పలు రైళ్ల రద్దు | Many trains canceled | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల రద్దు

Published Thu, Apr 3 2014 12:29 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

పలు రైళ్ల రద్దు - Sakshi

పలు రైళ్ల రద్దు

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ సమీపంలోని కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో వివిధ అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 24వ తేదీ వరకూ అంచెలంచెలుగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసేందుకు వాల్తేరు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని వల్ల కోరాపుట్, కిరండూల్, జగదల్‌పూర్, భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది తప్పదు.
 
 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసిం జర్(58501)ను మూడో తేదీన కోరాపుట్-కిరండూల్ మధ్య రద్దు చేశారు. ఈ రైలు కోరాపుట్ నుంచే విశాఖకు బయల్దేరుతుంది.
 
కిరండూల్-విశాఖపట్నం(5850 2) ప్యాసింజర్ ఈ నెల 8వ తేదీన కిరండూల్‌లో ఉదయం 6 గంటలకు బదులు 8 గంటలకు బయల్దేరుతుంది.
 
భువనేశ్వర్-జగదల్‌పూర్ వెళ్లే హిరాకండ్ ఎక్స్‌ప్రెస్(18447) ఈనెల 17వ తేదీన జగదల్‌పూర్‌కు షెడ్యూల్ సమయానికే చేరుతుంది. కానీ కోరాపుట్‌లో పాక్షికంగా రద్దు చేస్తున్నారు. తిరిగి కోరాపుట్ నుంచి 18448గా  జగదల్‌పూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌గా బయల్దేరుతుంది. కోరాపుట్-జగదల్‌పూర్ మధ్య ఈ రైలు 17న పాక్షికంగా రద్దవుతుంది. 24వ తేదీన కూడా కోరాపుట్-జగదల్‌పూర్ మధ్య పాక్షి కంగా రద్దు చేస్తున్నారు.
 
 కిరండూల్-విశాఖపట్నం ప్యాసిం జర్(58502) ఈ నెల 17వ తేదీన కిరండూల్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరడానికి బదులు ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement