గుత్తి (అనంతపురం) : ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని కోట వీధికి చెందిన శ్రావణి(19)కి ఏడాది కిందట మేన మామతో వివాహమైంది. ఆమె డిగ్రీ మొదటి ఏడాది చదువుతుండగానే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. అయితే శ్రావణి ఈ రోజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
వివాహిత బలవన్మరణం
Published Mon, Aug 31 2015 5:29 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement