోని పులిరామన్నగూడెం, చింతపల్లి గ్రామాల్లో తెల్ల దొరలు వేసవి విడిది కోసం బంగ్లాలు(భవంతులు) కట్టించుకున్నారని చెప్పింది. ప్రస్తుతం పూర్తిగా శిథిలమైన ఆ భవంతుల గోడపై 1920లో నిర్మాణం జరిగినట్టు రాసి ఉంది. ఈ లెక్కన చూస్తే ఆమె వయసు 100 పైనే అని గిరిజనులు చెబుతున్నారు. ఆ రోజుల్లో వరి అన్నం ఎక్కడుంది ! వేట్ల చిన్నమ్మ 40 సంవత్సరాల వయసు వరకు తెల్లకూడు(వరి అన్నం) తెలియదని పేర్కొంది. వెదురు బియ్యం, చేమ దుంపలతో పాటు ఇతర అడివి దుంపలను తన భర్త తీసుకువస్తే వాటిని వండి ఇద్దరం తినేవారమని చెప్పింది. అదేవిధంగా కాలానుగుణంగా వచ్చే కాయలలోని గింజలను వలిచి ఉడకబెట్టి తింటానని తెలిపింది. చింతపిక్కలు, సీతాఫల గింజలు, తంగేడి గింజలు, మారేడు కాయలతో పాటు అడవి మామిడి కాయలను, టెంకలను వండుకుని తింటామని, జీలుగుకల్లు సేవిస్తామని చెప్పింది. తన భర్త, కొడుకులు, కూతుళ్లు అంతా తన కళ్ల ముందే కాలం చేసినా మొక్కవోని ధైర్యంతో జీవనం సాగిస్తున్న చిన్నమ్మ నాటి కాలానికి సాక్షంగా మిగిలింది. -
ఆరు నెలల క్రితమే వివాహం...
కొయ్యలగూడెం : మండలంలోని కన్నాపురం దళితవాడకు చెందిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన యడ్లపల్లి నాగలక్ష్మి(18)ని కన్నాపురానికి చెందిన గోపి అనే వ్యక్తికి ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. మూడు నెలల క్రితం నాగలక్ష్మికి గర్భస్రావం జరిగింది. దీనిపై గోపి తల్లీదండ్రులు, కుటుంబసభ్యులతో నాగలక్ష్మికి తరచూ గొడవ చోటు చేసుకునేది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నాగలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి దుర్గయ్యకు గోపి కుటుంబ సభ్యులు ఫోన్లో సమాచారం అందించారు. అయితే తన కుమార్తె మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని, అత్తమామలు, భర్త గోపి నాగలక్ష్మి మృతికి కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుర్గయ్య పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం సీఐ బాలరాజు, ఎసై్స పి.చెన్నారావులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన
చౌటుప్పల్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్కుమార్ వెల్లడించారు. ఇందుకోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
కొయ్యలగూడెంలో మారిషస్ మంత్రి పర్యటన
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామాన్ని మారిషస్ దేశ ఆర్థిక, సామాజిక మంత్రి పృథ్వీరాజ్సింగ్ రూపేన్ శుక్రవారం సందర్శించారు. గ్రామంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతున్న వస్త్రాలను పరిశీలించారు. కార్మికుల సమస్యల గురించి తెలుసుకున్నారు. మారిషస్లో చేనేత వస్త్రాల అమ్మాకానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం స్థానిక మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ సుధాకర్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. -
అచ్చమైన మిథునం
ఇటీవల ఓ వృద్ధ జంట జీవితాన్ని వెండితెరపై ‘మిథునం’ పేరిట అందమైన కావ్యంగా ఆవిష్కరించారు తనికెళ్ల భరణి. అటువంటి అచ్చమైన జంట స్థానికంగా ఒకరికిఒకరై తోడుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ చెక్కు చెదరని అనుబంధంతో మెలుగుతున్నారు. ఈ ఆదర్శ దంపతుల జీవితం... నిజ జీవిత మిథునం. ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పాత లైబ్రరీ భవనం పక్కన 95 ఏళ్ల జొరిగే ముత్యాలు, 85 ఏళ్ల భార్య దుర్గమ్మ మేదర వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి సాగనంపారు. కుమారులెందరో పుట్టి మరణించడంతో ఓ బాలుడ్ని పెంచుకున్నారు. రెక్కలొచ్చాక ఆ బిడ్డకు ఎగిరిపోయాడు. దీంతో వృద్ధ దంపతులిద్దరూ ఒకరికి ఒకరై 60 ఏళ్లుగా పోలవరం మెయిన్రోడ్డుకి ఆనుకుని ఉన్న ఇంట్లో జీవించేవారు. రహదారి విస్తరణలో ఈ ఇల్లు కూడా పోవడంతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్ల దీస్తున్నారు. భర్తకు స్నానం చేయించడంతో పాటు అన్నం తినిపించడం వంటి అన్ని పనులు భార్య దుర్గమ్మ చేస్తుంది. భర్త బుట్టలు అల్లుతుంటే సాయం అంది స్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేకపోయినా ఈ జంట ఆనందంగా జీవనం సాగిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి!
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగివున్న లారీని మినీట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అన్నవరం నుంచి తిరువూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
70 ఇయర్స్ ఇండస్ ‘ట్రీ’
ఆ దారి వెంట వెళ్తే చాలు... గొడుగు పట్టినట్టు నీడ పరచుకుంటుంది. పచ్చని పసరు వాసన శ్వాసనాళాల్ని శుభ్రం చేస్తుంది. చల్లని గాలి ఒళ్లంతా పెనవేసుకుంటుంది. ఆహ్లాదకరమైన అనుభవం ఆనందాన్ని మిగులుస్తుంది. ఆ ఘనత శాఖోపశాఖలుగా విస్తరించిన కొన్ని మహావృక్షాలకు దక్కుతుంది. డెబ్భయ్యేళ్ల క్రితం నాటిన మొక్కలు వటవృక్షాలుగా ఎదిగాయి. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. కొయ్యలగూడెం మీదుగా ప్రయాణించే వారికి నడిబొడ్డున ప్రధాన సెంటర్ను ఆనుకున్న సువిశాల ప్రాంతంలో విస్తరించిన వటవృక్షం కనిపిస్తుంది. రూ.కోట్ల విలువైన పోలీస్ స్టేషన్ మైదానంలో ఈ భారీ వృక్షం సహా ఇతర వృక్షాలు పచ్చదనంతో పరవశింపజేస్తున్నాయి. ప్రస్తుతం కొయ్యలగూడెంలో ప్రధాన కేంద్రాలైన చెక్పోస్ట్, గణేష్ సెంటర్ల మధ్య నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ స్టేషన్ ఉంది. దీని వెనుకే మహావృక్షాలుగా ఎదిగిన మర్రి, వేప, గానుగ, రావిచెట్లు ఉన్నాయి. వీటి వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన వృద్ధుడు కొల్లూరు పండు గెరటయ్య అందించిన వివరాల ప్రకారం 1945-46 మధ్యకాలంలో మన్యంలో పెద్దపులిని వేటాడిన ఓ కోయదొరను గ్రామానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేటాడిన పులిని, కోయదొరను అప్పటి జమిందారు ఎర్ర గెరటయ్య ఎద్దుల బండిపై వెంట తీసుకొచ్చారు. పులిని చూసిన ఎద్దులు కాడి వదిలి పరుగు తీశాయి. దీంతో ఎడ్ల కళ్లకు గంతలు కట్టి బండిపై పులిని వేసుకుని ప్రస్తుతం చెట్లున్న ప్రాంతంలో ప్రదర్శించారు. ఆ సమయంలో ప్రస్తుతం కొయ్యలగూడెం అభివృద్ధి చెందకపోవడంతో నిర్మానుష్యంగా ఉండేది. ప్రస్తుత పోలీస్ స్టేషన్ను పోలవరం రోడ్లోని మాటూరి పంచాక్షరికి చెందిన పెంకుటింట్లో నిర్వహించేవారు. పెద్దపులిని వేటాడినట్టు తెలిసిసమీప గ్రామాల్లోని వందలాది ప్రజలు చూట్టానికి వచ్చారు. అది తెలిసిన అప్పటి బ్రిటిష్ కలెక్టర్ కొయ్యలగూడెంను సందర్శించారు. రెండ్రోజుల తర్వాత కోయదొరను జమిందార్లు ఘనంగా సన్మానించారు. ఇందుకు గుర్తుగా బ్రిటిష్ కలెక్టర్, జమిందార్లయిన కొల్లూరు ఎర్ర గెరటయ్య, కొల్లూరు వెంకటరత్నం, అంకాలగూడెం మునసబు గంటా జానకి రామయ్య, కన్నాపురానికి చెందిన గెడా గెరటయ్య ఈ మొక్కల్ని నాటారు. మొక్కలు నాటే ఆనవాయితీని సుమారు 70 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అందించారన్నమాట. - కొయ్యలగూడెం -
కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సవతి తండ్రి
కొయ్యలగూడెం :కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడంటూ జంగారెడ్డిగూడెం రోడ్డులోని 8వ వార్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిపై చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం రోడ్డులో ఎస్బీఐ బ్రాంచి సమీపంలో వెల్డింగ్ షాపు యజమాని పంపాని శేషగిరి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. షాపు యజమాని తాడేపల్లిగూడెంలో నివసించే సమయంలో సుబ్బమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండేవాడని, ఎనిమిది నెలల క్రితం ఆమె మరణించడంతో ఆమె కుమార్తె, కుమారుడిని కొయ్యలగూడెం తీసుకువచ్చి ఓ అద్దె ఇంటిలో ఉంచినట్టు కో-ఆర్డినేటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడిని తన వెల్డింగ్ షాపులోనే పనికి పెట్టి నిందితుడు తరచూ ఇంటికి వెళ్లి కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడన్నారు. ఈ విషయం స్థానికులు చైల్డ్లైన్ సెంటర్కు నాలుగు రోజుల క్రితం తెలిపారని, దీంతో చైల్డ్ లైన్ సిబ్బంది కొయ్యలగూడెం వచ్చి అద్దె ఇంటిలో ఉంచిన కుమార్తె వద్దకు వెళ్లి విచారించారన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె కన్నీళ్ల పర్యంతమై తనకు జరుగుతున్న ఘోరాన్ని వివరించింది. చైల్డ్లైన్ కేర్ సిబ్బంది బి.నరేంద్ర, ఎస్.రవిబాబు, ఎస్.సునీత పాల్గొన్నారు. దీనిపై ఎస్సై ఎస్ఎస్ఆర్ గంగాధర్ మాట్లాడుతూ నిందితుడు పంపాని శేషగిరి సుబ్బమ్మకు రెండవ భర్తగా వ్యవహరించాడని, ముందు భర్త పిల్లలు కావడం చేత ఇరువురిపై వేధింపులకు పాల్పడేవాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతును ముంచడమే టీడీపీ లక్ష్యం
కొయ్యలగూడెం : రైతును భూస్థాపితం చేయడమే టీడీపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కనపడుతోందని, ఇందుకు రైతుల భూములను బలిపెట్టి వారి జీవితాలను పణంగా పెడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. సోమవారం కొయ్యలగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ జిల్లా నాయకులు తాడికొండ మురళికృష్ణ, జిల్లా సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవి గంజిమాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించటానికి కృషి చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానిని మరుగునపరిచే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ కొత్త వివాదాన్ని సృష్టించారన్నారు. ఇప్పటికే ఏజెన్సీ, మెట్టప్రాంతంలో చింతలపూడి, కొవ్వాడ ఎత్తిపోతల పథకాలు, పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ నిర్మాణం వలన వేలాది ఎకరాల భూములను రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పట్టిసం ఎత్తిపోతల పథకం పేరుతో మరికొన్ని వందలాది ఎకరాలు భూములను రైతులు వదులుకోవాల్సి పరిస్థితి నెలకొందన్నారు. ఏ మాత్రం ఉపయోగం లేని వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని దారిని మళ్లించడం చంద్రబాబునాయుడు ఎత్తుగడలలో భాగమేనన్నారు. రైతు రుణమాఫీని మర్చిపోవటానికి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కనుమరుగు చేయటానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలతో ఉద్యమాలు నిర్వహిస్తుదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన యూరివర్సిటీ పేరును మార్పు చేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుందని మురళి, గంజిమాల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ పేరు మారిస్తే ప్రజలు తరిమికొడతారు జంగారెడ్డిగూడెం : తాడేపల్లిగూడెం మండలం వెంకట్రాయన్నగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచనను టీడీపీ నాయకులు విరమించుకోకపోతే ప్రజలు వారిని తరిమికొడతారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తక్కువ సాగు నీటితో వాణిజ్యపు విలువలున్న పంటలను రైతులు పండించాలంటే ఉద్యాన అధికారుల సహాయ సహకారాలు అవసరమని వైఎస్ రాజశేఖరరెడ్డి వెంకటరామన్నగూడెం ప్రాంతంలో ఉద్యాన వర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించి రైతులకు ఎంతో మేలు జరిగేలా కృషి చేయడం జరిగిందన్నారు. తరువాత వైఎస్సార్ అకాల మృతి, అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్కుమార్రెడ్డి యూనివర్సిటీకి వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీగా పేరుపెట్టారన్నారు. ఆయన పేరును తొలగించే అర్హత టీడీపీ నాయకులకు ఎక్కడిదని బాలరాజు ప్రశ్నించారు. అబద్దపు వాగ్ధానాలతో రైతులను, ప్రజలను ఘోరంగా మోసంచేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను అయోమయంలో, గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాలే కారణమన్నారు. అటువంటి గోదావరి జిల్లాల ప్రజలను ఆందోళన పరిచేవిధంగా టీడీపీ పాలన సాగుతోందని విమర్శించారు. వర్సిటీ పేరు తొలగించే ప్రయత్నం మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
గాంధీజీ విగ్రహం తొలగింపు అమానుషం
* వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు * కొయ్యలగూడెంలో గాంధీజీ విగ్రహానికి క్షీరాభిషేకం కొయ్యలగూడెం : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించడం అమానుషమైన చర్య అని, టీడీపీ నాయకుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొయ్యలగూడెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతిపితను యావత్ ప్రపంచం కూడా ఎంతో గౌరవిస్తుందని, అటువంటిది పెదవేగి మండలం చోదిమళ్ల పంచాయతీ పరిధిలోని దొండపాడులో టీడీపీ నాయకులు జాతిపిత విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేస్తున్న అరాచకాలకు జరిగిన ఘోరం పరాకాష్టగా నిలిచిందని, ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకతీతంగా ఇటువంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. జరిగిన అవమానాన్ని శాసనసభ స్పీకర్, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నామన్నారు. తొలగించిన చోటే మహాత్ముని విగ్రహాన్ని నిలబెట్టి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అనంతరం బస్టాండ్ నుంచి గణేష్ సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి బాలరాజు క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కన్వీనర్ మట్టా శ్రీనివాస్, జిల్లా సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీ గంజిమాల, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్కుమార్లతో కలిసి ఎంపీటీసీ కొట్రా గంగారత్నం, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కొవ్వాసి నారాయణరావు, డీసీసీబీ డెరైక్టర్ పొడియం శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆరేటి సత్యనారాయణ, గంజిమాల రామారావు, చిన్నం గంగాధరం, కాసగాని గోఖలే, ఎస్కే బాజీ, దూలపల్లి కాంతారావు, సంకు కొండ, ఎస్కే నవాబ్, ఎస్కే వహాబ్ పాల్గొన్నారు. -
పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట
కుంతలగూడెం (కొయ్యలగూడెం) : వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించక పోవడంతో పోలీసుల సాక్షిగా స్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి ఒక ప్రేమజంట దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. యర్రంపేట పంచాయతీ శివారు గ్రామం కుంతలగూడెంకు చెందిన బొల్లిపో సత్తిపండు, గెడ్డం సౌజన్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి సత్తిపండు పెద్దలు అంగీకరించపోవడంతో వారు బీజేపీ మండల నాయకుడు కొమనారపు సుబ్బారావును కలవగా, ఆయన సౌజన్య చిన్నాన్న అబ్బులును తీసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ప్రేమికులు ఇద్దరూ డిగ్రీ విద్యార్థులు కావడంతో, మేజర్లుగా గుర్తించి ఎస్సై గంగాధర్ ఇరు కుటుంబాలకు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. సత్తిబాబు పెద్దలు అంగీకరించకపోవడంతో రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం చేసుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం ప్రేమికులు ఇద్దరు స్టేషన్ ఎదుట దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
కొయ్యలగూడెం : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన పెరువిజ్జు వీరవెంకటసత్యనారాయణ, ఇదే గ్రామానికి చెందిన చిట్రోజు దుర్గాదేవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారని, ఈ నెల 6న ద్వారకాతిరుమలలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నట్టు తెలిపారని ఎస్సై చెప్పారు. పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ తమను ఆశ్రయించారన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. -
హోటల్లో సిలిండర్ల పేలుడు: భారీగా ఆస్తి నష్టం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలోని ఓ హోటల్లో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అయితే హోటల్ పక్కనే ఉన్న ఐదు దుకాణాలు కూడా ఆ అగ్నికి ఆహుతి అయ్యాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. -
మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ కలకలం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడు హరినాథ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారనే వదంతులు వ్యాపించాయి. వారు డబ్బు డిమాండ్ చేయటంతో మాజీ ఎంపీటీసీ గురువారం జంగారెడ్డి గూడెం వెళ్లి వారికి రూ.10 లక్షలు ముట్టచెప్పినట్లు సమాచారం. అయినా కిడ్నాపర్లు అతడిని విడిచి పెట్టకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్కు గురైన హరినాథ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తుండగా... అతడిని జూలై 28న ఖమ్మం జిల్లా మందలపల్లి వద్ద అపహరణకు గురయ్యాడు. అయితే అతడిని కిడ్నాప్ చేసింది మావోయిస్టులా... లేక నకిలీలా ...వ్యాపారానికి సంబంధించిన బకాయిదారులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ ఫైనాన్స్ వ్యాపారి కుమారుడు హరినాథ్ను దుండగులు వారం క్రితం అపహరించుకు వెళ్లారు. అతడిని విడిచిపెట్టాలంటే పెద్ద మొత్తంలో నగదు ముట్టచెప్పాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దాంతో హరినాథ్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు ముట్టచెప్పారు. అయినా కిడ్నాపర్లు హరినాథ్ను విడిచి పెట్టకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. -
కంగుతిన్న చంద్రబాబు
ఏలూరు: బెల్ట్ షాపులు మూయించడని పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఈ రోజు జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలు విజ్ఞప్తి చేశారు. బెల్ట్ షాపులు ఉన్నాయా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఉన్నాయని మహిళలు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఎక్సైజ్శాఖ పనితీరు బాగాలేదని ఆగ్రహిం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలమాఫీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు. డబ్బులు కట్టినా, కట్టకపోయినా న్యాయం చేస్తామన్నారు. రుణమాఫీపై మాట తప్పేది లేదని చెప్పారు. టిడిపి అధికారంలోకి రావడానికి మహిళా చైతన్యమే కారణం అన్నారు. విభజన ద్యారా వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. నూతన రాజధాని నిర్మాణానికి డ్వాక్రా సంఘాల మహిళలు 62 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడికి తీవ్ర గాయాలు
కొయ్యలగూడెం, న్యూస్లైన్ : స్టేట్ హైవేపై కొయ్యలగూడెంలోని హార్టిజన్ కాంప్లెక్స్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిబోయిన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్ మోటార్ బైక్పై పొలం వెళ్తుండగా రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్తో సహా శ్రీనివాస్ను సుమారు 15 అడుగుల దూరం కారు ఈడ్చుకుపోయి ందని స్థానికులు తెలిపారు. బైక్ను ఢీకొన్న అనంతరం కారు రోడ్డు పక్కనున్న తుప్పల్లోకి దూసుకుపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను స్థానికులు 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైతు సంఘం నాయకుడు పిల్లా రామారావు, పలువురు బీజేపీ నాయకులు శ్రీనివాస్ను పరామర్శించడానికి జంగారెడ్డిగూడెం తరలి వెళ్లారు. -
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వీరాస్వామి కొయ్యలగూడెం, న్యూస్లైన్ : ఏసీబీ వలకు శుక్రవారం గవరవరం విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ వీరాస్వామి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవరవరానికి చెందిన రైతు గారపాటి శ్రీనివాసరావు పొలంలో ఈ నెల 22న తాడిచెట్టు కొడుతుండగా అది విరిగి 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానిని సరిచేయటం కోసం గవరవరం సబ్స్టేషన్ ఏఈ వీరాస్వామి రైతను రూ.25 వేలు లంచం అడిగాడు. రూ.5 వేలకు మించి ఇచ్చుకోలేనని శ్రీనివాసరావు బతిమాలినా ఏఈ పట్టు వీడలేదు. దీంతో శుక్రవారం అతను ఏలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఏఈపై వల పన్నారు. వారు రైతుకు రూ.10వేలు ఇచ్చి గవరవరంలో ఏఈ చాంబర్కు పంపించారు. లుంగీలు ధరించిన ఏసీబీ అధికారులు సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టులో కూర్చున్నారు. శ్రీనివాసరావు సెల్ఫోన్ ఆన్చేసి ఏఈతో మాట్లాడుతూ ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన రూ.10వేలు ఆయనకు ఇచ్చి లెక్క చూసుకోండి అని అన్నాడు. సెల్ ఫోన్లో వారి సంభాషణ వింటున్న ఏసీబీ అధికారులు వెంటనే సబ్స్టేషన్లోకి వచ్చారు. అప్పటికి ఏఈ చేతిలో రైతు ఇచ్చిన నోట్లు ఉన్నాయి. వాటిని ఏసీబీ అధికారలు స్వాధీనం చేసుకున్నారు. రైతు శ్రీనివాసరావు, ఏఈ వీరాస్వామిలను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్ విచారించారు. అనంతరం తాడిచెట్టు పడిన ప్రదేశం వద్దకు వారిద్దరినీ తీసుకెళ్లారు. స్థానిక రైతులను కూడా వివరాలు అడిగారు. అరెస్ట్ చేసిన ఏఈ వీరాస్వామిని శనివారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. తనతోపాటు అనేక మంది రైతులను ఏఈ వీరాస్వామి పీడించుకు తింటున్నారని శ్రీనివాసరావు చెప్పాడు. ట్రాన్స్ఫార్మర్ల మార్పు, విద్యుత్లైన్ల వేసే విషయంలో ఆయన చాలా మంది రైతులను లంచాల కోసం పీడించారని తెలిపాడు. -
సినీనటుడు పొట్టి సత్యం మృతి
కొయ్యలగూడెం: తెలుగు చలనచిత్రాలలో కేరెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన పొట్టిసత్యం(85) ఆదివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక వైఎస్సార్ నగర్లోని బంధువులైన శెనగశెట్టి లక్ష్మీనారాయణ, శెనగశెట్టి వెంకటేశ్వరరావు ఇంటివద్ద గడుపుతున్నారు. చెన్నై టినగర్లో ఉండే సత్యంకి నా అన్నవారు ఎవరూ లేరు. దీంతో నెల క్రితం ఆయన వరుసకు సోదరులైన తమ ఇంటికి వచ్చినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. గవరవరంలోని తమపొలంలో ఉన్న ఇంటివద్ద ఉంచి చికిత్స చేయిస్తున్నామని, ఆరోగ్యం విషమించి మరణించారని పేర్కొన్నారు. 150కి పైగా తెలుగు, తమిళ చలనచిత్రాలలో నటించారని వివరించారు. ప్రముఖ నటుడు మోహన్బాబుతో సత్యంకు ఉన్న పరిచయంతో అసెంబ్లీ రౌడీ, పెద రాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాలలో హాస్య,కేరెక్టర్ పాత్రల్లో నటించారన్నారు. పొట్టి సత్యం స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామం. -
యువకుడిని బలిగొన్న లారీ
కొయ్యలగూడెం, న్యూస్లైన్ :చెరకులోడు లారీ అదుపుతప్పి పొలంలోని పాకలోకి దూసుకుపోయి బోల్తా పడటంతో పాకలో నిద్రిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించారు. మండలంలోని రాజవరం-కేతవరం గ్రామాలమధ్య శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇవి.. రాజవరం గ్రామానికి చెందిన శింగంసెట్టి రాంబాబు(25) శుక్రవారం రాత్రంతా తన మొక్కజొన్న తోటకు నీరుపెట్టాడు. అతని తండ్రి చంద్రరావు ఇక విశ్రాంతి తీసుకోమని రాంబాబుకి చెప్పటంతో బాగా అలసిపోయిన అతను పొలంలోని పాకలో నిద్రపోయాడు. శనివారం మధ్యాహ్నం తాడువాయిలోని షుగర్ ఫ్యాక్టరీకి చెరకులోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి పాకలోకి దూసుకుపోయి రాంబాబుపై బోల్తా పడింది. అతను చెరకు కట్టలకింద ఉండిపోయాడు. స్థానికులు చెరకుకట్టల్ని తొలగించి చూడగా అతను అప్పటికే మరణించాడు. రాంబాబు కష్టజీవి విశ్రాంతి తీసుకోమని అన్నానని, ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చిందని తండ్రి చంద్రరావు విలపిస్తూ చెప్పాడు. అవివాహితుడైన రాంబాబుకి పెళ్లి సంబంధాలు చూస్తుం డగా ఆ ఇంట విషాదం మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాంబాబు కష్టజీవిఅని, ఇద్దరు సోదరిలకు వివాహం చేశాడని, తమ్ముడుకికూడా వివాహం చేసిన తరువాత తాను పెళ్లిచేసుకుంటానని అంటుండేవాడని తల్లి జయమ్మ రోదిస్తూ తెలిపింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక రైతులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
బాబు రాజకీయ జీవితానికి చరమగీతం
కొయ్యలగూడెం , న్యూస్లైన్ : వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో రెండుసార్లు చావుదెబ్బతిన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతిలో పూర్తిగా ముగియనుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన పోలవరం నియోజ కవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాగూ రాజకీయ సమాధి తప్పదని తెలిసిన చంద్రబాబు మహానేత వైఎస్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతూ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. పిల్లనిచ్చిన పాపానికి నోరుమెదపలేని స్థితిలో బాలకృష్ణ ఉండగా, ఎన్టీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరైనా టీడీపీలో మనగలుగుతున్నారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరికి రాజకీయ జీవితం ప్రసాదించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అయితే, సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడికి రాజకీయ సమాధి కట్టిన ఘనత అతని అన్న చంద్రబాబుదని అంబటి ధ్వజమెత్తారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ... విభజించి పాలించు అనే ఆంగ్లేయుల సిద్ధాంతాన్ని సోనియాగాంధీ పాటిస్తూ రాష్ట్ర విభజనకు వంతపాడి తనలో కూడా తెల్లవారి రక్తం ఉందని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మహానేత వైఎస్సార్ లక్ష్యమని, దానిని పూర్తి చేయటమే వైసీపీ లక్ష్యమని చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తే తెలం గాణ ఇవ్వడం ఎవరి తరం కాదన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి జాతీయ నేతల మద్దతు కూడగట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సఫలమవుతున్నారని పే ర్కొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి తాడికొండ మురళీకృష్ణ, మండల కన్వీనర్ ఎస్ఆర్ఆర్ నరసింహరాజు, నాయకులు పోతన శేషు, చిన్నం గాంధీ, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కోర్సా వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం నాయకులు కె. కృష్ణస్వరూప్, పి. శ్రీనివాస్, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి కావూరికి సమైక్య సెగ
కొయ్యలగూడెం, న్యూస్లైన్ : కొయ్యలగూడెం మండలంలో పర్యటనకు మంగళవారం వచ్చిన కేంద్ర జౌళి శాఖా మంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలిసి స్థానిక గణేష్ సెంటర్లో వందలాది మంది సమైక్యవాదులు గుమిగూడారు. ఐటీడీఏకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ని అడ్డుకుని ఆయనను కారులోంచి దిగాల్సిందిగా కోరారు. కారు దిగి నాయకులు చెప్పిన విషయాలను మంత్రి ఆలకించారు. సమైక్య రాష్ట్రంపై ఏమీ చెప్పకుండానే కారు ఎక్కడంతో సమైక్యవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. డీఎస్పీ రాఘవ, పోలీసు సిబ్బంది వారిని పక్కకు నెట్టేశారు. అనంతరం కాన్వాయ్ దిప్పకాయలపాడు చేరుకుంది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎస్ఆర్ఆర్ నరసింహరాజు, సమైక్య పరిరక్షణ ఉద్యమ యూత్ జేఏసీ సభ్యుడు గంగిరెడ్ల సతీష్, ఉపాధ్యాయుల సంఘాలు, ఎన్జీవో సంఘ నాయకుల ఆధ్వర్యంలో వందలాది మంది స్థానిక తూర్పు కాలువ బ్రిడ్జి వద్ద బైఠాయించి మంత్రిని అడ్డుకున్నారు. మంత్రి కారు దిగి ఉపాధ్యాయ సంఘం నాయకుని చేతిలో చెయ్యివేసి పార్లమెంట్లో సమైక్యరాష్ట్రానికి మద్దతుగా ఓటువేస్తానని ప్రమాణం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని మంత్రిని కోరారు. సహనం కోల్పోయిన మంత్రి మీకు చెప్పాల్సిన పని లేదనడంతో సమైక్యవాదులు ‘గోబ్యాక్ కావూరి’ అంటూ నినాదాలు చేశారు.