ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం | Minister Balineni Serious On Molestation On Girl In Prakasam | Sakshi

ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం

Jun 23 2019 11:37 AM | Updated on Jun 23 2019 11:54 AM

Minister Balineni Serious On Molestation On Girl In Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం : ఆరుగురు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఆయన  బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులు మానవత్వం లేకుండా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. దీనిపై హోంశాఖతో కూడా మాట్లాడానని, నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి సుచరిత విచారణ జరిపారు. విచారణ వేగవంతంగా చేపట్టాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement