వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి | may 1st, 2nd ys jagan deeksha in guntur | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి

Published Sun, Apr 30 2017 3:35 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి - Sakshi

వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి

గుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌ చేపట్టనున్న దీక్షలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నల్లపాడురోడ్డులో వేదిక వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీక్షకు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు భారీ ఎత్తున తరలిరానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement