peddireddy ramachandrareddy
-
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
‘ప్రశాంత్ కిషోర్ను మేం వదిలేశాక బాబు పట్టుకున్నారు’
సాక్షి, చిత్తూరు: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ప్రశాంత్ కిషోర్ను మేము వదిలేశాక బాబు పట్టుకున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉందని మండిపడ్డారు. ‘‘2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయి. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుయుక్తులు పన్నిన వచ్చే ఎన్నికల్లో తిరిగి సీఎం జగనేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్ -
రాష్ట్రంలో కొత్తగా 100 ఎకో టూరిజం ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వంద పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) ప్రాజెక్టులను ప్రారంభించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అటవీ శాఖ డివిజన్ పరిధిలో కనీసం 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్లు నెలకొల్పాలని సూచించారు. విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి చెప్పారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామ్ లేదా రోప్వే ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జన నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో నాటేందుకు మొక్కలను సమకూర్చాల్సి ఉందన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెరగాలి రాష్ట్రంలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ విద్యుత్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఇంధనశాఖ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని చెప్పారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వా జోన్ పరిధిలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్ను అందిస్తోందని, దీనిపై సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్ను సబ్సిడీపై అందిస్తున్నాం, జోన్ పరిధిలో ఎంత డిమాండ్ ఉందనే వివరాలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. -
‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుంది. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. టీడీపీ అధినేత డైరెక్షన్లోనే పాదయాత్ర నడుస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు భయపడి వారి గొంతు నొక్కేసుకుంటున్నారు’ అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు అంటూ కామెంట్స్ చేశారు. -
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే నేను..
-
AP New Cabinet: ముచ్చటగా మూడు.. చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం
రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. చదవండి: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పార్టీ పదవులతో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రి వర్గంలో జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, దళితులకు మంత్రి పదవుల్లో పెద్దపీట వేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం హోదాను సైతం జిల్లాకే కట్టబెట్టారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచి, రాయలసీమ జిల్లాల్లోనే పెద్దాయనగా పిలిచే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పార్టీ కష్టకాలంలో జిల్లా అ«ధ్యక్షుడుగా అందరినీ కలుపుకుని పార్టీని నడిపించిన కళత్తూరు నారాయణస్వామికి తొలి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలోనూ ఏ జిల్లాకూ దక్కని అరుదైన గౌరవాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కట్టాబెట్టారు. పెద్దాయన పెద్దిరెడ్డి స్థానం పదిలం చేశారు. నారాయణస్వామి విధేయతను సుస్థిరం చేశారు. ఇద్దరినీ తిరిగి మంత్రులుగా కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు జిల్లాకు బోనస్గా మూడో మంత్రి రూపంలో ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. పునర్వ్యవస్తీకరణలోనూ మంత్రి పదవుల కేటాయింపుల్లో ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి, దళితులకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, రెడ్డి సామాజికి వర్గానికి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులుగా బెర్త్ ఖరారు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మూడు మంత్రి పదవులతో అరుదైన గౌరవం కల్పించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంబరాన్నంటిన సంబరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వైఎస్ జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితోపాటు రోజా అభిమానులు, నేతలు విజయవాడకు తరలివెళ్లారు. రోజా వికాసం.. వెల్లువెత్తిన హర్షం నగరి/నిండ్ర/పుత్తూరు రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు స్థానం దక్కడంపై నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. నిండ్రలో సైతం పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పరస్పరం తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రారెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్పన్, నగరి కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ తిరుమలరెడ్డి, పార్టీ రాష్ట్ర యవజన విభాగం ప్రదాన కార్యదర్శి శ్యామ్లాల్, నిండ్ర ఎంపీపీ దీప, పార్టీ మండల కనీ్వనర్ వేణురాజు పాల్గొన్నారు. పుత్తూరులో నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. అ‘ద్వితీయ కళ’త్తూరు కార్వేటినగరం/వెదురుకుప్పం/పెనుమూరు : డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రెండో పర్యాయం మంత్రి పదవి దక్కడంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ ధనంజయవర్మ, కో–ఆప్షన్ సభ్యుడు పట్నం ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్రెడ్డి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ సుమతి, నేతలు శేషాద్రి, సుమతి పాల్గొన్నారు. పెనుమూరులో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నేతలు దూది మోహన్, బండి కమలాకరరెడ్డి, కండిగ మధు, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాలినడకన కొండకు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడికి కేబినెట్లో మళ్లీ స్థానం దక్కాలని కోరుతూ కార్వేటినగరం ఎంపీపీ లతాబాలాజీ దంపతులు ఆదివారం అలిపిరి మార్గం గుండా తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఎంపీపీ లతాబాలాజీ మాట్లాడుతూ పెద్దిరెడ్డి, నారాయణస్వామికి మంత్రి పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. విధేయతకు పట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయత చూపే అతికొద్ది మంది నాయకుల్లో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఒకరు. నిజాయతీ, వైఎస్సార్ కుటుంబంపై విధేయత ఆయనకు అభరణాలు అని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. అందుకే తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవికి నారాయణస్వామిని తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉపముఖ్యమంత్రి హోదాను సైతం కల్పించారు ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలోనూ ఆయనకు రెండోసారి మంత్రి మండలిలోకి తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి రెండోసారి మంత్రిమండలిలో చోటుదక్కడంపై హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మూడేళ్ల పాటు మంత్రిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాయన ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. వైఎస్సార్ దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ప్రప్రథమ జిల్లా అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రత్యేకించి దళిత సామాజికర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మళ్లీ చోటు కల్పించారు. రెండోసారి మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సమర్థతకు గౌరవం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ చోటుదక్కింది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా అధికారంలో ఉన్న టీడీపీకి దీటుగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ కుప్పం మినహా క్లీన్స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో విడత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలోనూ చోటుదక్కించుకుని, తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత చేసుకున్నారు. సేవకు అందలం రాజకీయంగా ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వెన్నుచూపని ధీరురాలుగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం ఆమె పారీ్టలో కీలకభూమిక పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆయన వెంట నడిచారు. 2014, 2019లో నగరి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, పాలకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఆసెంబ్లీలో తన వాగ్ధాటితో అధికార పక్షానికి ఆమె ముచ్చెమటలు పట్టిస్తూ ఫైర్బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు. అసెంబ్లీలో ఉంటే కష్టమని భావించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆమెను అక్రమంగా ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా నిషేధం విధించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఆశించినా సామాజిక సమతుల్యత వల్ల చోటు దక్కలేదు. అయినా ఆమె సేవలను గుర్తించి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్గా రాష్ట్ర స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు మంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చోటకల్పించారు. తొలిసారి మంత్రిగా ఆమె సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచి వ్యక్తికి అవకాశం కోవిడ్ సమయంలో ఎమ్మెల్యే ఆర్కేరోజా సేవలు ప్రత్యక్షంగా చూశా. అందరికీ అందుబాటులో ఉంటూ, ఎందరినో ఆదుకున్నారు. పారీ్టలను పట్టించుకోకుండా సాయం అందించారు. అలాంటి మంచి వ్యక్తికి మంత్రిగా అవకాశమివ్వడం ఆహ్వానించాల్సిన అంశం. కేబినెట్ ఎంపికలో ముఖ్యమంత్రి చక్కటి కసరత్తు చేశారని అర్థమవుతోంది. – పి. బాలసుబ్రమణ్యం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పుత్తూరు సమ న్యాయం చేశారు కేబినెట్ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారు. ప్రధానంగా 75శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ అభినందనీయం. కొత్త మంత్రులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నాం. – రాజరత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు ఎంపిక బాగుంది నూతన మంత్రులను పక్కాగా ఎంపిక చేశారు. సీనియర్ల అనుభవాన్ని వదులుకోకుండా అవకాశం కల్పించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కొత్తవారిని తీసుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాకు మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉంది. -విజయశేఖర్, చిత్తూరు సమర్థతకు పట్టం నూతన మంత్రి వర్గంలో ఎస్సీలపై ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. అనుభవజు్ఞడైన నారాయణస్వామికి మళ్లీ అవకాశం కలి్పంచి సమర్థతకు పట్టం కట్టారు. ప్రజలకు సేవ చేసే నాయకులను మరువకుండా పదవులు కట్టబెట్టారు. ఇది హర్షించదగ్గ విషయం. – వినాయకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
బి.కొత్తకోట/బెంగళూరు/చిత్తూరు కలెక్టరేట్: తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్నాయక్ బి.సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో శనివారం అందించారు. కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడవారిపల్లె వచ్చారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహనలను పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. లాన్స్నాయక్ సాయితేజ విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సాయితేజ చేసిన సేవ గొప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. శ్యామల విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మదనపల్లెలో ఇంటిస్థలాన్ని కేటాయిస్తామన్నారు. పిల్లల చదువుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం సాయితేజ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. నేడు ఎగువరేగడలో అంత్యక్రియలు కాగా, సాయితేజ భౌతికకాయం శనివారం బెంగళూరు చేరుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరులోని యలహంక ఎయిర్బేస్కు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తరలించగా.. అక్కడ ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం వరకు సాయితేజ పార్థివదేహం బెంగళూరులోనే ఉండనుంది. అనంతరం బెంగళూరు నుంచి స్వగ్రామమైన ఎగువరేగడ గ్రామానికి పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్కుమార్, ఎస్ఐలు సుకుమార్, రామమోహన్ పరిశీలించారు. కడవరకు దేశ సేవలోనే ఉంటా: మహేష్బాబు తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్బాబు కురబలకోట మండలం రేగడవారిపల్లెలో శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘డిసెంబర్ 8న మేం పనిచేస్తున్న రెజిమెంట్ ఏఎస్పీ క్రోర్ డే వేడుకలు జరుపుకుంటుండగా మధ్యాహ్నం సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే సమాచారం వచ్చింది. ఆ వెంటనే వేడుకల్ని నిలిపివేశారు. టీవీల్లో చూస్తుండగా సాయితేజ కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తల్లో వచ్చింది. సాయితేజ అంటే ఎంతోమంది ఉండవచ్చు, అన్నపేరు బి.సాయితేజ కదా అని సర్దిచెప్పుకొన్నా. తర్వాత వదిన శ్యామలకు ఫోన్చేసి అన్న ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పాడా అని అడిగితే.. లేదని సమాధానం వచ్చింది. అన్న మిత్రులైన జవాన్లకు ఫోన్చేస్తే సెలవుల్లో ఉన్నామన్నారు. అన్న మొబైల్ స్విచ్చాఫ్ వస్తోంది. టెన్షన్ భరించలేకపోయా. చివరికి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే నిజమైంది. ప్రమాదంలో మరణించిన సాయితేజ నా సోదరుడేనని తెలిసింది. మా అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. అన్న మరణం తీరని లోటే అయినా, నేను జవానుగానే కొనసాగుతాను. తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తా. సాయితేజ మృతి నాకే కాదు.. ఎందరో యువకులకు తీరని లోటు’ అన్నారు. -
చంద్రబాబుకు చేతనైతే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తోంది: సజ్జల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆది మూలపుసురేష్ ,సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు పాదయాత్రల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు.. వైఎస్సార్సీపీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా ముక్తకంఠంతో తమ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని సజ్జల అన్నారు. కాగా, నిజమైన ప్రజల పక్షంగా ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించిందని సజ్జల అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సజ్జల పేర్కొన్నారు. -
తిరుపతి లో నేడు 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
-
‘కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారు’
చిత్తూరు: చంద్రబాబుకు పిచ్చి పతాకస్థాయికి చేరుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియడంలేదని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుకు బాగా తెలిసిన విద్యలని దుయ్యబట్టారు. మొదటినుంచి మోసాలు చేయడం చంద్రబాబుకు అలవాటని ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్కు అరుదైన గౌరవం సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని హెచ్చరించారు. కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. 17న ఫలితాలు వస్తాయని, అప్పుడు చంద్రబాబు ఏం చెప్తారో చూస్తామని అన్నారు. ఆయనతో పాటు ప్రచారంలో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
-
యాప్ ద్వారా పారదర్శకంగా ఇంటి పన్ను వసూలు: పెద్దిరెడ్డి
-
గ్రామాల్లో మొబైల్ యాప్తో ఇంటిపన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఇక నుంచి గ్రామాల్లో ఇంటి పన్నును అన్లైన్ విధానంలోనే వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఇంటిపన్ను పూర్తి పారదర్శకంగా నూరు శాతం వసూలవుతుందని తెలిపారు. గ్రామాల్లోని సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సేకరించి, ఆ వివరాలను యాప్తో ఇప్పటికే అనుసంధానం చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామాల్లో మాన్యువల్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇలా అన్లైన్ విధానంలో పన్ను చెల్లించిన వెంటనే అన్లైన్లోనే రశీదు తయారై, ఆ రశీదు వెంటనే పన్ను చెల్లించిన వారి మొబైల్ నెంబరుకు వెళ్తుందని మంత్రి చెప్పారు. అంతేకాక.. ఇంటి యజమానులకు ఎంత పన్ను చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలి అనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా ఆయా పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని వివరించారు. పొదుపు సంఘాల కార్యక్రమాలపైనా సమీక్ష పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పెన్షన్ల పంపిణీ అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సచివాలయంలోని తన ఛాంబరులో సెర్ప్ అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో నవరత్నాల నిలయం
-
చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: పశువుల పేడ, ఇతర వ్యవసాయ వ్యర్థాల ద్వారా పెద్ద తరహా (కస్టర్ బేస్డ్) బయోగ్యాస్ తయారీ యూనిట్లను పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీతోపాటు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్–ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్కుమార్ , మరో 12 రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గోబర్–ధన్ పథకంలో రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ల ఏర్పాటుకు కృష్ణా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అవకాశం ఉందని గుర్తించినట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో కనీసం 50 కంటే ఎక్కువగా పశువులున్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం గుర్తించినట్టు చెప్పారు. వాటిలో మొదట పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి, తర్వాత మిగిలిన మూడు జిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో గోబర్–ధన్ పథకం కింద పశువ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్ధతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం డీపీఆర్లను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించామని, వారి ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకం కింద ఏర్పాటుచేసే ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్, కంపోస్ట్లను మార్కెట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు.. గోబర్–ధన్ పథకం కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నామని, ఇంకా అవసరమైతే 15వ ఆర్థికసంఘం నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత గృహాల మోడల్, క్లస్టర్ మోడల్, కమ్యూనిటీ మోడల్, కమర్షియల్ మోడళ్లలో ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవికాకుండా రాష్ట్రమంతటా ఘన వ్యర్థాలను శుద్ధిచేసేందుకు, సేంద్రియ ఎరువులుగా మార్చేందుకు ఉపాధిహామీ పథకం కింద 10,645 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1,042 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలైందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
బొగ్గు మైనింగ్లో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: సొంతంగా బొగ్గు తవ్వకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కీలకమైన ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలోని 1,298 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించింది. ఈ వారంలోనే అక్కడ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవనుంది. మొదటగా దాదాపు రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుల్యారీ గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును లీజు సమయం ఉన్న 22 ఏళ్ల పాటు వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు తవ్వకం వల్ల ఆ ప్రాంతంలో నిర్వాసితులవుతున్న 1,250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిజర్వు చేయాలని నిర్ణయించారు. మైనింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు రాష్ట్ర పురోభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు.. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలు కావడానికి సీఎం దూరదృష్టే కారణం. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాజెక్టులను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుల్యారీ ప్రాజెక్టును త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చిన ఏపీఎండీసీ అధికారులను అభినందిస్తున్నా. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మైనింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొగ్గు తవ్వకాలతో సంస్థ పరిధిని విస్తరిస్తాం బెరైటీస్ మైనింగ్లో అంతర్జాతీయ మార్కెట్ను సృష్టించుకున్న ఏపీఎండీసీ.. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సుల్యారీలో బొగ్గు తవ్వకాల ద్వారా సంస్థ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని మదన్పూర్ సౌత్ బ్లాక్, జార్ఖండ్లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్లను ఏపీఎండీసీ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అక్కడ కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్, సిలికాశాండ్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్పై కూడా దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ భేటీ
-
నేటినుంచి సర్పంచులకు శిక్షణ
సాక్షి, అమరావతి: ఏపీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై గురువారం నుంచి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఆగస్టు 14 వరకు పంచాయతీరాజ్శాఖ, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్ఐఆర్డీ) ఆధ్వర్యంలో కొనసాగే ఈ శిక్షణ తరగతులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని ఎస్ఐఆర్డీ డైరక్టర్ జె.మురళి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 60 కేంద్రాల్లో ఈ తరగతులు మొదలవుతాయన్నారు. సర్పంచులకు రెసిడెన్షియల్ పద్ధతిలో వారి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రతి తరగతికి 20 మందే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కో బ్యాచ్లో ప్రతి జిల్లాలో 120 మందికి మాత్రమే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఒక్కో బ్యాచ్కి 3 రోజులపాటు 14 అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి జిల్లాలో గరిష్టంగా 7 బ్యాచ్లు ఉంటాయని చెప్పారు. ఈ తరగతుల నిర్వహణకు మొదటి విడతగా జిల్లాలకు రూ.1,77,63,998 విడుదల చేసినట్టు చెప్పారు. సర్పంచుల్లో గర్భిణులకు మినహాయింపు ఇచ్చామని, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చే 14 అంశాలు తొలిరోజు 1. గ్రామ పంచాయతీలు, మన స్థానిక ప్రభుత్వాలు– గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత 2. సర్పంచ్, వార్డుసభ్యులు, సిబ్బంది అధికారాలు, విధులు, బాధ్యతలు 3. స్థానిక స్వపరిపాలన– గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలు, కార్యచరణ కమిటీలు 4. మౌలిక వసతుల కల్పనతో గ్రామాభివృద్ధి – తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, వీధిదీపాలు మొదలైనవి 5. పారిశుధ్యం – జగనన్న స్వచ్ఛ సంకల్పం రెండో రోజు 6. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్1 7. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్ 2 8. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు 9. గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయాలు– వ్యయ నియమాలు– బడ్జెట్, అభివృద్ధి ప్రణాళికలు 10. ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు– నవరత్నాలు– గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న వివిధ పథకాలు మూడో రోజు 11. పారదర్శక పాలన– పంచాయతీలపై పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ 12. పంచాయతీ రికార్డులు, నివేదికలు 13. గ్రామ పంచాయతీలో జవాబుదారీతనం– క్రమశిక్షణ 14. కేంద్ర ఆర్థికసంఘం నిధులు, ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ -
గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గృహ వినియోగదారుల విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన గ్రామ ఉజాలా పథకాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సీడ్కోల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఈ ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ పథకం అమలుపై చర్చించేందుకు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య బుధవారం రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉందని మహువా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పటికే బిహార్, యూపీలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. ఎల్ఈడీ లైట్లు 75 శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని వివరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతానికి వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, వేదికను ఖరారు చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. అమలు ఎలా? ► ఈ పథకంలో భాగంగా అర్హులైన గ్రామీణ ప్రజల నుంచి వాళ్ల ఇళ్లలో ఇప్పుడు వినియోగిస్తున్న 60 వాట్, 100 వాట్ బల్బులను తీసుకొని వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. ► ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. ► బహిరంగ మార్కెట్లో 7 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.70, 12 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.120 ధర ఉండగా.. కేవలం రూ. 10కే వాటిని అందజేస్తారు. లాభం ఇలా.. పథకం అమలుతో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 600 నుంచి రూ.700 వరకు విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఏస్ఈసీఎం) అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి 1,144 మెగా వాట్ల మేర తగ్గి, డిస్కంలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 81,55,316 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని తెలిపారు. -
గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో పల్లె ముంగిట్లోకే పాలన వచ్చిందన్నారు. గ్రామ సర్పంచ్లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో "జగనన్న స్వచ్ఛ సంకల్పం" అమలుపై చర్చించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రూ.1312.04 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్లంతా గ్రామసచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా.. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛసంకల్పానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ‘‘గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయి. ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్ పదవి తొలిమెట్టు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి. పట్టణాలకు ధీటుగా గ్రామాలను తీర్చిదిద్దాలి. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలి. స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని’’ మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్ -
మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి తక్షణ నష్టపరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎంజీ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్లోడింగ్లో నిబంధనలు పాటించలేదన్నారు. చిన్న తరహా ఖనిజ నియమావళి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు చదవండి: ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి పూలింగ్.. భారీ కుట్ర -
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి
సాక్షి, అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్లు, వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించామని చెప్పారు. రూ.1,486 కోట్ల ఖర్చుతో గ్రామాల్లో 1,944 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. బోర్వెల్ డ్రిల్లింగ్కు రూ.2,340 కోట్లు, పంపుసెట్లకు రూ.1,875 కోట్లు, విద్యుత్ పరికరాలకు రూ.1,500 కోట్ల మేర అంచనాలతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎస్సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, వాటర్షెడ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ ఆదాయ లక్ష్యాన్ని సాధించాలి
సాక్షి, అమరావతి: మైనింగ్ ఆదాయ లక్ష్యాలను సాధించాలని అధికారులను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. గనుల శాఖ అధికారులతో విజయవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో కూడా అధికారుల కృషి వల్ల రూ.2,917 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 81 శాతం ఆదాయాన్ని సాధించిపెట్టిన అధికారులను అభినందించారు. 2021–22లో రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని వారు అంచనా వేశారు. ఈ ఏడాది ఆదాయ లక్ష్యాలను చేరేందుకు తగిన కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఏపీకి వలస వచ్చిన వారు కరోనా భయంతో వెనక్కి వెళ్లిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు. గతేడాది నిర్వహించిన తనిఖీల్లో అక్రమ మైనింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 10,736 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.42.66 కోట్ల జరిమానాలు విధించినట్టు వివరించారు. మూడంచెల విధానంలో మైనింగ్ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకట్రెడ్డి చెప్పారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని.. ఇతర జిల్లాల్లో త్వరలో ప్రవేశపెడతామన్నారు. అలాగే శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను ప్రయోగాత్మకంగా అవుట్ సోర్సింగ్ విధానంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. -
గ్రామ పాలనకు గౌరవం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 17 అవార్డులు పొందిన రాష్ట్రంలోని పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగా పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది రాష్ట్రానికి 15 అవార్డులు రాగా.. ఈసారి 17 వచ్చాయి. అవార్డుల పరంగా ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి రెండో అవార్డుతోపాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈసారి రాష్ట్రానికి దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి అందించారు. గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభం కావాలి: ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అలాగే మరో బటన్ నొక్కి 7 రాష్ట్రాల్లోని 5 వేల గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గతేడాది నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందువల్ల పంచాయతీలు అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ–పంచాయత్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, కమిషనర్ గిరిజా శంకర్ అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, జిల్లా స్థాయిలో.. గుంటూరు, కృష్ణా జిల్లాలు పొందిన అవార్డులు (దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం) ఆ జిల్లాల జెడ్పీ సీఈవోలు డి.చైతన్య, పీఎస్ సూర్యప్రకాశరావు, మండలాల స్థాయిలో.. చిత్తూరు జిల్లా సొడెం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవోలు అవార్డులు అందుకున్నారు. అలాగే పంచాయతీల స్థాయిలో.. కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పుగోదావరి జిల్లా జి.రంగంపేట, ప్రకాశం జిల్లా కొడెపల్లి పంచాయతీలకు సీఎం పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్తోపాటు వివిధ జిల్లాలు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
‘ఢిల్లీ వరకు ఆ రీసౌండ్ వినిపించాలి’
సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్కు పంపించిన ఘనత సీఎం జగన్దన్నారు. మాధవి, నందిగం సురేష్లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు. చదవండి: కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి -
మానవత్వం చటుక్కున ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: తనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విధించిన ఆంక్షలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్కుమార్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎస్ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదని, చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు.(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద ఉత్తర్వులు) ‘‘చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ తాపత్రయం. నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాల్సిందే. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. నిమ్మగడ్డ తనను తాను రాష్ట్రపతి అనుకుంటున్నారు. చంద్రబాబుకు తెలియకుండా యాప్ తయారైందా? చంద్రబాబు తయారు చేసిన యాప్ను నిమ్మగడ్డ అమలు చేశారంటూ’’ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కాగా మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. నిమ్మగడ్డ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్సీపీ) -
మాకు అగౌరవం కలిగేలా నిమ్మగడ్డ వ్యవహరించారు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ బలవంతుపు ఏకగ్రీవాలు వద్దని చేప్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము దౌర్జన్యాలు చేయలేదు, కానీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ విధంగా బెదిరించారో అందరూ చూశారన్నారు. కేసు పెడితే వేధిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు... అలాగే నిమ్మడలో దువ్వడా శ్రీనివాస్కు ఏం పని అని అంటు తామేదో కుట్ర చేశామంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఉత్తరాంధ్రపై క్షక్ష్య కట్టాడు అంటూ తమపై అరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి మాటలు నమ్మెద్దని, మొన్న నిమ్మగడ్డ కడపలో వైఎస్సార్ గురించి బాగా చెప్పారు.. మరీ చిత్తూరులో ఓటుకు నోటు కేసు గురించి కూడా మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో అన్నీ మీరే చేస్తున్నారని, తిరిగి తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారన్నారు. ఈ ఎన్నికలు ఆదర్శవంతంగా జరగాలని కోరుకుంటున్నామంటూ ఆ యాప్ చౌదరిగారే తయారు చేసుకుంటున్నారో లేక ఎస్ఈసీ తపున చేస్తున్నారా అని అన్నారు. తమలో చాలా మంది సినీయర్ మంత్రులు ఉన్నారని, తాము అనేక సార్లు ఎమ్మెల్యేలుగా పని చేశామన్నారు. కానీ యాప్ తయారు చేసేందుకు మమ్మల్ని నిమ్మగడ్డ వివరణ కోరలేదన్నారు. సీఎం వైఎస్ జగన్కు కూడా చెప్పలేదు అన్నారు. గవర్నర్ను బెదిరించే ధోరణిలోనే లేఖ రాశారని, తాను, మంత్రి బొత్స చాలా బాధపడ్డామన్నారు. అందుకే ప్రివిలేజ్ కమిటీకి వెళ్లామని, అక్కడ తమకు అగౌరవం కలిగేలా నిమ్మగడ్డ వ్యవహరించారన్నారు. అందుకే స్పీకర్కు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. టీడీపీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.. ప్రజలే ఏది నిజమో నిర్ణయిస్తారన్నారు. ఆ యాప్ చూస్తుంటే టీడీపీ వారి యాప్లానే ఉందన్నారు. కాగా రేపు విడుదల చేశాక దీనిపై స్పందిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
సుబాబుల్ రైతుకు ప్రభుత్వం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని దాదాపు 66 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనీల్కుమార్ స్పష్టం చేశారు. సుబాబుల్ రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో యూకలిప్టస్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుబాబుల్ ఎక్కువగా సాగవుతుంది. గతంలో నేరుగా పేపర్ మిల్లులే కొనుగోలు చేసేవి. 2017లో 45 మంది బయటి వారికి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చారు. ఈ ట్రేడర్స్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కంపెనీలతో కుమ్మక్కవుతున్న ట్రేడర్స్ను గుర్తించి లైసెన్సులను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర పంటల మాదిరిగా ఈ పంటలనూ ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పంటను పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా పర్మిట్లు జారీ చేయాలని, వ్యవసాయ శాఖ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడండి: మంత్రి పెద్దిరెడ్డి రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తక్షణమే మొదలు పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పేర్ని నాని, అధికారులు పాల్గొన్నారు. -
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీధి దీపాల నిర్వహణ బాధ్యతను గ్రామ సచివాలయాల చేతుల్లో పెట్టాలని యోచిస్తోంది. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే వెలిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. సచివాలయ కార్యదర్శిని పర్యవేక్షకుడిగా నియమించనుంది. ఈ దిశగా విధివిధానాలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ► పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ► ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్ల తోడ్పాటు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎనర్జీ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోతే పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను నియమించుకోవచ్చు. ► కొత్త వ్యవస్థలో భాగంగా డెస్్కటాప్, మొబైల్ ఆధారిత యాప్ను అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ► గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్లు అమర్చడం వల్ల దీర్ఘకాలికంగా రూ.156 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేయవచ్చు. -
నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం..
సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి నారాయణ స్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 'చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ తొత్తులా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం ఏకపక్ష నిర్ణయం. చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ దశలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గం. ఇప్పట్లో ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వ ఉపాధ్యాయులే అంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మంత్రులు తెలిపారు. గుంటూరు: కొంత మంది దుర్బుద్ధితో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం చేయాలని చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ఎవరూ ఇళ్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు ఆయన తాబేదార్లు కుతంత్రంతో కోర్టులకు వెళ్ళారు. మరికొంతమంది దుర్బుద్ధితో పట్టాల పంపిణీ ఆలయస్యం చేయాలని ఎన్నికల కోడ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: ('పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్గా ఫీలవుతున్నాడు') ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందకుండా అడ్డుకోవాలని టీడీపీ, ఇతర వ్యక్తులు చేస్తున్న కార్యక్యమాలపై ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్నికలు అందరికీ అవసరమే. కాదనడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆలోచన చేయాలి. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఇచ్చిన మాటను నెరవేర్చడమే ముఖ్యమంత్రి ధ్యేయం. విగ్రహాలను ధ్వంసం చేస్తూ ముఖ్యమంత్రిపై ఏలెత్తి చూపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు. నీచమైన ఆలోచనలతో రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు అన్నీ చూసుకుంటాడనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) -
తిరుపతి ఉప ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుంది
-
ఆ ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుంది
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని, తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో రెండో స్థానమో.. మూడో స్థానమో తేల్చుకోవాలని, ఆ ఉప ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రెఫరెండంపై ఆయన శుక్రవారం స్పందించారు. (ఇదేమి నీచ రాజకీయం! ) మంత్రి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఆయనకు సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో గెలిచే పరిస్థితి లేదు. మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం. బాబు మోసం ఏంటో ప్రజలకు ఎప్పుడో తెలిసింది. గత ఎన్నికల్లో 51 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు తీర్పు ఇచ్చారు. ఇంతకంటే రెఫరెండం ఏముంటుంద’’ని అన్నారు. -
25న చిత్తూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, తిరుపతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 25న చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో సోమవారం పీఎల్ఆర్ కన్వెన్షన్లో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ద్వారకనాథ్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేశ్గౌడ్, నవాజ్ బాషా, ఆదిమూలం ఇతర పార్టీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పంపిణీ కార్యక్రమం పూర్తిచేసిన వెంటనే పక్కాగృహాల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 15 లక్షల పక్కాగృహాలను నిరి్మంచనున్నట్లు వివరించారు. రెండో విడతలో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పక్కాగృహాల నిర్మాణ కార్యక్రమాలపై పార్టీ నేతలు చర్చించారు. ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైన మరుసటి రోజు నుంచి 15 రోజుల పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. -
బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత పాలకులు బీసీలను వెనుకబడిన తరగతులగానే చూశారని.. బీసీలను వెన్నెముకగా సీఎం వైఎస్ జగన్ భావించారని తెలిపారు. చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
వైఎస్సార్ చేయూత రెండో దశలో రూ. 510.01 కోట్లు జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకంలో రెండో దశ కింద 2,72,005 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాలకు రూ. 510.01 కోట్ల నగదు జమ అయింది. గురువారం పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల్లోని బాధ్యతలు మీదపడ్డ పేద మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 12న ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పథకం ద్వారా 21,00,189 మంది మహిళల ఖాతాలకు రూ. 3,938 కోట్లను సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. అర్హత ఉండీ ఎవ్వరైనా మిగిలినపోయిన వారు దరఖాస్తు చేసుకుంటే వారికీ సాయం అందిస్తామని ఆనాడు సీఎం జగన్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స రెండో దశ నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. (ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు) మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకే..: మంత్రి పెద్దిరెడ్డి ► మహిళలను ఆర్థికంగా సుస్థిరపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ► పేద కుటుంబంలో బాధ్యతలు మోసే మహిళలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆర్థిక స్వావలంబన దిశగా వారిని నడిపించేందుకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లు ఈ సహాయం అందజేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో ప్రముఖ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయడంతో ప్రతి కుటుంబానికి 15 నుంచి 18 శాతం అదనపు ఆదాయం వస్తుంది. ► ప్రముఖ దిగ్గజ కంపెనీలతో కూడా ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ► ముఖ్యమంత్రి ఇంత పెద్ద మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సాయం చేయడాన్ని మనసారా స్వాగతిస్తున్నాను. ఈ కార్యక్రమంలో, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో రాజబాబు, మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పథకం లబ్ధిదారులు తమ అనుభవాలు వివరించారు. ప్రొబేషన్ సమయంలో బదిలీలు ఉండవు ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్లో ఎలాంటి బదిలీలు, డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వరాదని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సల ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ని సీరియస్గా తీసుకోవాలని, ఈ సమయంలో ఎలాంటి బదిలీలు, డిప్యూటేషన్లకు అనుమతి ఇవ్వరాదని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక ప్రణాళికతో కార్యక్రమం: మంత్రి బొత్స ► సీఎం వైఎస్ జగన్ ఆదేశానుసారం రెండో దశలో లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నాం. ► మా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నూటికి నూరుపాళ్లు నెరవేర్చడమే మా ప్రభుత్వ ద్యేయం. ► లబ్ధిదారుల కుటుంబాలు డబ్బును సద్వినియోగం చేసుకునేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ కార్యక్రమం రూపొందించారు. ► దేశంలోని దిగ్గజ కంపెనీలతో మాట్లాడి మార్కెట్ ధరలకంటే తక్కువకు చేయూత లబ్ధిదారులకు సరుకులు ఇప్పించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ► ఆయా వర్గాల మహిళలంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వారి కాళ్లపై వారు నిలబడేలా చర్యలు తీసుకుంటుంది. ► కాల్సెంటర్కు కాల్చేసి కావాల్సిన సరుకులను ఈ మహిళలు షాప్కే తెప్పించుకునే వెసులుబాటు ఏర్పాటుచేశాం. అక్కచెల్లెమ్మలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. -
‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’
సాక్షి, గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రమశిక్షణ గల వ్యక్తి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. తమకు ఆయన ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు -నేడు కార్యక్రమం ఒక యజ్ఞంలా జరుగుతోందని, ఈ పథకం వల్ల సర్కారీ బడులు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. మండలి చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన బాపట్ల మండలం కొండు భొట్లపాలెంలో ఉమ్మారెడ్డి వెంకయ్య-కోటమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన నామకరణ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప సభాపతి కోన రఘపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, శ్రీ రంగనాథరాజు, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విద్య, వైద్య రంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పేదరికంతో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా 43 లక్షల మంది తల్లులకు సీఎం జగన్ అన్నయ్య అయ్యారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బూట్లు ముఖ్యమంత్రే స్వయంగా సెలక్ట్ చేశారంటే విద్యార్థుల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం జగన్ విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వచ్చే పదేళ్లలో రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తారని ఆయన విశ్వసిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఇంటి పెద్దగా ఆలోచిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఓ ఇంటి పెద్దగా పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల రూపురేఖలు మారుస్తున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన అంటే మాకు అత్యంత గౌరవం. ఆయన తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం’’అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇంగ్లీష్ మీడియంపై రాద్దాంతం చేస్తున్న టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన ఆయన, ధనిక వర్గాల పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదవాలా.... పేద వర్గాల ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని ప్రశ్నించారు. అందుకే విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు: ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ’ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలను మార్చేస్తున్నారు. కొండు బొట్లపాలెం లోని జిల్లా పరిషత్ స్కూల్ను తన సొంత నిధులతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివృద్ధి చేశారు. సమాజంలో అసమానతలు పోగొట్టాలంటే విద్యే ఏకైక ఆయుధం. అందుకే సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్కూళ్ల మెయింటెనెన్స్ కోసం మాత్రమే నిధులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు మా ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది’’అని పేర్కొన్నారు. -
మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
చంద్రబాబు దళిత వ్యతిరేకి
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, కులాల మధ్య చిచ్చుపెట్టి నీచ రాజకీయాలకు పాల్పడిన సంస్కృతి ఆయన సొంతమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి విమర్శించారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల పుంగనూరులో అనారోగ్యంతో దళితుడు ఓం ప్రతాప్ చనిపోతే దాన్ని చంద్రబాబు రాజకీయం చేయటం దారుణమన్నారు. తమ కుమారుడు అనారోగ్యంతో మరణించాడని ఓం ప్రతాప్ తల్లిదండ్రులు చెబుతున్నా చంద్రబాబు అండ్ కో శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత పక్షపాతియైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దళితులపై దాడిచేశారని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధిపొందాలని చూడడం చంద్రబాబుకు తగదన్నారు. ► స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలోని దళిత గ్రామాలను మట్టుబెట్టిన వ్యక్తి చంద్రబాబే అని విమర్శించారు. ► కారంచేడు, బషీర్బాగ్, పాదిరి కుప్పంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు. ► రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి వారిని ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మందగించిన పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారాయణస్వామి ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల, డివిజన్ల కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ నుంచి కమర్షియల్ టాక్సెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం బకాయిలు రూ. 1,080 కోట్లు రాబట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రఘునాథ్, డిప్యూటీ కమిషనర్లు హరీష్ కుమార్, సోనియా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పరీక్షలను సవాల్గా తీసుకోండి: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను సవాల్గా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు. ( ‘ఆ రోజు వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు’) మొత్తం 10,63,168 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ద్వారా రవాణా సదుపాయం ఉండేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల ఎంపికలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రూట్ ఆఫీసర్లు, జోనల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. గతంలో విజయవంతంగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించామని, ఈసారి కూడా అదే తరహాలో పరీక్షలను నిర్వహించాలని అన్నారు. -
సమన్వయంతో ముందుకు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని భూగర్భ గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఆయన భూగర్భ గనుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన సూచించిన ముఖ్యాంశాలు.. ► రెవెన్యూ పెంచడానికి జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలి. ► గ్రావెల్ తవ్వకాల విషయంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి. ► మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా ఖనిజం ఎగుమతి కావడానికి వీల్లేదు. ► ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఆదాయం పెంపునకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. గనుల శాఖ ప్రతిష్ఠ పెంచేలా ► జిల్లా స్థాయి అధికారులు గనుల శాఖ ప్రతిష్ఠ పెంచేలా పనిచేయాలి. ► నిర్ణీత గడువు ఉండేలా జిల్లాల వారీగా మైనింగ్ యాక్షన్ ప్లాన్ íసిద్ధం చేయాలి. ► అవసరమైన సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఆకస్మిక తనిఖీలు చేయాలి. చెక్పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలి. నాటే మొక్కకు రక్షణగా ట్రీగార్డు ఏర్పాటు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటిన మొక్కకు రక్షణగా ట్రీగార్డ్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉపాధి పథకం అమలుపై ఆయన ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ► మొక్కల పర్యవేక్షణను సచివాలయాల సిబ్బంది సహాయంతో జిల్లా డ్వామా పీడీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిర్ణయాలివీ... ► అన్ని పోర్టుల్లో రాయల్టీ ఇన్స్పెక్టర్లను నియమించాలి. ► పొరుగు రాష్ట్రాల నిబంధనలను అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేయాలి. ► ప్రభుత్వం ఇచ్చే ఇళ్లస్థలాలకు మొరం, గ్రావెల్ లెవలింగ్ విషయంలో అక్రమాలు జరగకుండా నిఘా వేయాలి. ► కోవిడ్ కారణంగా మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ఐరన్ఓర్, లెడ్, లైమ్స్టోన్లకు సంబంధించి 283 లీజులు పనిచేయడం లేదని అధికారులు వివరణ ఇచ్చారు. ► సుదీర్ఘంగా జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విపత్తులోనూ ఉపాధి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న తరుణంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేద కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఉపాధిహామీ పథకం ద్వారా ఇప్పటివరకు 79 లక్షల పనిదినాలు కల్పించగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 25.57 లక్షల పనిదినాలు కల్పించడం గమనార్హం. అయితే వాస్తవంగా రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 వరకు కూలీలకు 36.50 లక్షల పనిదినాలు కల్పించామని, తాజా డేటా కేంద్ర వెబ్పోర్టల్లో అప్లోడ్ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఏప్రిల్లో కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్పోర్టల్లో వెల్లడించింది. ► విపత్కర సమయంలో ఉపాధి హామీ ద్వారా గ్రామీణ నిరుపేద కూలీలకు పని కల్పన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా ఉంది. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా కల్పించిన ఉపాధిహామీ పనిదినాల్లో మూడో వంతు మన రాష్ట్రంలోని కూలీలే లబ్ధి పొందారు. ► రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పని కోరిన ప్రతి కూలీని వారి నివాసానికి సమీప ప్రాంతంలో ఉపాధిహామీ ద్వారా ఆదుకుంది. ► ఉపాధి హామీ పనుల కోసం వచ్చే కూలీల సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతోంది. ► విపత్కర పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 18 వరకు 9,100 గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా కూలీలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 2,07,498 మంది కూలీలు 9.03 లక్షల పనిదినాల పాటు పని చేసి రూ.18.23 కోట్ల వేతనాలు పొందారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 65 వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. 3,800 గ్రామాల్లో మాత్రం వివిధ కారణాలతో ఉపాధి హామీ పనులు మొదలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు.. ► ఉపాధి పనులను తెల్లవారుజామున ప్రారంభించి మధ్యాహ్నం 11 గంటల లోపు ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గ్రామీణాభివద్ధి శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ► కూలీలు పని ప్రదేశానికి వాహనాలలో వెళ్లేటప్పుడు దూరంగా కూర్చోవాలని, వీలైనంత వరకు సైకిల్ లేదా ద్విచక్ర వాహనాలపై వెళ్లడం మంచిదంటున్నారు. ► పనికి ఉపయోగించే పనిముట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకవద్దని, శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు. ► ఒక కుటుంబానికి ఒకే చోట పని కల్పిస్తున్నారు. ► కూలీలు కనీసం మీటరు దూరంలో ఉంటూ పనులు చేసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. తువ్వాలు లేదా కర్చీఫ్తో ముఖాన్ని కప్పుకోవాలి. ► వేసవి కాలం కావడంతో కూలీలు రోజు వారీ చేయాల్సిన పనిలో 30 శాతం తక్కువ చేసినా ‘నరేగా’ నిబంధనల ప్రకారం పూర్తి వేతనం చెల్లిస్తున్నారు. ‘ఉపాధి’కి నిధుల కొరత లేదు ‘ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నిధుల కొరత లేదు. ఉపాధి హామీ వేతనాల కోసం 2020–21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం రూ.2149.78 కోట్లు మంజూరు చేసింది. 2019–2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020–21లో అదనంగా రూ.26 పెంచి రోజుకి రూ. 237 చొప్పున చెల్లిస్తాం’ – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి -
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తిసుకున్నాం
-
ఉగాది రోజున ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుంది
-
చంద్రబాబు, లోకేశ్ పలకరేం!?
అదాయ పన్ను శాఖ దాడుల నేపథ్యంలో వెలుగు చూసిన చంద్రబాబు అవినీతిపై వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. ఆయన వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అంతులేని అవినీతికి తెరలేపారని ధ్వజమెత్తారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శిని తనిఖీ చేస్తేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయని.. చంద్రబాబును తనిఖీ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటకు వస్తాయోనని అన్నారు. – సాక్షి, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి పెద్దఎత్తున అవినీతి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా అవినీతి గురించి.. ఆయనకు కొమ్ముకాస్తున్న మీడియానే ప్రజలకు జవాబు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులే అవినీతిలో భాగం పంచుకున్నారని చెప్పారు. దీన్ని పొలిటికల్గా తీసుకోలేమన్నారు. కానీ చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గతంలో సోనియాగాంధీ, చంద్రబాబు కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తే.. టీడీపీ అధినేత అనుకూల మీడియా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి కుంభకోణం విషయంలో ఆ మీడియా స్పందనేంటో తెలపాలన్నారు. ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఆ పత్రికలు, చానళ్లు కొమ్ముకాస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం మూడు ఊర్లలో ధర్నాలు జరుగుతుంటే.. వాటిని ప్రధాన శీర్షికల్లో ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. జనసేన నేత పవన్కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పూర్తిస్థాయి విచారణ జరిపితే.. సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి రూ.లక్షల కోట్లు సంపాదించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం పేరుచెప్పి చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో అధికంగా చంద్రబాబు జేబులోకి వెళ్లిందన్నారు. ఆయన పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయని, చంద్రబాబును పట్టుకుంటే.. ఎన్ని వేల కోట్లు బయట పడతాయోనని అన్నారు. ఇంత పెద్దఎత్తున ఐటీ దాడులు జరుగుతుంటే.. ఈనాడు పత్రిక దేశవ్యాప్త దాడులని రాస్తోందన్నారు. ఆదాయ పన్ను శాఖ టీడీపీ నేతల బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నిలబెడుతున్నా పచ్చ మీడియా రాయదని ఎద్దేవా చేశారు. తన అవినీతిపై సాక్ష్యాలు ఉంటే చూపండని సవాల్ చేసే చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ , బాబు అనుచరులు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ నోరు మెదపరేం : మంత్రి బొత్స చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్, మాజీమంత్రి లోకేశ్ బినామీలకు చెందిన ఇళ్లు.. వారి సంస్థల కార్యాలయాల్లో ఆదాయ న్ను శాఖ నిర్వహించిన సోదాల్లో లెక్కలేనంత అవినీతి వెలుగు సిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ అవినీతితో తమకెలాంటి సంబంధమూ లేదని ఇప్పటివరకూ చంద్రబాబుగానీ, లోకేశ్గానీ ఎందుకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూణే, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర 45 చోట్ల జరిపిన తమ సోదాల్లో రూ.2 వేల కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖే అధికారికంగా వెల్లడించిందన్నారు. చంద్రబాబు వద్ద పీఎస్గా పనిచేసిన వ్యక్తి చేసిన అవినీతే రూ.2 వేల కోట్లు ఉన్నందున.. చంద్రబాబు, లోకేశ్ వ్యవహారాలపై కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని బొత్స అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి రూ.రెండు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని చెప్పారు. ఐదేళ్ల పాలనలో రూ.1.90 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకొచ్చారని, ఆ సొమ్మంతా ఏమైపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు తీగే లాగారు.. త్వరలో డొంక కదులుతుంది ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇటీవల ఐటీ శాఖ ఏపీలో నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు బాగోతం బయటపడిందని, రూ.2 వేల కోట్లు చేతులు మారిన విషయం రుజువైనందున తక్షణమే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబు.. బయట ఉంటే తిరిగి వ్యవస్థలను మేనేజ్ చేసే అవకాశం ఉందన్నారు. అందుకోసమే ఉన్నపళంగా హైదరాబాద్ పారిపోయారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే తీగ లాగారని.. త్వరలో డొంక కదులుతుందన్నారు. దేశంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని అంబటి తెలిపారు. లెక్కలు సరిచేసుకునేందుకే ఆయన తరచూ దావోస్, సింగపూర్ వెళ్తారన్నారు. బాబు 100 తప్పులు చేశారని, ఇక శిరచ్ఛేదన తప్పదన్నారు. కాగా, ఎల్లో మీడియా ఎందుకు రూ.రెండు వేల కోట్ల గురించి రాయడం లేదని అంబటి ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగల్లా బాబు, లోకేశ్లు నోరు మెదపడంలేదని.. అలాగే, నీతులు చెప్పే పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ కూడా ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తండ్రీ కొడుకులు ఎందుకు స్పందించడం లేదు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూటి ప్రశ్న ఐటీ దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించకుండా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించడంపై శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆయనేమైనా చంద్రబాబు ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారా? అని నిలదీశారు. శాసనమండలిలోని తన చాంబర్లో శుక్రవారం మీడియాతో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ఐదు రోజులపాటు చంద్రబాబు మాజీ సహాయకుడు శ్రీనివాస్ ఇంట్లో వరుసగా ఐటీ దాడులు జరిగితే ఆయన, ఆయన కుమారుడు లోకేశ్ స్పందించలేదన్నారు. దీన్నిబట్టి మౌనం అర్ధాంగీకారంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా వారిపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు తాను నిప్పులాంటి వాడినని చెప్పుకుంటుంటారని, ఇప్పుడు ఆ నిప్పుకు ఏమైనా తుప్పు పట్టిందా అని ప్రశ్నించారు. అందుకే నోరు మెదపడం లేదా? అని నిలదీశారు. వాస్తవానికి.. 26 డొల్ల కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలిగే సామర్థ్యం శ్రీనివాస్కు ఉందా? తన పీఏ డొల్ల కంపెనీలు పెట్టి లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు చూస్తూ కూర్చున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు జైలుకు వెళ్లే రోజు త్వరలో వస్తుందని.. ఇప్పటికైనా ఆయన నోరు విప్పి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
రాజధానిపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారు..
-
‘రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయి’
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభంలో భాగంగా ఈనెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, ఎంపీ రెడ్డప్పలు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నవరత్నాల్లో అతిముఖ్యమైన అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయి. హైపవర్ కమిటీలో దీనిపై చర్చిస్తాము. కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నాం. వచ్చే బడ్జెట్లో దీనిని ప్రకటిస్తాం. అదానీ సంస్థ విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. వాళ్లు 400 ఎకరాలు అడగలేదు. రూ. 79 వేల కోట్ల పెట్టుబడులు అన్నదానిలో వాస్తవం లేదు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల పెట్టుబడితో వారు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు హయాంలో విశాఖ పారిశ్రామిక సదస్సుల ద్వారా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు. కానీ అందులో పది శాతం కూడా పెట్టుబడులు రాలేదు. సౌదీ అరేబియా నుంచి రూ. 3 వేల కోట్ల పెట్టుబడులతో నాలుగు కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి’అని మంత్రులు పేర్కొన్నారు. -
రాజధానిపై చంద్రబాబు డ్రామాలు
సాక్షి, చిత్తూరు: అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో తన మనుషులకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, అదే తమ ప్రభుత్వ థ్యేయమని అన్నారు. చదవండి: అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
‘ఇసుక ధరల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ: గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొయ్యూరు ఇసుక రీచ్ను సోమవారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో మంత్రి రీచ్ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రోజుకు ఎంత ఇసుకను వెలికితీస్తున్నారు, ఏ మేరకు వినియోగదారులకు ఇసుకను అందిస్తున్నారు అని మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ను బట్టి రీచ్లో అదనంగా మిషన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసిన వారికి రవాణా చేస్తున్న లారీ యాజమానులతో మంత్రి ముచ్చటించారు. కాగా ఇసుక తరలింపులో ఎటువంటి జాప్యం లేకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న వారికి సీరియల్ నంబరు కేటాయించి త్వరితగతిన ఇసుక బయటకు వెళ్లేలా చూడాలని అన్నారు. పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపులు జరగాలని, అలాగే వేయింగ్, ఇసుక ధరల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
‘కొరత లేకుండా ఇసుక సరఫరా’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గా 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 5 నుంచి నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్ లను, 51 స్టాక్ యార్డ్ లను సిద్ధం చేశామన్నారు. మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సప్లై కోసం టెండర్లు కూడా పిలవడం జరిగిందని తెలిపారు. గోదావరి, కృష్ణానదిలో వరద కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారిందన్నారు. వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయిలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్ యార్డ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 20 వేయింగ్ మిషన్ లను ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టాదారు భూమి నుంచి కూడా ఇసుక సరఫరా కొరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో రైతాంగం ఎక్కువమంది సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వాగులో దాదాపు 263 ఎకరాలలో ఇసుక టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాలో 12 రీచ్ ల నుంచి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను, రోజుకు పది వేల క్యూబిక్ మీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణ, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో కొత్త రీచ్ లను గుర్తించడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుకను తీసుకు వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందని వివరించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే అవసరానికి తగినంత ఇసుక నిల్వలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. జిల్లా ఇసుక పరిమాణం(క్యూబిక్ మీటర్లలో) శ్రీకాకుళం జిల్లా 5,09,360 తూర్పు గోదావరి 6,33,358 పశ్చిమ గోదావరి 2,22,230 కృష్ణా 7,11,800 గుంటూరు 5,50,254 నెల్లూరు 4,21,145 కడప 5,05,928 కర్నూలు 1,97,600 అనంతపురం 2,50,500 చిత్తూరు 1,35,500 మొత్తం 41,37,675 -
దేశ చరిత్రలో అద్వితీయ ఘట్టం: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి : గ్రామ వాలంటీర్లు తమపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. వాలంటీర్లకు కేటాయించిన 50 కుటుంబాల సమస్యలను 72 గంటల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...దేశ చరిత్రలోనే ఇదొక అద్వితీయ ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మానస పుత్రిక అయిన నవరత్నాల ద్వారా ప్రభుత్వం నుంచి దాదాపు 35 కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయబోతున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకాలు లేవన్నారు. ఇక రాష్ట్రంలో 11,128 గ్రామ, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 4 లక్షల 20 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు స్వలాభంతో పనిచేశాయని విమర్శించారు. ఓడిపోయిన టీడీపీ నేతలను ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారని ఆరోపించారు. అయితే సీఎం జగన్ ప్రభుత్వంలో తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అలాంటిది కాదని, దీని ద్వారా అర్హులైన వారికి త్వరితగతిన పథకాలను చేరువ చేస్తామని వెల్లడించారు. చదవండి: గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్ -
గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి పరిస్థిలు తెలుసుకున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం జరిగింది. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారీన పడకుండా పారిశుద్ద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర వస్తువలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. -
మంత్రి హోదాలో అసెంబ్లీకి
సాక్షి, తిరుపతి: ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఘోర పరాజయంతో ప్రతిపక్ష నేత హోదాలో బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రి హోదాలో హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్త వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఏడాదిపాటు సస్పెన్షన్కు గురై రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజా బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో రాజ్యాంగానికి విరుద్ధంగా 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారికి మంత్రి పదవులు కట్టబెట్టి అసెంబ్లీలో కూర్చొబెట్టుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ్, నవాజ్ బాషా, ఎంఎస్ బాబు ఘన విజయం సాధించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ సునామీలో టీడీపీ నేతల అడ్రస్లు గల్లంతయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికి చోటు కల్పించారు. ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిని చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. వీరంతా అమరావతిలో బుధవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త కొత్తగా.. నిండుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మినహా.. మిగిలిన వారిలో పెద్దిరెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో భాగంగా సుమారు ఏడాదికిపైగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్ చెయ్యడంతో ఆమె అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. జిల్లా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు బుధవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి పచ్చకండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డి ఏకంగా మంత్రి అయ్యారని, ఆయనకు పలమనేరు ఓటర్లు గుణపాఠం చెప్పారని జిల్లా వాసులు గుర్తుచేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఏకపక్షంగా వ్యవహరించి.. సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు తెరలేపిన టీడీపీ నేతలకు ఎన్నికల ఫలితాలతో గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి ఇసుక రవాణా బంద్..!
సాక్షి, అమరావతి : ఇకపై రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు ఉండవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ సాగిందని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, టీడీపీ నేతలు ఇసుకను దోచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. అందుకే టీడీపీ అధోగతి పాలైందని అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఇసుక రవాణా నిలిపేయాలని ఆదేశించాం. కొత్త ఇసుక విధానం వచ్చేంత వరకు ఇసుక రవాణా చేయడానికి వీల్లేదు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక రవాణా గురించి కొత్త పాలసీ తీసుకురావాలని ఆదేశాలు జారీచేశారు. జూలై 1 లోపు నూతన ఇసుక పాలసీ తీసుకోస్తాం. ఇసుక స్మగ్లింగ్కి ఈరోజు నుంచి పుల్స్టాప్ పెట్టాలని ఆదేశాలు జారీచేశాం. స్మగ్లింగ్ ఆపకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోని టీడీపీ నేతలు కొట్టారు. సాండ్ స్మగ్లింగ్ జరిగితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా లక్షల లారీల ఇసుక దోచేశారు. ఇసుక ర్యాంపు 202 నుంచి 116 కు తగ్గిపోయాయి.’ అన్నారు. -
‘వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సమర శంఖారావం’
సాక్షి, తిరుపతి : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమరశంఖారావం సమావేశాలుంటాయిని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమరశంఖారావం పేరుతో పార్టీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో పార్టీ సమావేశాలు ఉంటాయి. 4న తిరుపతి, 5న కడప, 6న అనంతపురంలో పార్టీ సమావేశాలుంటాయి. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే వైఎస్ జగన్ లక్ష్యం. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. సొంతంగా ఒక్క పథకానికైనా చంద్రబాబు రూపకల్పన చేశారా? రాజధానిలో పర్మినెంట్ పేరుతో ఒక్క బిల్డింగ్ లేదు. అన్నీ తాత్కాలికమే. చంద్రబాబు సుమారు రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారు. ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? కుట్రలో తన పాత్ర బయటపడుతుందనే బాబు భయపడుతున్నారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది ఎవరో ప్రజలందరికి తెలుసు. టీడీపీ ఓటమి ఖాయమని అన్నీ సర్వేల్లో వెల్లడైంది. ప్రజల మనోభావాలను బట్టి కేంద్రంలో పార్టీకి మద్దతిస్తాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీకే మా మద్దతు ఉంటుంది' అని తెలిపారు. -
‘వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సమర శంఖారావం’
-
రామచంద్రారెడ్డితో వైఎస్సార్సీపీ సింగపూర్ శాఖ కన్వీనర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తామని వైఎస్సార్సీపీ సింగపూర్ వింగ్ కన్వీనర్ దక్కట జయప్రకాశ్రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన హైదరాబాద్లో కలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ చేపడుతున్న కార్యకలాపాలపై వారు చర్చించారు. ‘రామచంద్రారెడ్డిని కలుసుకోవడం ఆనందం ఉంది. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు. పార్టీ విజయం కోసం పనిచేస్తాం’అని జయప్రకాశ్ రెడ్డి చెప్పారు. -
చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు
-
చంద్రబాబు, కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోవడం చూస్తే..
విజయవాడ: కాంగ్రెస్తో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొత్తుపెట్టుకోవడం చూస్తే వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు అన్నీ చంద్రబాబు కుట్రలో భాగమే అని అర్ధమవుతోందని వైఎస్సార్సీపీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నిరంగులైనా మార్చగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని పాతరేయాలి, తరిమేయాలి అన్న చంద్రబాబు ఈ రోజు పొత్తుపెట్టుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నా వల్లే జరిగిందని అప్పుడు చెప్పి..మళ్లీ మాట మార్చారని వెల్లడించారు. కరవు నివారణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెయిన్గన్స్తో లక్షల ఎకరాలు కాపాడామని చెబుతున్నారు..ఒక్క ఎకరమైనా సాగు జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు అంటున్నారు..అసెంబ్లీ దూషణలకు పరిమితం అవుతుంది..మేము ఎలా రావాలని ప్రశ్నించారు. ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి..రేపే అసెంబ్లీకి వస్తామని తెలిపారు. చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిరాయింపులపై పుస్తకం రాశారు..మరి చంద్రబాబుకి ఎందుకు చెప్పరని సూటిగా అడిగారు. చంద్రబాబు చర్యలతో హరికృష్ణ, ఎన్టీఆర్ల ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక జబ్బుతో బాధపడుతున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవడం ఖాయమన్నారు. -
కలుషితాహారంతో 80 మందికి అస్వస్థత
పులిచెర్ల (కల్లూరు): ఆలయ ప్రారంభోత్సవంలో ఇచ్చిన ఉప్మా, పొంగలి తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురైన ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లెలో చోటుచేసుకుంది. గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామస్తులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఆలయం వద్ద భక్తులకు ఉప్మా, పొంగలి వడ్డించారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 80 మంది అస్వస్థతకు గురికావడంతో 108కు సమాచారం అందించారు. రాత్రి మూడు గంటల సమయంలో మూడు అంబులెన్స్లలో కొందరు బాధితులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆదివారం ఉదయం పూరేడువారిపల్లెలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. విందుకు వచ్చిన ఫించా, పాకాల, మొగరాల వాసులకు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రుల్లో చేరారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆహారాన్ని పరీక్షిస్తున్నాం బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆహారం కలుషితం కావడానికి కారణాలు పరీక్షల్లో వెల్లడవుతుంది. పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపాం. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ఇబ్బందీ లేదు. – ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ చంద్రశేఖర్ -
చంద్రబాబు హోదా ద్రోహి : పెద్దిరెడ్డి
సాక్ష, విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హోదాకోసం పోరాడాల్సింది పోయి, బందులతో ఏం సాధిస్తామని వ్యాఖ్యానించడం శోచనీమని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుసార్లు మాటలు మార్చారంటూ మండిపడ్డారు. హోదా సాధన కోసం ఉద్యమించిన వాళ్లపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యక హోదా పేరు ఎత్తితే అరెస్టు చేయాలన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ఏముఖం పెట్టుకొని అడుగుతున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కారణంగా చాలా మంది విద్యార్థులు నేటికి కేసుల విచారణకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని రామచంద్రారెడ్డి తెలియచేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా ద్రోహి అని, రాజకీయ లబ్ధికోసమే తమ ఎంపీలతో పార్లమెంట్లో డ్రామాలాడించారంటూ విమర్శించారు. హోదా సాధనపై తెలుగుదేశం ఎంపీలు, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైఎస్సార్ సీపీ ఎంపీల మాదిరి రాజీనామాలు చేసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విపక్షాలు ప్రజా సంఘౠలు ఏకమై ప్రజలును మమేకం చేసి ప్రత్యేక హోదా సాధనకు పోరాడుతుంటే, చంద్రబాబు వారి పోరాటాన్ని నీరుగార్చే విధంగా మాట్లాడుతున్నారంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు. -
‘బీజేపీని వదిలేశా.. పార్టీలోకి రమ్మంటున్నారు’
సాక్షి, విజయవాడ: బీజేపీని విడిచి పెట్టాను.. ముస్లిం మైనారిటీలను పార్టీలోకి రమ్మని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ మైనారిటీల విభాగం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమం ఇప్పుడు చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. మైనారిటీలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని.. టీడీపీ, బీజేపీలు మైనారిటీలకు ద్రోహం చేసిన పార్టీలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మైనారిటీకి అయినా చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారా? అని సూటిగా అడిగారు. మైనారిటీల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, మరోసారి మైనారిటీలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కలుస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, మోదీ, వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారో మరిచిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మాత్రమే హోదా ఆకాంక్షను బతికించారని అన్నారు. యువభేరీ సభలు, ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో ఆందోళనలతో హోదా కోసం పోరాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్పష్టత లేదు: సామినేని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టత లేదని, ఆయనకు కావాల్సింది అక్రమ సంపాదనేనని విమర్శించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదని, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ, ఒక్క గిరిజనుడు లేడని చెప్పారు. ఇదేనా చంద్రబాబు పాలన? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని అడిగారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే.. చంద్రబాబు సహకరించక పోగా ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయం లబ్ది కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. -
మోదీకి భయపడే నోరు మెదపడం లేదు
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే సీఎం చంద్రబాబు నోరుమెదపడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధితో కలిసి మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి మేం సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సవాల్ను చంద్రబాబు స్వీకరించి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తున్నా.. వారికి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామని ప్రకటిస్తుంటే కేంద్రంలో మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రంతో లాలూచి పడ్డారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అన్నారని..తీరా అధికారంలోకి వచ్చాక సొంత ప్రయోజనాల కోసం హోదాని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి 9 మంది ఎంపీలు గెలుపొందగా అందులో నలుగురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు తన ఎంపీలతో కలిసి వస్తే మేం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్.జగన్ ప్రకటించినా.. మద్దతు తెలిపేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అఖిపక్షం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా...అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని ఇప్పుడు బాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 9 నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని, మరుగుదొడ్డలోను అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. కడప జిల్లాలో ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మొత్తం 519 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేపట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 37వ రోజు ప్రజాసంకల్పయాత్రను అనంతపురం జిల్లాలోని దర్శినమలలో ముగించారు. -
అసెంబ్లీ సెషన్లోపే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఫిరాయింపుదారులైన 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘సభ ప్రారంభతేది నాటికి ఆ 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసి, నలుగురు మంత్రులను బర్తరఫ్చేసి, శాసనసభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలమీద మాట్లాడేందుకు అవకాశం కల్పించాలి’ అని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యనేతల కీలక భేటీ వివరాలను ఆ పార్టీ శాసనసభ ఉపనేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలు, రుణమాఫీ, చంద్రబాబు విదేశీ పర్యటనలు, మెడికల్ సీట్లలో మైనారిటీలకు అన్యాయం, అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్ర తదితర అంశాలపై నాయకులతో అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చర్చించారని పెద్దిరెడ్డి తెలిపారు. అసెంబ్లీని ఆగస్టులోనే నిర్వహించాల్సిఉండగా, అలా చేయకుండా, పాదయాత్ర ప్రారంభసమయంలో నిర్వహిస్తుండటం అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించినట్లు, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనియ్యకుండా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నదని, అలాంటి నేపథ్యంలో అసలు సభరే హాజరుకాకపోవడమే సరైన నిర్ణయమని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్లు మీడియా ప్రకటనలో పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనే నిర్ణయిస్తారని, ఈ అంశంపై అక్టోబర్ 26న జరగనున్న ఎల్పీ సమావేశంలో మరోసారి చర్చించి, అధ్యక్షుడు తుది ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. పాదయాత్రపై : నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి నేటి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో యాత్ర జరిగే జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు, త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడనున్నట్లు తెలిపారు. -
చంద్రబాబువి పగటి కలలు: పెద్దిరెడ్డి
చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికారులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. -
వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి
గుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టనున్న దీక్షలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నల్లపాడురోడ్డులో వేదిక వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీక్షకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు భారీ ఎత్తున తరలిరానున్నారు. -
‘వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి’
విజయవాడ: రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీలో మోసానికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేనెల ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో చేపట్టనున్న దీక్షలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మద్దతు ధర లేక మిర్చి, పసుపు, మినుము రైతులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చికి క్వింటాకు రూ.1500 అదనంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకూ ఏ ఒక్క రైతుకు రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రూ.5వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల అండతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిని ఆదుకోవాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా టీ కప్పులో తుఫాను మాదిరిగానే వైఎస్ జగన్పై వేసిన సీబీఐ కేసు కూడా వీగిపోతుందని ఆయన అన్నారు. -
‘వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి’
-
ఆ దుష్ప్రచారంతోటే దెబ్బతిన్నాం..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాత్రి పగలూ తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగినంత దుష్ప్రచారం ఏ నాయకుడిపైనా జరగలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. 2014 ఎన్నికల్లో తగినంత ప్రచారం చేయలేక, ఖర్చుపెట్టలేక తాము ఓడిపోలే దని, జగన్ ముందు ఎవరూ కూర్చోకూడదని, పెద్దలంటే గౌరవం లేదని, అందరూ తనను సార్ అని పిలవాలని కోరుకుంటాడని టీడీపీ తన అనుకూల మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్లే దెబ్బ తిన్నామని చెప్పారు. జగన్పై వ్యక్తిగతంగా చేసిన పచ్చి వ్యతిరేక ప్రచారం వల్లే కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో తాము అధికారాన్నే కోల్పోయామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభి ప్రాయాలు ఆయన మాటల్లోనే... చంద్రబాబు మీరు ఒకేచోట చదివారు. ఆయన సీఎం అయ్యారు. మీరిలాగే ఉన్నారే? ఆయన కంటే అద్వాన్నమైన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. వాళ్లనే జనం స్వీకరిస్తున్నప్పుడు చంద్రబాబు సీఎం కావడం పెద్ద విషయమా? పైగా ఎన్టీరామా రావు వంటి వారు నాకు కూడా మామ అయి ఉంటే నేను కూడా ముఖ్యమంత్రిని అయ్యే వాడిని. ఎందుకంటే మామను మోసం చేయడం చాలా ఈజీ కదా. ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది తానే అని చంద్రబాబు అంటున్నారు కదా? కూతురుని ఇచ్చిన మామ తండ్రితో సమానం. మరి మామతోనే పోటీ చేస్తానని చంద్ర బాబు చెప్పారు కదా. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి ఎందుకు రమ్మం టారు. ఆయన చెప్పేవన్నీ మీరు నమ్ముతుంటారా? ఆయన సత్యం ఎప్పు డన్నా చెప్పి ఉంటే కదా అసత్యం చెప్పడనడానికి. సింధును కూడా నేనే తయారు చేశానని అంటున్నారు కదా. నిజమేనా? కిరణ్కుమార్రెడ్డిని సీఎం చేయడానికి మీరు తీవ్రంగా వ్యతిరేకించారట? సోనియాగాంధీని స్వయంగా కలసి చెప్పాను. కిరణ్ను సీఎంను చేస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. 1994లో కాంగ్రెస్కు 26 సీట్లు మాత్రమే వచ్చాయి. కిరణ్ను సీఎంచేస్తే ఆరుసీట్లు కూడా మనకు రావు అని చెప్పేశాను. ఈ విషయం మీరు రాహుల్తో, అహ్మద్ పటేల్తో చెబితే మంచిది అని ఆమె సూచించారు. 1998 నుంచి మీతో నాకు సన్నిహిత పరి చయం ఉంది మేడమ్, వారికి చెప్పేటంత చనువు నాకు లేదు అని చెప్పి వచ్చేశాను. చివరికి అలాగే జరిగింది కదా. వైఎస్ జగన్ని సీఎం చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా అధిష్టానం వినలేదేం? పోగాలం దాపురించినప్పుడు ఎవరికైనా మంచి బుద్ధి పుట్టదు కదా. ఇప్పుడు సైతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేంతవరకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నిద్ర పోయే పరిస్థితి కనిపించటం లేదు. అప్పట్లో కూడా ‘కిరణ్ను సీఎంని చేయవద్దు. అలా చేస్తే పార్టీ ఇంకా మునిగిపోతుంది. జగన్ని సీఎంగా చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతు కుతుంది. లేకపోతే బతకదు’ అని ఆనాడే అధిష్టానానికి చెప్పాను. కానీ వినలేదు. ఆ తర్వాతే నేను పార్టీ మారాను. జగన్పై అన్ని కేసులు పెట్టడానికి ఎవరు ప్రేరణ? ఈ విషయంలో మీ అభిప్రాయం? కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతున్నప్పుడే అధిష్టానంతో మాట్లాడి ఉండవచ్చు. జగన్ని ఇబ్బంది పెడదాం. అలా అయితే మనవద్దకు మళ్లా పరుగెత్తుకుని వస్తాడు. అలా వచ్చేలా నేను చేస్తాను అని కిరణ్ ఢిల్లీలో చెప్పి ఉంటాడు. పైగా.. జగన్ మీద పెట్టిన కేసులు ఒక కిరణ్ కుమార్ లేదా అధిష్టానం మాత్రమే చేసి ఉంటారని కూడా నేననుకోవడం లేదు. చంద్రబాబుతో కిరణ్ కుమ్మక్కయ్యాక ఇద్దరూ కలిసే సీబీఐని ముందుకు తీసుకురావడం జరిగిందని అనుకుంటున్నా. జగన్ని 16 నెలలు జైల్లో పెట్ట డమే చాలా కుట్రపూరితంగా జరిగింది. జగన్కు అంత పాపులారిటీ ఉండి కూడా ఎలా అధికారం నుంచి దూరమయ్యారు? మాలాంటివాళ్లం వైఎస్ జగన్కి మద్దతు ఇస్తున్నామంటే కారణం... అతడు చాలా కష్టపడుతున్నాడు. రాత్రి పగలూ తేడా లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తిపై ఇంత చెడు ప్రచారం చేసింది మొదట్లో కిరణ్కుమార్రెడ్డి అయితే తర్వాత దాన్ని పెంచి పోషించింది చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో ఈ ప్రచారం ఏ స్థాయికి వెళ్లిందంటే జగన్ ముందు ఎవరూ కూర్చోకూడదని, పెద్దలంటే గౌరవం లేదని, అందరూ సార్ అని పిలవాలని కోరుకుంటాడని అంత తీవ్రంగా ప్రచారం చేసారు. మరి జగన్ని సార్ అని పిలవాల్సి ఉంటుందంటే మాలాంటి వాళ్లం ఒక్క క్షణం ఆయన పార్టీలో ఉండేవారమా? జగన్పై ప్రచారం ఎంత స్థాయికి వెళ్లిందంటే కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో మేం అధికారాన్నే కోల్పోయాం. డబ్బులు సరిగా ఖర్చు పెట్టకో, మరొక దానికో మా పార్టీ దెబ్బతినలేదు. కేవలం జగన్పై చేసిన వ్యతిరేక ప్రచారం వల్లే ఓడిపోయాం. ఈ దుష్ప్రచార ప్రమాదాన్ని ముందే గమనించి పైనుంచి కింది వరకు పార్టీ దాన్ని ఎదుర్కొని ఉంటే గత ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లేమే కాదు. మరి 21 మందిని మీ పార్టీలోంచి లాగేశారు కదా... దానిపై మీ అభిప్రాయం? బాబుకు నిజంగా దమ్ముంటే వారిచేత రాజీనామా చేయించి ఉపఎన్నికలు పెట్టి గెలిపిం చండి చూద్దాం. మా నాయకుడే సవాలు చేస్తున్నాడు. సవాలు స్వీకరించండి మరి. సత్తా తేలుతుంది.. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికే భయపడుతున్న బాబు ఇక ఎన్నికలకు పోవడం కూడానా. సమైక్యవాదాన్ని బలపర్చిన మీరేమో ఓడిపోయారు. రెండు కళ్ల సిద్ధాం తాన్ని చెప్పిన బాబు గెలిచాడు. ఎలా? ఈ రాష్ట్రం విడిపోయినా నాకు ఇబ్బంది లేదు అని చంద్రబాబు లేఖ రాశాడు. ఆ లేఖతోనే ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రక్రియ మొదలైంది. విడగొట్టింది ఆయనే. విడగొట్టమని చెప్పింది ఆయనే. అలాంటి వ్యక్తి గెలిచాడంటే.. తప్పుడు వాగ్దానాలు చేస్తే నేను కూడా సీఎం అయిపో తాను. తప్పుడు వాగ్దానాలు చేసి మోసం చేసి తండ్రికున్న పేరు చెడ గొట్టవద్దు అని జగన్ కట్టుబడ్డారు. రుణమాఫీ విషయంలో ఏదైనా వాగ్దానం చేద్దామని ఎన్నికల ముందు జగన్కి పదే పదే చెప్పాను. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ మాపీ అన్నాడు. ఇక్కడేమో బాబు రైతులకు, మహిళలకు అంద రికీ రుణమాఫీలు అంటున్నాడు. కాబట్టి అన్ని రుణాలూ మాఫీలు చేస్తామని చెప్పవద్దు కానీ కనీసం మహిళలకు చెందిన రుణా లైనా మాఫీ చేస్తామని హామీ ఇద్దాం అని నేను చెప్పాను. జగన్ అన్నీ లెక్కలువేసి బేరీజు వేసుకుని మహిళా సంఘాల రుణాల మాఫీ విషయం చేర్చుదాం అంతే కాని మిగతావి అస్సలు చేయలేము. హామీ ఇస్తే 52 వేల కోట్ల రూపాయలు ఎక్కడినుంచి తెస్తాం? అన్నారు. అయితే మనం ఇబ్బంది పడతా మని జగన్కి చెప్పాను. అయినా ఫర్వాలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అసమర్థు డినని అనిపించుకోవడానికి బదులు ప్రతి పక్షంలో ఉండటానికైనా ఒప్పుకుంటాను కానీ ఈ తప్పుడు వాగ్దానాలు చేయలేనని జగన్ కరాఖండీగా చెప్పేశాడు. ఆయన స్థానంలో నేను ఉంటే అలా వాగ్దానాలు చేసేసే వాడిని. ఈరోజు రైతుల బాధలు మనం చూస్తూనే ఉన్నాం. రెయిన్ గన్స్తో ఆరున్నర లక్షల ఎకరాల పంటను కాపాడినామని ఎక్కడైనా ఎవరైనా చెప్పుకుంటారా అండి. మరి మీరు బీజేపీతో కలుస్తారని, విలీనం ప్రతిపాదన కూడా జరిగిందని ప్రచారం? వైఎస్ జగన్ తనపై ఎవరు ఏం రాసినా, మాట్లాడినా ఊరుకుని ఉంటారు కాబట్టి ఆయనపై ఏదో ఒకటి రాస్తుంటారు. మేము బీజేపీతో కలిసే ఆవకాశమే లేదు. ఎందు కంటే చంద్రబాబు మోదీని గట్టిగా పట్టుకుని ఉంటారు. ఒకవేళ మోదీ ఆయనను తోసే శారనుకోండి... వెంటనే కిందపడిపోయి కాళ్లకు మొక్కుతారు. మరి జగన్ ఆ పని చేయ లేరు కదా. కాబట్టి ఆ పరిస్థితి లేదు. ఎవరి మద్దతూ లేకుండానే ఈసారి ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తాం చూస్తూ ఉండండి. అమరావతిని చూపి గెలిచేస్తామని చంద్రబాబు అనుకుంటున్నారే..? ఈమధ్య మిమ్మల్ని అసెంబ్లీలో చూశాను. మీరు అక్కడ భోంచేశారా. కనీసం తినే తిండి సరిగా లేదక్కడ. ఒక మంచి హోటల్ కట్టడానికి, మంచి ఆసుపత్రి కట్టడానికి, విద్యా సంస్థ రావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మరి? అమరావతిని చూపి గెలి చేస్తామనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? మూడు సంవత్సరాల కాలం వృధా చేసి తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక సచివాలయం కట్టగలిగారు. ఈ మూడేళ్లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నాలుగురెట్ల ఖర్చుతో వాటిని కట్టారు. ఇక అమరావతిని సింగపూర్ చేస్తాను, జపాన్ చేస్తాను అని చెబితే నమ్మేవాళ్లు ఉండాలి కదా?! (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/QbXqDI https://goo.gl/MCWyrh -
ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్
-
ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్
అమరావతి : సవాళ్లు, ప్రతి సవాళ్లు పార్లమెంటరీ సంప్రదాయంలో ఉన్నాయా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో ధ్వజమెత్తారు. అలా ఉంటే రూలింగ్ ఇవ్వండన్నారు. నిన్న జరిగిన దాని గురించి ప్రభుత్వం మాట్లాడుతోంది. ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాల గురించి తాము ఏడాదిగా అడుగుతున్నామని చెప్పారు. ఈ విషయమై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో చాలా సార్లు సవాల్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎప్పుడు స్పందించలేదన్నారు. పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ చేస్తే ఎందుకు స్పందించలేదని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి పోయారన్నారు. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు గొంతు ఆడియోలో రికార్డయింది. ఆ గొంతు చంద్రబాబుది అవునో కాదో చెప్పడంలేదని మండిపడ్డారు. ముందుగా వాటన్నింటిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. -
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి
-
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి: పెద్దిరెడ్డి
అమరావతి: రాష్ట్రంలోని బుడగ జంగాలను ఎస్సీల్లోకి చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల మంది బుడగ జంగాలు ఉన్నారని... సంచార జీవనం గుడుపుతున్న వీరందరినీ పక్క రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోనూ వారిని ఎస్సీలుగానే పొందుపరిచారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కమిటీల పేరుతో జాప్యం చేస్తోందని వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని పెద్దిరెడ్డి కోరారు. -
బాబు రాజకీయ కుట్రలను తిప్పికొడతాం
–అక్కసుతోనే కరుణాకర్రెడ్డిపై విచారణ –నిర్భందంగా అరెస్టులు చేస్తే తగిన మూల్యం తప్పదు –వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు: తమ పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్రెడ్డిపై చంద్రబాబు తుని కేసులో సీఐడీచే విచారణ జరపడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో సాగుతోందని ఇలాంటి కుట్రలను తమ పార్టీ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని బేరుపల్లెలో బుధవారం ఆయన నియోజకవర్గ కోఆర్డినేటర్లు రెడ్డెమ్మ, కుమార్, రాజేష్రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. తునిలో జరిగిన సంఘటనకు తిరుపతిలోని కరుణాకర్ రెడ్డిని బాధ్యున్ని చేసి గంటలకొద్దీ విచారించడం ఎంతవరకు సమంజసమన్నారు. కేవలం తమ పార్టీని టార్గెట్ చేసి ఇలాంటి నీచ రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూన్నారని తెలిపారు. కాపులకు మోసం చేసిన బాబు అనవసరంగా ఈకేసును వైఎస్సార్సీపీపైకి మోపడం సిగ్గుచేటన్నారు. కరుణాకర్రెడ్డిని నిర్భందంగా అరెస్టులు చేయాలని చూస్తే తాము చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చేందుకు సిద్ధమని తెలిపారు. ఇలాంటి తప్పుడు కేసులకు తాము బెదిరేది లేదన్నారు. నోటుకు కోట్లు కేసు విచారణను ఎదుర్కొనే దమ్ములేని ముఖ్యమంత్రి కోర్టులో స్టే తెచ్చుకున్నారని తమ నేత కరుణాకర్ రెడ్డి ఎటువంటి తప్పుచేయలేదు కాబట్టే ధైర్యంగా విచారణకు వెళ్ళారన్నారు. దీని పర్యవసానం ఈ ప్రభుత్వంపై తప్పదని చంద్రబాబుకు గట్టిగా బుద్దిచెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు, కుట్రలను పక్కనబెట్టి ప్రజలకిచ్చన హామీలను నెరవేర్చి వారి సమస్యలను పట్టించుకుంటే బాగుంటుందని ఆయన సీఎంకు హితవు పలికారు. -
నగరి మున్సిపల్ చైర్ పర్సన్ కు పెద్దిరెడ్డి పరామర్శ
తిరుపతి: రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా రెండేళ్లలో దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్పై పోలీసులు సమక్షంలోనే దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అండతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరి రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కె.శాంతకుమారిపైన దౌర్జన్యానికి దిగారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ మోకాళ్లతో కడుపులో బలంగా పొడిచారు. దీంతో కిందపడిపోయిన చైర్పర్సన్ స్పృహ కోల్పోయారు. ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నగరి మున్సిపాల్టీలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘రంజాన్ తోఫా’ పంపిణీ నేపథ్యంలో ఈ అమానుష చర్యలు చోటు చేసుకున్నాయి. -
టీడీపీ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకు?:పెద్దిరెడ్డి
చిత్తూరు : ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కాణిపాకంలో మాట్లాడుతూ చంద్రబాబును విమర్శిస్తే టీడీపీ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన బాబుపై అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిన చంద్రబాబుకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావుపై చెప్పులు వేయించింది ఎవరో మరిచిపోయారా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మోసగించి అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీని ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు రాజీనామా చేస్తే పరువు దక్కుతుందని సూచించారు. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రులకు ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది ఎవరో బాగా తెలుసునని చెప్పారు. ఒకవేళ వారికి మతిమరుపు ఉంటే... ఆ సంగతులను గుర్తు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకు ముందు పెద్దిరెడ్డి కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. -
ఆ ప్రాజెక్టుల్లో బాబు మనిషే ప్రధాన కాంట్రాక్టర్
దేవినేనిపై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రధాన కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనిషేనన్న విషయాన్ని పక్కనపెట్టి, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ జలదీక్ష చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేయడం తగదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ దీక్ష పట్ల దేవినేని అక్కసు వెళ్లగక్కడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రధాన కాంట్రాక్టరైన నవయుగ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి కాదా? ఆయనకు అవసరమైనవి సమకూర్చేది, విమానం ఏర్పాటు చేసేది వారి డబ్బుతోనే కదా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, దేవినేనికి దమ్ముంటే కేసీఆర్పై పోరాడి పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని ఆయన సవాలు విసిరారు. ఎంపీ మిథున్రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుల్లో రూ. వేల కోట్ల కాంట్రాక్టులు జగన్ ఇప్పించారని దేవినేని అబద్ధపు విమర్శలు చేయడం దుర్మార్గమని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. తాము చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైతం తాము రోడ్డు నిర్మాణ పనులు, హంద్రీ-నీవా సుజల స్రవంతిలో మూడు ప్యాకేజీల పనులు చేస్తున్నామని.. అలాగని సీఎంతో లాలూచీ పడినట్లా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
► ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని చంద్రబాబు ► వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి, భూమన ధ్వజం తిరుపతి మంగళం: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ నాడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సోనియాగాంధీకి పూర్తి సహకారం అందించిన ద్రోహి చంద్రబాబు అన్నారు. సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇచ్చిన హామీలు మరిచారా? అని ప్రశ్నించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడంతో రైతులు ప్రజలు సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొంత భాగం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఉంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాలు లాగా రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం జగనన్న చేపట్టే ప్రతి ఉద్యమంలో భాగస్వాములవుదామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు పోకల అశోక్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ప్రాజెక్టులు పూర్తికావని, పరిశ్రమలు రాక యువతకు ఉద్యోగావకాశాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిపై చంద్రబాబు తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. తిరుపతి విమానాశ్రయంలో పెట్టిన కేసులు నిలవలేదని, రాజంపేటలో మళ్లీ అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు నీతిమాలిన రాకీయాలకు నిదర్శనమన్నారు. 10వతేదీ ధర్నాను విజయవంతం చేయండి ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 10వతేదీన చిత్తూరు కలెక్టరేట్ వద్ద, తిరుపతి సబ్కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే ధర్నాతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టాలన్నారు. జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అనుబంధ సంస్థలు, అభిమానులతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు బీరేంద్రవర్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్రెడ్డి, దుద్దేల బాబు, టి. రాజేంద్ర, పుల్లయ్య, సయ్యద్షఫీఖాదరీ, హరిప్రసాద్రెడ్డి, ఎస్కె. ఇమామ్, హనుమంత్నాయక్, కట్టా గోపీయాదవ్, ముద్రనారాయణ, చెలికం కుసుమ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ స్క్రిప్టు ప్రకారమే మైసూరా లేఖ
♦ వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ ♦ మైనింగ్ లీజు కోసమే బాబు పంచన మైసూరా చేరుతున్నారు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం స్క్రిప్టు ప్రకారమే మైసూరారెడ్డి లేఖ ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఒక వ్యూహం ప్రకారం జగన్మోహన్రెడ్డిపై జరిగిన దుష్ర్పచారానికి అనుగుణంగా ఈ లేఖ ఉందన్నారు. పెద్దలకు జగన్ విలువివ్వరని, ప్రతినమస్కారం చేయరని, మంచి సంబోధనతో మాట్లాడరంటూ ఎన్నికలముందు టీడీపీ దుష్ర్పచారం చేసిందని, అవే అంశాల్ని ప్రస్తావిస్తూ మైసూరా లేఖ సాగిందన్నారు. టీడీపీ ప్రోద్భలంతోనే లేఖ రాసినట్టు ఉందన్నారు. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని జగన్ విడుదల చేసిన నేపథ్యంలో మైసూరాతో రాజీనామా లేఖ రాయించినట్టుగా ఉందన్నారు. జగన్ నివాసానికి టిఫిన్కు వెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ కండువా వేసుకోవాల్సివచ్చిందని మైసూరా చెప్పడం హాస్యాస్పదమన్నారు. కుటుంబంలోనూ చిచ్చుపెట్టారని మైసూరా విమర్శించడంలో అర్థం లేదన్నారు. మైసూరానే అపరిచితుడు కాంగ్రెస్ నుంచి టీడీపీకి, అక్కడినుంచి వైఎస్సార్సీపీకి, మళ్లీ టీడీపీకి.. ఇలా పార్టీలు మారుతున్న మైసూరానే అపరిచితుడని పెద్దిరెడ్డి విమర్శించారు. పెద్దల్ని జగన్ గౌరవించరనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీ చెబుతున్న విషయాల్నే లేఖలో ప్రస్తావించడాన్నిబట్టి చూస్తే.. మైసూరా టీడీపీలో చేరనున్నారని స్పష్టమవుతోందన్నారు. డబ్బు సాయం చేయమని మిమ్మల్ని అడిగారా? ‘‘జగన్కు డబ్బు ధ్యాస ఉందని లేఖలో రాశారు. జగన్ ఏనాడైనా డబ్బు సాయం చేయమని మిమ్మల్ని అడిగారా? డబ్బు ధ్యాస మీకుంది కాబట్టే.. సిమెంట్ కంపెనీ లెసైన్సు ఉన్నందువల్ల దానికి మైనింగ్లీజు, బ్యాంకులనుంచి రుణాలు తెచ్చుకోవడానికే చంద్రబాబు పంచన చేరుతున్నారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు. అవినీతి బాబుకు అర్హత ఉంటుందా? కేంద్ర హోంమంత్రిని కలిసే అర్హత జగన్కు లేదన్న టీడీపీ విమర్శలపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. రూ.1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు హోంమంత్రిని కలిసే అర్హత ఉండదు తప్ప జగన్కు ఎందుకుండదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరిగితే బండారం బయటపడుతుందన్నారు. విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోకపోతే అసలు విషయం తెలిసిపోయేదన్నారు. ఇప్పటికైనా సీబీఐ విచారణను తనంతటతాను కోరుకుని ఎలాంటి మతలబులు చేయకుంటే బాబు సచ్ఛీలతను అంగీకరిస్తామన్నారు. జగన్పై ఆరోపణలొచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. రాష్ట్రానికి ఎన్ని నిధులు సాధించిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
'టీడీపీలో చేరమంటూ ఎమ్మెల్యేలకు మైసూరారెడ్డి ఫోన్లు'
న్యూఢిల్లీ : యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ మైసూరారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓ పద్ధతి ప్రకారమే ఆయనతో లేఖ రాయించినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం పెద్దిరెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైసూరారెడ్డి లేఖలో చెప్పుకోవాల్సింది ఏమీలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై వైఎస్ జగన్ పుస్తకం విడుదల చేసిన నేపథ్యంలో ఈ లేఖను రాయించారు. చాలామంది నాయకులు, ఆహ్వానాల మేరకు విందులకు, బ్రేక్ ఫాస్ట్కు వెళ్తారని, అలా చెప్పగానే కండువా కప్పుకుని పార్టీ మారిపోతారా? అని ఆయన ప్రశ్నించారు. 'రాయలసీమ పరిరక్షణ ఉద్యమానికి మేం మద్దతు ఇవ్వడం లేదనడం దారుణం. రాయలసీమకు అన్యాయం గురించి ఎన్నోసార్లు మేం అసెంబ్లీలో మాట్లాడాం. రాయలసీమ ఉద్యమంపై మైసూరారెడ్డి మూడుసార్లు తేదీలు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారో ఎవ్వరికీ చెప్పలేదు. జమ్మలమడుగులో మైసూరారెడ్డి సోదరుడి కుమారుడిని సమన్వయకర్తగా నియమించాం. దీన్ని నెపంగా పెట్టుకుని ఏవేవో లేఖలో రాశారు. కాంగ్రెస్ పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్లారు. వైఎస్ జగన్ సీఎం అవుతారని అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అపరిచితుడు మైసూరానే, మరెవ్వరో కాదు. ఆ వ్యాఖ్యలు మైసూరారెడ్డికే వర్తిస్తుంది. మాలాంటి సీనియర్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ ఎంతో గౌరవంగా చూస్తారో, మాకు తెలుసు. మైసూరారెడ్డి రాజకీయ ధ్యాసతో వెళ్లారా? మరో కారణంతో వెళ్లారో చూస్తాంగా. వైఎస్ జగన్ అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. మరి డబ్బు ధ్యాస అనే మాట ఎక్కడ నుంచి వస్తుంది. మైసూరారెడ్డిని వైఎస్ జగన్ ఎప్పుడైనా డబ్బులు ఇవ్వమని అడిగారా? గత ఆరు నెలల నుంచి మైసూరారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొలేదు. టీడీపీ అనుకూలంగా వ్యవహరించమని ఎమ్మెల్యేలకు మైసూరా చెప్పలేదా? వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో ఆయన ఫోన్లో మాట్లాడలేదా? అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలంటూ మైసూరారెడ్డి చేసిన సంభాషణలు పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. పార్టీ ఎమ్మెల్యేలను కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీకి రాజీనామాలు చేయించేలా వ్యవహరిస్తున్నారని అందరికీ తెలుసు. పార్టీలు మారడం వారి అభిమతం, కానీ వెళ్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చేందుకు ఆరు నెలలుగా మైసూరారెడ్డి అందరికీ ఫోన్లు చేశారు. మైసూరారెడ్డికి చెందిన సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజులు, బ్యాంక్ గ్యారంటీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినందుకే ఆయన ఇదంతా చేస్తున్నారని నేను వ్యక్తిగతంగా అంటున్నా. హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన అనుచరులకు ఎలా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలుసు. రాజధాని పేరుతో అమరావతిలోనూ అలానే చేస్తున్నారు. చంద్రబాబు సచ్ఛీలుడు అయితే సీబీఐ విచారణకు అంగీకరించాలి.' అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. -
అసలు ‘ఎర్ర’ దొంగలను అరెస్టు చేయూలి
రొంపిచెర్ల, న్యూస్లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అసలు దోషులను అరెస్టు చేయూల ని వైఎస్సార్ సీపీ నాయకుడు, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రొంపిచెర్ల వుండలంలో ఆయన గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రవుం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిచ్చిలివారిపల్లెలో వూట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం సోదరుడు కూడ ఉన్నారని ఆరోపించా రు. అసలు దోషులను వదలిపెట్టి, కూలి కోసం వచ్చిన వారిని అరెస్టు చేయడం న్యాయుం కాదన్నారు. అటవీ, పోలీసుశాఖాధికారులందరూ సీఎం సోదరుని కనుసన్నల్లో నడుస్తున్నారని వివుర్శించారు. ఇందుకు ముఖ్యమం త్రి కూడ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం దొం గలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉందన్నారు. కిరణ్కువూర్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు పెరిగిపోయూయని విమర్శించారు. తాను అట వీశాఖ వుంత్రిగా ఉన్నప్పుడు రాయులసీవు జిల్లాలో ఎర్రచందనం అక్రవు రవాణాను పూర్తిగా నివారించినట్లు చెప్పారు. ప్రస్తుతం కోట్ల రూపాయులు విలువ చేసే ఎర్రచందనం ఇతర దేశాలకు తరలిపోతోందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టలేని సీఎం కిరణ్ వెంటనే పదవికి రాజీనావూ చేయూలని డివూండ్ చేశారు. వైఎస్ హయుంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే, కిరణ్ పాలనలో ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతోందని ఆరోపించారు. గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.