సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని తుళ్లూరుకి దగ్గరలో మంగళగిరి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని సింగపూర్ కంపెనీ రూపొందించిన రాజధాని ప్రణాళికలో స్పష్టం చేసింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్మించనున్న దీనికిగాను దాదాపు 5 వేల ఎకరాల భూమిని రిజర్వ్ చేశారు. విపక్షంలో ఉండగా వాడరేవు-నిజాంపట్నం పోర్టు-పారిశ్రామిక కారిడార్(వాన్పిక్)పై తీవ్రస్థాయిలో చేసిన విమర్శలు మరిచిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ సంస్థకే నూతన రాజధాని అభివృద్ధిలో కీలక భూమిక అప్పగించనున్నారు.
మంగళగిరిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్!
Published Mon, Apr 13 2015 3:34 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement