prakasam
-
బాలినేని బ్రతుకు ప్రకాశం ప్రజలకు బాగా తెలుసు: బూచేపల్లి
సాక్షి, ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద కమల్హాసన్.. ఆయనతో సినిమా తీయొచ్చు అంటూ దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం జనసేనలో చేరి ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. బాలినేని బ్రతుకు ప్రకాశం జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని.. నీ గురించి అందరకీ తెలుసు. జిల్లాలో ప్రతీ ఒక్కరినీ వేధించి వారి వద్ద దోచుకున్నావ్. నీ బాధితుడు కానీ వాడు ప్రకాశం జిల్లాలో ఒక్కడు కూడా లేడు. బాలినేని పార్టీ మారిన తర్వాత జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంతోషించారు. నటనలో బాలినేని.. కమల్హాసన్ను మించిపోయారు. ఆయనతో ఒక సినిమా తీయవచ్చు. టీడీపీలో చేరేందుకు నువ్వు ప్రయత్నిస్తే.. రిజక్ట్ చేస్తే.. ఆస్తుల కోసం జనసేనలో చేరావు. జడ్పీ చైర్పర్సన్ని మార్చేస్తానని చాలెంజ్ చేస్తున్నావు. నీలాగా అమ్ముడుపోయే జడ్పీటీసీలు జిల్లాలో లేరు. నీలాగా వెన్నుపోటు పొడిచే వారు పార్టీకి అవసరం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
YSRCP సోషల్ మీడియాపై పోలీసుల ఓవరాక్షన్.. హైకోర్టు దెబ్బకు సీన్ రివర్స్
-
458 మందిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు
-
చంద్రబాబు అబద్ధాలు, మోసాలు పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
-
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు. ‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. -
ప్రకాశం జిల్లా కామెపల్లిలో తాగుబోతు వీరంగం
-
ఆ రెండు బోట్ల వెనుక కుట్రకోణం
-
ప్రమాదంలో విజయవాడ.. విరిగిన ప్రకాశం బ్యారేజీ దిమ్మ
-
కారు బీభత్సం
వైఎస్సార్ సీపీలోకి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మార్కాపురం: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంభం వెంకట రమణారావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీటీడీ, జనసేన పొత్తుతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. అన్నా రాంబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గెలుపుకు కృషిచేస్తానని తెలిపారు. ఆయనతోపాటు మాజీ టీడీపీ కౌన్సిలర్లు నందిగం శ్రీనివాసులు, జలుకూరి సత్యవతీతోపాటు వేముల పెద్దరంగడు, పారుమంచాల చిన్నకృష్ణయ్య, దండూరి కోటయ్య, సయ్యద్ ముజీబ్, ఎస్కే కరీముల్లా, ఎస్కే గౌస్ మొహిద్దీన్, గంగిరెడ్డితోపాటు 9,10 వ బ్లాక్ టీడీపీ బ్లాక్ నాయకులు వైఎస్సార్ సీపీ లో చేరారు. కార్యక్రమంలో రఘుపతి శివ, పెంచికల కాశయ్య, నజీర్, ఉప్పు బాబు, మొగిలి ఇస్మాయిల్ బేగ్, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రాంబాబు పార్టీలోనికి ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు తన దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.గిద్దలూరు రూరల్: అతివేగంగా వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మమూడు బైక్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన నంద్యాల రోడ్డులోని స్వదేశీ రెస్టారెంట్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న కారు రెస్టారెంట్ వద్ద ఆగి ఉన్న మూడు బైక్లను, వ్యక్తిని, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కేఎస్పల్లెకు చెందిన గాలిరెడ్డి (63) రెస్టారెంట్ వద్ద తన బైక్ పక్కన నిలబడి ఉండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు నడుపుతున్న రాజేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు ఢీకొట్టడంతో బైక్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలైన రాజేష్ను చికిత్స నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఒకరు మృతి, మూడు బైక్లు ధ్వంసం -
బస్సు దిగి ప్రజలతో మమేకం
-
తుది దశకు ‘వెలిగొండ’
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయించిన సీఎం జగన్.. రెండో సొరంగంలో శనివారం సాయంత్రానికి 18.465 కి.మీ.ల పొడవున తవ్వకం పనులు పూర్తి చేయించారు. మరో 335 మీటర్ల పనులే మిగిలాయి. రోజుకు 8 మీటర్ల చొప్పున పనులు చేయిస్తున్నామని.. డిసెంబర్లోగా పూర్తవుతాయని సీఈ మురళీనాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించనున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పనుల వరద శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4.37,300(తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న దీనికి శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తో పాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కి.మీ. పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ చానల్ పనులు చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు చేపట్టారు. ఖజానాను లూటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండం నుంచి గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేశారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63(çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లు ఇచ్చి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి, వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. శరవేగంగా పూర్తి చేయించిన సీఎం జగన్ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే, మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019, నవంబర్లో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులనూ అదే ఏడాది పూర్తి చేయించారు. రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దు చేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్ల తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ సొరంగం పనులు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందుంచారు. రెండో సొరంగంలో టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడమే కష్టంగా మారింది. దీంతో గతేడాది మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ., 16.555 కి.మీ., 14.5 కి.మీ., 13.5 కి.మీ., 12.5 కి.మీ. వద్ద సొరంగాలు తవ్వి.. అక్కడ మనుషులతో పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే 7.363 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేయించింది. మిగిలిన 335 మీటర్ల పనులు డిసెంబర్లోగా పూర్తికానున్నాయి. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వ్యయం చేసి.. ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. -
‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్’
సాక్షి, ప్రకాశం: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, అందుకు తామే ప్రత్యక్ష సాక్ష్యాలని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. బుధవారం కనిగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. సాయంత్రానికి పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. ఆయన పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాలకు సీఎం జగన్ పాలనలో దక్కిన ప్రాధాన్యత, పదవులు,జరిగిన మంచి గురించి వివరించారు వాళ్లు. రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పాటించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశానికి ఆయనొక రోల్ మోడల్. వెనుకబడిన వర్గానికి చెందిన 7 మందికి నాతో సహా రాజ్యసభకి ఆయన పంపారు. కేబినెట్,ఎమ్మెల్సీ ల కేటాయింపు లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు సింహ భాగం ఇచ్చారు. ఫీజు రీయంబర్స్మెంట్ అనేది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక వరం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మకండి. బీసీలకు రక్షణ చట్టం తెస్తా అని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. జగన్నన్న పాలనలో మనం బాగున్నాం. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అంటే గతం లో ఎన్నికల హామీలు మాత్రమే. కానీ, ఇప్పుడది ఆచరణలో కనిపిస్తోంది. సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యం మేమే. మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టి.. మహిళా సాధికారిత సాధించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అవినీతి రహితంగా, పేదల ప్రభుత్వంగా సమర్థవంతమైన పాలనను వైఎస్సార్సీపీ అందిస్తోంది. కాబట్టి.టీడీపీ మాయ మాటలు వినొద్దు.. యెల్లో మీడియా వార్తలు అసలు పట్టించుకోవద్దు. అంతకు ముందు.. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభమై.. పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, ఆంజాద్ బాషా, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. సినిమా ట్విస్టులు తలపించే రీతిలో..
కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా): వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద వివాహిత దారుణ హత్యకు గురైన కేసు కీలక మలుపు తిరిగింది. కోట రాధ (35)ను ఆమె భర్త మోహన్రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాధకు ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త మోహన్రెడ్డి పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కె.రాధకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కోట మోహన్రెడ్డితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రాధ గృహిణి కాగా.. మోహన్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ క్రమంలో హైదరాబాద్లోనే ఉంటున్న రాధ చిన్ననాటి స్నేహితుడు కాశయ్య అలియాస్ కాశిరెడ్డి కుటుంబ సభ్యులతో దగ్గరయ్యాడు. ఆ క్రమంలోనే కాశిరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట రాధ నుంచి సుమారు రూ.16 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అతనికి రాధ తన భర్త మోహన్రెడ్డి నుంచి కూడా రూ.35 లక్షల వరకు ఇప్పించింది. కొంతకాలానికి కాశిరెడ్డి అప్పులపాలై పరారయ్యాడు. అప్పు తీర్చకుండా సుమారు రెండేళ్ల నుంచి కాశిరెడ్డి తిప్పుతుండటంతో భార్యభర్తల మధ్య వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో భార్య రాధపై మోహన్రెడ్డికి అనుమానం కలిగింది. ఒకవైపు ఆర్థికపరమైన అంశం, మరోవైపు అనుమానం రెండు మోహన్రెడ్డిలో తీవ్ర ద్వేషాన్ని పెంచాయి. దీంతో భార్యను ఎలాగైనా అంతమొందించేందుకు పథకం రచించినట్టు తెలిసింది. ఫోన్లు.. సిమ్ కార్డ్లు కొని.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఓ ఫోన్, సిమ్కార్డ్ కొనుగోలు చేసిన భర్త మోహన్రెడ్డి.. ఆ వ్యక్తి పేరు ట్రూ కాలర్లో వచ్చేలా నమోదు చేశా డు. ఆ నంబర్తో సొంత భార్యతోనే చాటింగ్ చేయగా.. మోహన్రెడ్డి అనుమానానికి మరింత బలం చేకూరిందని సమాచారం. దీంతో ఎలాగైనా భార్య ను చంపాలని మోహన్రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న జిల్లెళ్లపాడులో జాతర ఉండటంతో రాధ పుట్టింటికి భర్త మోహన్రెడ్డి, పిల్లలు వచ్చారు. భార్యాపిల్లల్ని ఇక్కడే వదిలేసి మోహన్రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 13, 14 తేదీల్లో భార్యకు వేరే వ్యక్తి పేరిట మెసేజ్ పెట్టాడు. తిరిగి 17న కనిగిరికి ఒంటరిగా వస్తే రూ.2 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో రాధ కనిగిరి వచ్చింది. ఈ క్రమంలో వేరే వ్యక్తి మాదిరిగా ఫోన్లో మాట్లాడుతూ.. మెసేజ్, ఫోన్ చాటింగ్లు కూడా చేశాడు. పామూరు బస్టాండ్లో ఎదురుచూస్తున్న రా«ధకు నగదు ఇస్తానని చెప్పిన వ్యక్తి, అతని మనుషులకు బదులు కారులో భర్త కన్పించాడు. చదవండి: విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని.. దీంతో ఒక్కసారిగా అవాక్కైన రాధ భర్త మోహన్రెడ్డి పిలవడంతో కారులో ఎక్కినట్టు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఇదే కారు పాతకూచిపుడిపల్లి సమీపంలో కొంతసేపు ఆగినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైనట్టు సమాచారం. ఆ తర్వాత కారులో టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాధను తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కారులోనే ఆమె మృతదేహాన్ని జిల్లెళ్లపాడు క్రాస్రోడ్డులో పడేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శనివారం ఉదయం భర్త మోహన్రెడ్డిని పోలీసులు దాచేపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొట్టి చంపేశారయ్యా! నా కూతురుని భయంకరంగా కొట్టి చంపారయ్యా. మా అల్లుడు మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్ చేసి నీకేమైనా క్లూ దొరికిందా మామా అని అడిగాడు. ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారని అడిగితే.. నాకు సమాచారం లేదని చెప్పాను. రాధ చనిపోయిందని అల్లుడికి ఫోన్ చేసినప్పుడు తాను వచ్చేదాకా ఆమె ఫోన్ తీయవద్దన్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాడు. హత్య చేసింది వీడని మాకెట్లా తెలుస్తుంది. ఇప్పటివరకు గండ్లోపల్లికి చెందిన వ్యక్తిపై అనుమానం ఉండేది. అతడికి మా అమ్మాయి రూ.18 లక్షలు ఇచ్చింది. అల్లుడు రూ.33 లక్షలు ఇచ్చాడు. పెళ్లప్పుడు 38 ఎకరాల పొలం, 25 సవర్ల బంగారం, రూ.10 లక్షలు కట్నం ఇచ్చాం. నా కూతుర్ని చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడాలి. – సుధాకర్రెడ్డి, రాధ తండ్రి -
రాధ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ప్రకాశం: సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల అనుమానం రాధ భర్త మోహన్రెడ్డిపైకి మళ్లింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. స్నేహితుడు కాశిరెడ్డికి రాధ దంపతులు రూ.80 లక్షలు అప్పు ఇచ్చారు. అయితే కాశిరెడ్డి తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో ఆ భార్యాభర్తల నడుమ విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయేదాకా వెళ్లారని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. రాధ పేరు మీద భారీ(కోటిన్నర రూపాయలు) ఇన్సూరెన్స్ ఒకటి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అన్ని కలుపుకుని పక్కా ప్లాన్ ప్రకారమే భర్త ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇన్సూరెన్స్ సొమ్ముపై ఆశతో పాటు వివాహేతర సంబంధం కూడా రాధ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ పురం పోలీస్ స్టేషన్కు తరలించి.. మోహన్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రకాశం (Prakasam) జిల్లా వెలిగండ్ల మండలంలో జిల్లెళ్లపాడులో ఈ నెల 17వ తేదీన ఈ హత్య జరిగింది. రాధను హత్య చేయడానికి ఆర్థిక కారణాలా? లేదంటే ఇతర అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా?.. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆమెను హత్య చేసిందెవరు? చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది. -
4,39,068 మంది లబ్దిదారులకు రూ.658.60 కోట్ల సాయం
-
పరిశ్రమల ప్రకాశం
పారిశ్రామిక ప్రగతితో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తోంది. ఫలితంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో పాటు సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఒంగోలు అర్బన్: జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు సీడీపీ (క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)లతో జిల్లా ప్రకాశించనుంది. ఆ మేరకు కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన యువతకు ఉపాధి కలి్పంచేలా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాలో 2022–23 సంవత్సరంలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో సుమారు 1600 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. పరిశ్రమలకు చేయూత: జిల్లాలో ఇప్పటికే 25 భారీ పరిశ్రమలు, 2899 ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా) పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో భారీ పరిశ్రమల్లో సుమారు 8 వేల మంది, ఎంఎస్ఎంఈల్లో 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ పరిశ్రమలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. 2019 నుంచి జిల్లాలో 1406 పరిశ్రమలకు రాయితీ కింద రూ.171.07 కోట్లు అందజేసింది. 2019–20లో 242 పరిశ్రమలకు రూ.23.76 కోట్లు, 2020–21లో 220 పరిశ్రమలకు రూ.48.26 కోట్లు, 2021–22లో 375 పరిశ్రమలకు రూ.33.6 కోట్లు, 2022–23లో ఇప్పటి వరకు 569 పరిశ్రమలకు రూ.65.98 కోట్లు రాయితీ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ పార్కులతో కొత్త పరిశ్రమలు: జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. 99.27 ఎకరాల్లో రూ.201.22 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దొనకొండ మండలం రాగముక్కలపల్లి, పామూరు మండలం మాలకొండాపురం వద్ద ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పార్కులు సిద్ధమైతే వీటిలో సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీడీపీలతో పరిశ్రమలకు అండగా... క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)లతో పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా ఏర్పాటు చేయనున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్సెంటర్ వద్ద రెండు సీడీపీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. చీమకుర్తిలో ఏర్పాటు చేసే సీడీపీ గ్రానైట్ పరిశ్రమలకు, గ్రోత్సెంటర్లో ఏర్పాటు చేసే సీడీపీ నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉండనున్నాయి. 15 ఏళ్లకు ప్రణాళికలు జిల్లాలో ఉన్న వనరుల మేరకు భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా నెలకొల్పేందుకు యువతను ప్రోత్సహించడం అవసరమైన నైపుణ్య శిక్షణలు ఇవ్వడం, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అండగా ఉండటం వంటి చర్యలపై రాబోయే 15 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలను కలెక్టర్ సిద్ధం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో కొత్తగా పరిÔశ్రమలు నెలకొల్పేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ముందుకు రావాలి పరిశ్రమలు స్థాపించేందుకు యువత వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రావాలి. అలా వచ్చిన యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తాం. తద్వారా వాళ్లు ఎదగడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కలి్పంచవచ్చు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్నీ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తోంది. రాయితీలు అందిస్తోంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన వాటిలో నైపుణ్య శిక్షణ ఇస్తూ జిల్లాలోనే యువతకు ఉపాధి కలి్పంచడంతో పాటు పరిశ్రమలకు మ్యాన్పవర్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నాం. – ఏఎస్ దినే‹Ùకుమార్, కలెక్టర్ -
ఒంగోలును తాకిన ‘స్వాతి కిరణం’
పాపం పుణ్యం తెలియని ఓ అమాయకుడు నాటి మూఢ నమ్మకాలకు బలవుతున్న ఓ వితంతువు మెడలో తాళి కడతాడు. అదీ సీతారాముల కల్యాణోత్సవంలో, రాముల వారు కట్టాల్సిన తాళిని. ఈ ఒక్క సీన్ స్వాతిముత్యం కథలోని ఆత్మని ఘాడంగా ఎలివేట్ చేస్తుంది.. తాను సంగీత సామ్రాట్ని అని విర్రవీగే గురువు ఆత్మాభిమానాన్ని గౌరవించేందుకు పదేళ్ల బాలుడు ఆత్మత్యాగం చేస్తాడు. ఇది స్వాతికిరణం అనే మహాకావ్యంలో పేద తల్లిదండ్రులు.. గురువు భార్య పడే ఆవేదన ప్రేక్షకుల గుండెల్ని పిండి చేసి.. కన్నీటి ధారలు కారుస్తుంది.. ఒకటా రెండా ఇలాంటి సున్నితమైన అంశాలతో కళాఖండాలు సృష్టించిన కళా తపస్వి భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మెరుస్తూనే ఉంటారు. సినీ దర్శకుడు కె. విశ్వనాథ్కు ఒంగోలుతో ఎనిలేని బంధం ఉంది. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణకంకణ సన్మాన కార్యక్రమంలో.. ( ఫైల్) ఒంగోలు టౌన్: తెలుగు సినీ రుచిని ప్రపంచానికి చూపించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతితో ఒంగోలులోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. అయితే ఆ మహా రుషి ఒంగోలులో పర్యటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నలభై సంత్సరాల క్రితం 1980 ఫిబ్రవరి 2న ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన రోజునే ఆయన నిష్కృమించడం కాకతాళీయం. శ్రీనళిని ప్రియ నృత్య నికేతన్ వార్షికోత్సవంలో పాల్గొన్న మహా దర్శకుడు ( ఫైల్) కాగా నాడు శంకరాభరణం సినిమా విడుదలైన సందర్భంగా నటీనటులతో కలిసి విశ్వనాథ్ తొలిసారిగా ఒంగోలు వచ్చారు. పాతికేళ్ల తరువాత 2015 జూలై 4న ఒంగోలులోని శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు హోటల్ సరోవర్లో వసతి సౌకర్యం కలి్పంచారు. కానీ ఎంతో నిష్టగా ఉండే ఆయన హోటల్ భోజనం తినేందుకు ఇష్టపడలేదు. అన్నవరప్పాడులోని పోతురాజు కాలనీలో నివాసం ఉండే నృత్య కళాశాల నిర్వాహకురాలు యస్వీ శివకుమారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. మరుసటి రోజు గుంటూరులో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున రెండో రోజు కూడా ఆయన ఒంగోలులోనే గడిపారు. విశ్వనాథ్ అంతటి విఖ్యాత దర్శకుడు తమ ఇంటికి రావడం అదృష్టం అని, ఆయన మృతిని జీరి్ణంచుకోలేక పోతున్నామని శివకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కినేని కళాపరిషత్ నిర్వాహకులు కల్లంగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వర్ణకంకణంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలుకు వచ్చారు. ఆ సందర్భంగా నగరంలోని ముంగమూరు రోడ్డులో గూడ రామ్మోహన్ నిర్వహిస్తున్న శ్రీ ఆదిశంకరా వేద పాఠశాలను సందర్శించారు. అక్కడి వేద విద్యార్థులతో వేదాలు, బ్రాహ్మణత్వం గురించి చర్చించారు. వేద విద్యార్థులకు వ్రస్తాలను బహూకరించారు. బ్రాహ్మణుడినై పుట్టి వేద విద్యను అభ్యసించలేక పోయాను అంటూ పండితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు రామ్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒంగోలులోని కళాకారులతో, సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ‘రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’ అన్న మహాకవి గుర్రం జాషువ వాక్యాలు విశ్వనాథ్ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. ఒంగోలు ముంగమూరు రోడ్డులోని డాక్టర్ దారా రామయ్య శా్రస్తికి విశ్వనాథ్తో చిరకాల స్నేహం ఉందని ఆయన కూతురు, చిత్రకారిణి సి.హెచ్.శ్రీలక్ష్మి చెప్పారు. తాను గీసిన కృష్ణం వందే జగద్గురు చిత్రానికి వచ్చిన మిరాకిల్ బుక్ ఆఫ్ ఇండియా అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ అవార్డులను విశ్వనాథ్ చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పారు. సంప్రదాయ సంకెళ్లు తెంచిన విశ్వనాథుడు ఒంగోలు టౌన్: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి రంగభూమి కళాకారుల సంఘం ఘనంగా నివాళి అరి్పంచింది. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళరి్పంచారు. సామాజిక సందేశంతో నిర్మించిన ఆయన సినిమాలు తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయని పడమటి గాలి ఫేం పాటిబండ్ల ఆనందరావు అన్నారు. సంప్రదాయ సంకెళ్లను తెంచిన సాంస్కృతిక విప్లవకారుడు విశ్వనాథ్ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన కవులు, కళాకారులు ప్రసాద్, ఏ.ప్రసాద్, వాకా సంజీవరెడ్డి, గుర్రం కృష్ణ, తాళ్లూరి శ్రీదేవి, చల్లా నాగేశ్వరమ్మ, నల్లమల్లి పాండురంగనాథం, ఎస్కే బాబు, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కె.రాఘవులు తదితరులు విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్ఫూర్తినిచ్చిన విశ్వనాథ్ సినిమాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశ్వనాథ్ సినిమాలను చూస్తూ పెరిగా. మానవ సంబంధాలు, నైతిక పునాదులపై ఆయన సినిమాలు చర్చించేవి. సమాజం పట్ల బాధ్యతను తెలిపే ఆ సినిమాల ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఒంగోలులో నృత్య కళాశాలను ఏర్పాటు చేశా. ఎంతోమంది చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నా. మా కళాశాల ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ఒంగోలుకు రావడం, తండ్రిలా మా ఇంటికి భోజనం చేయడం ఎన్నటికీ మరిచిపోలేను. ఆయన మరణం కళాకారులకు తీరని లోటు. – యస్వీ శివకుమారి, శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్, ఒంగోలు మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా సినిమాలు చూస్తే పిల్లలు పాడైపోతారని పెద్దలు మందలించే వారు. అలాంటి పరిస్థితి నుంచి స్వయంగా పెద్దలే తమ పిల్లలను విశ్వనాథ్ సినిమాలు చూడమని ప్రోత్సాహించేలా ఆయన కళాఖండాలు రూపొందించారు. విశ్వనాథ్ మృతి తెలుగు సినిమా రంగానికే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరని లోటు. ఆయన వారసత్యాన్ని కొనసాగించే దర్శకులు నేడు ఒక్కరు కూడా కనిపించకపోవడం విచారకరం. – కల్లకుంట కృష్ణయ్య, అక్కినేని కళాపరిషత్, ఒంగోలు -
అలల సాగరంపై బతుకు విన్యాసం.. కడలి పుత్రుల జీవనం విలక్షణం
కడలే వారికి అమ్మ ఒడి. అలల సవ్వడులు వారికి జోలపాట. సాగరంలో వేటే జీవనంగా సాగుతున్న మత్స్యకారుల జీవనశైలి అంతా విభిన్నం. ఇల్లు వదిలి సముద్రంలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ నిత్యం ఆటుపోటుల మధ్య సాగే వీరి జీవనం ఓ సమరం. గంగమ్మ చెంత మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచే ఆరంభమవుతుంది. నడి సంద్రం సాక్షిగా వీరు సాగించే జీవన తెరను ఒక్కసారి తెరిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. వీరు వినియోగించే వల దగ్గర నుంచి సాగరంలో సాగించే వేట వరకూ అన్నీ విభిన్నం..విలక్షణమే.. ఇంకెందుకాలస్యం సముద్ర తీరానికి పోదాంపదండి... సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరం. ఇక్కడ చిన్నా..పెద్దా, ఆడ..మగా అనే తేడా లేకుండా అందరూ వేట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది తెల్లవారుజామునే వేటకు వెళితే.. మరికొంత మంది రేపటి కోసం వలలను సిద్ధం చేస్తూ కనిపించారు. మరికొందరు పడవలను శుభ్రం చేస్తున్నారు. వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొచ్చిన విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు భోజనాలతో తీరానికి వస్తారు. అక్కడే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇక్కడ జీవనం సాగిస్తున్న గంగపుత్రులను పలకరిస్తే వారి బతుకుల్లో విలక్షణత కనిపించింది. కడలిలో వందల కిలోమీటర్లు రోజుల తరబడి వీరు చేస్తున్న సాహసం తెలుస్తుంది. చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే మత్స్యకారుల బతుకు ప్రకృతి విపత్తుల మధ్య పెనుసవాలే.. అంతా విలక్షణం... అందరిదీ ఒక్కటే మాట..బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెద్దకాపు తీసుకున్న నిర్ణయమే శాసనం. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికీ వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఊరంతా అనుసరించాల్సిందే. వల..వలకూ ప్రత్యేకమే... మత్స్య సంపదను వేటాడటానికి రకరకాల వలలు వినియోగిస్తారు. చేపలు, రొయ్యలు, పీతలు ఒక్కొక్కదానికి ఒక్కో వలను వేటకు వాడతారు. ఏ వల కొనుగోలు చేయాలన్నా రూ.లక్షల్లోనే మరి. వేట సరిగ్గా సాగితే అది పెద్దలెక్కలోదేమీ కాదు. సంప్రదాయ మత్స్యకారులు వాడే వలలు పులసల వల, నరంవల, బాడీవల, సన్నకన్నుల వల, ఐలావల, రింగుల వల, కొనాము వల. వీటిల్లో అత్యంత ఖరీదైంది ‘ఐలా వల’. దీని ఖరీదు దాదాపు రూ.రెండు లక్షలు ఉంటుంది. అంటే ఒక్కో వల అతి తక్కువ పొడవు అంటే ఒక కిలో మీటరు. ఇక పొడవు పెరిగే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. దీనితో సముద్రం ఒడ్డున ఉండి మరీ వేట సాగిస్తారు. ఈ వలను సముద్రంలో రెండుమూడు పడవల్లో వేసుకుని ఎంత పొడవు ఉంటే అంత దూరంలో సముద్రంలో వదులుకుంటూ వెళ్తారు. ఒడ్డున ఉండి మత్స్యకారులు ఒక చివర పట్టుకుని ఉంటే.. రెండో చివర మరో పక్కన ఒడ్డునే ఉండి మరికొంతమంది మత్స్యకారులు పట్టుకుంటారు. సముద్రంలో వదిలిన వలను రెండు అంచులు పట్టుకుని లాగుతారు. ఐలా, రింగుల, కొనాము వలను లాగడానికి దాదాపు 50 మందికిపైగా మత్స్యకారులు కావాలి. కాకినాడ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను తీసుకొచ్చి వేటకు వెళ్తారు. సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వలల యజమానికి అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. మత్స్య సంపద పడితే ఊపిరి పీల్చుకుంటాడు. లేకుంటే మళ్లీ రెండో ప్రయత్నమే మరి. పీతలు, చిన్నచేపలు, రొయ్యల కోసం ముందు రోజు లంగరు వేసి తర్వాత రోజు ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లి మత్స్యసంపద తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన మత్స్య సంపదను ఊర్లో ఉన్న వ్యాపారులకు ఇస్తారు. వారు సరుకును బట్టి ప్రత్యేక వాహనాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఒడిస్సా పంపిస్తుంటారు. పడవలోనే వంటా వార్పూ... సుదూర ప్రాంతాలకు వేట కోసం వెళ్లేవారు ముందుగానే పడవలో వంట సరుకులు తీసుకువెళ్తారు. అందులోనే వంటా వార్పూ. తమ వెంట తీసుకెళ్లిన పప్పులు, కూరగాయలతోనే కాకుండా సముద్రంలో లభించే చేపలు, రొయ్యలను సైతం వండుకుని తింటారు. అంతేకాదు వీరికి ప్రత్యేక భాష ఉంటుంది. తమిళం కలిపి వీరు మాట్లాడుతుంటారు. ఎంతో మార్పు... రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వేట విరామ సమయంలో గత ప్రభుత్వాలు అరకొరగా.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. ప్రస్తుతం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్ల పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడితో పిల్లలు చదువుకు వెళ్తున్నారు. విరామ సమయంలో... వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్కు, వ్యవసాయ, ఉపాధి పనుల్లో కూలీలుగా వెళ్తారు. మరికొందరు రొయ్యల చెరువుల్లో రొయ్యలు పట్టడం, ప్యాకింగ్ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో ఆటలతో కాలక్షేపం చేస్తుంటారు. చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ ఉదయం ఆరు గంటలకు చేపల వేటకు బోటులో ఇద్దరం వెళ్లాం. ప్రస్తుతం పీతలు మాత్రమే పడ్డాయి. పీతలు పెద్దసైజు అయితే కేజీ రూ.150 ఉండగా, చిన్న సైజు కేజీ రూ.60 మాత్రమే. పీతలు పడితే చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ. – అల్లారి లక్ష్మణ్, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల శాపంగా తమిళనాడు బోట్లు... చేపల వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. సముద్రంలో చాలా దూరం వెళ్లి వలలు వేస్తేనే చేపలు లభిస్తున్నాయి. ఈలోగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కడలూరు జాలర్లు సోనా బోట్లతో నిబంధనలు అతిక్రమించి తీరానికి సమీపంలో చేపల వేట చేయడంతో లక్షలాది రూపాయల విలువ గల వలలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నాం. చెన్నై బోట్లు తీరంలో వేటాడకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. – ప్రళయ కావేరి రోశయ్య, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల రోజూ రూ.200 సంపాదన ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకుంటూ జీవిస్తాను. చేపల వేట సాగించి తీరానికి వచ్చిన బోట్ల మత్స్యకారులకు బఠానీలు వంటి తినుబండారాలు ఇచ్చి వారి వద్ద నుంచి చేపలు తీసుకెళ్లి అమ్ముకుంటాను. రోజుకు 150 నుంచి 200 రూపాయలు సంపాదిస్తాను. నాకు వృద్ధాప్య పింఛన్ రూ.2,750 వస్తుంది. – వాటిపల్లి పోలేరమ్మ, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల చదవండి: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
ఒంగోలు సిటీ.. ఇదిగో అభివృద్ధి
అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరం రూపురేఖలు మారుతున్నాయి. నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడున్నరేళ్లలో రూ.137.79 కోట్లు వెచ్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని ప్రతి ఇంటింటికీ తిరుగుతూ డివిజన్లలోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. నూతన నగర పాలకమండలి ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్ నేడు ప్రవేశపెట్టనున్నారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరం సమగ్ర అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని విస్తరిస్తున్న నగరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజల అవసరాలు తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు కూడా మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నగర ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఒంగోలు నగరంలో బాలినేని మార్క్ అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చేయటమే లక్ష్యంగా యంత్రాంగాన్ని ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగర జనాభా 3,01,572 మందికి చేరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బాలినేని ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో వేలాది మంది అర్హులైన పేదలు, మధ్య తరగతి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇంటింటికీ వెళుతున్న బాలినేనికి స్వయంగా లబ్ధిదారులు ‘ఇది మీరు ఇచ్చిన ఇల్లే వాసన్నా’ అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. 11వ డివిజన్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లకు శంకుస్థాపన చేస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, పక్కన మేయర్ గంగాడ (ఫైల్) కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలు నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో మొత్తం 50 డివిజన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టేందుకు 1013 పనులు మంజూరు చేశారు. అందుకుగాను రూ.101.67 కోట్ల సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయటానికి పూనుకున్నారు. వాటిలో ఇప్పటికే 641 పనులు పూర్తయ్యాయి. మరో 71 పనులు కొనసాగుతున్నాయి. 301 పనులు ప్రారంభించాల్సి ఉంది. 2019 నుంచి 2022 వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ కింద మొత్తం రూ.కోటి వెచ్చించి 12 పనులు చేపట్టి పూర్తి చేశారు. ఎంపీ లాడ్స్ కింద రూ.20 లక్షలు వెచ్చించి నాలుగు పనులు పూర్తి చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 14వ ఫైనాన్స్ కింద మంచినీటి సరఫరా పనులతో పాటు మొత్తం 3 పనులకు రూ.6.84 కోట్లు వెచ్చించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను 15వ ఆర్థిక సంఘంలో భాగంగా మొత్తం 29 పనులు చేపట్టారు. అందుకుగాను రూ.16.87 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో 6 పనులు పూర్తి కాగా మరో 14 పనులు ప్రారంభించాల్సి ఉంది. ఒంగోలు నగరంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నూతనంగా ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరయ్యాయి. ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్కు ప్రభుత్వం రూ.80 లక్షల చొప్పున మంజూరు చేసింది. వాటిలో కొన్ని పూర్తికాగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో నాలుగు పాత అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కో దానిని రూ.10 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆరు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.58 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 20 పనులు మంజూరు చేసింది. అందుకోసం ఒక్కో డివిజన్కు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇప్పటికే 11 పనులు ప్రారంభించి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల్లో భాగంగా మూడు పనులకు గాను రూ.22.95 లక్షలు మంజూరు చేశారు. వాటిలో రెండు పనులు జరుగుతున్నాయి. మరొక పనిని ప్రారంభించాల్సి ఉంది. జగనన్న హరిత నగరాల్లో భాగంగా ఒంగోలు నగరంలో మొక్కలు నాటడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూ.2.62 కోట్లు కేటాయించారు. పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికలు ప్రారంభించారు. గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన మంచినీటి పథకం అమృత్ మొదటి విడత పనులు రూ.75 కోట్లతో కొనసాగుతున్నాయి. రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వైనం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం జరగనున్న ఒంగోలు నగర పాలక సంస్థ పాలక మండలి రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాలక మండలి ఏర్పాటైన తరువాత ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఆదాయం, రాబడులు, జీతాలు, ఒంగోలు నగర పాలక సంస్థ నిర్వహ ణ, అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అన్నీ కలుపుకొని రూ.196 కోట్ల ఖర్చు లు పోను రూ.13 కోట్ల మిగులుతో కౌన్సిల్ ఆమోదించనుంది. మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ఒంగోలు నగరంలో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నాం. నగర శివారు ప్రాంతాల్లోనూ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాం. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ను రూపొందించాం. కౌన్సిల్ సమావేశంలో చర్చ అనంతరం ఆమోదింపజేసుకొని ముందుకు సాగుతాం. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
ప్రకాశం: చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. -
ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లయిన రెండు నెలలకే నవ దంపతులు మృతి..
ప్రకాశం: కోటి ఆశలతో ఏడు అడుగులు, వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట వారి ఆశలు తీరకుండానే రోడ్డు ప్రమాదం కబళించింది. బాపట్ల జిల్లా జే పంగులూరు మండల పరిధిలోని రామకూరు గ్రామానికి చెందిన నవ దంపతులు మిన్నికంటి పవన్కుమార్ (30), మిన్నికంటి కళ్యాణి (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అందిన సమాచారం ప్రకారం రామకూరు గ్రామానికి చెందిన మిన్నికంటి సిద్దయ్య, పద్మావతికి కుమారుడు పవన్ కుమార్తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల క్రితమే వివాహం చేశారు. ఇంజినీరింగ్ చేసిన పవన్ కుమార్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి వద్దే ఉండి పనిచేస్తున్నాడు. గత ఆగస్టు నెలలో పవన్ కుమార్కి నరసరావుపేట దగ్గరలోని వడ్లమూడి గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరి పెళ్లిని తల్లిదండ్రులు ఎంతో వైభవంగా చేసి మురిసిపోయారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దంపతులు ఇద్దరూ టూవీలర్పై బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న హోటల్లో పుల్కా తిని, అనంతరం టీ స్టాల్లో టీ తాగి తిరిగి టూవీలర్ పై రామకూర వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్నారు. వెనక నుంచి వచ్చిన ప్రైవేటు ట్రావెల్ బస్సు టూవీలర్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. సెంటర్కు వెళ్లి టిఫిన్ చేసి వస్తామని చెప్పి వెళ్లిన కుమారుడు, కోడలు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసే సరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దంపతుల మరణ వార్త వినగానే గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. -
మహనీయులకు మరణం ఉండదు: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం: మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైఎస్సార్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశారాయన. ఆయన ఒక అడుగు వేస్తే.. వైఎస్సార్ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మహానేతతో పాటు ఆయనతో అడుగులు వేసిన నేత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం కూడా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న సీఎం జగన్.. వచ్చే ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రకటించారు. గాంధీ, అంబేద్కర్, పూలే, అల్లూరి, ప్రకాశం, మహానేత వైఎస్సార్.. ఇలా మహనీయులను కలకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వీళ్లకు భౌతికంగా మరణం ఉన్నా.. వీళ్లు చేసిన మంచికి, భావాలకు మరణం ఉండదు అనేది వాస్తవమని సీఎం జగన్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నచిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని సీఎం జగన్ చీమకుర్తి సభా వేదికగా ప్రకటించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందన్న సీఎం జగన్ ప్రకటించారు. గ్రానైట్ పరిశ్రమకు కొత్త స్లాబ్ సిస్టమ్ తీసుకురాబోతున్నట్లు తెలిపారాయన. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరినట్లు.. ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం కోసం రూ. 20 కోట్ల మంజూరు చేయడంతో పాటు తుళ్లూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్గా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇదీ చదవండి: సంక్షేమం తలుపు తడుతోంది (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
వేకువజామున రెండు గంటలు. అంతా చిమ్మ చీకటి. కంభం రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్పై ఒక్క కుదుపు. ముందు వెళ్తున్న లారీ వేగం తగ్గి నెమ్మదించింది. వెనుకనే వస్తున్న కారు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమి జరిగిందో తెలిసే లోపు అందరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తమ ఇష్టదైవం మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. కుమారుడు.. కుటుంబ సభ్యులు, బంధువులు కళ్లెదుటే విగతజీవులుగా మారడం ఆయా కుటుంబాలను పెను విషాదంలోకి నెట్టింది. కంభం: ఉన్నత చదువు కోసం యూకే వెళ్లిన తన కుమారుడి మొక్కు తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అనంతపురం–అమరావతి రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన జోలకంటి హనిమిరెడ్డి, జోలకంటి గురవమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా చిన్న కుమారుడు జోలకంటి నాగిరెడ్డి (23) గుంటూరులో బీటెక్ పూర్తి చేసి పది నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు యూకే వెళ్లాడు. పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన తన కుమారుడి తిరుపతి మొక్కు తీర్చేందుకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రెండు కార్లలో బయలు దేరారు. ఒక కారులో నాగిరెడ్డి డ్రైవింగ్ చేస్తుండగా ఆ కారులో అతని తాత, అమ్మమ్మ, ఇద్దరు చిన్న అమ్మమ్మలు కూర్చున్నారు. మరో కారులో నాగిరెడ్డి తల్లిదండ్రులు, సోదరుడు, మరో 8 మంది అతని బంధువులు ఉన్నారు. కారు కంభం సమీపంలో ఫ్లైవోవర్ వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న జోలకంటి నాగిరెడ్డి (23), చిలకల పెద్ద హనిమారెడ్డి (70), అతని భార్య ఆదిలక్ష్మమ్మ (60), ఆదిలక్ష్మమ్మ సోదరి పల్లె అనంత రామమ్మ (50), మరో సోదరి భూమిరెడ్డి గురువమ్మ (60)లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చిలకల పెద్ద హనిమారెడ్డికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పల్లె అనంతరామమ్మకు భర్త, ఒక కుమార్తె ఉన్నారు. గురువమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుల కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవించే వారు. పల్లె అనంతరామమ్మ బొల్లపల్లి మండలం దేమిడిచర్లలో నివాసం ఉంటుండగా, మిగిలిన వారందరూ సిరిగిరిపాడులో నివాసం ఉంటున్నారు. కష్టాలు తీరుస్తాడనుకుంటే కడుపుకోత మిగిల్చాడు వ్యవసాయం, పొలం పనులు చేసుకుంటూ తన చిన్నకుమారుడిని ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించగా త్వరలో వచ్చి కుటుంబ సమస్యలన్నీ తీరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు నాగిరెడ్డి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడు. నాగిరెడ్డి తల్లిదండ్రులు కుమారుడిని బీటెక్ వరకు గుంటూరులో చదివించుకున్నారు. కుమారుడు చదువులో రాణిస్తుండటంతో సుమారు రూ.15 లక్షల వరకు అప్పు చేసి మరీ విదేశాలకు పంపించి చదివిస్తున్నట్లు బంధువులు తెలిపారు. త్వరలో చదువు ముగించుకొని తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటాడని అనుకుంటున్న ఆ కుటుంబానికి విషాదం మిగిలింది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు మృతి జోలకంటి నాగిరెడ్డి తల్లి గురవమ్మ ఈ ప్రమాదంలో కుమారుడితో పాటు, ఆమె తల్లిదండ్రులు చిలకల పెద్ద హనిమారెడ్డి, తల్లి ఆదిలక్ష్మమ్మ, చిన్నమ్మలు పల్లె అనంత రామమ్మ, భూమిరెడ్డి గురవమ్మలను కోల్పోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు: సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన సీఐ యం.రాజేష్, ఎస్సై నాగమల్లేశ్వరరావు మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు స్వగ్రామం తీసుకెళ్లారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా -
ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య
ప్రకాశం: ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మర్రిపూడి నడిగడ్డకు చెందిన ఆకుమళ్ల తిరుమలయ్య కుమార్తె వెంకటేశ్వరి(22)ని మూడేళ్ల క్రితం బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణయ్యతో వివాహమైంది. అయితే కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి నిత్యం గొడవలు జరుగుతుండటంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వరి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన వెంకటేశ్వరి ఈ నెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తినింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. మృతురాలి తండ్రి తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తహసీల్దార్ జి.విజయలక్షి్మ, వీఆర్ఓ శామ్యేలు పరిశీలించారు. -
కమ్మనైన గోరుముద్ద
జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు కమ్మనైన భోజనం అందిస్తున్నారు.. రోజుకు ఒక మెనూ అమలు చేస్తూ రుచికరమైన భోజనం విద్యార్థులకు పెడుతున్నారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల శాతం పెరుగుతోంది. నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దృశ్యాలివి.. -
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
పండుగలా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి ఒంగోలు/సాక్షి రాయచోటి: వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణంలో ప్లీనరీలు జరిగాయి. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, ప్లీనరీ పరిశీలకుడు చొక్కాకుల వెంకట్రావ్, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్టలో నిర్వహించిన ప్లీనరీకి టీటీడీ బోర్డు సభ్యుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ అధ్యక్షత వహించగా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ప్లీనరీ పరిశీలకుడు తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్బాబు, మాజీ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్వహించిన ప్లీనరీలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్బాషా, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు కాన్వాయ్పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా బాలయ్య భార్య వసుంధరతో కలిసి తన సోదరి పూరందేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశంలో జిల్లాలోని కారంచేడులో భోగి సంబరాలు జరుపుకున్న బాలయ్య ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలయ్య గుర్రం ఎక్కి హంగామా చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు. కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. ఇక బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు. -
మూవీ టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం మంచిదే: టీఎఫ్పీసీ అధ్యక్షుడు
సాక్షి, ఒంగోలు: పెద్ద హీరోలు, నిర్మాతల ధన దాహంతో తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రేక్షకులపై అధిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్లో సినిమా–అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు’ అనే అంశం మీద ఒంగోలు వీకేబీ ఫంక్షన్ హాల్లో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సినీ పెద్దలు కొందరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లను లీజుకు తీసుకుని సాధారణ థియేటర్లకు సైతం మలీ్టప్లెక్స్ కలరింగ్ ఇచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆరోపించారు. షోలను నియంత్రించడం, ఆన్లైన్లో టికెట్ల విక్రయం లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రేక్షకులు సంతోషంగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షిస్తోందన్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. చిత్ర నిర్మాత సి.ప్రవీణ్కుమార్, సినీ ప్రదర్శకులు అయినాబత్తిన ఘనశ్యాం, షాజహాన్, ఎండీ సాహుల్, సూపర్బజార్ చైర్మన్ తాతా బద్రి, షౌకత్ ఆలీ, వరదా నాగేశ్వరరావు, పావులూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం: చీమకుర్తిలో పావురానికి రబ్బర్ ట్యాగ్
-
పావురం కలకలం.. కాలికి జియోట్యాగ్.. గూఢచర్యం కోసమేనా?
సాక్షి, ప్రకాశం: చీమకుర్తి మండలంలోని నెహ్రూనగర్లో రబ్బరు ట్యాగ్తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్నఅపార్ట్మెంట్లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదానికి చైనా అక్షరాలతో రబ్బర్ట్యాగ్ను గుర్తించాడు. దానికి అడ్డంగా 2019, నిలువుగా 2207 కోడ్స్ ఉన్నాయి. అయితే, అతని ఇంట్లో తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో.. నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్ ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక వీఆర్వో, పోలీసులకు సమాచారం అందించాడు. వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు. కాగా, గతంలో కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. కేంద్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిధిలో దశరథ్పుర్, పూరి జిల్లా హరికృష్ణాపూర్లోకూడా ఇదే తరహా పావురాలు పట్టుబడ్డాయి. ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి వీహెచ్ ఎఫ్ వైజాగ్ 19742021 ముద్రించి ఉన్నాయి. గత సోమవారం పూరి జిల్లాలో లభించిన పావురం. ఒక పాదానికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం, మరో కాలికి 37 కోడ్ అంకెలతో కూడిన ట్యాగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు!
సాక్షి, కనిగిరి(ప్రకాశం): ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో గురువారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్ సెంటర్లో కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పటించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అనుకోని ఘటనతో బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. విచారణలో యువకుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వాటి ధరలు తగ్గిస్తుందని.. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ చెప్పారు. -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
రూ.5.60 కోట్లకు మహిళ టోకరా
చినగంజాం: చీటీల పేరుతో ఓ మహిళ తమను మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్లోని చినగంజాం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పలువురు బాధితులు శనివారం చినగంజాం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. సుమారు 40 మందికి పైగా బాధితులు కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీస్ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోపిరాల గ్రామానికి చెందిన మహిళ సుమారు రూ.5.60 కోట్ల నగదు తమకు చెల్లించాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. సీఐ పీ సుబ్బారావు, ఎస్ఐ పీ అంకమ్మరావులు అందించిన సమాచారం ప్రకారం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పోలకం ఝాన్సీ లక్ష్మి... 25 ఏళ్ల నుంచి గ్రామంలో చీటీపాటలు నిర్వహిస్తోంది. చీటీపాటలపై వచ్చే కమీషన్తో పాటు, రొక్కంగా మరి కొంత సొమ్ము వడ్డీకి తీసుకొని, వారికి వడ్డీ కడుతోంది. అయితే గత ఏడాది నుంచి వడ్డీలు చెల్లించక, అందరి చీటీ పాటలు తానే పాడుకొని సుమారు రూ.5.60 కోట్ల నగదు వసూలు చేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు చీటీ పాడిన లబి్ధదారులకు సైతం డబ్బులు చెల్లించక కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితులకు ఎటువంటి తేదీ, ఇతర వివరాలు నమోదు చేయకుండా ఖాళీగా ఉన్న ప్రామిసరీ నోటుపై కేవలం సంతకాలు చేసి ఇచ్చి వారికి నమ్మకం కలిగేలా చేసింది. ఒక్కొక్క బాధితునికి సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు ఇవ్వకుండా ఇంటి చుట్టూ తిప్పుకుంటోంది. కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురవుతున్న చీటీ సభ్యులు తమ నగదు గురించి అడుగగా ఆమె తమ కుమార్తెకు, కుమారునికి నగదు ఇచ్చినట్లు, వీరితో పాటు తమ బంధువులకు నగదు ఇచ్చినట్లు బాధితుల వద్ద ఒప్పుకొని వాయిదాల పద్ధతిలో బాకీ తీరుస్తానని నమ్మబలుకుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో తనకు సంబంధించిన గృహం, ఇతర ఆస్తులను బంధువుల పేరుతో రిజి్రస్టేషన్ చేయించడంతో అనుమానం వచ్చిన బాధితులు శనివారం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాధితుల గోడు విన్న ఇంకొల్లు సీఐ పీ సుబ్బారావు నిందితురాలిని విచారించిన అనంతరం కేసు నమోదు చేశామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. చదవండి: రూ. కోట్ల విలువైన భూమికి స్కెచ్.. బీజేపీ నేత అరెస్టు -
చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవం: కలెక్టర్
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రాజుపాలెం పాఠశాలలో చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ అన్నారు. స్కూల్ లేని ఆదివారం రోజు ఘటన జరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థి ఆడుకోవడానికి అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. ఆ స్కూల్ భవనం వినియోగంలోనే లేదన్నారు. నాడు-నేడు కింద ఆ స్కూల్ను తీసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. పాడైపోయిన భవనాలను గుర్తించి కూల్చివేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చదవండి: పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ -
ప్రకాశం: బొలేరో నుంచి జారిపడి నలుగురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెదదోర్నల నుంచి పొదిలి మండలం, అక్క చెరువుకు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 12 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బొలెరో గూడ్స్ వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో రోడ్ మీద పడి నలుగురు మృతి చెందారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: రక్షా బంధన్ రోజునే అక్కాతమ్ముడి మృతి.. -
ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..
పొదిలి/దర్శి టౌన్: అది పొదిలిలోని ఆంజనేయ స్వామి ఆలయం. వివాహ వేడుక సందర్భంగా సోమవారం ఆలయ ఆవరణ మొత్తం వధూవరుల బంధువులు, అతిథులతో సందడిగా ఉంది. కళ్యాణ ఘట్టం పూర్తి చేసేందుకు వేద పండితుడు మంత్రాలు ఉచ్ఛరిస్తున్నాడు. కాసేపు ఆగితే పెళ్లి తంతు ముగిసేది! ఇంతలో పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘‘పోలీసులు ఎందుకొచ్చారబ్బా..’’ అని అంతా సంశయించేలోపే పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్శి ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు.. దర్శి మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రవీంద్రబాబు అనే యువకుడు బేల్దారి పనులకు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు సరస్వతిని ప్రేమించాడు. వీరి పెళ్లి విషయమై రెండు కుటుంబాల మధ్య ఇటీవల సంప్రదింపులు నడిచాయి. చదవండి: యువతలో ఇడియట్స్ అయితే డిగ్రీ చదువుతున్న కూతురికి బేల్దారి పనికి వెళ్లే రవీంద్రతో వివాహం చేసేందుకు యువతి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో యువకుడి తల్లిదండ్రులు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం పొదిలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21వ తేదీన తనకు తాళి కట్టిన యువకుడు పొదిలిలో మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని, తనను మోసం చేస్తున్నాడని సరస్వతి దర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. పొదిలి ఎస్సై శ్రీహరితో కలిసి వివాహం జరుగుతున్న ఆలయం వద్దకు వెళ్లారు. పరిస్థితిని పెళ్లి కుమార్తె తరఫు వారికి వివరించారు. అనంతరం రవీంద్రను పెళ్లి దుస్తుల్లోనే దర్శి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి ఎస్సై తెలిపారు. చదవండి: దుప్పిని మింగిన కొండచిలువ -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి
కందుకూరు రూరల్: మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను 27 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారు. భర్త చెడు వ్యసనాలకు బానిసైనా కూలీనాలి చేసుకొని కుమార్తెతో జీవనం సాగిస్తోందా తల్లి. భార్యపై అనుమానానికి తోడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆ భర్త మృగాడిగా మారాడు. 30 ఏళ్లు కలిసి జీవించిన భార్యను, మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను మానవత్వం మరిచి పెట్రోలు పోసి తగులబెట్టాడు. చికిత్స పొందుతూ కుమార్తె ప్రాణాలు వదలగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డికి అదే గ్రామానికి చెందిన సుశీలతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుమార్తె ప్రియాంక (27) మానసిక దివ్యాంగురాలు. శ్రీనివాసులరెడ్డి బేల్దారి పనులు చేస్తుంటాడు. సుశీల గ్రామంలో కూలి పనులకు వెళ్తుంటుంది. బిడ్డ పుట్టిన కొంత కాలం నుంచి భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం కూడా తలెత్తింది. గొడవల కారణంగా శ్రీనివాసరెడ్డి కొన్నాళ్లు భార్య, కూతురిని వదిలి హైదరాబాద్, బెంగళూరు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటుండేవాడు. తిరిగి వచ్చినప్పుడుల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఘర్షణలకు దిగేవాడు. ఈ నేపథ్యంలో భార్య, భర్తల మధ్య గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇలా తాగుడుకు అలవాటు పడిన శ్రీనివాసరెడ్డి డబ్బుల కోసం, భార్యపై అనుమానంతో భార్యను, కూతురిని ఇంట్లో పెట్టి తలుపువేసి వెళ్తుంటాడు. ఈ విధంగానే శనివారం కూడా చేశాడు. తిరిగి రాత్రి భార్యతో గొడవపడి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లుంగీతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారించి చుట్టు పక్కల వారు సర్దిచెప్పారు. ఈ గొడవలు రోజు ఉండేవేనని తల్లీ కూతుళ్లు ఇంటి ముందు దోమతెర వేసుకొని నిద్రిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నిద్రపోయేందుకు మిద్దె మీదకు వెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఆదివారం తెల్లవారు జామున మిద్దెమీద నుంచి తల్లీ కూతుళ్లపై పోశాడు. నిద్రలో ఉన్న తల్లి ఏదో కారుతుందని మేల్కొనే లోపు మంటలు వచ్చాయి. పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆర్పారు. ఏం జరుగుతుందో తెలియని కూతురు శరీరం 80 శాతం కాలిపోయింది. తల్లి శరీరం 30 శాతం కాలింది. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి కుమార్తె ప్రియాంక మృతి చెందింది. కాలిన గాయాలతో తల్లి చికిత్స పొందుతోంది. -
చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం.. డబ్బు కోసం కన్నబిడ్డనే కిడ్నాప్!
కందుకూరు: వ్యసనాలకు బానిసై డబ్బు కోసం కన్నబిడ్డనే ఎత్తుకెళ్లి బెదిరింపులకు దిగాడు ఓ తండ్రి. డబ్బు ఇవ్వకపోతే బిడ్డను చంపి తాను చస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. వారు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రి బారి నుంచి బాలుడిని కాపాడి తల్లికి అప్పగించారు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. కందుకూరు పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండె శ్రీనివాసులు ఆ వివరాలు వెల్లడించారు. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి, ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న బాలుడు శర్వాన్రెడ్డి ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో చెరువుకొమ్ముపాలెం వచ్చి ఇంటి వద్దే ఉండి విధులు (వర్క్ ఫ్రమ్ హోం) నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు రామకృష్ణారెడ్డి బానిసయ్యాడు. దాదాపు రూ.20 లక్షలకుపైగా అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేకపోవడంతో డబ్బు కోసం గత నెల 28వ తేదీ తన మూడేళ్ల బాలుడు శర్వాన్రెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే బాలుడికి మందు పోసి చంపుతానని, తాను కూడా అదే మందు తాగి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు రామకృష్ణారెడ్డి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత నెల 30వ తేదీ పొన్నలూరు పోలీస్స్టేషన్లో భార్య ఉమ ఫిర్యాదు చేసింది. ఈ విషయం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కందుకూరు పట్టణంలోనే స్వర్ణ ప్యాలెస్ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. కందుకూరు డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్, పొన్నలూరు ఎస్సై రమేష్బాబు లాడ్జికి చేరుకుని మద్యం తాగి మత్తుగా పడుకుని ఉన్న రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పక్కనే ఉన్న శర్వాన్రెడ్డిని తల్లి ఉమకు అప్పగించారు. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి,ఒంగోలు అర్బన్: రైతులు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్నీ రకాలుగా ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా అందడంలేదని, అక్రమంగా తెలంగాణకు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు ఎందుకు సీఎం కేసీఆర్ను ప్రశ్నించడని అన్నారు. ఓటుకు నోటు కేసు తిరగతోడతారని చంద్రబాబుకు భయం అన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన హయాంలో రైతులకు ఏం చేశారో, నీటి వాటాలపై తెలంగాణ వైఖరిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా గురించి మాట్లాడితే రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలతో జిల్లా ఎడారిగా మారుతుందని మాట్లాడించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లాలో రైతుల గురించి కాని, నీటి సరఫరా గురించి కాని మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హైదరాబాదులో బాబుని కలిసి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు చదివారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అన్నీ జిల్లాలు సమానమేనని, అన్నీ జిల్లాలకు సమ న్యాయం జరుగుతుందని చెప్పారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి నీటి పంపకాల్లో న్యాయం చేస్తే మంచిదన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నారు. ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్న చంద్రబాబు: మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు మధ్య చంద్రబాబు ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్నారని అన్నారు. చట్ట బద్ధంగా రాష్ట్రానికి అందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా ఎక్కువ అవసరం లేదని, అదేవిధంగా ఒక్క చుక్క తగ్గినా ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ ప్రజలకు నీరు ఇవ్వకూడదా... రాయలసీమ రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదా చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లా ఎడారి అవుతుందని మాట్లాడించడం అన్యాయమన్నారు. ఆయన హయాంలో జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివరకు మొదటి టన్నెల్ ప్రారంభించి నీటి విడుదల చేస్తామన్నారు. రెండో టన్నెల్ పనులతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాస కాలనీల పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మంత్రులతో పాటు వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఉన్నారు. -
ఎన్జీటీని ఆశ్రయించిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తాగునీటి ప్రాజెక్ట్గానే ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. -
కడుపుకోత మిగిల్చి వెళ్తారా.. మాకు దిక్కెవరు..
స్నేహం గుండె బలం.. మనసుకు ధైర్యం.. త్యాగానికి ప్రతిఫలం.. జీవితం తుది ఘడియలోనూ దాని విలువ ఆణిముత్యం. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అమరులయ్యారు. బతికుండగానే కాదు చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని నిరూపించారు. వారి పేర్లు స్నేహానికి గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. చీరాల టౌన్: ఎదురు చూపులు నిరాశను మిగిల్చాయి. బతికి వస్తారునుకున్న కన్నవారి నమ్మకం మోడిబారింది. ముగ్గురు స్నేహితులు మృతదేహాలను చూసిన గవినివారిపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. మూడురోజల క్రితం యువకులు బాపట్ల కొత్త ఓడరేవు తీరంలో గల్లంతు కాగా సురేష్ (23) మృతదేహం శనివారం సాయంత్రం బాపట్ల తీరానికి కొట్టుకొచ్చింది. ఆర్మీ జవాన్ రామకృష్ణ (24), వల్లు బ్రహ్మయ్య (23) మృతదేహాలు ఆదివారం బాపట్ల రూరల్ పరిధిలోని కొత్త ఓడరేవు తీరానికి చేరాయి. బాపట్ల రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు ప్రాణ మిత్రులు రామకృష్ణ, బ్రహ్మయ్య, సురేష్ల మరణం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం గవినివారిపాలెంకు తీసుకువచ్చారు. ఆర్మీ జవాను రామకృష్ణకు నెల క్రితమే వివాహం జరగ్గా సెలవుల అనంతరం ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంది. కానీ విగతజీవిగా పడి ఉండటంతో తనను ఒంటరి చేసి వెళ్లిపోయావా అంటూ రామకృష్ణ భార్య గాయత్రి గుండెలవిసేలా రోదించింది. అండగా ఉంటాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరు.. మాకు కడుపుకోత మిగిల్చి వెళ్తారా...అంటూ బ్రహ్మయ్య, సురేష్ కుటుంబ సుభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలు దెబ్బతినడంతో అంత్రక్రియలను త్వరగా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అండగా ఉంటాం ముగ్గురు ఒకేసారి తనువు చాలించడం బాధాకరమని శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల వద్ద మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీమంత్రి పాలేటి రామారావు, నాయకులు నివాళులర్పించారు. -
గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ హయాంలో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీల నిర్వాహకులు, వ్యాపారులు అక్రమాలకు తెరలేపగా.. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గనులను అడ్డగోలుగా దోచేశారు. క్వారీల నిర్వాహకులు, లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.కోట్లకొద్దీ రాయల్టీని ఎగ్గొట్టారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా అక్రమాలను వెలుగులోకి తీశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 155 క్వారీల్లో అక్రమాలు ఇప్పటివరకు జరిపిన విచారణలో 155 గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. వీటి నిర్వాహకులకు రూ.3,527 కోట్లు జరిమానా విధించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రానైట్ ఫ్యాక్టరీలు, పాలిషింగ్ యూనిట్లపైనా విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వీరినుంచి కూడా జీఎస్టీ, రాయల్టీ రూపంలో మరో రూ.2 వేల కోట్లు జరిమానా విధించేందుకు సన్నద్ధం కాగా.. గ్రానైట్ క్వారీ లీజుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజిలెన్స్ విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై 100 పైగా కేసులు నమోదు చేయించి ఆట కట్టించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడం వెనుక ప్రకాశం జిల్లాలోని భూగర్భ గనుల శాఖ (మైనింగ్) అధికారుల పాత్ర కూడా ఉంది. దాదాపు రాయల్టీ రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగ్గొట్టినట్టు విజిలెన్స్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. అక్రమాలకు చెక్ పెడతాం ఎవరైనా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదు. క్వారీల్లోంచి బయటకు తీసిన ప్రతి రాయి రవాణా చేసేప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి ఏ ఒక్కరైనా గండి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. గ్రానైట్ రవాణాపై ఎప్పటికప్పుడు విజిలెన్స్ నిఘా ఉంటుంది. – కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చదవండి: గోదావరి డెల్టాలకు పోల‘వరం’ -
కోడలిని వేధించిన పాపం..!
గిద్దలూరు: తండ్రిని కడతేర్చిన కుమారుడిని అరెస్టు చేసినట్లు సీఐ ఎండీ ఫిరోజ్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని దంతెరపల్లెలో ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి మోడి భాస్కర్ను హత్య చేసింది అతని కన్న కొడుకు రంగప్రసాద్..అని తేలింది. హత్యకు గురైన భాస్కర్ కొంతకాలంగా కుమారుడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లడంతో రంగప్రసాద్ తండ్రిని పలు మార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. ఆగ్రహించిన కుమారుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికాడు. బలమైన గాయం కావడంతో భాస్కర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కుమారుడు తన తండ్రి కరోనాతో మరణించాడని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. గ్రామంలో పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని, మృతదేహం గ్రామంలో ఉండకూదంటూ తన సమీప బంధువుల సహకారంతో రాత్రికి రాత్రి మృతదేహాన్ని దహనం చేసే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దహనం అవుతున్న మృతదేహాన్ని మధ్యలో ఆపేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా హత్యగా తేలడంతో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించగా భాస్కర్ను ఆయన కుమారుడు రంగప్రసాద్ హతమార్చినట్లు తేలింది. రంగప్రసాద్తో పాటు మృతదేహాన్ని దహన సంస్కారాలు చేసేందుకు సహకరించిన వెంకటాపురం గ్రామానికి చెందిన మోడి రంగనాథం, రంగస్వామి, ఆదిగంగయ్యలను కె.బయనపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండు విధించారు. చదవండి: హైవేలో లారీ పార్క్ చేస్తే అంతే..! -
రూ.16 కోట్ల ఇంజక్షన్.. గుండెల్ని పిండేసే కథ
చిత్రంలో పచ్చటి పచ్చికపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను చూస్తే ముచ్చటేస్తుంది కదా.! కానీ ఆ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే వ్యథ దాగి ఉంది. తప్పటడుగులు కూడా వేయలేని ఆ చిన్నారుల పరిస్థితిని తలుచుకుంటూ వారి తల్లిదండ్రులు మౌనంగా రోదిస్తున్నారు. ‘ఈ బాధ ఇంకెన్నాళ్లు.. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నారు. కానీ వారిలో ఎక్కడో ఓ ఆశ.. పిల్లలకు వైద్యం చేయించాలన్న తపన.. ఆత్మహత్య ఆలోచనను విరమించుకునేలా చేశాయి. సాక్షి, ఒంగోలు: ఒంగోలుకు చెందిన దండే వినయ్కుమార్ బిల్డర్, ఇంటీరియర్ డెకరేటర్గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వేదవతితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ మకాం మార్చారు. అక్కడ వీరికి లాసిత్ అయ్యన్ జన్మించాడు. ఆరు నెలలు గడిచినా కదలిక లేదు. పెద్దల సూచనతో ఏడాది వరకు వేచి చూశారు. కనీసం పక్కకు కూడా పొర్లకపోతుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్లోని రెయిన్ బో ఆస్పత్రిలో జెనెటిక్ పరీక్షలు చేయించగా స్పైనల్ మస్క్యులర్ ఏట్రోఫీ(ఎస్ఎంఏ)–టైప్ 2గా నిర్ధారణ అయింది. ప్రపంచంలో ఎక్కడా మందు లేదని వైద్యులు స్పష్టం చేశారు. బతికినన్నాళ్లు చూసుకోవడమే తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో హతాశులయ్యారు. రెండో కుమారుడికీ అదే జబ్బు వినయ్, వేదవతి దంపతులకు మరో కుమారుడు మోక్షిత్ జన్మించగా ఆ చిన్నారికీ ఎస్ఎంఏ టైప్–2 సోకింది. మోక్షిత్ పరిస్థితి తన అన్న కంటే కొంత ఫర్వాలేదు. కొద్దిసేపు కూర్చోగలడు. ఈ చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ ఏదైనా వస్తువు ఇస్తే చేయి చాచి అందుకోలేరు. కూర్చున్న కాసేపటికే నేలమీద వాలిపోతారు. అసలే బలహీనమైన కండరాలు.. రోజురోజుకూ శక్తి క్షీణిస్తుండటంతో ఆ పిల్లల వ్యధ వర్ణణాతీతం. బిడ్డల్ని బతికించుకోవాలన్న తాపత్రయంలో ఎస్ఎంఏపై వినయ్కుమార్ ఎంతో స్టడీ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 400 మందితో ‘‘క్యూర్ ఎస్ఎంఏ ఇండియా’’ అనే సంస్థను స్థాపించి సమాచారం పంచుకుంటున్నారు. అన్నీ అమ్మే.. చిన్నారులిద్దరూ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తల్లి వేదవతే విద్యాబుద్ధులు నేర్పుతోంది. వారి తెలివితేటలకు అబ్బురపడుతూ మానసిక క్షోభను మరిచిపోతోంది. ఆరు, ఏడేళ్ల వయసున్న వీరు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడమే కాదు, జనరల్ నాలెడ్జ్పైనా పట్టు సాధించారు. వివిధ అంశాల గురించి వివరంగా చెప్పగల నేర్పు వీరి సొంతం. 2017లో మందులు అందుబాటులోకి.. 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన బయోజిన్ కంపెనీ స్పిన్రజా అనే మెడిసిన్ను అందుబాటులోకి తెచ్చింది. తొలి ఏడాది ఐదు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 కోట్లు కాగా.. ఎస్ఎంఏ బాధితులు జీవించినంత కాలం ఇంజక్షన్లు వేసేందుకు మరో రూ.3 కోట్లు వెచ్చించాలి. కొద్దికాలం క్రితం రోచె అనే కంపెనీ రిస్డీ ప్లామ్ అనే ఓరల్ డ్రగ్ను అందుబాటులోకి తెచ్చింది. రోజు ఒక్కో సాచెట్ పిల్లవాడికి ఇవ్వాలి. దీని ఖరీదు రూ.80 వేలు. కానీ జీవితకాలం ఈ సాచెట్లు ఇస్తూనే ఉండాలి. ఇదిలా ఉండగా అవాక్సిస్ కంపెనీ జోల్జెన్ ఎస్ఎంఏ అనే ఇంజక్షన్ అందుబాటోకి తెచ్చింది. ఒక్కసారి ఈ ఇంజక్షన్ చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతున్నారు. దీని ఖరీదు ఏకంగా రూ.16 కోట్లు. అదృష్టవశాత్తు అమెరికాలోని డైరెక్ట్ రిలీఫ్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎంఏ సోకిన 360 మందిని గుర్తించి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. అందులో మోక్షిత్ ఒకడు. దీంతో త్వరలోనే ఆ చిన్నారి కోలుకుంటాడనే నమ్మకం కలిగింది. సాయం చేసే దాతలు 7799373777, 8977274151ను సంప్రదించవచ్చు. లేదా ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్ నం.0738104000057169, ఒంగోలు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఐబీకేఎల్ 0000738కు నగదు అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేసి ఆదుకోండి నా బిడ్డల ఆరోగ్యం బాగుండుంటే నేనే పది మందికి అండగా ఉండేవాడిని. కానీ ఇటువంటి అరుదైన జబ్బులకు వైద్యం చేయించాలంటే కష్టసాధ్యం. నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా తొలి ఏడాది ఒక ఇంజెక్షన్ కూడా వేయించలేను. అందుకే ఇటీవల క్రౌడ్ ఫండింగ్కు సంబంధించి ఇంపాక్ట్ గురూలో యోగేష్ గుప్తాకు లభించిన ఆదరణ చూసి ఆన్లైన్లో అప్రోచ్ అయ్యాను. వారు పరిశీలించి ఫండింగ్ సేకరించడం మొదలుపెట్టారు. ఒంగోలుకు చెందిన ఆసిఫ్, అన్వేష్ స్మైల్ ఎగైన్ అనే సంస్థను స్థాపించి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మేము ఒక సంస్థ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలిశాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – దండే వినయ్ కుమార్, వేదవతి చదవండి: విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
ప్రకాశం: హైవే కిల్లర్ మున్నాకు ఉరిశిక్ష
-
తల్లితో ప్రియుడి సహజీవనం.. కుమార్తెను కోరిక తీర్చాలని..
సాక్షి, అద్దంకి రూరల్: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమె ఇంట్లో లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా వేధిస్తున్నాడని గురువారం అద్దంకి పట్టణానికి చెందిన 9వ తరగతి చదువున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ కథనం ప్రకారం.. అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో నివాసం ఉంటున్న వీట్టెం మల్లికార్జునరావు, అరుణలకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి కుమార్తె తల్లి వద్దే ఉంటోంది. తల్లితో వివాహేతర సంబంధం ఉన్న వలబూని జానకిరామయ్య కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. రెండు నెలల నుంచి జానకిరామయ్య బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా హింసిస్తున్నాడు. తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. ఈ విషయం తల్లికి చెప్పగా ఆమె కూడా జానకిరామయ్యకే మద్దతు పలుకుతూ నిన్ను అతనికిచ్చి పెళ్లి చెస్తానని అంటోందని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి అరుణ, జానకిరామయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వయసుకొచ్చిన కుమార్తె ఉన్న తల్లి.. వేరొకరితో సహజీవనం చేయడమే కాకుండా.. అతడ్నే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బాలికను వేధించిన కామాంధుడు జానకిరామయ్యతో పాటు తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. టీచర్ మృతి.. చెత్తకుండీలో బిడ్డ! -
ఫేస్బుక్ ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని..
సాక్షి, ఒంగోలు: తొమ్మిది నెలల క్రితం ఇద్దరు యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఆ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లక ముందే కులాంతర వివాహానికి అంగీకరించరేమో అనే ఆందోళన మొదలైంది. ఇరవయ్యేళ్లు కూడా నిండని ఆ యువ జంట రైలు పట్టాలపై నలిగి తనువు చాలించింది. నాలుగు రోజుల కిందట ఒంగోలు శివారు పెళ్లూరు సమీపంలో ఇదే తీరులో జరిగిన ఘటన మరువక ముందే అక్కడికి సమీపంలో మంగళవారం మరో జంట దేహాలు పట్టాలపై ఛిద్రమయ్యాయి. ఎన్నో ఆశలతో బిడ్డలను చదివిస్తున్న రెండు నిరుపేద కుంటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఒంగోలు శివారు కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరరెడ్డి, సుజాత దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమారుడు విష్ణువర్దన్రెడ్డి రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొడుకు స్మార్ట్ ఫోన్ కావాలని గోల చేస్తుండటంతో మూడు నెలల కిందట సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో కొనిచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఫోన్తో సమయం గడుపుతున్న అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్బుక్లో పరిచయం అయింది. వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగినేని ఇందు కుటుంబం వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నాగినేని పుల్లయ్య ఏడాది కిందట మరణించడంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడంతో వచ్చే కొద్దిపాటి సొమ్ము, తల్లికి వచ్చే పింఛనే ఆ కటుంబానికి జీవనాధారం. కొద్ది రోజుల కిందట ఓ యువతి తన కుమారుడికి తరచూ ఫోన్ చేస్తుండటం గమనించిన సుజాత కంగారు పడింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో విష్ణువర్దన్రెడ్డి ఆ ఫోన్ను కాస్తా పగలగొట్టాడు. కానీ స్నేహితుడి మొబైల్ నుంచి ఇందుతో టచ్లో ఉన్నాడు. సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్లి పెరుగు పాకెట్ తెస్తానని వెళ్లిన ఇందు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక వెదుకుతున్నారు. హాల్ టికెట్ ఆధారంగా గుర్తింపు.. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ పెట్రోలు బంకు వెనుక రైల్వే ట్రాక్పై యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సీఐ ఎండ్లూరి రామారావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మొండెం నుంచి తల వేరు అయిన స్థితిలో యువతి, పూర్తిగా ఛిద్రమైన యువకుడి మృతదేహంతో ఆ ప్రదేశం భీతావహంగా కనిపించింది. ఘటనా స్థలానికి సమీపంలో లభించిన హాల్ టికెట్ ఆధారంగా యువకుడు రైజ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిగా గుర్తించిన పోలీసులు కాలేజికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడు కొప్పోలుకు చెందిన భవనం విష్ణువర్దన్రెడ్డి (19)గా నిర్ధారించారు. అతడి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం మృతురాలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు(18) అని, వీరిద్దరికీ 9 నెలల కిందట ఫేస్బుక్లో పరిచయం అయినట్టు వెల్లడైంది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందు ఎక్కడి వెళ్లిందో తెలియక వెతుకుతూనే ఉన్నామని విష్ణువర్దన్రెడ్డితో ప్రేమలో ఉందనే విషయం తమకు తెలియదని ఆమె బంధువులు తెలిపారు. కులాంతర వివాహానికి అడ్డంకులు వస్తాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తూ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సచివాలయం మహిళా పోలీస్ ఆత్మహత్య!?
సాక్షి, చీరాల: చీరాల మున్సిపాలిటీలోని 16వ వార్డు సచివాలయం మహిళా పోలీసు ముత్యాల భార్గవి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువులు తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గురువారం చీరాల సాల్మన్ సెంటర్లో వెలుగు చూసింది. చీరాల ఒన్టౌన్ సీఐ రాజమోహన్ కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు సచివాలయంలో ముత్యాల భార్గవి మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి ఏం జరిగిందో ఏమోగానీ ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి మృతురాలి భర్త రాంబాబును విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని, ఈ మేరకు భార్గవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తమ కుమార్తె భార్గవిని అల్లుడు రాంబాబు మద్యం తాగి తరుచూ వేధింపులకు గురిచేస్తుండేవాడని, ఈ విషయం పలుమార్లు తమకు చెప్పుకుని బాధపడిందని, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కన్న తల్లి విగత జీవిగా పడి ఉండటంతో పిల్లలు భోరున విలపిస్తున్నారు. సాల్మన్ సెంటర్తో పాటు మృతురాలు పనిచేసే సచివాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
'రాసలీలలు చేసే లోకేష్కు విమర్శించే హక్కు లేదు'
సాక్షి, ప్రకాశం: విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ''లోకేష్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడటం సిగ్గుచేటు. ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు. నేను కులాలు చూడలేదు.. కమ్మవారికి కూడా కార్పొరేషన్లో టికెట్ ఇచ్చా. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించా. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. గతంలో ఒంగోలును అభివృద్ధి చేశా.. ఇప్పుడూ చేస్తున్నా. టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల జనార్ధన్ బాగోతం అందరికీ తెలుసు. నాకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయను. దామచర్ల జనార్ధన్ అప్పులు ఎగ్గొడితే.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేశా. రోడ్లు మీద రోడ్లు వేసి టీడీపీ నేతలు దోచుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుంది'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా.. -
పంచాయితీ బరిలో అక్కా, చెల్లెళ్ల ఢీ
సాక్షి, కారంచేడు(ప్రకాశం) : ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అక్కడే ఇద్దరూ ఇంటర్ వరకు చదువుకున్నారు. అదే ఊరికి చెందిన ఒకే ఇంటి పేరున్న వారిని వివాహమాడారు. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామంలోని ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు. ఇంత వరకు ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేకపోయినప్పటికీ. .ఇప్పుడు ఇద్దరు తమ, తమ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. చదవండి: ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా! బొడ్డు అంకయ్య, బొడ్డు నరసింహం అన్నదమ్ములే ప్రత్యర్థులు.. మిట్టపాలెం(కొండపి): ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామంలో 793 ఓట్లుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 380 దాకా ఉంటాయి. సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్లు వేశారు. 87 ఏళ్ల వయస్సులో పోటీ మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని శేరేపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు 1993లో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001–2006 వరకు సర్పంచ్గా పనిచేశారు. 87 ఏళ్ల వయస్సులోనూ మరోసారి సర్పంచ్గా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి 1995 నుంచి 2001 వరకు సర్పంచ్గా, 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీ సభ్యురాలిగా చేశారు. -
తొలి దెబ్బ అదిరింది
సాక్షి, ఒంగోలు: పల్లె పోరులో రెండు కీలక ఘట్టాలు గురువారం ముగిశాయి. జిల్లాలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ, రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలు పూర్తయ్యాయి. మొదటి విడతలో 13 మండలాల పరిధిలోని 227 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాయి. ఇందులో 35 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, 762 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించారు. గ్రామాల్లో ఎన్నికలు జరగడం కంటే ఏకగ్రీవాల వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి 35 గ్రామాల ప్రజలు శాంతి వైపు అడుగులు వేశారు. అభివృద్ధికి తోడ్పాటునందిస్తారనుకున్న వారిని సర్పంచ్గా తామే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు మిగల్చడంతో పాటు ఏకగ్రీవాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలని నిశ్చయించుకున్నారు. ⇔ ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో 15 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నుకోగా, సంతనూతలపాడులో 13 గ్రామాల్లో, ఒంగోలులో 3 గ్రామాల్లో, టంగుటూరు మండలంలో 3 గ్రామాలతో పాటు వేటపాలెం మండలంలో ఎన్నిక జరుగుతున్న ఒక్క గ్రామంలో సైతం సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ⇔ మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి 35 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 192 గ్రామాల్లో ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పోటీలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులను కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ⇔ మరోవైపు రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం గురువారంతో ముగిసింది. చాలా గ్రామాల్లో ఈ దశలో సైతం ఏకగ్రీవాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక గ్రామాల్లో ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తేదీన జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుని గ్రామాల్లో చిచ్చు రేపాలనే కుట్రను భగ్నం చేస్తూ అనేక గ్రామాల ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవాల వైపు అడుగులు వేయడం శుభపరిణామం. జిల్లాలో ఏకగ్రీవమైన 35 గ్రామ పంచాయతీల్లో 31 చోట్ల వైఎస్సార్ సీపీ అభిమానులు సర్పంచ్లుగా ఏకగ్రీవం కాగా 4 చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బద్దలైన టీడీపీ కంచు కోటలు.. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడంతో టీడీపీ కోటలు బద్దలయ్యాయి. గతంలో ఎన్నడూ ఏకగ్రీవం కాని అనేక గ్రామాలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకోవడం చూస్తుంటే గ్రామాభివృద్ధి కంటే ఎన్నికలు ముఖ్యం కాదనే విషయం ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేసినట్లయింది. ముఖ్యంగా యద్దనపూడి మండలం దరిశి గ్రామం పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వగ్రామం. ఆయన కుటుంబ సభ్యులకు అక్కడే ఓటు ఉంది. అయినప్పటికీ అక్కడ వైఎస్సార్ సీపీ అభిమాని అయిన బీసీ మహిళను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాడు తీవ్ర పోటీ.. నేడు ఏకగ్రీవాలు.. ⇔ యద్దనపూడి మండలంలోని వింజనంపాడు గ్రామం సైతం టీడీపీకి కంచుకోటగా మొదటి నుంచి ఉండేది. అక్కడ సైతం వైఎస్సార్ సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్చూరు మండలం ఇనగల్లు గ్రామం ఫ్యాక్షన్తో రగిలిపోయేది. ఎన్నికలు వచ్చాయంటే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. ఎన్నికలు వస్తే ఎప్పుడు ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. గ్రామం ఏర్పడి దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన పరిస్థి లేదు. అయితే తొలిసారిగా ఇక్కడ వైఎస్సార్ సీపీ అభిమాని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికవడం చెప్పుకోదగ్గ విషయం. ⇔ పర్చూరు నియోజకవర్గంలోని ఏలూరివారిపాలెం, చినరావిపాడు, టంగుటూరు మండలం అనంతవరం, అల్లూరు, ఒంగోలు మండలం కరవది, వలేటివారిపాలెం, ఉలిచి, నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామాలు సైతం దశాబ్దాలుగా ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంటూ వస్తోంది. వీటిలో అనేక గ్రామాల్లో టీడీపీ అభిమానులే సర్పంచ్లుగా గెలుస్తూ వస్తున్నారు. అయితే మొదటిసారి వైఎస్సార్ సీపీ అభిమానులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. చీరాల నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక్క గ్రామమైన వేటపాలెం మండలం రామన్నపేట గ్రామం గత 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఎన్నిసార్లు ఎన్నిక జరిగినా టీడీపీ అభిమానులే సర్పంచ్లుగా ఎన్నికవుతూ వచ్చారు. మొదటిసారిగా రామన్నపేట సర్పంచ్గా వైఎస్సార్ సీపీ అభిమాని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంచలనం కలిగించింది. కారంచేడు మండలం యర్రంవారిపాలెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన వద్ద నుంచి ఒక్కసారి కూడా ఎన్నిక జరగని పరిస్థితి. అక్కడ గ్రామ పెద్దలే ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుని గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారి కూడా అక్కడ సర్పంచ్ అభ్యరి్థని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప మార్పులు
సాక్షి,విజయవాడ: పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులు ఫిబ్రవరి 17న మూడవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా పశ్చిమలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. -
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహం.. కార్మికుడు బలి
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహానికి ఓ నిండు ప్రాణం బలైంది.. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బ్లాస్టింగ్ ఓ కార్మికుడి ప్రాణాలు బలిగొంది. అక్రమాలు జరిగాయంటూ సీజ్ చేసిన గ్రానైట్ క్వారీలో వక్రమార్గంలో తవ్వకాలు జరిపారు. పక్కనే ఉన్న మరో క్వారీ నుంచి మూతపడ్డ క్వారీకి దారి వేసి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బినామి పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. సీజ్ చేసిన క్వారీలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కష్టం చేసుకుంటున్న అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బల్లికురవ మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్రమ దందా వెలుగు చూసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోని రాగానే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిల్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చారు. ఇందులో భాగంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తన అనుయాయుల పేర్లతో నడుపుతున్న క్వారీల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి వందల కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. తన గనుల్లో తవ్విన గ్రానైట్కు సంబంధించి జీఎస్టీ, రాయల్టీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా తన జేబులు నింపుకున్న వైనం విజిలెన్స్ విచారణలో బయటపడింది. అయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు గొట్టిపాటికి చెందిన క్వారీలను సీజ్ చేశారు. అయితే అక్రమాలకు అలవాటు పడ్డ ఎమ్మెల్యే సీజ్ చేసిన క్వారీల్లో సైతం రాత్రిపూట దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ పక్కనే ఉన్న తన బినామీలకు చెందిన క్వారీల్లో నుంచి గ్రానైట్ను అక్రమ రవాణా చేస్తూ భారీస్థాయి దోపిడీకి పాల్పడుతున్నారు. మూతపడ్డ క్వారీలో ఆదివారం జరిగిన బ్లాస్టింగ్లో కార్మికుడు మృతి చెందిన ఘటనతో గొట్టిపాటి అక్రమాలు బట్టబయలయ్యాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా నడుస్తుందనే విషయం జిల్లాలో అందరికీ తెలిసిందే. శ్రీ రాఘవవేంద్ర గ్రానైట్స్ క్వారీ టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ అక్రమ తవ్వకాలకు తెరతీశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని గాని, జీఎస్టీని గాని చెల్లించకుండా అసలు బిల్లులే లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. తాను చేసిన అక్రమ వ్యవహారాలను కప్పి పుచ్చుకునేందుకు తనను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరుగుతున్నారు.(చదవండి: ఇబ్బంది లేకుండా 'ఇసుక') అంతటితో ఆగకుండా మూతపడ్డ క్వారీల్లో సైతం దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందాకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మూతపడ్డ గంగాభవాని క్వారీలోనే సుమారు 100 మంది కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి ఉంచుతున్నారంటే అక్రమ దందా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం తన క్వారీలో నిబంధనలకు విరుద్దంగా బ్లాస్టింగ్లు చేయడంతో తమిళనాడుకు చెందిన ఎం.అర్ముగం (40) అనే కార్మికుని తలపై బండ రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్వారీలోకి వెళ్లి చూసిన పోలీసు, మైనింగ్ అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. మూతపడిన ఎమ్మెల్యే గొట్టిపాటి క్వారీలో కూలీలను ఉంచిన గదులు గత 8 నెలల క్రితం మూతపడిన గంగాభవాని క్వారీలో సైతం అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు బయటపడింది. పక్కనే తన బినామీకి చెందిన సాయి రాఘవేంద్ర క్వారీలో నుంచి దారి వేసుకుని యథేచ్చగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ బయట ప్రచారాలు చేస్తూ చీకట్లో మాత్రం అక్రమ దందా నిర్వహించడం ఆ ఎమ్మెల్యే నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. అక్రమ గ్రానైట్ దందా మాట అటుంచితే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేసి ఓ కూలీ ప్రాణాలను బలిగొన్న వైనంపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గొట్టిపాటి గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవడంతో పాటు, మైనింగ్ మాఫియా దాష్టీకానికి బలైన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. ఈర్లకొండలో క్వారీ పరిశీలన బల్లికురవ: ఈర్లకొండ ఇంపీరియల్ క్వారీలో కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో సోమవారం డీఎస్పీ క్వారీని పరిశీలించారు. ఈ క్వారీకి ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న శ్రీరాఘవేంద్ర, గిరిరాజ్ క్వారీల్లో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేపట్టగా అక్కడ నుంచి రాయి ఎగిరిపడి ఆర్ముగం తలపై పడి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయినట్టు డీఎస్పీ దృష్టికి తెచ్చారు. విచారణ తదుపరి మైనింగ్ అధికారులకు నివేదించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. క్వారీ పరిశీలనలో అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్ఐ శివనాంచారయ్య పాల్గొన్నారు. మృతుని సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో ఆర్ముగం భౌతికకాయాన్ని పోస్టుమార్టూమ్ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 లక్షల పరిహారానికి డిమాండ్.. గ్రానైట్ క్వారీల్లో వేళాపాళలేని బ్లాస్టింగ్లు రాళ్లు దొర్లిపడి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టించుకోవాల్సిన మైన్స్ అండ్ సేప్టీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని క్వారీ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీ యూ నాయకుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇంపీరియల్ క్వారీలో రాయిపడి చనిపోయిన ఆర్ముగం భౌతిక కాయానికి నివాళులతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. బ్రతుకు దెరువుకు వలసవచ్చి విగత జీవిగా మా రిన ఆర్ముగం కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కారి్మక సంఘం అధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చంద్రబాబు కారణంగా వ్యవస్థ భ్రష్టుపడుతుంది
ఒంగోలు: చంద్రబాబు కారణంగానే వ్యవస్థ భ్రష్టుపడుతుందని , ప్రజల కోసం మనమా లేక మనకోసం ప్రజలా అనే పరిస్థితి నేడు నెలకొందని ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆదివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాహిత్య కార్యక్రమానికి హాజరైన ఆమె కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎంతో మంచిగా ఉండే వారని, తనకు అతని గురించి బాగా తెలుసన్నారు. కానీ నేడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చంద్రబాబు చేతిలో పావుగా మారడం బాధాకరమని, ఈ సమయంలో నిమ్మగడ్డ తెలివి తేటలు ఏమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ఏళ్లపాటు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం ప్రస్తుతం కోల్పోతున్నారని, ఇప్పటికైనా మంచి వ్యవస్థకు నాంది పలికేందుకు చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలని నిమ్మగడ్డకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితులు ఉండవని, ఆయన అనుకున్నదే నిజం చేయాలనుకుంటారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అక్రమాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీచ రాజకీయాలు చంద్రబాబు నైజం అన్నారు. భారత దేశం లౌకిక రాజ్యం అని, సర్వమతాలు సమానమే అన్నారు. చంద్రబాబు నీచ, క్షుద్ర రాజకీయాలకు నిదర్శనంగా దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగారని , ఒక వైపు హిందువును అంటూనే మరో వైపు హిందూ విగ్రహాలను ధ్వంసం చేయమని ఎవరైనా చెబుతారా , అలా చెబితే వారు హిందూ ద్రోహి అవుతారు తప్ప హిందువు కారన్నారు. ఇటువంటి వ్యక్తులను బీజేపీ సైతం దూరంగా ఉంచడం మంచిదని ఆ పారీ్టకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మరో వైపు జగన్మోహన్రెడ్డి కుటుంబ వ్యవహారాల గురించి రాసిన వారు చంద్రబాబు , భువనేశ్వరి పలుక్కోవడం లేదు, చంద్రబాబుకు భోజనం కూడా పెట్టడం లేదు అంటే దీనిని ఆయన నిరూపించుకుంటారా అని ప్రశ్నించారు. ఏ కుటుంబం గురించి అయినా విమర్శించడం సరికాదన్నారు. -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రకాశం : వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొని నలుగురు దుర్మరణం చెందిన ఘటన మార్టూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న రెండు జంటలు ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి. పోలీసులు, 108 సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసే రేకందారు కనక మహాలక్ష్మి (58), బలిజ సత్యనారాయణ(63) భార్యభర్తలు. అదే కోర్టులో అడ్వొకేట్గా పనిచేసే వీరి సమీప బంధువు పర్వతనేని విజయలక్ష్మి (58), ఉయ్యూరు రవీంద్రనాథ్ చౌదరి అలియాస్ చినబాబు (60)లు దంపతులు. ఈ రెండు కుటుంబాలు ఏలూరు పట్టణంలోని ఫతేబాద్ కాలనీ అగ్రిగోల్డ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాయి. చినబాబుకు గతంలో భార్య మరణించగా గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీన విజయలక్ష్మితో వివాహమైంది. ఈ రెండు కుటుంబాలతో పాటు కనక మహాలక్ష్మి మేనల్లుడు అయిన ఎం.సందీప్తో కలిసి మొత్తం ఐదుగురు నాలుగు రోజుల క్రితం కారులో వెంకన్న దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. తిరిగి ఏలూరు ప్రయాణం కాగా చినబాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్థానిక అంబేడ్కర్ కాలనీ ఎదురు జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ 50 మీటర్లకు పైగా ముందుకు దూసుకెళ్లి.. వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును సైతం తనతో లాక్కొని వెళ్లిందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చెమటోడ్చిన అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే ఎస్ఐ శివకుమార్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ రమణ, నారాయణలతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో ఉన్న ఐదుగురులో నలుగురు మృతి చెందగా ఐదో వ్యక్తి సందీప్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. హైవే అధికారుల క్రేన్ ద్వారా లారీ నుంచి కారును విడగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అనంతరం భారీ క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును విడగొడుతూ కారు వెనుక సీట్లో సందీప్ను అతి కష్టం మీద బయటకు రప్పించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనంలో సందీప్కు ఆక్సిజన్ అమర్చి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. లారీ నుంచి విడిపించిన కారు డోర్లు ఎంతకు రాకపోవడంతో ఎస్ఐ, ఏఎస్ఐలు స్వయంగా గునపాలతో కారు డోర్లు ధ్వంసం చేసి సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఛిద్రమైన నలుగురు మృతదేహాలను వెలికితీశారు. వేళకాని వేళ.. స్థానికులు అందుబాటులో లేకపోవడంతో పోలీసు అధికారులే అన్నీ తామై వ్యవహరించారు. మూడున్నర గంటల సమయంలో ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఐదున్నర గంటలకు చీరాల డీఎస్పీ శ్రీకాంత్, మధ్యాహ్నం ఒంటి గంటకు ఏఎస్పీ రవిచంద్ర చీరాల మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ అమర్ నాయక్లు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ఎస్ఐ శివకుమార్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలు సమయంలో నలుగురు మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి పోస్టుమార్టం నిర్వహించగా అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( యూపీలో మరో నిర్భయ) గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోనే మృతదేహలు చిక్కుకుపోవడంతో పోలీసులు, హైవే సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. -
మా మంచి సైన్సు మాస్టార్
ఆయనో సైన్సు ఉపాధ్యాయుడు..ఉదయాన్నే పాఠశాలకు వచ్చి పిల్లలకు నాలుగు పాఠాలు చెప్పి తన పని అయిపోయిందనుకోలేదు. పిల్లల చేతిరాత శిక్షణ మొదలుకొని మూఢ నమ్మకాలపై అవగాహన, సమ్మర్ క్యాంపులు, సమాజంలోని రుగ్మతలపై నాటిక రచనలు, ప్రదర్శనలు, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంటూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కొండపి: కొండపికి చెందిన లక్కంతోటి వరప్రసాద్ రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మర్రిపూడి మండలం తంగెళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్సు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. చేతిరాత..మన తలరాత.. చేతిరాత బాగుంటే మన తలరాత బాగుంటుందంటారు పెద్దలు. అందుకే వరప్రసాద్ విద్యార్థుల చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటి వరకు చేతిరాత సక్రమంగా లేని 3 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాతను తీర్చిదిద్దారు. తాను పనిచేసిన పాఠశాలల్లోనే కాకుండా ఇతర పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సైతం సమ్మర్ క్యాంపులు పెట్టి మరీ శిక్షణ ఇస్తున్నారు. నాటికల ద్వారా చైతన్యపరుస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలను బట్టబయలు చేసేలా ప్రజలకు కనువిప్పు కలిగేలా ఎయిడ్స్పై సమరం అంటూ నీ జీవితం–నీచేతిలోనే.. నాటికను రచించి పాఠశాల విద్యార్థులతో హైదరాబాద్ శ్రీసత్యసాయి ఆడిటోరియంలో ఎయిడ్స్డే సందర్భంగా 2006 డిసెంబర్లో ప్రదర్శించారు. ఈ నాటికకు రచయితగా, డైరెక్టర్గా ప్రసాద్ యూనిసెఫ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. బేటిబచావో– బేటిపడావో కార్యక్రమంలో భాగంగా చదవనిద్దాం– ఎదగనిద్దాం అంటూ బాలికల విద్య గురించి ప్రకాశంజిల్లాలో ప్రథమస్థానం సాధించి, గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంశాపత్రం అందుకున్నారు. బాలకార్మిక వ్యవస్థపై పోలీస్ బాబాయ్ శీర్షికన ఎన్టీఆర్ కళాపరిషత్లో 2010–11లో పిల్లలచేత వేయించిన నాటికకు రచయిత, దర్శకత్వం తదితర విభాగాల్లో మొత్తం 11 అవార్డులు అందుకున్నారు. అదే విధంగా వివిధ దినపత్రికల్లో ఆదివారం మ్యాగజైనన్లలో రచయితగా ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. క్రీడలకు ప్రోత్సాహం.. ప్రసాద్ చదువుకునే రోజుల్లో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా ఆంధ్రజట్టుకు ప్రాతినిధ్యం వహించి 1995లో బంగారు పతకం సాధించారు. క్రీడల పట్ల మక్కువతో ఏటా తాను పనిచేస్తున్న పాఠశాలల్లోని క్రీడాకారులకు రూ.15 వేలు ఖర్చు చేసి క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్పుస్తకాలు అందిస్తూ వారి విద్యార్థిభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ తోటి ఉపాధ్యాయులకు ప్రసాద్ ఆదర్శంగా నిలుస్తున్నారు. మ్యాజిక్ వెనుక లాజిక్.. సమాజంలో పట్టిపీడిస్తున్న మూఢ నమ్మకాలు ఎన్నో. ఈ మూఢ నమ్మకాలకు విద్యార్థులను దూరం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుండే చిన్నారుల్లో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించేలా మ్యాజిక్ వెనుక లాజిక్ అంటు సైన్సు ప్రయోగాల ద్వారా విద్యార్థులకు విషయాలపై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకు వస్తున్నారు. -
మైనారిటీ తీరకముందే యువత పెడదొవపడుతుంది
సాక్షి, ప్రకాశం: మైనారిటీ తీరకముందే యువత ప్రేమ మోజులో పడి పెడవదోవ పడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న రాజమహేంద్రవరం ప్రభుత్వ కళశాల తరగతి గదిలో విద్యార్థులు పెళ్లి చేసుకున్న సంఘటన చూసి షాకయ్యానన్నారు. మైనర్ బాలిక, బాలుడు తీరు తప్పైనప్పటికి బాలికకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. బాలికతో పాటు ఇంటి నుంచి వెలివేసిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు.. మోసాలపై వార్డు గ్రామ, మండల.. పట్టణ స్థాయి వరకు పరిస్థితులను పరిశీలించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉన్న చట్టాలపై గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని వాసిరెడ్డి పద్మా తెలిపారు. -
నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ..
చీరాల టౌన్ : నడిసంద్రం.. ఇంజిన్ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్ రిగ్ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి ) ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు. -
దర్శిలో కిడ్నాపైన పసికందు క్షేమం
సాక్షి, ప్రకాశం: నెల రోజుల వయసున్న శిశువు కిడ్నాప్కు గురై, ఆ వెంటనే తల్లి ఒడిని చేరిన ఘటన ప్రకాశం జిల్లాలోని దర్శిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మకు నెల రోజుల వయసున్న బిడ్డ ఉంది. ఆ పాపపై కన్నేసిన ఓ గుర్తు తెలియని మహిళ తనను అంగన్వాడీ టీచర్గా మరియమ్మకు పరిచయం చేసుకుంది. ప్రభుత్వం నుంచి మహిళలకు డబ్బు వస్తుందని నమ్మించి, ఫొటోలు దిగేందుకు దర్శి రావాలని ఆమెను నమ్మించింది. (చదవండి: చిన్నారి అంజి కిడ్నాప్ కథ విషాదాంతం!) ఓ నలుగురు మహిళలను దర్శికి తీసుకొచ్చింది. అనంతరం ఫొటో స్టూడియో దగ్గర మహిళలను ఉంచి బిడ్డను తీసుకుని పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మరియమ్మ పోలీసులను ఆశ్రయించింది. కిలాడీ మహిళ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నూజెండ్ల మండలం ఉప్పలపాడులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. (చదవండి: తల్లి చూస్తుండగానే.. కూతురి కిడ్నాప్) -
ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు
సాక్షి, కర్నూలు/ప్రకాశం/గుంటూరు: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా బండి ఆత్మకూరు మండలం లో 180.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహానంది - గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుండి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల - భీమవరం మధ్య వక్కిలేరు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లా: పెద్దముడియం మండలంలో కుందూ ప్రవాహం పెరుగుతుంది. లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. నెమలిదిన్నె, బలపనగుడూరు, చిన్నముడియం, సిరిపాల దిన్నే, గర్శలూరు, ఉప్పలురు, పెద్దముడియం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పోరుమామిళ్ళ, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. పోరుమామిళ్ళ మండలంలో నాగలకుంట్ల, బూరగమానుపల్లె చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. గోపవరం మండలం మడకల వారిపల్లె రాచెరువుకు భారీగా వర్షపు నీరు చేరింది. ఐదేళ్ల తర్వాత చెరువుకు నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రొంపిచర్ల మండలం మునమాక, తుంగపాడు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసరావుపేట వైపు రాకపోకలు బంద్ అయ్యాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు పొంగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం చదలవాడ చెరువుకు గండి పడటంతో చీరాల - ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో శ్రీనివాస థియేటర్ వద్ద ఇళ్ల లోకి చేరిన వరద నీరు చేరడంతో ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. రాచెర్ల మండలంలో గుండ్లకమ్మ ఉగ్రరూప దాల్చింది. గిద్దలూరు-ఆకవీడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. బెస్తవారిపేట మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. బాసినేపల్లి వద్ద వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా: జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో కుండపోత వర్షం పడుతుంది. డోనేకల్ వాగు పొంగిపొర్లడంతో గుంతకల్లు-బళ్లారి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి: ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి వరద నీరువచ్చి చేరుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద నీటిమట్టం 5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కు మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం పెద్దగా లేకపోయినా గోదావరి కాస్త పెరిగితే లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ఐదు లక్షల క్యూసెక్కుల కు మించి వరదనీరు పెద్దగా వచ్చే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పరీక్ష రాస్తుండగా పేపర్ లాగేశారు
ఒంగోలు మెట్రో: పీజీ పరీక్షలు వారం రోజులు ముందుకు జరిపి నిర్వాకం ప్రదర్శించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు ఇప్పుడు ఏకంగా డిగ్రీ పరీక్షలు రాస్తుండగానే రద్దు చేసి మరో సంచలనానికి కారణమయ్యారు. కరోనా కష్టకాలంలో అసలే రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలూ పడి కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ అధికారుల తీరు కన్నీరు పెట్టించింది. ఏకాగ్రతతో పరీక్ష రాస్తున్న సమయంలో కేంద్రాల నిర్వాహకులు ఓఎంఆర్ షీట్లు లాగేసుకుంటుంటే చేష్టలుడిగి చూడటం విద్యార్థుల వంతైంది. యూనివర్సిటీ పరీక్షాధికారుల తప్పిదం వల్ల జిల్లాలో వేలాది మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు తీవ్ర అవస్ధలు పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్న పరీక్షలనైనా ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన అధికారులు తీవ్ర అలసత్వంతో నిర్వహిస్తూ పరీక్షల ప్రక్రియనే అపహాస్యం చేశారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. (అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) పశ్చిమ ప్రకాశంలో గంట గడిచాక.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు కరోనా కారణంగా ఆగిపోగా, తిరిగి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రీ–షెడ్యూల్ చేశారు. గత వారంలో డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థులకు గత వారం పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15 సోమవారం బీకాం విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్, బీఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్ష నిర్వస్తున్నారు. జిల్లాలో చీరాల, కంభం, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు తదితర పదికి పైగా కేంద్రాల్లో వేలాదిమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా కారణంగా రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలు పడి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులు యథాతధంగా పరీక్ష రాస్తుండగా, ఆయా కేంద్రాల నిర్వాహకులు పరీక్ష రద్దయిందంటూ జవాబు పత్రాలు లాక్కుంటుండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. కంభం, గిద్దలూరు, మార్కాపురం తదితర కేంద్రాల్లో విద్యార్థులు సగానికి పైబడి పరీక్షను పూర్తి చేశారు. ఇక ఒంగోలులోని పలు కేంద్రాల్లో విద్యార్థులు గంటకు పైగా పరీక్ష రాసేశారు. ఒంగోలులో నోడల్ కాలేజీ నుంచి పరీక్ష రద్దయిందంటూ సమాచారం వచ్చిందని పేపర్లు లాగేసుకున్నారు. దీంతో విస్తుపోవటం విద్యార్థుల వంతయింది. మారని అధికారుల తీరు.. జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఒంగోలులో ఒక పరిపాలనా కార్యాలయం పెట్టమని, ఎప్పటికప్పుడు తగిన విధంగా సమాచారం ఇవ్వమని దశాబ్దాలుగా జిల్లా విద్యార్థులు, యాజమాన్యాలు ఎంత మెరపెట్టుకుంటున్నప్పటికీ, నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో ఎంపిక చేసిన నోడల్ కాలేజీలు సైతం యూనివర్సిటీకే లేదు. తమకెందుకు బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక డిగ్రీ విద్యను పట్టించుకోవాల్సిన రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎప్పుడో చుట్టపుచూపుగా తప్ప జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుత పరీక్షల నిర్వహణలో అయితే పరీక్షల పరిశీకులు, స్క్వాడ్ మెంబర్లుగా ప్రభుత్వ, ఎయిడెడ్ లెక్చరర్లుని నియమించాల్సిన అధికారులు తమకు తెల్సిన ఒకరిద్దరు ప్రవేటు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకున్నారు. కనిపించని సమన్వయం.. జిల్లాలో 200 డిగ్రీ కళాశాలలు, 60కి పైగా పీజీ కళాశాలలు, మరో 60 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతియేటా పాతిక వేలమందికి పైగా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరి కోర్సుల నిర్వహణ, పరీక్షలు, మూల్యాంకనం తదితర అంశాల్లో జిల్లాకు చెందిన అధ్యాపకుల, యాజమాన్యాల సమన్వయం లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో జిల్లా నుంచి కనీసం ఒక్కరిని కూడా నియమించలేదు. తద్వా రా జిల్లాలోని డిగ్రీ, పీజీ, బీఈడీ విద్య నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కనీసం సవతితల్లి ప్రేమనైనా చూపడం లేదు. దీంతో విద్యా ర్థులు, కాలేజీల నిర్వాహకుల అవస్థలు వర్ణనాతీతం. ఇటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే సోమవారం పరీక్షను గంట ముందు రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. (శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్) 18న మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం గుంటూరులో వర్షం కారణంగా సెప్టెంబర్ 15 సోమవారం రద్దు చేసిన పరీక్షను సెప్టెంబర్ 18న నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ పరీక్షల అదనపు నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, పరీక్షల సమన్వయకర్త కె.మధుబాబు తెలిపారు. ఇక రీ–షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న పరీక్షలను యథాతధంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. – ఎఎన్యూ పరీక్షల విభాగం -
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ. 1,863 కోట్లు: మంత్రి
సాక్షి, ప్రకాశం: మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో మంత్రి ఒంగోలు నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి, మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 1,863 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మహిళలకు సంబంధించి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దే అన్నారు. ఈ నెల 11వ తేదీన డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ పథకం కింద 6, 200 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద జిల్లాలోని దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల పరిధిలోని 248 అంగన్వాడి కేంద్రాల ద్వారా 3, 980 మంది తల్లులు, 14, 650 మంది చిన్నారులు ప్రయోజనం పొందనున్నారన్నారు. అంతేగాక సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలోని 53 మండలాల్లో 3,996 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 46 వేల మంది తల్లులు, 7 నెలల నుండి 6 ఏళ్ళ లోపు ఉన్న లక్షా ఇరవై వేల మంది చిన్నారులు లబ్ధి పొందునున్నారన్నారు మంత్రి పేర్కొన్నారు. -
దారుణం: మందలించాడని రిటైర్డ్ ఏఎస్ఐ మర్డర్
సాక్షి, ప్రకాశం: చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గొడవ చేయొద్దని మందలించినందుకు రిటైర్డ్ ఏఎస్ఐ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. రౌడీ షీటర్ సురేంద్ర మద్యం మత్తులో స్థానికంగా ఇళ్ల వద్ద రోజూ గొడవ చేస్తున్నాడు. అక్కడే నివాసముండే రిటైర్డ్ ఏఎస్ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. దీంతో గత అర్ధరాత్రి ఇంట్లో చొరబడి నాగేశ్వరరావుపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలోఉన్న నిందితుడు సురేంద్ర కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. (చదవండి: రౌడీషీటర్ షానూర్పై హత్యాయత్నం) -
నారా లోకేష్కు లీగల్ నోటీసు
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే) -
మూన్నాళ్ల ముచ్చటే!
పెద్దదోర్నాల: జాతీయ రహదారులు దేశంలోని వేల కిలోమీటర్ల దూరంలోని ప్రధాన నగరాలను కలిపే రాచబాటలు. కాలాన్ని, ఇంధనాన్ని ఆదా చేసే మార్గాలు. రోజూ వందలాది వాహనాలు ఈ మార్గాల గుండా ప్రయాణికులను, సరుకులను తరలిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన జాతీయ రహదారులను నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్మించడం అధికారుల అలసత్వానికి పడుతోంది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. మండల పరిధిలోని రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో అడుగుడుగునా అధికారులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఈ మార్గంలో ఇటీవల వేసిన రోడ్డు కొద్ది రోజులకే జారి పోయింది. రాయలసీమ, కోస్తా జిల్లాలను కలిపే ప్రధానమైన రహదారిని అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకంగా నిర్మించడంపై వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు గాలికి.. మండల పరిధిలోని కర్నూలు రహదారిలో ఉన్న రోళ్లపెంట నుంచి శ్రీశైలం రోడ్డులోని శిఖరం మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు ఆయా రోడ్లు విజయవాడ పరిధిలో ఉండేవి. అయితే ఇటీవల ఆ రోడ్లను అనంతపురం పరిధిలోకి చేర్చటంతో అధికారుల పర్యవేక్షణ నామమాత్రమైంది. రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు రెండు భాగాలుగా సుమారు 34 కోట్ల రూపాయలతో ని«ర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయి. సాధారణంగా కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును డోజరుతో పెకిలించి ఆపై కొత్త రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల కొత్త రోడ్డుకు గ్రిప్ ఉంటుంది. కాంట్రాక్టర్లు పాత రోడ్డును పెద్దగా కదిలించకుండా ఆపైన కొత్త రోడ్డు వేశారు. దీంతో రోడ్డు వేసిన కొద్ది రోజులకే అడుగుడుగునా జారిపోయి పాత రోడ్డు దర్శనం ఇస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో హుటా హుటిన మండల పరిధిలోని యడవల్లి వరకు పలు ప్రాంతాలలో నాసిరకంగా ఉన్న రోడ్డును తొలగించి కొత్త రోడ్డును వేసేందుకు రంగం సిద్ధం చేశారు. తొలగించిన రోడ్డు కాకుండా మరి కొన్ని ప్రాంతాలలో రోడ్డు జారి పోవడంతో పాత రోడ్డే దర్శనం ఇస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణ పనులను మరింత నాణ్యతా ప్రమాణాలు జోడించి చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. -
భార్య, కుమార్తెను హతమార్చి.. కిరాతకం..!
ప్రకాశం,యర్రగొండపాలెం: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను, కన్న కూతురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ నగర్లో సోమవారం జరిగింది. ఈ హత్యలు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమాచారం అందింది. స్థానిక ఒక ప్రైవేట్ డెయిరీలో పాలపట్టే వ్యాన్కు డ్రైవర్గా పనిచేస్తున్న కె.ముసలయ్య తన భార్య రేష్మ(21), కుమార్తె సమీర(3)లను హత్యచేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేందుకు ఫ్యాన్కు చీర కట్టి ఉరివేసుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ముందుగా కుక్కర్ ప్లగ్ తీగతో గొంతుకు బిగించి హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. హత్య చేసిన తరువాత రేష్మ ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసి రక్తపు మరకలు కింద పడకుండా జాగ్రత్త పడినట్లు వారు ఆరోపించారు. (భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం) ఆడపిల్ల పుట్టిందని వేధించేవాడు.. కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లెకు చెందిన రేష్మను పుల్లలచెరువుకు చెందిన కె.ముసలయ్యకు ఇచ్చి 2016లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.80 వేలు, ఆ తర్వాత రూ.20 వేలు ఇచ్చామని మృతురాలి తండ్రి డి.హుస్సేనయ్య తెలిపాడు. వివాహం జరిగిన ఏడాదిన్నర తరువాత ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి తన కూతురిని తీవ్రంగా వేధించేవాడని మృతురాలి తల్లి జరీనా వాపోయింది. నిత్యం తాగివచ్చి గొడవ పడుతుండేవాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా కాపురం చేసుకుంటుందని ఆమె తెలిపింది. అయితే ముసలయ్య అక్రమ సంబంధం గురించి అడిగినందుకు రేష్మను అతికిరాతకంగా హత్యచేశాడని, అడ్డువస్తుందని ముక్కుపచ్చలారని పసికందును కూడా గొంతుకు తీగబిగించి హత్య చేశాడని వాపోయింది. మీ కుమార్తె గొడవ పడుతుందని ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముసలయ్య ఫోను చేశాడని, అందుకు తాను సర్ది చెప్పినట్లు మృతురాలి తండ్రి హుసేనయ్య తెలిపాడు. కాసేపు ఆగిన తరువాత నా కుమార్తె రేష్మకు ఫోను చేసి మాట్లాడానని, మాట్లాడుతున్న సమయంలో అర్థంతరంగా ఆగి పోయిందని ఆయన తెలిపాడు. రాత్రి 10గంటలు దాటిన తరువాత నీ కుమార్తె ఉరివేసుకొని మరణించిందని ఫోను ద్వారా తెలిపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల నుంచి కేకలు వినిపిస్తున్నాయని, భార్యభర్తలు గొడవ పడుతున్నారని తాము అనుకున్నామని పరిసర ప్రాంతాలకు చెందిన వారు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ తల్లి, కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హుటాహుటిన యర్రగొండపాలెం చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురయిన రేష్మ తల్లిదండ్రులు, బంధువులను ఆయన విచారించారు. తహసీల్దార్ కె.నెహ్రూబాబు శవ పంచనామా కార్యక్రమాలను చేయించారు. ఈ కేసును సీఐ పి.దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్సై పి.ముక్కంటి దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
మోపాల్: మోపాల్కు చెందిన జనగాం సందీప్రెడ్డి (27) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మోపాల్ ఎస్హెచ్వో పూర్ణేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. సందీప్రెడ్డికి మూడేళ్ల క్రితం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ప్రవళికతో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. సందీప్రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు చేసుకోవడంతో పురుగుల మందు వాసన వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి భూదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
యువతిని మోసగించిన ఆర్మీ క్లర్క్
వెలిగండ్ల: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆర్మీ క్లర్క్పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజ్కుమార్ కథనం ప్రకారం.. మొగళ్లూరుకు చెందిన గంగవరపు ప్రవళ్లిక అదే గ్రామానికి చెందిన పూనూరి ప్రతాప్లు నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రతాప్ ఆర్మీలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. తల్లికి కుమారుడి ప్రేమ వ్యవహారం నచ్చ లేదు. ఈ నెలలో తెలంగాణకు చెందిన మరో యువతితో అతడికి వివాహం చేశారు. విషయం తెలుసుకున్న ప్రవళ్లిక, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఈ నెల 8వ తేదీన స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజ్కుమార్ ఇరువర్గాల బంధువులను పిలిపించి విచారించారు. ప్రవళ్లిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ప్రతాప్కు వివాహం జరిగే వరకూ పట్టించుకోలేదని బంధువులు పోలీసుస్టేషన్ ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. -
పోరాడి ఓడింది..!
నాగులుప్పలపాడు: మాచవరం విద్యుత్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలతో 88 రోజుల కిందట ఒళ్లంతా కాలిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన కాకామాను భాగ్యవతి (35) బతకాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తాయన్నట్లు గత 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కాస్త కోలుకున్నట్లు, తెలివిగా ఉండటంతో అంతా సంతోషం అనుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి ఆదివారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. మే 14వ తేదీన రాపర్ల గ్రామ పొలాల్లో మిర్చి కోతకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ట్రాక్టర్ ఎక్కి వస్తుండగా డొంకకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం ట్రాక్టర్ డోరుకు బలంగా తగిలి కరెంటు తీగలు ట్రాక్టర్లోని కూలీలపై పడ్డాయి. ఈ సంఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించడంతో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు కాకుమాను నాగమణి కాలిన గాయాలతో ఉన్నారు. వీరి ఇరువురిని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ అదే రోజు రాత్రికి మరణించాడు. కాకుమాను భాగ్యవతి మాత్రం ఆ రోజు నుంచి కొన ఊపిరితో కొట్టుకుంటూ చికిత్స పొందుతుంది. అయితే 10 రోజుల కిందట నుంచి కాస్తంత కోలుకున్నట్లు తెలివిగా ఉండటంతో కుటుంబ సభ్యులలో బతుకుతుందేమో అన్న కొంత ఆశ కలిగింది. ఆ ఆశలను నీరుగారుస్తూ ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది. మృతురాలుకి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడి వయస్సు మూడేళ్లు ఉంటుంది. -
'పర్ఫెక్ట్' కంపెనీ గుట్టురట్టు చేసిన సిట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :మద్యానికి బానిసైన వారు మద్యం దొరక్క శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. కురిచేడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు ‘‘పర్ఫెక్ట్’’గా సాగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడవక ముందే అందుకు కారణమైన పర్ఫెక్ట్ కంపెనీ మూలాలను పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తూ వెళ్లిన సిట్ బృందం ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ శానిటైజర్ గుట్టును రట్టు చేసింది. కనీసం ఈ శానిటైజర్ తయారీ కేంద్రంలో సాంకేతిక నిపుణులు గానీ కనీసం చదువుకున్న వారు గాని లేని పరిస్థితి. గ్రామాల్లో కూలీ పనులు చేసుకునే వారిని ఓ గోడౌన్లో ఉంచి వారి చేత శానిటైజర్ పేరుతో నకిలీవి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం పోలీసు దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ బృందం అసలైన సూత్రధారులను పట్టేపనిలో పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్లో అక్రమంగా తయారవుతున్న పర్ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని పట్టుకున్నారు. అంతా అక్రమమే.. పర్ఫెక్ట్ కంపెనీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్ బృందానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ఒళ్లు జలదరించింది. కనీసం ఒక్క టెక్నికల్ పర్సన్ కూడా లేకుండా చదువులేని గ్రామీణ ప్రాంతాల కూలీలను తీసుకొచ్చి శానిటైజర్ పేరుతో ఏదో ద్రవాన్ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. శానిటైజర్లో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, ప్రొఫనాల్ కాకుండా మిథైలిన్ క్లోరైడ్ (డీసీఎం) ను ఉపయోగించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ మిథైలిన్ క్లోరైడ్ ప్రమాదకరమైనదని దానిని శానిటైజర్లో వాడకూడదని నిపుణుల ద్వారా తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీ పేరుతో చూపుతున్న అడ్రస్, జీఎస్టీ, ఐఎస్ఓ సర్టిఫికెట్ వంటివి అన్ని తప్పుడు వాటిని సృష్టించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి వద్ద నుంచి కురిచేడులో మెడికల్ షాపు నిర్వాహకులు ఎంతమంది కొనుగోలు చేసి వీటిని అమ్మారనే విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులకు విషయం తెలిసినా బయటపడటం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తాగడం వల్లే కురిచేడులో అధిక శాతం మరణాలు సంభవించాయని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరినీ వదలం.. – ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశాం. ఇప్పటికే సిట్ అధికారులు పర్ఫెక్ట్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీని సీజ్ చేసి అందులో నిషేధిత మిథైలిన్ క్లోరైడ్ను కలుపుతున్నట్లుగా గుర్తించాం. ఇది ప్రమాదకరమైన కెమికల్. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇందులో కురిచేడులోని మెడికల్ షాపు నిర్వాహకులకు ఎంతమందికి సంబంధాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నాం. అది నిజమని తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం. -
ఆయనకు కాళ్లు, ఒళ్లు పట్టాలి..
బేస్తవారిపేట: రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు..రాచరికం అంతమైంది..కానీ అదే రాచరికపు పోకడలను గుట్టుగా కొనసాగిస్తున్నాడు ఓ ఉన్నతాధికారి. ఉన్నత ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తనకింది స్థాయి సిబ్బందితో ఊడిగం చేయించుకుంటున్నాడు. రాచరికపు పోకడలను అనుసరిస్తూ తనను తాను రాజులా భావించుకుంటున్నాడు. సిబ్బందితో చెయ్యకూడని పనులు చేయించుకుంటూ హీనాతి హీనంగా చూస్తుండటంతో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆ అటెండర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన ప్రవర్తనతో విసుగు చెందిన సిబ్బంది కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదీ..కథ బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. ఎస్డీసీ ఎన్.విజయ్కుమార్ వారిని హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ నుంచి హౌస్ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు. కంభంలో నివాసం ఉండే అటెండర్ అనిల్ ఉదయం ఐదు గంటలకే వేడినీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్ చేయాలి. అంతేకాదు ఆయన దుస్తులను సైతం ఉతికి శుభ్రం చేసి పెట్టాలి. ఇవి చేయకుంటే బూతు పురాణం మొదలు పెడతాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తుండటంతో ఏడాదిగా అటెండర్లు మనసు చంపుకుని చాకిరీ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ చిరుద్యోగి రోజూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పట్టుకు రావాల్సిందే. కార్యాలయంలోనే నివాసం ఉంటుండటంతో టీవీ ఒకరు, సన్ డైరెక్ట్ ఒకరు తెచ్చి పెట్టే వరకు ఒప్పుకోలేదు. వెహికిల్ అలవెన్స్లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దొర కోసం కోళ్లు పెంచాలి క్యాంపుకు వెళ్లివచ్చేటప్పుడు సదరు ఉన్నతాధికారి రైతుల నుంచి కోళ్లు పట్టుకొస్తాడు. మీరు ఏం పెట్టి పెంచుతారో తనకు తెలియదని, పది రోజుల్లో మంచి సైజు రావాలంటూ ఆయన అటెండర్లను ఆదేశిస్తాడు. కోడిని కార్యాలయంలోనే కట్టేసి పెంచాల్సిన దుస్థితి. బాగా పెరిగిన తర్వాత ఆయన ఇంటికి పంపాల్సిన బాధ్యత కూడా అటెండర్లదే. నెల్లూరు వెళ్లి బాత్రూమ్లు శుభ్రం చేయాల్సిందే అటెండర్గా పనిచేసే మురళికి డ్రైవింగ్ కూడా వచ్చు. ఆయన్ను తన కారుకు డ్రైవర్గా ఉపయోగించుకుంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల ఆలనపాలన చూసుకోలేక మురళి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు అపార్ట్మెంట్లో ఎవరైనా ప్లాట్ ఖాళీ చేస్తే దానిలో టాయిలెట్స్, లెట్రిన్ క్లీన్ చేయాలి. గృహాల్లో బూజు దులపాలి. ఉన్నత ఉద్యోగం చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్ను సైతం సదరు అధికారి కాజేశాడు. ఫ్యాన్లు, బాత్రూమ్ షింక్లు నెల్లూరులోని తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. కలెక్టర్కు ఫిర్యాదు వ్యక్తిగత పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదును కలెక్టర్, సీఏం కార్యాలయానికి బాధితులు పంపారు. సొంత పనులు చేస్తూ రాత్రి పూట కూడా కాపాలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాళ్లు పట్టించుకోవడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవడం వంటి పనులు చేస్తున్నాడని వారి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
థర్డ్ స్టేజిలోకి ఒంగోలు నగరం
ఒంగోలు టౌన్: ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా గుప్పెట్లో ఉంటూ ఏ క్షణాన దాని బారిన పడతమోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగర పాలక సంస్థకు చెందిన కీలకమైన ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. కింది స్థాయి సిబ్బంది వరకు కరోనా పాకింది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం రోడ్లపై ఉంటూ కాలువల్లోని చెత్తా చెదారం తీసే తమలో ఎంతమంది కరోనా బారిన పడ్డారోనంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలు నగర పాలక సంస్థపై కరోనా కొరడా ఝులిపించిన నేపథ్యంలో తదుపరి టార్గెట్ తామేనంటూ పారిశుద్ధ్య కార్మికులు హడలిపోతున్నారు. కాలువలు శుభ్రం చేస్తూ, రోడ్లపై ఉన్న చెత్తను తొలగిస్తున్న తాము త్వరగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని, అధికారులు తమ గురించి కూడా పట్టించుకొని త్వరితగతిన నిర్ధారణ పరీక్షలు చేయించాలని వారు వేడుకుంటున్నారు. మురిపించి..మురిపించారు ఒంగోలు నగరంలో తొలి కరోనా కేసు నమోదైన మార్చి చివరి వారంలో యంత్రాంగం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్జీఓ కాలనీలో కరోనా కేసు రావడంతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ కింద మార్చేశారు. అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తించారు. కరోనా కేసు వచ్చిన ఇంటితో పాటు ఆ కాలనీ మొత్తం కొన్ని రోజులపాటు ఏకధాటిగా శుభ్రం చేస్తూ బ్లీచింగ్ చల్లుతూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. పారిశుద్ధ్య కార్మికులకు కనీసం రక్షణ కవచాలు కూడా అందించకుండా పనులు చేయిస్తున్నారంటూ సాక్షి దినపత్రికలో వారి గోడుపై వరుస కథనాలు ప్రచురించారు. స్పందించిన నగర పాలక సంస్థ అప్పటికప్పుడు వారికి రెండు శానిటైజర్లు, రెండు మాస్క్లు, చేతులకు గ్లౌజ్లు అందించింది. దాంతో వారి పని అయిపోయినట్లుగా నగర పాలక సంస్థ అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కరోనా ఒంగోలు నగరం మొత్తాన్ని చుట్టు ముట్టేసింది. దాదాపు ప్రతి కాలనీలో పదికి తగ్గకుండా కరోనా కేసులు నమోదై ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు నగర పాలక సంస్థలోని కీలక అధికారులంతా కరోనా బారిన పడ్డారు. కొంతమంది సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ హడావుడిగా ప్రత్యేక వాహనాన్ని తెప్పించి కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించింది. అయితే నిత్యం కరోనా అంచున ఉంటూ విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. థర్డ్ స్టేజిలోకి ఒంగోలు నగరం ఒంగోలు నగరంలో కరోనా థర్డ్ స్టేజీలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ముందుగా పేర్కొన్న విధంగా కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కరోనా తొలి దశలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం అలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా కరోనా ఒక్కసారిగా వారిని పడేస్తోంది. ప్రస్తుతం ఒంగోలులో ఇలాంటి పరిస్థితులు ఉండటంతో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి కరోనా లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం నగరంలోని అన్ని వీధులను చిమ్మడం, కాలువలను శుభ్రం చేసేవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు నగరంలో మొత్తం 786 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 105 మంది రెగ్యులర్ సిబ్బంది ఉండగా 681 మంది కాంట్రాక్టు కింద పనిచేస్తున్నారు. నగరం మొత్తం కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ 786 మంది పారిశుద్ధ్య కార్మికుల్లో ఎంతమంది కరోనా బారిన పడి ఉంటారోనని అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షించే శానిటరీ సూపర్వైజరే కరోనా బారిన పడ్డారు. రోజూ తమ డివిజన్కు వెళ్లి అక్కడ మస్టర్ వేసిన అనంతరం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికుల్లో ఎంతమందికి కరోనా ఉండవచ్చన్న దానిపై చర్చ జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు మూకుమ్మడిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని యంత్రాంగం నిర్ణయించింది. అంతకంటే ముందుగా నగర పాలక సంస్థ కార్యాలయంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ మిగిలిన వారికి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. తమను ఎప్పుడు గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారోనని పారిశుద్ధ్య కార్మికులు ఎదురు చూస్తున్నారు. -
అటవీ భూమి హాంఫట్..!
తిమ్మపాలెం (పొన్నలూరు): పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెం గ్రామంలో చెరుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 787, 787/1తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సుమారుగా 1708 ఎకరాల ఫారెస్ట్, పశువుల మేత బీడు భూములు విస్తారంగా ఉన్నాయి. వీటిలో సుమారు 700 ఎకరాలు ఆక్రమణకు గురైంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ సానుభూతిపరులు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు చూసుకొని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. అప్పటి నుంచి నేటి వరకు అక్రమార్కులు తమ పట్టా భూమికి సమీపంలో ఉన్న అటవీ, పశువుల బీడు భూములను కొంచెం, కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. రోజులుగా అటవీ భూములను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా చదును చేసి జామాయిల్, కంది, బత్తాయి, వరి, మినుముతో పాటు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. మొదటిలో కొంత భూమిని మాత్రమే ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ఈ వ్యవహారాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడంతో ఎకరాల కొద్దీ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వం హయాం నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణకు అలవాటుపడిన గ్రామంలోని టీడీపీ నాయకులు నేడు కూడా యథేచ్ఛగా అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారు. టీడీపీ నాయకులు ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగే ఒక దళారిని ఏర్పాటు చేసుకొని అతని ద్వారా గ్రామస్తులను, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ తమపని తాము కానిస్తున్నారు. ఆక్రమిత భూమి విలువ ఎకరా రూ.3 లక్షలు: ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి విలువ నేడు బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలా ఆక్రమణకు గురైన వందల ఎకరాల అటవీ, పశువుల బీడు భూముల విలువ నేడు కోట్లలోనే ఉంది. అలాగే కొందరు అక్రమార్కులు వారు ఆక్రమించిన భూములకు ఎలాంటి పత్రాలు లేకుండానే మరొకరికి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి ఎకరా భూమి రూ.6 వేలు చొప్పున కౌలు కింద ఇస్తున్నారు. ఆక్రమిత భూమికి దొంగ చాటుగా పట్టాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అక్రమాల వలన కనీసం గ్రామంలోని పశువులు ఈ భూముల్లోకి వెళ్లడానికి దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ భూమిని ట్రాక్టర్తో దున్నుతుంటే గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదని గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూమిని ఆక్రమించుకుంటూ పోవడం వలన పశువులు కూడా అటుగా పోయే మార్గం లేదని టీడీపీ సానుభూతిపరులను నిలదీశారు. మీ చర్యలు వలన గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు.. ఇదిలా ఉంటే తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆక్రమణదారులకు నోటీసులు పంపించారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యవసాయ పనులు చేస్తే ట్రాక్టర్లను సైతం సీజ్ చేస్తామని గ్రామంలో ఇటీవల దండోరా కూడా వేయించి, ప్రభుత్వ భూమిలోకి ఎవరు వెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులు కావాలనే రెవెన్యూ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ హెచ్చరిక బోర్డులను తొలగించి తమ పట్టా భూములకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్లతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాము అటవీ, పశువుల బీడు భూములను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ప్రభుత్వ భూముల జోలికి వెళ్లవద్దని చెప్పినా వారు వెళ్లిపోయిన తరువాత అక్రమార్కులు తమపని తాము కానిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటవీ, పశువుల బీడు భూముల ఆక్రమణపై స్పందించి పటిష్ట చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కిలాడీ లేడీ పెళ్లిళ్లు..
-
కట్టె కాల్చడానికీ.. కష్టమొచ్చె!
ప్రకాశం ,ఉలవపాడు: కరోనా...కడచూపులోనూ కన్నీటి కష్టాలు పెడుతోంది. కట్టె కాల్చడానికి దహన సంస్కారాలు చేయడానికి వీలు లేక కుటుంబ సభ్యులు దొంగతనంగా దహనం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం కరోనా సోకిన మృతదేహాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడంలో ఇబ్బందులు లేవని అవగాహన కల్పిస్తున్నా నేటికీ అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే శనివారం రాత్రి ఉలవపాడు మండల పరిధిలోని చాగల్లు అటవీ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన సంఘటన. రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన తన కుమారుడికి కరోనా ఉందని తెలియడంతో అంత్యక్రియలు చేయడానికి వీలులేక ఆ తండ్రి ఇబ్బందులు పడి గుర్తు తెలియని చోట టైర్లతో తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జాగ్రత్తలతో ఖననం లేదా దహనం చేస్తే చాలని చెబుతున్నా గ్రామాల్లో అడ్డుచెప్పడం ఆగడం లేదు. అంత్యక్రియలకు నిరాకరించడం వల్లే.. గ్రామాల్లో కరోనాతో మృతి చెందిన వారిని రానివ్వకుండా అంత్యక్రియలు చేయకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను కుటుంబ సభ్యులు ఎంచుకుంటున్నారు. దీని వలన కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో పరిస్థితులు కరోనా వలన చాలా దారుణంగా ఉంటున్నాయి. మృతదేహాలను కనీసం పూడ్చిపెట్టే వీలులేదు. కాల్చడానికి కుదరడం లేదు. మరణం బాధని కలిగిస్తే మరణం తరువాత చేయాల్సిన కార్యక్రమాలు మరింత వేదన మిగులుస్తున్నాయి. అవగాహన తప్పదు... కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యతగా అవగాహన కల్పిస్తోంది. న్యాయశాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు తెలియచేస్తున్నారు. కానీ గ్రామాల్లో పరిస్థితి మారడం లేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో మరింత అవగాహన పెరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో భయం ఇలాంటి పరిస్థితి కల్పించేలా చేసింది. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ మానవత్వం మంటకలవకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దహనం చేసిన మృతదేహం..కోవిడ్ సోకిన వ్యక్తిదే ఉలవపాడు: మండల పరిధిలోని చాగల్లు గ్రామ అటవీ శాఖ పరిధిలోని జామాయిల్ తోటలో మృతదేహాన్ని శనివారం రాత్రి దహనం చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఈ మృతదేహానికి సంబంధించి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు కేసును చేధించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు పంచాయతీ చల్లపాలేనికి చెందిన కరిచేటి శింగయ్య (29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇంటి వద్దే ఉంటూ వర్క్ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఈ నెల 23న మార్బుల్స్ కొనడానికి ఒంగోలుకు ద్విచక్ర వాహనం పై వెళ్లి తిరిగివస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో పేర్నమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో మృతి చెందాడు. 24 న పోస్ట్మార్టం నిర్వహించిన తరువాత కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అంత్యక్రియలు చేయడానికి గ్రామంలో వెళ్లి అడుగగా గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 25న రిమ్స్ బయట ఓ అంబులెన్స్ డ్రైవర్ దహనక్రియలు చేయడానికి రూ.25 వేలు ఇస్తే అన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో రూ.17 వేలకు మాట్లాడుకున్నారు. దహనం చేయడానికి టైర్లు, పెట్రోలు కొనుగోలు చేసుకున్నాడు. చాగల్లు వద్ద అడవిలో మృతదేహాన్ని డ్రైవర్ తీసుకుని వచ్చి దహనం చేశారు. రాత్రి వరకు మంటలు వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమాచారం సేకరించారు. రిమ్స్కు సంబంధించిన వైద్యులు పోస్టుమార్టం చేయడానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇది పోస్టుమార్టం చేసిన మృతదేహం అని, కరోనా సోకిన వ్యక్తికి చేసిన ప్యాకింగ్ అని తెలిపారు. దీని పై వివరాలు సేకరించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. వారి తల్లితండ్రులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. తమ కుమారుడి మృతదేహంగా గుర్తించారు. అప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటనా స్థలిలో వివరాలు సేకరించారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ లు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. వారి తండ్రి వద్ద స్టేట్మెంటును రికార్డు చేసుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిరాకరించడంతో ఈ పరిస్థితి వచ్చి దహనం చేసినట్లు పేర్కొన్నాడు. -
తల్లిలాంటి వదినే బాలికను..
నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు. ♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
శ్రుతి లేదు.. భృతి లేదు
చీరాల అర్బన్: ఒక కమ్మని పాటకు శ్రుతి ఎంతో ప్రధానం. లయబద్దంగా సాగే పాటకు శ్రుతి సక్రమంగా ఉంటేనే ఆ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రుతి, లయను సమ్మోహనంగా మిళితం చేసి గానం చేస్తే ఆ పాట సంగీత ప్రియులను రంజింప చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సంగీతాన్ని అందరికీ పంచే కళాకారులు జిల్లాలో ఎందరో ఉన్నారు. అలానే జానపద కళాకారులు, సుమధుర గాత్రంతో రంగస్థలంపై ఏకపాత్రాభియం చేస్తూ నాటకాన్ని రక్తికట్టేంచే వారూ లేకపోలేదు. ఎంతో మంది ప్రముఖులతో సన్మానాలందుకున్న కళాకారులు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రుతిలయలను నమ్ముకున్న వారు నేడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. సప్త స్వరాలను సమ్మోహనంగా ఆలపించడంతో పాటు సంగీత వాద్యాలను అలవోకగా పలికిస్తూ పలువురికి సంగీత, వాద్య విద్యను చెప్పే కళాకారుల జీవితాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. సంగీత వాద్య కళాకారులకు లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది. చీరాల, వేటపాలెం మండలాలల్లో ఎంతో మంది సంగీత, రంగస్థల కళాకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది సంగీత, వాద్య కళాకారులు కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ఒకప్పుడు చీరాలలోని వాణి కళానికేతన్ లో ఎంతో మంది సంగీతాన్ని నేర్చుకున్నారు. ప్రస్తుతం వారందరూ వేర్వేరు ప్రాంతాలలో స్థిరపడి మంచి సంగీత కళాకారులుగా రాణిస్తున్నారు. చీరాలలో వీణ, వయోలిన్తో పాటు సంగీతం చెప్పేవారు కళాకారులు ఉన్నారు. ఒకప్పుడు సంగీత కళలకు పెట్టింది పేరుగా ఉన్న చీరాలలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే కళాకారులు ఉన్నారు. కొంతమంది ఇంటివద్దనే సంగీతం నేర్పుతుండగా, మరికొందరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సంగీతం, వయోలిన్ నేర్పుతున్నారు. అలానే నాదస్వర కళాకారులకు కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహించడంలేదు. కొంతమంది సంగీతం, నాట్యం ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. విజయవాడకు చెందిన నాట్యకళాకారిణి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ఆన్లైన్లో నాట్యం నేర్పుతున్నారు. చీరాలకు చెందిన 20 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆన్లైన్లో చూస్తూ నాట్యం నేర్చుకుంటున్నారు. అలానే సంగీతం కూడా అదే మాదిరిగా ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. రంగస్థలంపై రాణించినా..! రంగస్థలంపై ఏకధాటిగా గంటల కొద్ది ప్రదర్శనలు ఇచ్చి ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న కళాకారులు నేడు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జానపద కళలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటివి చేసి అందరిని మెప్పించినా ప్రస్తుతం వారికి ఆదరణ కరువైంది. జాండ్రపేటలో నివసించే చల్లా రాజేశ్వరి రేడియో ఆర్టిస్ట్. ఆమెను కళాకారిణిగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించింది. ఎన్నో స్టేజి ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు ఇచ్చినా కళాకారుల పెన్షన్ మాత్రం రావడంలేదని వాపోయింది. ఐదు సంవత్సరాలుగా కళాకారులకు ప్రభుత్వం అందించే నగదు కోసం దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులను కూడా కరోనా సమయంలో ఆదుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. అలానే వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల పట్టణంలోని 26 వార్డులో ఉన్న కళాకారులకు నిత్యవసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు. కళలకు జీవం పోసే కళాకారుల జీవనం కరోనా వైరస్ కారణంగా కష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆన్లైన్లో సంగీత పాఠాలు.. చీరాల వైకుంఠపురంలోని బాలసాయినగర్కు చెందిన కొణికి సుష్మ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న వయస్సు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకున్న సుష్మ కర్నాటక సంగీతంలో డిప్లమో పొందింది. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటూ తాను నేర్చుకున్న సంగీతాన్ని ఆన్లైన్ ద్వారా మరికొందరికి నేర్పుతోంది. -
రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి
ఒంగోలు: ఆరేళ్లపాప రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటలకుపైగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీ మూడో లైనులో గురువారం జరిగింది. లక్కె ముద్దుల కృష్ణ, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నారు. రెండిళ్ల మధ్య సన్నని ఖాళీ వదులుకున్నారు. కనీసం అడుగు గ్యాప్ కూడా లేదు. కృష్ణ ఆరేళ్ల కుమార్తె మీనాక్షి ఆడుకుంటూ ఆ గ్యాప్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. కదల లేని స్థితిలో పాప కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది పాపకు తాడు అందించి బయటకు తీసుకొద్దామని చేసిన యత్నం విఫలమైంది. మరికొంత మంది కర్ర సాయంతో బయటకు తీసేందుకు యత్నించగా అది కూడా విఫలమైంది. పాప తండ్రి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో పాటు ఒంగోలు ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు, బాలికను రక్షించేందుకు పరిస్థితిని అంచనా వేసి గోడలను పగలగొట్టక తప్పదని నిర్ణయించుకున్నారు. పాపకు దెబ్బ తగలకుండా గోడకు తమ వద్ద ఉన్న అధునాతన యంత్రాలతో రంధ్రం చేసి గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు. అనంతరం పాపను సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి వరకూ జరుగుతున్న తతంగాన్ని ఉగ్గబట్టి చూస్తున్న జనంతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
తల్లితో సహజీవనం.. కుమార్తెపై
ఒంగోలు: తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన మానవ సంబంధాలు ఎంతగా దిగజారుతున్నాయనో తెలిపేందుకు ఉదాహరణగా చెప్పువచ్చు. రెండు సార్లు తనపై దురాగతానికి పాల్పడ్డాడంటూ బాలిక మొత్తుకున్నా.. తల్లి సైతం మభ్యపెట్టి ఇరువురికి పెళ్లి చేస్తానంటూ నచ్చజెప్పేందుకు యత్నించడంతో బాలిక పారిపోయి అమ్మమ్మ ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దీంతో వారు ఒంగోలు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దిశ పోలీసుస్టేషన్లో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సుభాని, బాలిక తల్లిపై కేసులు నమోదు చేశారు. జరిగింది ఇదీ: బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళకు వివాహమైంది. ఆమె స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు, భర్తకు మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్లుగా విడిపోయి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం పాటు ఇరువురు కుమార్తెలు తల్లి వద్దనే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి చేరుకుని అక్కడే ఉంటోంది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఒంటరిగా ఉంటున్న బాలిక తల్లికి స్థానిక బలరాం కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సుభానితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ కామాంధుడి కన్ను ఇంట్లో ఎదిగిన ఆమె కుమార్తెపై పడింది. ఈ క్రమంలోనే రెండు దఫాలు బాలికను బెదిరించి ఆమెపై సుభాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దృష్టికి తీసుకెళ్లగా గోలచేయవద్దని.. ఇరువురికి పెళ్లిచేస్తానంటూ నచ్చజెప్పేందుకు యత్నించింది. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడం ఏమిటంటూ బాలిక నిలదీయగా చంపేస్తానంటూ సుభాని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి బేస్తవారిపేటకు చేరుకుని అమ్మమ్మ ఇంట జరిగిన విషయం చెప్పి బావురుమంది. దిగ్భ్రాంతి చెందిన వారు బుధవారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బిళ్ళా చెన్నయ్య నేతృత్వంలో టూటౌన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. అనంతరం వారి సూచన మేరకు దిశ పోలీసు స్టేషన్కు వెళ్లి బాలిక జరిగిన విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సుభానిపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లి కూడా నిందితుడికి సహకరించిందని కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నటు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే బాలిక తల్లి టూటౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు యత్నించింది. -
చీరాల ఘటనపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, ప్రకాశం/అమరావతి: చీరాలలో ఈ నెల 18న ఎస్సై దాడిలో మృతి చెందిన యువకుడు కిరణ్ కేసు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంవో కార్యాలయం సేకరిచింది. యువకుడి మృతి కేసుపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మృతుడు కిరణ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు: పిల్లి సుభాష్) ఈ ఘటనపై ఎస్పీ సిద్దార్థ్ కౌసల్ వివరణ ఇస్తూ.. చీరాల యువకుడు కిరణ్పై ఎస్సై విజయ్ కుమార్ దాడి చేశారనడం అవాస్తవమని తెలిపారు. ఈ నెల 18న చీరాల 2 టౌన్ పరిధిలో కిరణ్, అబ్రహం షైన్ అనే ఇద్దరు యువకులు మాస్క్ లేకుండా బైక్పై తిరుగుతుండగా ఎస్సై విజయ కుమార్ ఆపి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న కిరణ్, అబ్రహం షైన్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో యువకులను పోలీసు స్టేషన్కు తరలిస్తుండగా కిరణ్ కిందకు దూకడంతో తలకి బలమైన గాయం అయిందని చెప్పారు. అనంతరం హాస్పీటల్కు తరలించారని, చికిత్స అందిస్తున్న క్రమంలో కిరణ్ నిన్న(మంగళవారం) మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. -
మైనర్ను వ్యభిచారంలోకి..
ప్రకాశం ,కందుకూరు:కందుకూరు ప్రాంతంలో రహస్యంగా వ్యభించారం నిర్వహిస్తూ బాలికతో బలవంతంగా వ్యభించారం చేయిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ ధనుంజయులు మంగళవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కందుకూరు పోలీసులతో కలిసి విచారణ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తన అన్న, వదినల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె వదిన జ్యోతి బాలికను సింగరాయకొండకు చెందిన కె. మాధవి అనే వ్యవభిచార నిర్వాహకురాలికి రూ.27 వేలకు అమ్మేసింది. మాధవి కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రహస్యంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బాలికతో కూడా బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఎలాగోలా బాలిక 100 కాల్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు రెండు రోజుల క్రితం ఆ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు. స్థానిక ఏరియా వైద్యశాలలో బాధితురాలికి చికిత్స అందించారు. అనంతరం ఈ కేసును దిశ చట్టం కింద డీఎస్పీ ధనుంజయులుకు అప్పగించారు. ఆయన మంగళవారం విచారణ చేపట్టారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ వ్యభిచార కూపంలో ఎవరెవరు ఉన్నారు? బాలికతో వ్యభిచారం చేయించిన మాధవితో పాటు, ఆమె వదిన జ్యోతిని మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార ముఠాతో ఇంకా ఎంతమందికి సంబంధం ఉంది, ఇంకెవరెరు ఈ ముఠాలో ఉన్నారనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా..!
మార్టూరు: గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా వారి కళ్లు కప్పి కొత్త కొత్త దారుల్లో గంజాయిని తరలించేస్తున్నారు. తాజాగా శనివారం రాజుపాలెం చెక్పోస్టు వద్ద తనిఖీల్లో రూ.కోటి విలువైన 600 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారించిన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.. మూడు రోజులుగా నిఘా.. జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి, ఇంకొల్లు సీఐ ఆర్ రాంబాబు, ఎస్సై శివకుమార్లతో కలిసి మూడు రోజులుగా రాజుపాలెం చెక్పోస్టు వద్ద నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి వ్యవసాయానికి వినియోగించే కొబ్బరి పిట్టు లోడుతో వెళుతున్న లారీని ఆపి అధికారులు తనిఖీ చేశారు. లారీలో అడుగు భాగాన కంప్రెషర్ చేయబడిన గంజాయి ప్యాకెట్లు ఉంచి వాటి పైన కొబ్బరిపిట్టు లోడు చేసి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు సుమారు 600 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కీలక నిందితులు మదనపల్లి ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు శనివారం రాత్రికి రాత్రే ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ రూ.కోటి ఉండవచ్చని అధికారులఅంచనా. ఒడిస్సా, ఛత్తీస్ఘడ్ నుంచి.. ఒడిస్సా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు సరఫరా అయిన గంజాయి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు ప్రాంతం నుంచి సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు గంజాయి అక్రమంగా తరలిపోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి 8, 9 జిల్లాలు దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు గంజాయి అక్రమంగా తరలిపోతుండగా మధ్యలో ఉన్న జిల్లాల అధికారుల తీరు పలు అనుమానాలుకు దారితీస్తుంది. అక్కడక్కడ కొన్నిచోట్ల కీలక అధికారులు మామూళ్లకు అలవాటు పడి గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక నిందితులను అదుపులోనికి తీసుకున్న అనంతరం అధికారులు రేపోమాపో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మార్టూరులోను జోరుగా గంజాయి విక్రయాలు మార్టూరులోనూ గత పదేళ్లుగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. స్థానిక పోలీస్ స్టేషన్కు చెందిన కొందరు కింది స్థాయి సిబ్బంది సహకారం ఉండటంతో దాడులు జరగడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజమండ్రి ప్రాంతం నుంచి మార్టూరు నిత్యం వస్తున్న చేపలలోడు లారీలలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న ప్రాంతంలో గంజాయి విక్రయాలు కుటీర పరిశ్రమగా విస్తరించింది. స్థానిక నేతాజీ నగర్ కాలనీ సమీపంలోనూ జోరుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్ కార్మికులు, విద్యార్థులను టార్గెట్గా చేసుకొని గంజాయి వ్యాపారం ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
అర్ధరాత్రి ఆర్తనాదాలు
ముండ్లమూరు: మండలంలోని శంకరాపురం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ యడ్లపల్లి సునీల్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పూరిమెట్లకు చెందిన పొగాకు రైతులు ఒగులూరి ఆంజనేయులు, తువ్వదొడ్డి చిన్నబ్బాయి, ఒగులూరి నరేష్, యడ్లపల్లి సునీల్ పొగాకు చెక్కులతో ట్రాక్టర్తో అర్ధరాత్రి వెల్లంపల్లికి బయల్దేరారు. మార్గంమధ్యలో దర్శి–అద్దంకి ప్రధాన రహదారిలో శంకరాపురం వద్దకు వెళ్లగానే డీజిల్ లేక ట్రాక్టర్ ఆగిపోయింది. శంకరాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ట్రాక్టర్ను ఆపుకుంటున్నారు. ఆ సమయంలో నంద్యాల నుంచి టమోటా లోడుతో అద్దంకి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సునీల్ ట్రాక్టర్ టాప్కు ఇంజిన్కు మధ్య ఇరుక్కుపోయాడు. పొగాకు చెక్కులు ట్రాక్టర్పై పడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఒగులూరి ఆంజనేయులు ట్రాక్టర్ నుంచి పక్కకు దూకేశాడు. పైనే ఉన్న మరో ఇద్దరు ఒగులూరి నరేష్, తువ్వదొడ్డి చిన్నబ్బాయికి, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సునీల్ను బయటకు లాగేందుకు ఆంజనేయులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షతగాత్రులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం ధాటికి పెద్ద శబ్దం రావడంతో దగ్గర్లో ఉన్న శంకరాపురం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకొన్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఒంగోలు తరలించారు. ట్రాక్టర్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన సునీల్ను బయటకు లాగేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అప్పటికే రోడ్డుకి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పొక్లెయిన్ సాయంతో చెక్కులు తొలగించి డ్రైవర్ను పక్కకు తీశారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్ను, లారీని తొలగించారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య ఏసుదయమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు వెంబడే పడి ఉన్న టమోటాలను స్థానికులు ఎవరికి వారు ఇళ్లకు తీసుకెళ్లారు. -
అమ్మవారి ఆస్తిని బ్యాంక్లో తాకట్టు
ప్రకాశం,మర్రిపూడి: వెనుకబడిన మర్రిపూడి మండలంలో దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. అక్రమార్కులకు మర్రిపూడి కేరాఫ్ అడ్రస్గా మారింది. కొందరు దేవదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్పుస్తకాలు సృష్టించుకున్నారు. భూములు యథేచ్ఛగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దేవాలయ భూములను పలు బ్యాంక్ల్లో తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు తీసుకుని దర్జాగా తిరుగుతున్నారు. గ్రామ దేవతలకు చెందిన భూములను కూడా వదలడం లేదు. అక్రమార్కుల చెర నుంచి గ్రామ దేవతల భూమికి విముక్తి కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ ఎస్.సువర్ణరావు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్కు సోమవారం వినితిపత్రం సమర్పించారు. ఇదీ..అక్రమార్కుల దుర్బుద్ధి మండల కేంద్రం మర్రిపూడికి ఉత్తరం వైపున నూకల పరమేశ్వరి అమ్మవారి (గంగమ్మ) గుడి ఉంది. ఆ గుడిని పురాతన కాలంలో నిర్మించారని పెద్దలు చెబుతున్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పిచేందుకు అప్పట్లో అమ్మవారికి 20 ఎకరాలను దాతలు కేటాయించారు. 20 ఎకరాల్లో 13 ఎకరాల భూమి పూజారి కింద ఉంది. మిగిలిన అమ్మ వారి భూమిపై భూకబ్జాదారుల కన్ను పడింది. సర్వే నంబర్ 978–1లో 5.62 ఎకరాల భూమి, సర్వే నంబర్ 978–2లో 1.47 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో దేవదాయ శాఖ అధికారులకు సైతం తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మర్రిపూడి, పొదిలికి చెందిన ఇద్దరు ఈ భూమిని గుర్తించి కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు సీఎస్పురం మండలం పెదగోగులపల్లికి చెందిన ఆకుమళ్ల వెంకటేశ్వర్లును సంప్రదించి మర్రిపూడి రెవెన్యూ పరిధిలో మీ పూర్వికులకు చెందిన ఆస్తి ఉందని, ఆ భూమి తమకు విక్రయించాలని మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు పొదిలి సబ్రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి 2011 ఏప్రిల్ 18న ఆ ఇద్దరు అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ చేశాడు. అమ్మవారి భూమికి పట్టాదారు పాస్పుస్తకాలు సృష్టించి సిండికేట్ బ్యాంక్లో తాకట్టు పెట్టి దాదాపు రూ.6 లక్షలుపై చిలుకు రుణం తీసుకున్నారు. అది అమ్మ వారి భూమని తనకు తెలియదని, వారిద్దరు వచ్చి తనను ప్రలోభాలకు గురిచేసి తనతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమి వెంటనే అమ్మవారికి చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆకుమళ్ల వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
‘ముగ్గురు నలుగురు వద్దు, ఒక్కరిద్దరే ముద్దు’
ఒంగోలు మెట్రో: పెరుగుతున్న జనాభా మానవ వనరుల వృద్ధికి ఊతంగా ఉపకరిస్తుందనేది ఎంత సత్యమో ఆకలి బాధలు కూడా పెరుగుతాయనేది అంతే సత్యం. ఏటికేటికీ పెరుగుతున్న జనాభా వల్ల నిరుద్యోగ సమస్య, ఆకలి మరణాలు, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికంతోపాటు నివాస సమస్య, నిరక్షరాస్యత లాంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏ కుటుంబమైనా, దేశమైనా అభివృద్ధి చెందడం అనేది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది. జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో కనిపించకపోవడం వల్ల జనాభా పెంపుదల మీద అదుపు లేకుండా పోతోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల..లాభనష్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రకాశం @పనామా ప్రపంచ జనాభాలో 40 శాతం ఆసియా దేశాలైన ఇండియా, చైనాలోనే ఉన్నారు. జూలై 11, 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరగా.. ఇప్పుడా సంఖ్య 540 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభా ఏటా 9.20 కోట్లు పెరుగుతోంది. దేశంలో 1881 నుంచి జనగణన ప్రారంభించగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో 2011లో జనగణన చేపట్టారు. ప్రస్తుత ఇండియాలో జనాభా 140 కోట్లకు చేరువలో ఉండగా ప్రకాశం జిల్లాలో 40 లక్షల మార్కుకు దగ్గరవుతోంది. మధ్య అమెరికాలోని పనామా దేశంతో సమానమైన సంఖ్యలో జిల్లాలో జనాభా ఉన్నారు. అంతేకాదు అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర జనాభాతో మన జిల్లా జనాభా సమానం. ఇక మే 2010 జనాభా లెక్కల ప్రకారం పనామా జనాభా 34,05,813. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా జనాభా కూడా ఇంతే ఉంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. 2011లో 34 లక్షలున్న జిల్లా జనాభా ఇప్పుడు 40 లక్షలు దాటే అవకాశం ఉంది. జిల్లాలో అక్షరాస్యత 63.53 శాతంగా ఉంది. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 981 మంది స్త్రీలు ఉన్నారు. తద్వారా లింగ వివక్ష ఉన్నట్టు రుజువవుతోంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో అక్షరాస్యత తక్కువ. జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 193గా ఉంది. జనాభా పెరుగుతుండటం వల్ల జీవనావసరాలు పెరిగి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతోంది. ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి నిరుద్యోగులు ఇతర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లకు క్యూకడుతున్నారు. ఇక ప్రజలు తాగడానికి పూర్తి స్థాయిలో నీటి సదుపాయాలు ఉండటం లేదు. పేద కుటుంబాల్లోనే జనాభా సంఖ్య పెరిగిపోతోందని అధికారిక గణాంకాలు, వివిధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ ప్రాధాన్యం, గర్భ నిరోధక సాధనాలపై అవగాహనా లేమి దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనాభా తక్కువగా ఉంటే.. జనాభా తక్కువగా ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. మంచి ఆహారం అందరికీ దొరుకుతుంది. మంచి నివాసాలు నిర్మించుకోగలరు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి దొరుకుతుంది. పేదరికం తగ్గిపోయి ఆకలి మరణాలు లేని కాలం ఎదురొస్తుంది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించగలుగుతారు. నష్టాలు అధికమే.. జనాభా పెరగడం వల్ల నివాస వసతికే పెద్ద చిక్కులు వస్తాయి. ఇరుకైన ఇళ్లు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఒకేచోట ఉండాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. దీంతో అంటురోగాలు, అనారోగ్యాలు పెరుగుతాయి. ఇంకోవైపు నిత్యావసరాలు పెరుగుతాయి. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ కారణంగా ఒకపూట తిండి మాత్రమే తినాల్సి వస్తుంది. ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయి. ఇక పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం కోసం వస్తు సామగ్రి విస్తృత ఉత్పత్తి కోసం పరిశ్రమలు ఏర్పడాలి. వాటి ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య, జీవితంలో నిరాశ, సోమరితనం, నిర్లిప్తత పెరిగి క్రమంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలంతా జనాభా పెరుగుదలను అరికట్టేందుకు తాత్కాలిక పద్ధతులను, శాశ్వత పద్ధతులను ఎంచుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆచరించాలి. జనాభా గణాంకాలు కీలకం ఒక దేశ ఆర్థిక ప్రణాళికలు, సామాజిక పథకాలు రూపొందించడానికి విధిగా జనాభా లెక్కలు అవసరమవుతాయి. ఇటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల గుర్తింపు లాంటివి జరిగి వాటిపై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తారు. అందువల్ల జనాభా లెక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిరోధించడం ఎలా? జననాల రేటు ఎక్కువగా ఉండి, మరణాల రేటు తక్కువగా ఉండటమే జనాభా పెరుగుదలకు సూచిక. జనాభా పెరుగుదలను కట్టడి చేయాలంటే దంపతులు కుటుంబ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఆడ అయినా, మగ అయినా సంతానాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేసుకుంటే మంచిది. ఇందుకుగాను ప్రభుత్వం ఉచితంగా కుటుంబ నియంత్రణ లాంటి సేవా సౌకర్యాలు ప్రవేశపెడుతోంది. శాశ్వత పద్ధతులుగా ట్యూబెక్టమీ, డీపీఎల్, ఎస్ఎస్వీ(వేసెక్టమీ) లాంటివి ఉన్నాయి. తాత్కాలిక పద్ధతులుగా నిరో«ధ్, మాత్రలు, ఐడీయూ లాంటివి ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఎవరికి వారు జనాభా నియంత్రణ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. పరిష్కార మార్గాలు రోజురోజుకీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ప్రకృతి వనరులు ఉండటం లేదు. కనుక అవసరాలకు తగినట్టు సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలి. ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కలిగించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ⇒ మహిళలు, బాలికల సంక్షేమం, చదువుపై శ్రద్ధ చూపాలి. ⇒ గర్భ నిరోధక సాధనాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలి. ⇒ పురుషులను సంతాన నిరోధక ఆపరేషన్లకు ప్రోత్సహించాలి. ⇒ వెద్య రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మీద అవగాహన పెంచాలి. ⇒ ‘ముగ్గురు నలుగురు వద్దు, ఒక్కరిద్దరే ముద్దు’ లాంటి సూచనలు పాటించాలి. ⇒ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లోని ప్రజలతో జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ అవగాహన పెంచాలి. ⇒ జనాభా నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. -
అమాంతం పెరిగిపోయిన కౌలు ధరలు..
సొంతూళ్లో పంట భూములను కౌలుకు అప్పగించి చెట్టుకొకరు, పుట్టకొకరుగా పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగొచ్చారు. కరోనా మహమ్మారి విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి దొరక్క అంతా పల్లెబాట పట్టారు. ఇప్పుడు వారి దృష్టి సేద్యం వైపు మళ్లడంతో జిల్లాలో కౌలు భూములకు డిమాండ్ పెరిగింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కౌలు ధరలు ఇంతగా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికిస్తున్న ప్రోత్సాహం ఒక కారణమైతే.. కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం యథావిధిగా సాగుతుండటం మరో కారణంగా కనిపిస్తోంది. జె.పంగులూరు: జిల్లాలో సాగు భూములకు తీవ్ర డిమాండ్ నెలకొంది. కౌలు భూముల కోసం రైతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాదితో పోల్చితే ఎకరాకు కనీసం ఐదు వేల రూపాయల మేర పెరుగుదల కనిపిస్తోంది. భూముల వారీగా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, పంట ఉత్పత్తులకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం అధిక శాతం మందిని సాగుకు సమాయత్తం చేస్తోంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావహ దృక్పథానికి దారితీసింది. ఖరారవుతున్న ఒప్పందాలు.. కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నాచితకా వ్యాపారాలు కుంటుపడ్డాయి. నిన్నా మొన్నటి వరకు దూర ప్రాంతాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టు కొచ్చిన వారు స్వ గ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగ యువత పొలాల వైపు చూస్తోంది. గడచిన నాలుగు నెలలుగా మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. వ్యాపారాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో సొంత భూములున్న రైతులు కౌలుకు ఇవ్వడం మానేసి తామే సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది వరకు నీటి లభ్యత ఉండి వ్యవసాయ బోర్లు ఉన్న భూములకు ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు కౌలు లభించగా ఈ ఏడాది అవే భూములకు ఎకరానికి రూ. 30 నుంచి రూ.35వేల వరకు కౌలు చెల్లించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ భూ యజమానులకు కలిసి వస్తోంది. మిర్చి ధరలతో మరింత డిమాండ్.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావటం కౌలు ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. గత సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి. మిర్చి పంటకు నీరు సంవృద్ధిగా అందింది. ప్రస్తుతం ఎకరా మిర్చి పంట వేసేందుకు కౌలు రూ. 35 వేలు నుంచి 40 వేలు వరకు ఉంది. శనగ సాగు చేసే పొలాలకు ఎకరా కౌలు రూ. 25 నుంచి 30 వేలు పలుకుతోంది. ఈ కౌలు కూడా జూన్, జూలై మాసాలలో ముందుగానే కౌలు చెల్లించాలని భూ యజమానులు షరతు పెడుతున్నారు. శనగ పంటకు గిట్టుబాటు ధర.. ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం ఈ సంవత్సరం శనగ పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించింది. దీంతో రైతులు దళారులకు పంట అమ్మకుండా నేరుగా మార్కెట్ యార్డులకు అమ్ముకొని లభాలు బాట పట్టారు. సంవత్సరాల కొద్ది శీతల గిడ్డంగులలో వున్న శనగపంట ఈ సంవత్సరం మొత్తం అమ్ముడుపోయింది. దానితో ఈ సంవత్సరం శనగ పంట వేసేందుకు రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మాగాణికి రూ.30 వేలు.. ఈ సంవత్సరం జిల్లాలో మగాణి పంటలు కళకళలాడాయి. సకాలంలో వర్షాలు పడటం, సాగరు కాలువ నీరు సమృద్ధిగా అందటం, గిట్టుబాటు ధర వుండటంతో కౌలు ధరలు అమాంత పెరిగాయి. -
'తాపీ'గా లేరు!
కూలన్నా నీ ఆకలినెవరు తీర్చేరూ!బేల్దారన్నా నీ దాహమెవరు తీర్చేనూ!పనుల్లోన మేటి అన్నామెళకువల్లో సాటినీవన్నాతలెత్తుకుని నాడు బతికావుతలదించుకొని నేడు చితికావుతాపీ పడితేనే భవనాలు నిలబడెబొచ్చ..పార ఉంటేనే ఇల్లు పూర్తయ్యెపది అంతస్తులు కూడా నీ ముందు మోకరిల్లెఅపార్టుమెంట్లైనా సలాము చేసేఇంటిలోన పెళ్లాము బిడ్డలునీకోసము చూసేకరోనా సమయంలో ఆకలితో అలమటించేఈ కోవిడ్కు కరుణలేదు.. జాలిలేదుచైనా దేశము నుంచి పగబట్టి వచ్చేనుఎప్పటికి పోతుందో ఈ జాడ్యముఎన్నటికి నశిస్తుందో ఈ దారిద్య్రము ఒంగోలు వన్టౌన్: అందమైన భవనాలు, రంగుల మేడలు, అబ్బుర పరిచే నిర్మాణాల నైపుణ్యం వెనుక తాపీ మేస్త్రీ కృషి, కష్టం ఎంతో ఉంటుంది. లాక్డౌన్ ముందు చేతినిండా పని.. క్షణం తీరిక లేని వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రావటంతో వారి బతుకులు తలకిందులయ్యాయి. ప్లాస్టింగ్ చేసినంత సాఫీగా వారి జీవితాలు లేవు. జిల్లా వ్యాప్తంగా కూలీలు, గుంతలు తీసేవారు, తాపీ మేస్త్రీలు, రాడ్బెండింగ్ పనులు చేసేవారు, సెంట్రింగ్ పనులు చేసేవారు. ప్లంబ్లర్లు, పెయింటర్లు, చెక్క పని చేసేవారు, ఎలక్ట్రీషియన్లు, గ్రిల్స్ చేసేవారు.. సీలింగ్ వర్క్ చేసేవారు, ఇలా రకరకాల పనులు చేసే కార్మికులున్నారు. ఇలాంటివారు మన జిల్లాలోనే 1, 47, 614 మంది పేర్లు సమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకోని వారు మరో 10 వేల మంది వరకు ఉండవచ్చుని అంచనా. కూలీలుగా ఇతర రాష్ట్రలకు పనులు నిమిత్తం వెళ్లేవారు 40 వేల మంది వరకు ఉంటారు. ప్రకాశం జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఆర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు జరిగేవి. ఎక్కువగా ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం ప్రాంతాల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి అపార్టుమెంట్ కల్చర్ బాగా పెరగడంతో కూలీలకు మేస్త్రీలకు చేతినిండా పని దొరుకుతోంది. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు మేస్త్రీలు కూలీలను తీసుకొని పనులకు వచ్చేవారు. ఎక్కువ రోజుల పని అయితే ఇతర జిల్లాలకు కూడా వెళుతుంటారు. ప్రస్తుతం పనులు లేక వారి జీవితాలు పూట గడవని పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా ముందు ప్రారంభమైన భవనాలు ప్రస్తుతం ప్రారంభించడానికి భవనా యజమానులు, బిల్డర్లు జంకుతున్నారు. కరోనాకు తోడు వర్షాకాలం కావడంతో నిర్మాణాలు చేపట్టరు. ఒకవేళ కట్టినా యజమానులకు, బిల్డర్లకు నష్టం తప్ప లాభాముండదు. దీంతో ప్లాస్టింగ్ పనులకే పరిమితమవుతారు. ప్రతిఏటా నవంబర్ నుంచి మే నెల వరకు భవనాలు నిర్మిస్తుంటారు. వార్షాకాలంలో భవనం లోపల పనులు చేపడుతుంటారు. ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా బతికిన జీవితాలు ఇప్పుడు పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం దగ్గర నగదు లభ్యత లేక సిమెంట్ ఇటుక ధరలు పెరగటంతో నిర్మాణ రంగంపై భారం పడింది. వాటికి తోడు కరోనా వైరస్, వర్షాకాలం తోడవడంతో కార్మికుల భవిష్యత్తు మీద భరోసా కోల్పోయేలా చేసింది. ఇటుక మీద ఇటుక నిలబెట్టి అందమైన భవనాన్ని నిర్మించిన చేతులు ఈ రోజు పనికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. లాక్డౌన్ సడిలింపుల తర్వత దేశవ్యాప్తంగా భవన నిర్మాణం మొదలు కాలేదు. కరోనా భయం పెరగటంతో ఇప్పుడు బిల్డర్లు కన్స్ట్రక్షన్ ఊసే ఎత్తటం లేదు. మేస్త్రీలను నమ్ముకుని రోజూ కూలీలకు వెళ్లే కూలీల పరిస్థితి దారణంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలలో వారం రోజుల పని కూడా దొరకటం కష్టంగా మారింది. అప్పులతో కుస్తీ.. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి పనులు దొరికినప్పుడు అప్పులు తీర్చుకుందాములే అన్న ఆశతో బతుకుతున్నారు. భవనాల నిర్మాణంలో క్షణం తీరిక లేకుండా పని చేసిన చేతులు నేడు పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిగా స్థిర పడిన వారి పరిస్థితి పర్వలేదు గానీ.. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారస్తులు నిర్మాణాలపై కాకుండా ఇంటి ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో చిన్న రిపేర్లు వస్తే మేస్త్రీ వచ్చేదాకా అదేపనిగా ఫోన్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క కూలీ, ఒక్క మేస్త్రీతో మాత్రమే చేయించుకుంటున్నారు. ఈ కరోనా కష్టం వర్షాకాలం తర్వాత అయినా పోదా అని ఎదురు చూస్తున్నారు. మరి కొంత సమయం పడుతుంది నిత్యం పనులతో సంతోషంగా ఉండే మేస్త్రీలు, కూలీల పరిస్థితి ప్రస్తుతం ఆశా జనకంగా లేదు. కరోనా ముందు పనుల కోసం మేస్త్రీ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లేవారు. ఒక్క అపార్టుమెంట్ పనికి వెళ్తే సుమారు 6 నెలల వరుకు చేతి నిండా పని ఉంటుంది. ప్రస్తుతం పనులు కోసం కూలీలు, మేస్త్రీ ఎదురు చూస్తున్నారు. కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కూలీలది. 4 నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషనే దిక్కుగా మారింది. కూలీలకు పని ఉంటే ఎంత దూరం అయినా వెళ్లి పని చేసేవారు. ప్రస్తుతం చేద్దామన్న పని దొరకటం లేదు. ప్రభుత్వమే పనులు కల్పించేల చర్యలు తీసుకోవాలి. -
టన్ను బంగినపల్లె రూ.లక్ష..!
ప్రకాశం, ఉలవపాడు: చివరి దశ..మూడు ఎకరాల్లో బంగినపల్లె కాయలు టన్ను లక్ష రూపాయల రేటు పలికింది. ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో మామిడి కాయల సీజన్ పూర్తయింది. బంగినపల్లె కాయలు పూర్తయిపోయాయి. ప్రస్తుతం కేవలం బెంగళూరు, నీలం కాయలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ సోమవారం బంగినపల్లె కాయలు చివరలో పూసిన పూతకు వచ్చిన కాయలు టన్ను లక్ష రూపాయలకు కోశారు. గత పదేళ్లలో ఇదే బంగినపల్లె కాయలకు అత్యధిక రేటు. ఎన్నడూ లేని విధంగా కరోనా కష్టకాలంలో మామిడి కాయల రైతులు లాభాల బాట పట్టారు. టన్ను రూ.65 వేల వరకు బంగినపల్లె ఎగుమతులు జరిగాయి. చివరలో టన్ను లక్ష పలకడం విశేషం. -
కుటుంబమంతా కరోనాతో ఆస్పత్రిలో..
ప్రకాశం, సింగరాయకొండ: కరోనా...అయినవారందరూ ఉన్నా దిక్కులేని వారిని చేస్తోంది. కుటుంబంలో అందరికీ కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తే.. ఓ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో రెండు రోజుల పాటు ఇంటి మెట్ల కింద వర్షంలో తడుస్తూ ఉండిపోయింది. ఇటీవల హైదరాబాద్లో నివసిస్తున్న ఒక కుటుంబంతన స్వగ్రామమైన బింగినపల్లికి వచ్చింది. వీరిలో ఒక వృద్ధురాలితో పాటు ఆమె కొడుకు, కోడలు, మనవడు ఉన్నారు. వీరు ఇక్కడికి వచ్చే సమయానికే వృద్ధురాలికి తప్ప మిగతా ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉంది. హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిల్లో చేర్చుకోకపోవడంతో బింగినపల్లికి వచ్చి ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా వారు చేర్చుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు నెల్లూరు వెళ్లి నారాయణ ఆస్పత్రిలో చేరారు. వృద్ధురాలిని తమతోపాటు తీసుకెళ్లలేక ఇంటి బయట మెట్ల కింద ఉంచి వెళ్లారు. ఆమె క్యాన్సర్ పేషంట్, నడవలేదు. తాము కరోనాతో నెల్లూరులో చికిత్స పొందుతున్నామంటూ కొడుకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్థానిక అధికారులు వచ్చి వృద్ధురాలికి కూడా కరోనా పరీక్ష చేసేందుకు శాంపిల్ తీసుకెళ్లారు. దాని రిజల్ట్ రావాల్సి ఉంది. అయితే ఈ రెండు రోజుల నుంచి ఆ వృద్ధురాలు ఇంటి మెట్ల కిందే ఉండిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఆమె బాధ చూడలేని చుట్టుపక్కల వారు కర్ర సహాయంతో భోజనం అందించారు. వర్షానికి తడుస్తూ కుమిలిపోతున్న వృద్ధురాలి దీనస్థితిని చూసి చలించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు తెలిపి ఆదివారం 108 వాహనంలో రిమ్స్కు పంపే ఏర్పాట్లు చేశారు. అయితే 108 వాహనంలో ఒక్కరే రావడంతో ఆ వృద్ధురాలిని వాహనం ఎక్కించేందుకు సహాయం చేయాలని గ్రామస్తులను కోరినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సుమారు 4 గంటల పాటు వాహనం ఇంటి వద్దే ఉండిపోయింది. చివరకు వైద్య సిబ్బంది వచ్చి వృద్ధురాలిని అంబులెన్స్ ఎక్కించి రిమ్స్కు తరలించారు. -
నేను చనిపోతున్నా.. కాబోయే భార్యకు మెసేజ్
ప్రకాశం ,చీమకుర్తి: ఆ జంటకు ఇటీవల నిశ్చితార్థమైంది. పెళ్లి చేసుకోవడమే తరువాయి. చీమకుర్తి నుంచి సోనూరాజ్.. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నుంచి అతనికి కాబోయే భార్య ఫోన్లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య ఏమైందో ఏమో.. తాను చనిపోతున్నానని సోనూరాజ్ తనకు కాబోయే భార్యకు మెసేజ్ పెట్టాడు. రామతీర్థంలోని గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న సోనూరాజ్ తమ్ముడికి ఆమె ఫోన్ చేసి మీ అన్నయ్య ఇంట్లో ఉరేసుకొని చనిపోబోతున్నాడని, వెంటనే వెళ్లి కాపాడని ఏడుస్తూ చెప్పింది. హుటాహుటిన సూరజ్రాజ్ తన అన్న సోనూరాజ్ను కాపాడుకునేందుకు వచ్చి ఇంటి తలుపులు తట్టాడు. అప్పటికే సోనూరాజ్ (25) ఇంట్లో సీలింగ్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం చీమకుర్తిలోని కొత్తపేట బజారులో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన సోనూరాజ్, అతని తమ్ముడు సూరజ్రాజ్ చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీల్లో ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. తనతో నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో సోనూరాజ్ ఫోన్లో మాట్లాడాడు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ ఫోన్ పెట్టేశాక ఆమెకు మెసేజ్ పెట్టాడు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాన్నది ఆ మెసేజ్ సారాంశం. కంగారు పడిన ఆమె వెంటనే చీమకుర్తిలోనే ఉన్న అతడి తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా తన అన్న ఉరికి నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. క్షణంలో ఉరేసుకొని సోనూరాజ్ ఆత్మహత్య చేసుకోవడాన్ని తమ్ముడు సూరజ్రాజ్, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పి.నాగశివారెడ్డి పరిశీలించారు. సూరజ్రాజు ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ మాల్యాద్రి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
భూమి కుంగడంతోనే ప్రమాదం
టంగుటూరు: మండల పరిధిలోని టి.నాయుడుపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి 58 ట్యాంకర్లతో కడప వెళుతున్న గూడ్స్ రైలు 580 ఎగువ రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే పట్టాలు తప్పింది. మొత్తం ఏడు ట్యాంకర్లు పట్టాలు తప్పగా నాలుగు ట్యాంకర్లు బ్రిడ్జి కింద పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి దగ్ధమయ్యాయి. ఈ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఐఓసీ లే అవుట్ పక్కనే ఉండటంతో భయాందోళన నెలకొంది. మంటలు క్రమం క్రమంగా పెద్దవి కావడంతో స్థానిక గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఐఓసీ రెస్క్యూ టీం, సౌత్ సెంట్రల్ రైల్వే రెస్క్యూ టీం, రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అడిషనల్ ఆర్ఎం రామరాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజినీరింగ్ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడవ రైల్వే నిర్మాణ పనుల వల్ల భూమి కుంగి రైలు పట్టాలు తప్పినట్లు భావిస్తున్నామన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మిగిలిన 50 ట్యాంకర్లను టంగుటూరుకు చేర్చామన్నారు. గురువారం ఉదయం 300 మంది కార్మికులు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. సంఘటనా స్థలాన్ని రైల్వే అధికారులు, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై రమణయ్యలు పరిశీలించారు. -
కలెక్టర్కు షోకాజ్ నోటీసు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి షోకాజ్ నోటీసు జారీ చేసింది. విద్యుత్ కారిడార్ వ్యవహారంలో రైతుకు న్యాయం చేయని కలెక్టర్పై కమిషన్ సీరియస్ అయింది. రెండు వారాల్లో సరైన వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టు ఏపీఈఆర్సీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఏపీ ట్రాన్స్కో 2017లో పొదిలి–పర్చూరు మధ్య 220 కేవీ విద్యుత్ లైన్ వేసింది. ఈ క్రమంలో సుబాబుల్ సాగు చేస్తున్న వలేటి వెంకట శేషయ్య భూమి మీదుగా లైన్ వెళ్లింది. దీనివల్ల 80 సెంట్ల భూమి దెబ్బతింటుందని, పరిహారం ఇవ్వాలని విద్యుత్ ఉన్నతాధికారులను కోరాడు. దీనికి వాళ్లు నిరాకరించారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితుడు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 5న ఆ రైతు ఏపీఈఆర్సీని ఆశ్రయించాడు. కమిషన్ వివరణ కోరినా ప్రకాశం జిల్లా కలెక్టర్ స్పందించలేదు. దీంతో విద్యుత్ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కలెక్టర్కు కమిషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. -
తిలా పాపం.. తలా పిడికెడు!
ఒంగోలు: బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదరణ కార్యక్రమం కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగమైన కేసులో ఎట్టకేలకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇంకో మహిళ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కాకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదు. 2019 అక్టోబర్ 21న కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోకి వెళ్తే.. నాగముని బీసీ కార్పొరేషన్ ఈడీగా బా«ధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్నా సిబ్బంది మాత్రం క్యాష్ బుక్ అందజేయడం లేదు. దీంతో ఆయన గట్టిగా ప్రశ్నించడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెక్కులు అయితే డ్రా చేశారని, వాటికి సంబంధించిన బిల్లులు అందజేయలేదని సెలవిచ్చారు. పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేయాలంటే తప్పనిసరిగా ప్రొసీడింగ్స్ ఉండాలని, వాటిని చూపించాలని కోరారు. వాటిని కూడా చూపక పోవడంతో ఆయన కలెక్టర్, బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావుకు ఫిర్యాదు చేశారు. నిధులు దుర్వినియోగమై ఉండొచ్చని భావించి ప్రధాన కార్యాలయంలో పనిచేసే జి.భీమశంకరరావును విచారణ చేయాలని ఈడీ కోరారు. దీంతో ఆయన జిల్లాకు చేరుకుని మొత్తం విచారించి రూ.50.10 లక్షలకు సంబంధించి ఎటువంటి లెక్కలు లేవని తేల్చారు. అదే నివేదికను ఆయన బీసీ కార్పొరేషన్ ఎండీకి అందజేశారు. కలెక్టర్కు ఆ నివేదికను పంపి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎండీ రామారావు నివేదిక ప్రకారం అప్పటి బీసీ కార్పొరేషన్ ఈడీగా ఉన్న నాగేశ్వరరావు పేరున రూ.9 లక్షలు, ఏఈవో అంబటి శ్రీనివాసరావు పేరున రూ.8.05 లక్షలు, డీబీ సీడబ్ల్యూవో పీవీ ఆంజనేయులు పేరున రూ.45 వేలు, జూనియర్ అసిస్టెంట్ (ఔట్ సోర్సింగ్) ఏడుకొండలు పేరున రూ.11,48,500, కాపు కార్పోరేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) వి.రాజేష్ పేరున రూ.8.90 లక్షలు, మరో డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) బీవై కమలేశ్వరరావు పేరున రూ.10,02,500లు, దోర్నాల మండలం యడవల్లికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ అలుగులు లక్ష్మయ్య పేరున రూ.1,24,500, అద్దంకికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసరావు పేరున రూ.95 వేలు చొప్పున చెక్కులు డ్రా అయ్యాయి. వీటికి సంబంధించిన బిల్లులు, ఓచర్లు అందజేయక పోవడంతో నిధులు దుర్వినియోగమైనట్లు భావించి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వీరితో పాటు అప్పట్లో మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తేళ్ల జాహ్నవి, గౌతమి, షేక్ జిలానీలపై కేసు నమోదు చేశారు. అరెస్టు ఇలా.. వీరంతా సోమవారం జాయింట్ కలెక్టర్ వద్దకు వచ్చారు. ఆయనతో మాట్లాడి కార్యాలయం నుంచి బయటకు రాగానే గతంలో కేసు నమోదైనందున తమ విచారణకు సహకరించాలని తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ వారిని కోరారు. అనంతరం వారిని తాలూకా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం అప్పటి ఈడీ అరపికట్ల నాగేశ్వరరావు, ఏఈవో అంబటి శ్రీనివాసరావు, పీట్ల వెంకట ఆంజనేయులు, ఏటి ఏడుకొండలు, బత్తినేని యోగిరుత్ కమలేశ్వరరావు, దోర్నాల మండలానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ అలుగుల లక్ష్మయ్య, అద్దంకికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసరావు, ఒంగోలుకు చెందిన తేళ్ల జాహ్నవి, షేక్ జిలానీలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడు రాజేష్ ఆచూకీ లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. అతని స్వస్థలం విజయనగరంగా చెబుతున్నారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పదో నిందితురాలిగా పేర్కొన్న మరో ఉద్యోగిని గౌతమిపై ప్రాథమికంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రమేయం ఉన్నట్లు రూఢీ కాకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదని సీఐ లక్ష్మణ్ తెలిపారు. -
ఆరేళ్లుగా విద్యుత్ సరఫరాకు నోచుకోని గ్రామం
కొండల కోనల మధ్య నాగరిక జీవనానికి..అభివృద్ధికి ఆమడ దూరంలో చీకటిలో మగ్గుతోంది టేకులపెంట గ్రామం. కొమరోలు మండలం చింతలపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్ల రాళ్లుతేలిన మట్టిబాటే శరణ్యం. ఆ ఊరి మొత్తం మీద అక్షరాలు నేర్చిన వారు ముగ్గురే. ఆ ఊరికి విద్యుత్ వెలుగులే లేవు..ఇక ఫోను, టీవీ సంగతి సరేసరి. దప్పికేస్తే నేల బావి..ప్రాణం మీదకొస్తే డోలీలే దిక్కు. ఆ గ్రామస్తుల స్థితిగతులపై సాక్షి కథనం గిద్దలూరు: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఫోన్, టీవీకి దూరంగా జీవిస్తున్న వారు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నెలకు ఓసారి కూడా వారు బస్సులు, ఆటోల ముఖం చూడరంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ అదే నిజం.! నాగరిక జీవనానికి దూరంగా ఉంటున్న ఆ గ్రామం పేరు టేకులపెంట. కొమరోలు మండలం చింతలపల్లెపంచాయతీ పరిధిలో ఉంటుందీ ఊరు. ఏదైనా పనిమీద గ్రామం నుంచి బయటకురావాలంటే ఏడు కి.మీ దూరం రాళ్లు, ముళ్లపొదల్లో క్రూర మృగాల మధ్య నడిచి వెళ్లాలి. సాయంత్రం ఆరు గంటలు దాటితే చిమ్మచీకటి. గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉన్న నేలబావి నీటితోనే నేటికీ దప్పిక తీర్చుకుంటున్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేదు. 60 మంది జనాభా నివసిస్తున్న గ్రామంలో చదువుకున్న వారు ముగ్గురే. సుస్తీ చేస్తే డోలీ కట్టుకుని ఏడు కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి. సంక్షేమ పథకాలకు అర్హులైనా అవి అందించే మార్గం లేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ‘మాకు రోడ్డు, కరెంటు, తాగునీటి బోరు ఏర్పాటు చేస్తే చాలు’ అంటున్నారే తప్ప గ్రామాన్ని ఖాళీ చేసిజనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పడం లేదు. టేకులపెంట వాసులకు ఏ అవసరమొచ్చినా, ఆపదొచ్చినా రాళ్లతో కూడిన దుర్భరమైన ఈ రహదారిలోనే ఏడు కిలోమీటర్ల దూరంప్రయాణించాలి.. కొండల మధ్య జీవనం చింతలపల్లె పంచాయతీ పరిధిలోని టేకులపెంట గ్రామం కొండల మధ్య ఉంది. వీరు ఐదు కి.మీ దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. దట్టమైన అడవులు, కొండల్లో చెట్లను తప్పించుకుంటూ నడవాలి. వీరు పంచాయతీ కేంద్రానికి వచ్చేది ఎన్నికల సమయంలోనే. రేషన్కార్డులు ఉన్నా సరుకులు తీసుకునేది తక్కువే. దట్టమైన అడవి మధ్య 40 కుటుంబాల వరకు ఉండేవి. అందరిదీ ఒకే సామాజిక వర్గం. కాలక్రమంలో ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం 14 కుటుంబాలకు చెందిన 60 మంది మాత్రమే నివసిస్తున్నారు. గ్రామానికి చుట్టూ రాతితో గోడ కట్టి అడవి జంతువులు రాకుండా చిన్న గేటు ఏర్పాటు చేసుకోవడం విశేషం. జబ్బు చేస్తే డోలీ కట్టాల్సిందే.. టేకులపెంటలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీ కట్టుకుని ఏడు కిలోమీటర్ల దూరంలోని కోనపల్లి వరకు మోసుకెళ్లాల్సిన దీనావస్థ. అక్కడ నుంచి ఆటోలో సమీప వైద్యశాలకు వెళ్తారు. అనారోగ్యం నుంచి కోలుకుంటే చిన్నగా గ్రామానికి వెళ్తారు. లేదంటే బంధువుల వద్దకు వెళ్లి ఆరోగ్యం బాగయ్యాకే తిరిగి స్వగ్రామానికి వెళ్తారు. గర్భిణులు నెలలు నిండితే సాధారణ ప్రసవం చేస్తారు. లేదంటే డోలిలోనే వైద్యశాలకు తీసుకెళ్తారు. ఈ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. సెల్ఫోన్ కొనుక్కున్నా చార్జింగ్ పెట్టేందుకు కరెంటు లేదు. మాట్లాడేందుకు సెల్ టవర్ సిగ్నల్ అందదు. కొండ నుంచి మైదాన ప్రాంతానికి రావాలని అధికారులు సూచించినా గ్రామస్తులు ఇష్టపడటం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా భరిస్తున్నారు. గ్రామానికి రోడ్డు, తాగునీటి బోరు, విద్యుత్ సరఫరా తదితర వసతులు కల్పిస్తే ‘మా బతుకు మేము బతుకుతాం’ అని చెబుతున్నారు. టేకులపెంట గ్రామం వ్యూ సమస్యలతో సతమతం టేకులపెంట గ్రామం కొమరోలు మండలంలో ఉన్నప్పటికీ వీరికి ఏ అవసరం వచ్చినా బేస్తవారిపేట మండలంలోని కోనపల్లెకు వెళ్తారు. ఇందుకు ఏడు కిలోమీటర్లు నడవాలి. నడిచేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. మొనదేలిన రాళ్లపై కిందామీద పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలబావి(దిగుడుబావి) వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆ నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో మోటారు ఏర్పాటు చేసినా అది మరమ్మతులకు గురయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. ఆరేళ్ల క్రితం వరకు విద్యుత్ సరఫరా ఉన్న ఈ గ్రామం.. ప్రస్తుతం చీకట్లో మగ్గుతోంది. ఆరేళ్ల క్రితం గాలివాన బీభత్సంతో స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సోలార్ ఎల్ఈడీ లైటు ఏర్పాటు చేసినా అది పనిచేయడం లేదు. మేకల పెంపకం, చిరుధాన్యాల సాగు అడవుల్లో ఉన్న వీరు వాణిజ్య పంటలు సాగుచేయరు. వర్షాధార పంటలుగా చిరుధాన్యాలైన కొర్రలు, సజ్జ, జొన్న, రాగులు, ఉలవలుపండిస్తున్నారు. వాటినే ఆహారంగా తింటున్నారు. దీంతో తమ శరీరం దృఢంగా ఉంటుందనిగ్రామస్తులు చెబుతున్నారు. అడవుల్లో గడ్డిఎక్కువగా లభ్యమవుతున్నందున మేకలు, గేదెలు పెంచుతున్నారు. అడవులకు ఎలాంటి హాని తలపెట్టకుండా జీవనం సాగిస్తున్నారు. ధాన్యం ఎక్కువగా పండితే మూటలు కట్టుకునిమోసుకుంటూ వెళ్లి విక్రయించుకుని బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటారు. తాగునీరు, కరెంటు, రోడ్డు ఏచ్చే ఇక్కడే బతుకుతామయ్యా మాకు ఏమొద్దయ్యా తాగేదానికి బోరు, కరెంటు లైను, ఊర్లోకి వచ్చేదానికి రోడ్డు ఏచ్చే ఎలాగోలా ఇక్కడే బతుకుతాం. దేవుని దయవలన వానలు పడుతున్నాయి. అంతో ఇంతో పంటలు పండుతాయి. అనారోగ్యం సేచ్చే రోడ్డు ఉంటే ఏదొక ఆటోను పిలుచుకొచ్చుకుని ఆసుపత్రికి పోతాం. అసలు మాకు జ్వరాలు కూడా రావు. ఆకు పసురుకే తగ్గిపోతాయి. ఈడనే మేము ఆరోగ్యంగా ఉండగలమనిపిస్తోంది. బోరు, కరెంటు, రోడ్డు వేసేలా చూడాలి. – వెంకటేశ్వర్లు, టేకులపెంట గ్రామస్తుడు -
ప్రకాశం బత్తాయి ఒడిశాకు..
యర్రగొండపాలెం: కరోనా ఉధృతి ప్రారంభం నుంచే బత్తాయి రైతులకు గడ్డుకాలం దాపురించింది. వైరస్ ప్రబలకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో రైతులు విలవిల్లాడారు. కోతకొచ్చి మంచి ధర పలుకుతున్న సమయంలో రవాణా సౌకర్యం ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు బయట తిరగకపోవడంతో పండ్ల మండీలు మూతవేశారు. ఈ తరుణంలో టన్ను రూ.55 నుంచి రూ.60 వేల మేరకు ధర పలకాల్సిన బత్తాయి రూ.8 వేలకు పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమై చెట్టు నుంచి కాయలు కోయకుండా రైతులకు అవగాహన కలిగించారు. చెట్టు నుంచి రాలిపడిన కాయలు మాత్రం స్థానికంగానే అమ్మకాలు జరిపారు. వీరికి వైఎస్సార్ క్రాంతి పథం – డీఆర్డీఏ శాఖ చేయుతనిచ్చింది. కాయలు కొనుగోలు చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా అమ్మకాలు జరిపించింది. 4 నెలలుగా ఆటు పోట్లకు గురైన బత్తాయి ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఒడిశా మార్కెట్లో మంచి డిమాండ్.. జిల్లాలో మొత్తం 21,250 ఎకరాల్లో బత్తాయి తోటలను పెంచుతున్నారు. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల మేర దిగుబడి వస్తుంది. సరాసరిన ఎకరాకు 8 టన్నుల ప్రకారం లెక్కలు వేసుకుంటే 1.70 లక్షల టన్నులు బత్తాయి కాపు కాస్తుంది. టన్ను రూ.35 వేల ప్రకారం బత్తాయి తోటలు పెంచే రైతులకు రూ.595 కోట్ల రాబడి ఉంటుంది. ప్రభుత్వం లాక్డౌన్ సడలించిన తరువాత బత్తాయికి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరిగింది. జిల్లాలో పండిన బత్తాయి పంట ఒడిశాకు ఎక్కువగా రవాణా అవుతుంది. వారం రోజుల క్రితం టన్ను రూ.32 వేలు ధర పలకగా ఒడిశా మార్కెట్ తెరుచుకున్న తరువాత బత్తాయికి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం బత్తాయి ధర టన్ను రూ.40 వేల వరకు ఉందని పలువురు రైతులు తెలిపారు. ఇప్పుడిప్పుడే దేశంలో పండ్ల మండీలు తెరుచుకుంటున్నాయి లాక్డౌన్ కారణంగా పండ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్ లేకపోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో మండీలు తెరుచుకుంటున్నాయి. దీని వలన బత్తాయికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం టన్ను బత్తాయి రూ.40 వేల వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో బత్తాయి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం టన్ను రూ.60 వేల వరకు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం రూ.70 వేల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.– షేక్.నబీరసూల్, ఉద్యానశాఖాధికారి, వైపాలెం -
మద్యానికి దూరం... దూరం!
మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలు మందుకు దూరం..దూరం అంటున్నాయి. మద్యానికి బానిసలుగా మారి కుటుంబం పట్ల నిర్లక్ష్యాన్ని కనబరిచే వారిలో సైతం నేడు మార్పు కనిపిస్తుంది. గత, ప్రస్తుత ప్రభుత్వాల ఒక ఏడాది పాలనను పరిశీలిస్తే ఆ తేడా ఇట్టే అర్థమవుతుంది.ఒక వైపు ఎడాపెడా పెంచిన మద్యం ధరలు సామాన్యుడిగుండెల్లో దడను పెంచాయని చెప్పక తప్పదు. మరో వైపు నిర్ణీత వేళల్లోనే విక్రయాలు చేపట్టడం, బెల్టుషాపులకు స్వస్తి పలకడం, పర్మిట్ రూముల పేరుతో మినీబార్లను తలపించేలా ఉండే సిట్టింగ్లకు చెక్ పెట్టడంవంటి ఎన్నో నిర్ణయాలు మద్యం నుంచి ప్రజలను దూరంగా తీసుకువెళ్లేందుకు కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒంగోలు: గతంలో చంద్రబాబు హయాంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండేవి. మంచినీరు లభించకున్నా మద్యం మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉండేదనే అభిప్రాయం నాడు సర్వత్రా వినిపించేది. అర్ధరాత్రి సైతం చీకటి వ్యాపారం బహిరంగంగా సాగేది. మద్యం అమ్మకాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకమంటూ నాటి పాలకులు ప్రజల్లో ఒక అపోహను సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో 2018 మే 30వ తేదీ నుంచి 2019 మే 29 వరకు జిల్లాలో 20,06,110 మద్యం కేసులు, 14,72,258 బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో పర్మిట్ రూముల పేరుతో ప్రైవేటు మద్యం వ్యాపారుల వద్ద ఫీజు వసూలు చేయడం, మద్యం షాపులకు లాటరీల నిర్వహణ జరిగాయి. దీంతో ప్రైవేటు వ్యాపారులునిర్ణీత వేళలను పట్టించుకోకపోవడం, బెల్టుషాపులు ఇష్టరాజ్యంగా కొనసాగడం వెరసి చివరకు స్వర్ణాంధ్రప్రదేశ్కు బదులుగా మద్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందనే విమర్శలు మిక్కిలిగా వినిపించాయి. కానీ నేడు... వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా దశలవారీ మద్య నియంత్రణకు కట్టుబడి జిల్లాలో ఉన్న మద్యం షాపులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2019 మే 30వ తేదీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్స్ జూన్ 30వ తేదీతో ముగిసింది. నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తొలి మూడు నెలలపాటు గతంలో వ్యాపారం నిర్వహించుకునే వారికే రెన్యువల్ చేశారు. అంటే సెప్టెంబర్ 2019 వరకు పాత పద్ధతిలోనే మద్యం వ్యాపారాలు జరిగాయి. 2019 మే 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 6,11,326 మద్యం కేసులు, 5,00,777 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. అదే 2019 అక్టోబరు 1వ తేదీ నుంచి 2020 మే 29వ తేదీ వరకు అంటే 8 నెలల కాలంలో 8,05,525 మద్యం కేసులు, 1,90,129 బీరు కేసుల విక్రయాలు మాత్రమే జరిగాయి. అంటే మొత్తం విక్రయాలు 14,16,851 మద్యం, 6,90,906 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పాత పాలసీ అమలులో ఉన్న నాలుగు నెలల కాలంలో 43.14 శాతం మద్యం విక్రయలు జరగ్గా తరువాత 8 నెలల కాలంలో 56.86 శాతం మాత్రమే జరగడం గమనార్హం. ఇక బీరు విక్రయాలను పరిశీలిస్తే తొలి నాలుగు నెలల పాత పాలసీ కాలంలో 72.48 శాతం బీరు విక్రయాలు జరగ్గా, నూతన పాలసీ అమలులోకి వచ్చిన తరువాత 27.52 శాతం మాత్రమే జరగడం గమనార్హం. ఎంత వ్యత్యాసం: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏడాది కాలంలో 20,06,851 మద్యం కేసులు, 14,72,258 బీరు కేసుల విక్రయాలు జరిగితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తొలి ఏడాది కాలానికి 14,16,851 మద్యం కేసులు, 6,90,906 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. పర్మిట్ రూముల రద్దు, ప్రైవేటు మద్యం వ్యాపారం స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకురావడం, 331 మద్యం షాపులకు గాను తొలి విడత 69 దుకాణాలు రద్దుచేసి 262కు పరిమితం చేశారు. తాజాగా మరలా 2020 జూన్ 1వ తేదీ నుంచి మరో 13 శాతం రద్దుచేస్తున్నట్లు ప్రకటించి మరో 40 షాపులు తగ్గించారు. దీంతో ప్రస్తుతం మిగిలి ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్య కేవలం 222 మాత్రమే. వాటికి కూడా నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం విక్రయాలు నిర్వహిస్తుండడం, ధరలు భారీగా పెంచడంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోయింది. చాలా మంది మద్యం దుకాణాల వైపు చూసేందుకు జంకుతుండడంతో తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇన్నాళ్లు మద్యం కోసం వెచ్చించిన వారు నేడు కుటుంబ సంక్షేమం కోసం వెచ్చిస్తున్నారు. అందువల్లే చంద్రబాబు ఏడాది కాలంతో పోలిస్తే మద్యం విక్రయాలు 29.38 శాతం పడిపోగా, బీరు విక్రయాలు 53.08 శాతం పడిపోయాయి. దీనిని బట్టే తొలి ఏడాదిలోనే మద్యం ప్రియుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని స్పష్టం అవుతుంది. -
తండ్రి ఘాతుకం
యర్రగొండపాలెం:కుటుంబ సభ్యులు తన చిల్లర ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని 6 నెలల ఆడశిశువును కన్న తండ్రి గొంతుపట్టుకొని విసిరి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని అమానిగుడిపాడు ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వైదన బాల ఏసు బీడీల కోసం భార్య విజయులును డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బుల్లేవని చెప్పిన వెంటనే కిందపడుకొని ఉన్న పసికందు గొంతుపట్టుకొని విసిరేశాడు. ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. బాలఏసుకు మతిస్థిమితం లేదని, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థంకాని పరిస్థితని ఆయన బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.ముక్కంటి తెలిపారు. -
భార్య వేధింపులకు తాళలేక భర్త ఆత్మహత్య
దేవరాజుగట్టు (పెద్దారవీడు): తరుచూ భార్య వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన భర్త చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దేవరాజుగట్టులో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కటికల దావీదు (50)కు ఆయన భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. స్థానికులు ఉదయం ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లారు. కాలనీలో ఎవరూ లేని సమయంలో గ్రామం సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వెనుక వేప చెట్టుకు ఉరేసుకుని దావీదు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు దావీదు తన చిన్న తమ్ముడికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. వెంటనే బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య బాలకుమారి, వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. పురుగుమందు తాగి .. కొండపి: మండలం గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన గోనెల వెంకటేశ్వర్లు (21) బుధవారం పొలాల్లో మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించే వెంకటేశ్వర్లు కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగాడు. కుటుం బసభ్యులు సమాచారం అందుకుని అతడిని కొండపి వైద్యశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ హనుమంతురావు తెలిపారు. మరో యువకుడు కూడా.. ఉలవపాడు: పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రం ఉలవపాడులో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక దర్గా సెంటర్కు చెందిన మున్వర్బాషా (25) మంగళవారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ను స్థానిక వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మున్వర్ బాషా మృతి చెందాడు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. మృతుడికి వివాహం కాలేదు. హోటల్ వ్యాపారంలో తండ్రికి అండగా ఉంటున్నాడు. ఎస్ఐ దేవకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత బలవన్మరణం మద్దిపాడు: కడుపునొప్పి తాళలేక వివాహిత ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఎలీసమ్మకు నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన వడేల సుబ్బారావుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పనికి వెళ్లిన తర్వాత కడుపునొప్పి విపరీతంగా రావడంతో భరించలేక ఎలీసమ్మ (28) ఇంట్లోని ఫ్యాన్కు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. -
కరోనా కరాళ నృత్యం
ఒంగోలు సెంట్రల్: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోతుండటంతో రోజు, రోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 18 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 207కు చేరుకుంది. వీరిలో ఒంగోలు వీఆర్డీఎల్ పరీక్షల్లో ఆరుగురు, గుంటూరు వీఆర్డీఎల్ పరీక్షల్లో ఒకరు, ట్రూనాట్ పరీక్షల్లో 11 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. దర్శికి చెందిన ఓ పోలీసు అధికారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇటీవల గుంటూరు నుంచి దర్శికి వచ్చాడు. అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలికి ఈ నెల 9వ తేదీ పరీక్షించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పామూరు మండలం రావిగుంటపల్లికి చెందిన 17 సంవత్సరాల యువకుడు ఈ నెల 9వ తేదీ చెన్నై నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చాడు. అనారోగ్యంగా ఉండటంతో పరీక్షించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. యద్దనపూడి మండలం చింతపల్లిపాడుకు చెందిన 40 సంవత్సరాల మహిళకు ఈ నెల 15న పరీక్షించగా పాజిటివ్గా తేలింది. ఇదే గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలికకు పాజిటివ్గా నిర్ధారించారు. మార్కాపురానికి చెందిన 47 సంవత్సరాల వ్యక్తి ఈ నెలలో వివాహ సంబంధ కార్యక్రమాలపై విజయవాడకు వెళ్లి తిరిగి ఈ నెల 15న జిల్లాకు వచ్చాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో అధికారులు పరీక్షించగా పాజిటివ్గా నిర్ధారించారు. వీరందరికీ వీఆర్డీఎల్ పరీక్షల ద్వారా కోవిడ్ను నిర్ధారించారు. ఒంగోలు మంగమూరుడొంకకు చెందిన 38 సంవత్సరాల మహిళను ఈ నెల 15వ తేదీ ట్రూనాట్ పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. చీరాలలో 11 కేసులు: చీరాలకు చెందిన ఏడుగురు పురుషులకు, ఇద్దరు స్త్రీలకు ఈనెల 15న కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారించారు. 38 ఏళ్ల మరో వ్యక్తికి గుంటూరులో వీఆర్డీఎల్ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. చీరాల జయంతిపేటకు చెందిన 13 ఏళ్ల బాలుడికి కరోనా సోకింది. ఒక్క చీరాలలోనే 28 పాజిటివ్ కేసులు ఒక్క చీరాల, పేరాల ప్రాంతాలలోనే ఇప్పటి వరకూ 28 పాజి టివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 10కి పైగా కేసులు నమోదవడంతో పాటూ, మరి కొన్ని అనుమా నిత కేసులు ఉండటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. చీరాలలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించారు. కరోనాతో ముగ్గురు మృతి సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి నెల్లూరులో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మృతదేహానికి అక్కడే అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికే టంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ క్యాన్సర్తో చెన్నైలో చికిత్స పొందుతూ అక్కడ కరోనా వైరస్ సోకి వారం క్రితం మృతిచెందింది. పామూరు మండలానికి చెందిన 35 ఏళ్ల మహిళ గుండె జబ్బుతో గుంటూరులో చికిత్స పొందుతుండగా అక్కడ కరోనా సోకి రెండు రోజుల క్రితం మృతిచెందింది. తీవ్ర స్థాయిలో కోవిడ్ 19 వైరస్ జిల్లాలో కోవిడ్ 19 వైరస్ తీవ్ర స్థాయిలో ఉందని, జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఎల్.జాన్ రిచర్డ్స్ తెలిపారు. ఇతర ప్రాంతాలు ముఖ్యంగా చెన్నై, పూణె, హైదరాబాద్ నుంచి వచ్చిన వైరస్ గతంలో ఉన్న వైరస్ కంటే తీవ్ర స్థాయిలో ఉందన్నారు. గతంలో జిల్లాలో వైరస్ బారిన పడిన వారు తీవ్ర స్థాయి అనారోగ్యానికి గురి కాలేదని, చికిత్సకు బాగా స్పందించే వారన్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. – డాక్టర్ జాన్ రిచర్డ్స్ -
ఇలాగైతే..ఎలాగమ్మా?
పర్చూరు: నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఎస్హెచ్వో అవినీతికి అడ్డు లేకుండా పోయిందని కింది స్థాయి సిబ్బంది ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్కు రాతపూర్వకంగా సోమవారం ఫిర్యాదు చేశారు. పర్చూరు ఎస్ఈబీ ఇన్చార్జి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆర్వీ రమణమ్మపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సిబ్బంది పంపిన లేఖ పర్చూరు ఎస్ఈబీలో దుమారం రేపుతోంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది కొన్ని కేసుల్లో జరిగిన అవినీతి గురించి వివరించడం చర్చనీయాంశంగా మారింది. ఇవీ..సిబ్బంది ఆరోపణలు ♦ మే 14వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 12–2020లో పర్చూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు నిందితుల్లో ఒకరిని, ఒక మోటారు సైకిల్ను కేసు నుంచి తప్పించేందుకు, మిగిలిన ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.60 వేలు డిమాండ్ చేసి చివరకు ఎస్హెచ్ఓ రూ.25 వేలు తీసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ♦ ఈ నెల 6వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 15–2020లో పర్చూరు మండలం నాగులపాలేనికి చెందిన కేసు నుంచి మోటారు సైకిల్ను తప్పించి నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకున్నారు. ♦ ఈ నెల 9వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 16–2020లో యద్దనపూడికి చెందిన ఒక నిందితుడిని, ఒక మోటారు సైకిల్ను తప్పించారని, మరో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.30 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు. ♦ ఈ నెల 11వ తేదీన నమోదైన క్రైమ్ నంబర్ 17–2020లో ఒక నిందితుడిని, మోటారు సైకిల్ను తప్పించి మరో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఇంకో మరెన్నో? ♦ మద్యం సీసాలతో పట్టుబడిన వారి ఫొటోలు తీసి వారి వద్ద డబ్బులు, మద్యం సీసాలన్నింటినీ తీసుకుని వదిలేశారంటూ ఆరోపణలు ♦ మే 30వ తేదీన పూసపాడు జీఆర్వో వద్ద అరెస్టు చేసిన నలుగురు నిందితులు, రెండు మోటారు సైకిళ్లను వదిలేసేందుకు రూ.40 వేలు తీసుకున్నట్లు ఆరోపించారు. ♦ నూతలపాడులో అర్ధరాత్రి ఓ ఇంటిపై దాడి చేసి వారి వద్ద 8 ఫుల్ బాటిళ్లు, ఐదు క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయలేదు. ♦ ఇంకొల్లులో ఓ ట్రావెల్స్ యజమాని వద్ద సాయంత్రం 8 గంటల సమయంలో 12 మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తీసుకొచ్చి ఫొటోలు తీసిన తర్వాత కేసు నమోదు చేయకుండా రూ.20 వేలు లంచం తీసుకుని వదిలేశారు. ♦ పర్చూరు ఇందిరా కాలనీలోని వైఎస్సార్ సెంటర్లో ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి 12 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఎస్హెచ్ఓ ఇంటికి తీసుకెళ్లారు. ♦ ఈ నెల 11వ తేదీన దొరికిన 13 ఖరీదైన మద్యం సీసాలను ఇంటికి తీసుకెళ్లి తక్కువ ఖరీదు ఉన్న 9 మద్యం సీసాలు చూపి కేసు నమోదు చేశారు. వీటితో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్హెచ్వో రమణమ్మ అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ పరువు కాపాడాలని ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్ను సిబ్బంది కోరారు. -
టీవీ చూస్తుందని మందలిస్తే..
కొత్తపల్లె (పామూరు): తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మలు కిరాణాదుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో అగ్రికల్చల్ బీఎస్సీ, కుమారుడు విజయవాడలో ఇంటర్మీడియెట్ చదివిస్తున్నారు. ఇటీవల లాక్డౌన్తో ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు. అనంతరం ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. దేవీ ప్రసన్న వరండాలో నిద్రపోగా మిగిలిన వారంతా పంచలో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పద్మ నిద్ర లేచి ఇంట్లోకి వెళ్లగా కుమార్తె ప్రసన్న ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కింద దించగా అప్పటికే మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై అంబటి చంద్రశేఖర్, ఏఎస్సై డి.లక్ష్మీప్రసాద్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తుదనుకుంటే.. ‘మాకష్టం మాపిల్లలకు ఉండకూడదని కష్టపడి పిల్లలను చదివిస్తున్నాం. చదువుకుని మంచి ఉద్యోగస్తురాలవుతుందనుకున్న మా కుమార్తె ఇలా మాకు దూరమవుతుందనుకోలేదు. కష్టపడి చదివితే ఉద్యోగమొస్తుందనే టీవీ ఎక్కువగా చూడద్దని చెప్పా. కానీ ఇలా మమ్ములను మా కుమార్తె విడిచి శాశ్వతంగా దూరమవుతుందనుకోలేదని’ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. విద్యార్థిని ఆత్మహత్య మద్దిపాడు: ఇంటర్ పరీక్షలు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్లవరం ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...మల్లవరం ఎస్సీ కాలనీకి చెందిన బోడిపాక కీర్తి అద్దంకిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంది. రెండు రోజుల క్రితం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్దిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రులకు ఒక్కటే కుమార్తె, ముగ్గురు కుమారులు కావడంతో ఇంటి మహాలక్ష్మి మరణించిందంటూ విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడా నాకెందుకీ శిక్ష!
తిండిపోతును కాదు.. తాగుబోతును, తిరుగుబోతును అసలే కాదు.. పెద్దగా ఆశల్లేవు.. ఆర్భాటాలకు పోలేదు. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేసిన వాడ్ని కాదు. కానీ, ఆ దేవుడు నాకే ఎందుకు వేశాడీ శిక్ష? సాగు చేయడం తప్ప నాకు మరో ప్రపంచమే తెలియదు. ఇంటిల్లాపాదీ పొలం పనుల్లో చెమటోడ్చడం తప్ప ఏనాడూ సుఖ పడింది లేదు. వ్యవసాయంలో పిల్లలకు సంపాదించి పెట్టిందేమీ లేకపోగా చేసిన అప్పులకు తాతలిచ్చిన గడ్డంతా కరిగించేస్తున్నాను. మళ్లీ మళ్లీ పొలం అమ్మాలంటే మనసొప్పడం లేదు. ఉన్నదంతా అమ్మేస్తే బిడ్డల భవిష్యత్తేంటా అనే ప్రశ్న మెదడునుతొలిచేస్తోంది. నాతోపాటు కుటుంబ సభ్యులనూకష్టపెడుతున్నాననే బాధ గుండెల్ని పిండేస్తోంది. ఎంత మదనపడ్డానో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో.. నాకూఅందరిలా బతకాలని ఉంది. జనంలో దర్జాగా తిరగాలనుంది. కానీ, దేవుడు నాకా అదృష్టం ఇవ్వలేదు. ఇది భూమిని నమ్ముకున్న ఓ అన్నదాత కన్నీటి కథ. ఈ అప్పుల భారం నేనిక మోయలేనంటూ ప్రాణార్పణ చేసిన రైతన్న వ్యథ. పెద్దారవీడు పంచాయతీ సిద్దినాయునిపల్లెకు చెందిన రైతు శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి తాను ఆత్మహత్య చేసుకునే ముందు చెప్పుకున్న బాధలు వింటే మనసున్న ఎవరికైనా కడుపు తరుక్కుపోవాల్సిందే..! ప్రకాశం, పెద్దారవీడు: పెద్దారవీడు పంచాయతీ సిద్దినాయునిపల్లెకు చెందిన శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి(50), వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, వివాహమైన ఒక కుమార్తె ఉంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న శింగారెడ్డి తన తొమ్మిది ఎకరాల పొలంలో పత్తి, మిరప పంటలు సాగు చేస్తూ వచ్చాడు. అతడి తల్లి, భార్యకు పొలం పనులలో కష్టపడడం తప్ప మరో ప్రపంచం తెలియదు. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో నష్టం వాటిల్లింది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు బతికించుకునేందుకు పొలాల్లో మొత్తం 16 బోర్లు వేశాడు. పెట్టుబడుల కోసం దాదాపు రూ.25 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులకు వడ్డీలకు వడ్డీలు పెరిగాయి. అప్పిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమయ్యాయి. మంగళవారం రాత్రి ఇద్దరు కుమారులు కొండారెడ్డి, సుబ్బారెడ్డిలను దగ్గర కుర్చోపెట్టుకొని తన పరిస్థితి చెప్పాడు. మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పొలం అమ్మి అప్పులు తీర్చాలని చెప్పాడు. తనలా పొలం మీద ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకొని జీవించాలని, పొలాన్ని నమ్ముకుంటే తనలా అప్పుల పాలవుతారని హితబోధ చేశాడు. సూసైడ్ నోట్లో అప్పుల వివరాలు.. ఆ రాత్రి అందరూ నిద్రించాక తనకు అప్పులు ఇచ్చిన వారి పేర్లు, నగదు, ఏ బ్యాంక్లో ఎంత అప్పు తీసుకుంది ఓ కాగితంలో వివరంగా రాసి పెట్టాడు. మరో కాగితంపై తన మృతికి తానే కారణమని సూసైట్ నోటు రాసి రాసి సంతకం పెట్టాడు. అప్పులెలా తీర్చాలో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, కుటుంబ భారాన్ని మోయలేక, అప్పుల వారికి సమాధానం చెప్పలేక మనోవేదన అనుభవించానని అందులో పేర్కొన్నాడు. ఇప్పటికే కొంత పొలం అమ్మాను ఉన్న పొలమంతా అమ్మి అప్పులకు కడుతుంటే పిల్లల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించుకున్నాని ఆవేదన వ్యక్త పరిచాడు. ఏదారి లేక ఇక నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాని, కష్టం చేయడం తప్ప ఇంకేమి తెలియని అమ్మ, జేజిని బాగా చూసుకోవాలని కుమారులను కోరాడు. మిమ్మల్నందరిని విడిచిపెట్టి పోతున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నాడు. అనంతరం బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్యనారాయణరెడ్డి సూసైడ్ నోట్లో రాసిన అంశాలు ఆ గ్రామస్తులను ఎంతగానో కలచివేశాయి. -
డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!
సాక్షి, ప్రకాశం : ఒంగోలును అభివృద్ధి చేశానని డబ్బా కొట్టిన జిల్లా టీడీపీ నాయకుడు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని, గత ప్రభుత్వం పర్సంటేజీలు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి బాలిలేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంత్రి బాలినేని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ విస్మరించిన మార్కాపురం మెడికల్ కాలేజ్, రామాయపట్నం పోర్ట్, నిమ్స్ వంటి భారీ ప్రాజెక్టులను త్వరలో ప్రారంభించబోతున్నాం. ('జంతువులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు') రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అన్నీ సిద్ధం. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీలు వేశాం. కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా కొనసాగింపు చర్యలు ఉంటాయి. అందులో ఒంగోలు భగీరథ కూడా ఉంది. దీనిపై ఇప్పటికే కమిటీ వేశాం. కనిగిరి, దర్శీలలో రెండు వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పనున్నాం. -
ఎకరా కౌలు రూ.42వేలు
కారంచేడు: వ్యవసాయంపై గతంలో ఎన్నడూ లేనంత భరోసా. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాటపై ఉన్న ధీమా రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సాగుపై ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయాల్సిన పని లేదనే ధీమా నేడు జిల్లా రైతాంగాన్ని ఉరకలెత్తిస్తోంది. సాగు చేశామంటే వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదనే ధీమాతో రైతులు ఈ ఏడాది వరి, మిరప, అపరాల సాగుకు ముందడుగు వేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని పంట భూముల కౌలు ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌలు ధరలు ఎగిసిపడటానికి రైతుల్లో నెలకొన్న పోటీనే అని పలువురు రైతులు వ్యాక్యానిస్తున్నారు. ఈ విషయం రైతుల్లో ఆనందాన్ని ఇస్తున్నా కౌలు రైతుల్లో మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయమే. అయినా ఎంత ఖర్చు చేశామో అంత పెట్టుబడితోపాటు, అధిక లాభాలు కూడా ఆర్జించవచ్చనే ధైర్యంతోనే రైతులు సాగుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో ఈ ప్రాంత వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ పెరిగింది. అత్యధికంగా మిరప సాగు చేసే భూములకు కౌలు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో మిరపకు అనుకూలమైన భూములకు ఇప్పటికే కౌలు ధరలు నిర్ణయించుకొని, ఖజానాలు సైతం అయిపోయాయంటే భూములకు నేడు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మాగాణి ప్రాంతంగా పేరొందిన కారంచేడులో గత ఏడాది నుంచి రైతులు మెట్ట పైర్ల వైపు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. వరికి తగ్గిన డిమాండ్ గతంతో పోల్చుకుంటే వరి సాగుకు కొంత డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. గతంలో కారంచేడు మండలంలో సుమారు 40 వేల ఎకరాల సాగు భూములుంటే వీటిలో 25వేల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో మెట్టపైర్లు సాగు చేసేవారు. ప్రస్తుతం సుమారు 20 వేల ఎకరాలకు పైగా మెట్ట పైర్లు సాగు చేసే పరిస్థితి వచ్చింది. మిరపకు డిమాండ్ ♦ ప్రస్తుతం మిరప పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంది. మిరప పంటకున్న «గిట్టుబాటు ధరలకు తోడు మిరప సాగు చేసే భూములకు కౌలు రైతులు అధిక కౌలు ఇచ్చి మరీ తీసుకుండటంతో డిమాండ్ పెరిగింది. ♦ ఎకరా కౌలు రూ.38 వేల నుంచి రూ.42వేలు ♦ ప్రస్తుతం కౌలు రైతులు ఏ పంట సాగు చేసుకున్నా సంబంధం లేకుండా ఎకరా కౌలు మాత్రం రూ.38వేల నుంచి రూ.42 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాగాణి సాగుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కారణం ధాన్యానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది క్వింటా ధాన్యం పాతవి రూ.2500, కొత్తవి క్వింటా రూ.1700 వరకు ధర పలుకుతున్నాయి. ♦ అపరాలకు గిట్టుబాటు ధర గతంలో ఎన్నడూ లేని విధంగా అపరాల ధర ఆశాజనకంగా ఉంది. దీంతో మెట్ట పైర్ల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కారంచేడు ప్రాంతంలో మాగాణి భూముల్లో సైతం మెట్ట పైర్లు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులు కౌలుకు చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెద్ద రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సన్న, చిన్నకారు రైతులు మాత్రం కౌలు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం గతంతో పోల్చుకుంటే సాగు భూములకు కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను 15 సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నా. ఇంత ఎక్కువ కౌలు ధరలు చూడలేదు. రైతుల మధ్య పోటీతోనే కౌలు ధరలు పెరుగుతున్నాయి. నేటి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందనే ధైర్యం మాకుంది. ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నాం.– అంజమ్మ, కౌలురైతు, ఆదిపూడి -
తీపి కబురు!
త్రిపురాంతకం: ఉద్యాన పంటలు కళకళలాడుతున్నాయి. వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు లేక తోటలు ఎండుముఖం పడుతు కళావిహీనంగా మారాయి. అయితే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో మళ్లీ జీవం వచ్చినట్లైంది. రైతు భరోసా కేంద్రాలు కూడా అందుబాటులోకి రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రైతుల ఉత్సాహం జిల్లాలో పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేసేదిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉంది. ఉద్యాన పంటలకు అనువైన భూములు ఉండటం మంచి అవకాశంగా మారింది. కొన్ని పంటలకు ఎక్కువగా నీరు అవసరం కాగా.. మిగిలినవి వర్షాధారం. పశ్చిమ ప్రకాశంలో ఒకప్పుడు బత్తాయి, నిమ్మ, బొప్పాయి, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. మళ్లీ ఈ పంటలు పూర్వవైభవం పొందే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో బత్తాయి 11685 హెక్టార్లు, నిమ్మ 4,123, మామిడి 10,458, అరటి 801 హెక్టార్లు, సపోట 3201, బొప్పాయి 1940, జామ 725 హెక్టార్లలో తోటలు సాగులో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో రైతులు దీర్ఘకాలిక పండ్ల తోటల సాగుపై ఆలోచిస్తున్నారు. అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. తోటల పెంపకానికి ప్రోత్సాహం జిల్లాలో గత ఏడాది పదివేల ఎకరాల్లో తోటల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుని ప్రోత్సహించారు. దీంతో ఈఏడాది ఉత్సాహంతో రైతులు ముందుకు వస్తున్నట్లు తెలుపుతున్నారు. ఉపాధిహామీ నుంచి మొక్కలు, నాటేందకు గుంతలు, నిర్వహణ వ్యయం కింద ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యాన శాఖ నుంచి ఎకరా బత్తాయికి 16,004 రూపాయలు, మామిడి రూ. 13,300, అరటి రూ. 40,985, బొప్పాయి రూ. 24,662, దానిమ్మ రూ. 26,672, జామ రూ. 29,331, సపోట రూ. 10,896, పసుపుకు రూ. 12,000 చొప్పున మూడేళ్లు మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నీటి నిల్వ కోసం ఫారంపాండ్ల నిర్మాణంకు రూ. 75 వేల వరకు రాయితీలు అందించారు. యాంత్రీకరణ పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. గతం నరకం.. ఒకప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉంది. దాంతో తోటలు అధికంగా సాగుచేశారు. రానురాను వాతావరణంలో వచ్చిన మార్పులకు నీటి ఎద్దడి కారణంగా తోటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రాంతంలో బత్తాయికి అనుకూలంగా ఉండటంతో రైతాంగం దీనిపై ఆసక్తిని పెంచుకుని తోటలు సాగుచేశారు. గత పాతికేళ్లుగా ఇక్కడ బత్తాయి, నిమ్మ వంటి పంటలతో కళకళలాడుతూ తోటలు దర్శనమిచ్చేవి. కాలక్రమేణ వర్షాలు తగ్గిపోవడం భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రకతి వైపరీత్యాలు వెంటాడాయి. ఎండలు అధికం కావడం, తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తోటలు కళ తప్పాయి. పదేళ్లుగా బోర్లలో నీరు అడుగంటి పోయింది. ఇలాంటి పరిస్థితుల తర్వాత ప్రస్తుతం తరచూ వర్షాలు పడుతుండటంతో ఈదిశ నుంచి రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. -
జాన పండ్ల కోసం వెళ్లి తప్పిపోయిన మహిళ
ప్రకాశం, అర్ధవీడు: మండలంలోని వెలగలపాయలో ఉపాధి హామీ పనికి వెళ్లిన మహిళ అడవిలో దొరికే జాన పండ్ల కోసం వెళ్లి దారితప్పి అక్కడే పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గరిక రాజమ్మ (40) నాలుగు రోజుల క్రితం ఉపాధి హామీ పథకం పనికి గ్రామస్తులతో కలిసి వెళ్లింది. పని ముగిసిన తర్వాత అడవిలో దొరికే జాన పండ్ల కోసం తోటి కూలీలకు చెప్పకుండా కొద్ది దూరం వెళ్లింది. మిగిలిన కూలీలు గమనించలేదు. ఎవరింటికి వారు వెళ్లి పోయారు. భర్త పుల్లయ్య తన భార్య ఇంటికి రాక పోవడంతో తోటి కూలీలను ప్రశ్నించడంతో అడవిలో పండ్లు కోసుకుంటోందని సమాధానమిచ్చారు. పుల్లయ్య గ్రామస్తులను వెంటబెట్టుకొని అడవిలో వెతికారు. రాజమ్మ జాడ కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె జాడ తెలియలేదు. గ్రామస్తులంతా కలిసి అడవంతా జల్లెడ పట్టడంతో మంగళవారం సాయంత్రం అడవిలో రాజమ్మ మృతదేహం లభ్యమైంది. శరీరమంతా కమిలిపోయి, కరెంట్షాక్ తగిలిన గుర్తులుండటంతో అడవిలో పిడుగుపాటుకు గురై ఉంటుందని భర్త, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతుల బంధువులను విచారించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతురాలి బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
చీరాల పట్టణంలో విచ్చల విడిగా జూదం
ప్రకాశం, చీరాల రూరల్: భౌతికదూరం పాటించి కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలని ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సమావేశాలు పెట్టి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు యువకులు అధికారుల సూచనలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇష్టాను రీతిగా వ్యవహరిస్తూ కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండా వైరస్ను వ్యాప్తి చెందే విధంగా ఎక్కడ పడితే అక్కడ జూదాలు ఆడుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నప్పటికీ జూదరులు ఏదో ఒకచోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొందరు భౌతిక దూరం పాటించకుండా ద్విచక్ర వాహనాపై డబుల్స్, త్రిబుల్స్ రైడ్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. చీరాలలో జూద స్థావరాలు.. చీరాల వన్టౌన్ పరిధిలో దండుబాట, విఠల్ నగర్, ప్రకాశ్ నగర్, జయశంకర్ నగర్, ఉజిలిపేట, పాలేటి నగర్, జవహర్ నగర్, హరిప్రసాద్ నగర్, శ్రీరాంనగర్, కొత్తపాలెం వంటి ప్రాంతాలు, టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జాన్పేట, జయంతిపేట, మరియమ్మ పేట, ఐక్యనగర్, విజయ నగర్ కాలనీ, రామ్నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, ఆనంద పేట, శృంగారపేట, హారిస్ పేట, హయ్యర్పేట, థామస్ పేట, గంజిపాలెం, గొల్లపాలెం వంటి ప్రాంతాల్లో కొందరు యువకులు పేకాట, చింత పిక్కలాట, హౌసీ వంటి ఆటలాడుతున్నారు. కనీస జాగ్రత్తలూ లేవు.. ప్రభుత్వం లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఇప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన యువకులు జూలు విదిల్చారు. ఆకతాయిలు వివిధ రకాల జూదాలపై దృష్టి సారించారు. ఎవరికి తోచిన విధంగా వారు కనీసం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఆటలాడుతూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నారు. బుధవారం స్థానిక వైకుంఠపురం, విఠల్ నగర్, ప్రకాష్ నగర్లలో కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటలాడుతున్న వారిని గమనించిన సాక్షి ఫోటోలు తీస్తుండగా ఆ యువకులు ముఖాలకు చేతులు అడ్డుపెడుతూ కాలికి బుద్ధి చెప్పారు. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసి జూదాలను అరికట్టాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
విద్యార్థి ఆయువు తీసిన ఆర్థిక కష్టాలు
వైఎస్సార్ జిల్లా, మార్టూరు: బతుకుదెరువు కోసం లారీ క్లీనర్గా మారిన ఇంటర్ విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక జాతీయ రహదారిపై ఇసుక దర్శి (ప్రకాశం జిల్లా) సమీపంలో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు, హైవే అంబులెన్స్ సిబ్బంది కథనం ప్రకారం.. కడపలోని గౌస్ నగర్కు చెందిన వెంకట్ (18) ఇంటర్ చదువుతున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వెంకట్ సోమవారం రాత్రి కడప నుంచి విజయవాడ వెళ్లే టమాటా లారీలో క్లీనర్గా బయల్దేరాడు. స్థానిక ఇసుక దర్శి సమీపంలో అతడు ప్రయాణిస్తున్న లారీకి ముందు వెళ్తున్న మరో లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో వెనుక లారీ బలంగా ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలుకాగా.. క్యాబిన్లో కూర్చున్న వెంకట్ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని లారీ నుంచి అతికష్టం మీద బయటకు తీస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
అల్లుడిని అంతమొందించిన మామ..
ప్రకాశం, చీరాల రూరల్: చీరాలలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లనిచ్చిన మామే తన బంధువుల సాయంతో అల్లుడిని తరుముకుంటూ వెంటాడి గొడ్డలితో హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చీరాల మండలం సాయి కాలనీలో జరిగింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. స్థానిక రామ్నగర్ ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో మోటా దిలీప్ (27) కుటుంబం నివాసం ఉంటోంది. రెబక అనే యువతిని ఎనిమిదేళ్ల క్రితం దిలీప్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిది, ఏడేళ్ల పిల్లలున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. రెబక పెద్దనాన్న పీరిగ వెంకటేశ్వర్లు రామ్నగర్లోని ఇంటి వద్ద కూర్చుని దిలీప్తో రెబక విషయం మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రçహానికి గురైన దిలీప్ ఓ సీసా పగలకొట్టి వెంకటేశ్వర్లుపై మూడు చోట్ల దాడి చేసి గాయపరిచాడు. సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు తమ్ముడు పీరిగ చిన్న (పిల్లనిచ్చిన మామ), అతని కుమారుడు రవితేజ, చెంగయ్య మరో ఇద్దరు కలిసి దిలీప్ను హతమార్చేందుకు గొడ్డళ్లు తీసుకుని వెంబడించారు. దిలీప్ వారి బారి నుంచి తప్పించుకునేందుకు రామ్నగర్కు సమీపంలోని సాయి కాలనీలోకి పరుగులు తీశాడు. అయినా వారంతా దిలీప్ను వెంబడించి సాయికానీలోని ఓ దుకాణం వద్ద పట్టుకుని గొడ్డలితో తలపై, చేతులపై నరకడంతో తీవ్ర రక్త స్రావానికి గురై దిలీప్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 వాహనానికి, టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనం సంఘటన స్థలానికి రావడం ఆలస్యం కావడంతో ఎస్ఐ విజయ్కుమార్ తన సిబ్బంది సాయంతో క్షతగాత్రుడిని తమ పోలీసు వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. మార్గంమధ్యలో 108 వాహనం రావడంతో అతడిని ఆ వాహనంలోకి ఎక్కించి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి దిలీప్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి మణెమ్మ, ఆమె బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎండీ ఫిరోజ్ తెలిపారు. -
ఉసురు తీసిన ఈత సరదా
ప్రకాశం, కొనకనమిట్ల: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసింది. ఈ సంఘటన కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ అంబాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..అంబాపురం గ్రామానికి చెందిన యన్నాబత్తిన బాలంకారావు, కాశమ్మ దంపతుల కుమారుడు బ్రహ్మయ్య (14), వద్దిమడుగు గ్రామానికి చెందిన ముసుకు చినగురవయ్య, సుబ్బమ్మ దంపతుల కుమారుడు గణేష్(15) ఇద్దరు స్నేహితులు. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న నీటి కుంటలో ఆదివారం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటికుంటలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నీటి కుంటదగ్గరకు వెళ్లి గణేష్, బ్రహ్మయ్య మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో గణేష్ మండలంలోని మర్రిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్నాడు. వచ్చే నెలలో పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. అమ్మమ్మను చూ సేందుకు వారం క్రితమే గణేష్ అంబాపురం వచ్చాడు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన గణేష్ మృతి చెందటం తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరో విద్యార్థి బ్రహ్మయ్య విజయవాడలో 9వ తరగతి చదుతున్నాడు. బ్రహ్మయ్య తల్లిదండ్రులు బాలంకరావు, కాశమ్మలు విజయవాడలో ముఠా పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామమైన అంబాపురం వచ్చారు. ఇంతలో ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరనాయక్ అన్నారు. -
టామాటో ఛాలెంజ్: రైతులకు అండగా ఎన్ఆర్ఐలు
సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్డౌన్లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న పేదవారికి అండగా నిలబడ్డారు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజవర్గం, బురుజుపల్లె, ముండ్ల పాడు, వేంకటాపురంలోని 1000 కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇందుకోసం సాయం చేసిన ఇక్కడి తెలుగువారికి వారు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే చిక్కికుపోవడంతో పండించిన పంటను మార్కెట్కు తరలించలేక రైతులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ రైతు చేతికొచ్చిన తన టమోటా పంటను అమ్మడానికి వీలులేక తన ఆవేదనను ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియో చూసిన తెలుగు ఎన్ఆర్ఐ సోదరులు డా. వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి యెదురు, డా. ప్రభాకర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది రైతులను ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ‘టామాటో చాలేంజ్’ పేరుతో జిల్లా రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా పేదవారిని కూడా నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసి ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇందుకోసం టామాట పంటను నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తు ఎన్ఆర్ఐలు తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. -
బిడ్డ పుట్టిన మరుసటి రోజే తండ్రి మరణం
ప్రకాశం,ముండ్లమూరు: మండలంలోని రెడ్డినగర్కు సమీపంలో రజానగర్ మేజర్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి పిట్టం అజయ్రెడ్డి (23) అనే వ్యక్తి మృతి చెందాడు. అజయ్రెడ్డిది దర్శి మండలం అబ్బాయిపాలెం. భార్య శివమణి దర్శిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రంతా అజయ్రెడ్డి భార్య వద్దే ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. గురువారం ఉదయం స్నానం చేసేందుకు రజానగరం మేజర్ పరిధిలో రెడ్డినగర్ వద్దకు ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాలువలో మెట్లపై కూర్చొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడ్డాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కాలువలో కొట్టుకు పోతుండగా ఇద్దరు స్నేహితులూ పెద్దగా కేకలు వేశారు. చుట్టు పక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. ఇంతలోనే దగ్గరలోని తూములోకి జారుకోవడంతో ఊపిరాడక అజయ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం 11 గంటల వరకు భార్య పక్కనే ఉండి బిడ్డను చూసి మురిసిపోయాడు. అంతలోనే కాలువకు వెళ్లి మృతి చెందాడని వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న అజయ్రెడ్డి తల్లిదండ్రులు ప్రభావతి, సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృతుడు తమ్ముడు రాజశేఖరరెడ్డి దర్శిలో డిగ్రీ చదువుతున్నాడు. వీఆర్వో మందా పెద్దన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.రామకృష్ణ తెలిపారు. -
డ్రైవర్ల కుటుంబంలో విషాదం..
ప్రకాశం, కారంచేడు: ఆ తండ్రికి నలుగురు కొడుకులు.. అందరూ డ్రైవింగ్నే వృత్తిగా ఎంచుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయిన తండ్రి గతంలోనే కాలం చేయగా ఆయన కుమారుల్లో ఇద్దరు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇటీవల చనిపోయిన తోటి ఉద్యోగి కర్మకాండలకు వెళ్లొస్తున్న సోదరులను టిప్పర్ రూపంలో మృత్యువు బలితీసుకుంది. మండలంలోని దగ్గుబాడు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ఊపిరి వదిలారు. అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటం, వారిలో ఒకరి పుట్టిన రోజు కూడా కావడంతో వారి స్వగ్రామం పర్చూరులో తీవ్ర విషాదం అలముకుంది. స్థానిక ఎస్ఐ బి.నరసింహారావు తెలిపిన వివరాల మేరకు.. చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేసిన చెరుకూరి జగన్మోహనరావు పర్చూరులో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. పదవీ విరమణ అనంతరం జగన్మోహనరావు మృతి చెందగా ఆయన భార్య కూడా ఇటీవలే కాలం చేసింది. ఆయన నలుగురు కుమారులు కూడా అందరూ డ్రైవర్లుగానే స్థిరపడ్డారు. వీరిలో పెద్ద కుమారుడు కోటేశ్వరావు పర్చూరులో స్కూల్ బస్సు డ్రైవర్, రెండవ కుమారుడు హనుమంతరావు చీరాల ఆర్టీసీ డ్రైవర్, మూడవ కుమారుడు పర్చూరులో స్కూల్ బస్సు డ్రైవర్, చిన్నకుమారుడు చీరాలలోని టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇటీవల చినగంజాంకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాసరావు మృతి చెందగా బుధవారం ఆయన దశ దిన ఖర్మకు హాజరయ్యేందుకు చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న హనుమంతరావు (53) ఆయన తమ్ముడు శ్రీనివాసరావు(51) ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ఇంకొల్లు వైపు నుంచి పర్చూరు వస్తుండగా పర్చూరు వైపు నుంచి ఇంకొల్లు వైపు వెళ్తున్న టిప్పర్ మండలంలోని దగ్గుబాడు కోల్డ్ స్టోరేజీ సమీపంలో వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతరావు, శ్రీనివాసరావు ఇద్దరూ ఎగిరి రోడ్డుపై పడి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం, రెండు కుటుంబాలు వీధిన పడటంతో పర్చూరులో విషాదఛాయలు అలముకున్నాయి. హనుమంతరావుకు భార్య, వివాహాలు అయిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, వివాహాలు అయిన ఇద్దరు కుమార్తెలున్నారు. పుట్టిన రోజు మృత్యు ఒడికి.. బుధవారం శ్రీనివాసరావు పుట్టినరోజు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుందామని చెప్పాడు. తల స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని వెళ్లిన భర్త విగత జీవిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నతో కలిసి ఇంటికి బయలుదేరిన శ్రీనివాసరావును టిప్పర్ రూపంలో మృత్యువు కబళించిందని గ్రామస్తులు వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ బి.నరసింహారావు వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సాగర్ కాలువలో బాలుడి గల్లంతు
ప్రకాశం, త్రిపురాంతకం: సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన బాలుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన సాగర్ కాలువలో మంగళవారం జరిగింది. బాలుడి ఆచూకీ కోసం సాగర్ కాలువలో గాలిస్తున్నారు. వివరాలు.. యర్రగొండపాలేనికి చెందిన దూదేకుల కాశిం (16) పదో తరగతి చదువుతున్నాడు. సరదాగా తోటి స్నేహితులతో కలిసి త్రిపురాంతకం సాగర్ కాలువకు ఈత కొట్టేందుకు వచ్చాడు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా మునిగి పోవడం చూసి మిగిలిన ముగ్గురు స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రక్షించే ప్రయత్నం చేసిన వారిలో మరొకరు మునిగిపోబోయారు. పిల్లల కేకలు విని అటుగా వచ్చిన ట్రాక్టర్లోని కొందరు తాడు వేసి మునిగిపోబోతున్న బాలుడిని రక్షించారు. కాశిం అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు, స్థానికులు, బంధువులు అక్కడకు చేరుకుని సత్వర చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈతగాళ్లను పిలిపించి బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కాశిం ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి హుస్సేన్ యర్రగొండపాలెంలో ముఠామేస్త్రిగా పనిచేస్తున్నాడు. రంజాన్ పండగకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాశిం ఇంతలోనే ప్రమాదంలో చిక్కుకున్నాడు. -
పావని అనే యువతిని పావుగా వాడి...
ప్రకాశం, చీరాల రూరల్: హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక కొత్తపేటలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ టి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణంలోని హారిస్పేటకు చెందిన నల్లగొండ్ల నయోమి, చిరంజీవి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో మొదటి కుమారుడు దినేష్ (19) స్థానికంగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పెట్రోలు బంకులో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన కంపా సంధ్య అనే యువతి దినేష్ ఇంటి సమీపంలోని ఓ చర్చికి ప్రతి ఆదివారం వచ్చేది. ఈ క్రమంలో సంధ్య, దినేష్లకు పరిచయం ఏర్పడి..ఆ పరిచయం ప్రేమగా మారింది. విషయం సంధ్య ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు దినేష్ను పలుమార్లు హెచ్చరించారు. అయితే దినేష్లో మార్పు రాకపోవడంతో వారు సంధ్యను చీరాలలో కాలేజీ మాన్పించి బాపట్లలో చేర్పించారు. అయినప్పటికీ దినేష్ బాపట్లలోని ఆమె చదివే కాలేజీకి వెళ్లి ఆమెతో మాట్లాడేవాడు. ఈ విషయం సంధ్య తల్లికి తెలిసి అవమానానికి గురై రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో దినేష్ ప్రవర్తనపై విసుగు చెందిన సంధ్య అన్నయ్య వంశీ, ఆమె తండ్రి రాజేష్లు దినేష్పై కక్ష పెంచుకున్నారు. ఏ విధంగానైనా దినేష్ను అంతమొందించాలని పథకం సిద్ధం చేసుకున్నారు. పావని అనే యువతిని పావుగా వాడి... దినేష్ను చంపేయాలని నిర్ణయించుకున్నరాజేష్, వంశీలు పక్కా ప్రణాళిక రూపొందించారు. వంశీ ప్రేయసి అయిన పావని అనే యువతి ద్వారా దినేష్ను ట్రాప్లోకి దించారు. వెదుళ్లపల్లికి వస్తే చంపేయాలనే నిర్ణయానికి వచ్చిన వారు అనేక సార్లు పావని, సంధ్యతో దినేష్కు ఫోన్లు చేయించారు. అయితే దినేష్ లాక్డౌన్ కారణంగా వారి వద్దకు వెళ్లలేకపోయాడు. పావని ఫోన్ చేసిన సమయంలో తన ఫోన్ పోయిందని దినేష్ ఆమెకు చెప్పడంతో తన వద్ద కొత్త ఫోన్ ఉందని వెదుళ్లపల్లికి వస్తే ఫోన్ ఇస్తానని మభ్యపెట్టింది. దీంతో దినేష్ తన స్నేహితునితో కలిసి బైక్పై వెదుళ్లపల్లి బయలుదేరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సంధ్య తండ్రి రాజేష్ తన కుమారుడైన వంశీకి కోడి పందేలకు ఉపయోగించే కత్తులను ఇచ్చి పంపించాడు. వంశీ తన స్నేహితుడైన వెదుళ్లపల్లికి చెందిన బొజ్జగాని దుర్గారావు, అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ బాలుడితో కలిసి దినేష్ను హత్య చేసేందుకు కాపు కాశారు. దినేష్ స్నేహితునితో కలసి వెదుళ్లపల్లి వెళుతుండగా తోటవారిపాలెం బైపాస్ రోడ్డుకు సమీపంలోని కృపానగర్ వద్ద వంశీ అతని స్నేహితులు దినేష్ వాహనాన్ని అడ్డగించారు. దినేష్ వారి నుంచి తప్పించుకొని పరుగులు తీయగా..వారు వెంబడించి కత్తులతో గొంతు కిందభాగంలో బలంగా పొడిచారు. దీంతో తీవ్ర రక్త స్రావానికి గురైన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి.. రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వి. సుధాకర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. కేసును దర్యాప్తు చేపట్టిన వారు అందిన సమాచారం మేరకు నిందితులు ఆటోనగర్ బైపాస్ రోడ్డువద్ద ఉన్న కుందేరు బ్రిడ్జిపై ఉన్నారనే విషయం తెలుసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారితో పాటు హత్యకు ఉపయోగించిన రెండు కోడి కత్తులు, రెండు సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సంధ్య, ఆమె తండ్రి రాజేష్లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐ టి. వెంకటేశ్వర్లు, ఎస్సై వి. సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. వెంకయ్య, పి. హేమ చంద్రుడు, కానిస్టేబుళ్లు భాస్కర్, విజయ కృష్ణ, ఉమెన్ పీసీలు అనిత, షహనాజ్, హోంగార్డులు సతీష్, ప్రభావతిలను డీఎస్పీ అభినందించారు. -
సొంత అక్క తమ్ముడిపై అనుమానం పెంచుకుని..
ప్రకాశం, దర్శి: సొంత అక్కతో స్వయానా ఆమె తమ్ముడే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె భర్త బావమరిదిని అతికిరాతకంగా హత్య చేశాడని డీఎస్పీ కె. ప్రకాశరావు వెల్లడించారు. నిమ్మారెడ్డిపాలెంలో 12వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో పోకూరి రామస్వామి (55)ని అతి కిరాతకంగా ముఖంపై కొట్టి చంపిన కేసును దర్శి పోలీసులు ఛేదించారు. స్థానిక తన కార్యాలయంలో డీఎస్పీ ప్రకాశరావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హంతకుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి సొంత అక్కను దామా సుబ్బారావు అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. బావ మరిది రామస్వామి ఏడాదిన్నర క్రితం కొత్తగా ఇంటి నిర్మాణం సమయంలో భూమి పూజకు చుట్టాలు వచ్చారు. ఇంట్లో మంచాలు చాలక పోవడంతో అంతా సుబ్బారావు ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. ఆ సమయంలో సొంత అక్క పక్కన ఆమె సోదరుడు రామస్వామి పడుకుని ఉండటాన్ని భర్త సుబ్బారావు గమనించి అనుమానించాడు. తన భార్యకు ఆమె తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందని సుబ్బారావు అనుమానం పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి బావమరిదిపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి తన గొర్రెల దొడ్డి వద్ద రామస్వామి ఒంటరిగా పడుకుని ఉండటాన్ని గమనించిన సుబ్బారావు రోకలి బండతో ముఖంపై తీవ్రంగా కొట్టి గాయపరిచి హత్య చేశాడు. ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. శుక్రవారం గ్రామ వీఆర్వో బండారు శ్రీనివాసరావు వద్ద లొంగి పోయాడు. వీఆర్వో నిందితుడిని సీఐ మహమద్ మొయిన్ వద్ద హాజరు పరిచారు. సుబ్బారావును అరెస్టు చేసి హత్య చేసేందుకు ఉపయోగించిన రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం దర్శి జూనియర్ సివిల్ జడ్జి కోర్డ్లో నిందితుడిని హాజరు పరచనున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. డీఎస్పీతో పాటు ఎస్ఐ ఆంజనేయులు ఉన్నారు. -
'సరదా' వెనుక విషాదం!
వేసవి కాలం ఈత సరదాతో కొందరు తల్లిదండ్రులకు విషాదం మిగులుతోంది. కరోనా ఎఫెక్ట్..లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లో సాయంత్రం వేళ సరదాగా ఈతకు వెళ్లి సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోతూతల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. ప్రకాశం, మార్కాపురం: సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఈతకు వెళ్లిన వారు మృత్యువాత పడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈత అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. జిల్లాలో గడిచిన 40 రోజుల్లో ఈతకు వెళ్లి సుమారు పది మంది వరకు చనిపోయారు. వినోదం విషాదంగా మారింది. ఈత కొట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో కొత్తపట్నం, రామాయపట్నంలో సముద్రం బీచ్లు ఉన్నాయి. దీనితో పాటు చీమకుర్తి వద్ద సాగర్ కాలువ, గుండ్లకమ్మ రిజర్వాయర్, పశ్చిమ ప్రకాశంలో కుంటలు, వాగు, వంకల్లో ఈతకు వెళ్తుంటారు. సెలవులు వస్తే చిన్నారులు, విద్యార్థులు, యువత సరదాగా ఈతకు వెళ్లి కుటుంబాలకు దూరమవుతున్నారు. వచ్చి రాని ఈతతో తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈతకు సరైన రక్షణ చర్యలు తీసుకోకుంటే వారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంది. కానీ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని చిన్నారులు.. తమ తల్లిదండ్రుల కళ్లు కప్పి ఈతకు వెళ్తుంటారు. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు చెరువు, బావులు, కుంటలు లోతు, పాతులపై అవగాహన ఉండదు. దీంతో సరదాగా నీటిలో దిగి బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక చనిపోతుంటారు. గుండ్లకమ్మ, చెరువులు, గుంతల్లో ఇసుక, మట్టి కోసం గుంతలు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరింది. లోతు తెలియని వారు ఈతకు గుంతల్లో దిగి కూరుకుపోయి చనిపోతున్నారు. బావుల్లో ఈత కొట్టే వారు లోపలి తీగలను గుర్తించక వాటిల్లో చిక్కుకుంటారు. అలాంటప్పుడు ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఈత రాని వారు ఓ పర్యవేక్షకుడి సాయంతో ఈత నేర్చుకుంటే మంచిది. ఒక్కరే కాకుండా పలువురితో కలిసి ఈత కొడితే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈత కొడుతూ చనిపోయిన వారిలో తమకు పరిచయం లేని ప్రాంతాల్లో ఈత కొట్టిన వారే ఎక్కువ. ఏ మాత్రం ఈత గురించి అవగాహన లేని వారే అధికంగా ఉన్నారు. ఇటీవల ఈతకు వెళ్లి చనిపోయింది వీరే.. ⇔ ఏప్రిల్ 18న గూడ్లూరు మండలం దప్పళంపాడులో గుంతలో పడి రోహిత్ మృతి చెందాడు ⇔ మే 6న ఇంకొల్లు మండలం దుద్దుకూరు చెరువులో పడి ఇద్దరు బాలికలు చనిపోయారు ⇔ మే 10న మర్రిపూడి మండలం దుర్గిరెడ్డిపాలెంలో నీటి కుంటలో పడి వెంకట శివమణికంఠ, బాల మణికంఠ మృతి చెందారు. ⇔ మే 17న కరేడు బీచ్లో యువకుడు గల్లంతు ⇔ అదే రోజు డిజిటల్ అసిస్టెంట్ సురేంద్ర ఈతకు వెళ్లి మృతి చెందాడు ⇔ మే 18న తాళ్లూరు మండలం లక్కవరంలో బ్రహ్మారెడ్డి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ⇔ అదే రోజు కొత్తపట్నం బీచ్లో విద్యార్థి గోవర్ధన్ మృతి చెందాడు అప్రమత్తంగా ఉండాలి ఈత రాక ఇబ్బంది పడుతున్న వారిని రక్షించాలంటే ముందు రక్షించే వ్యక్తికి ఈత వచ్చి ఉండాలి. దీంతో పాటు నీటిలో మునుగుతున్న వ్యక్తిని రక్షిస్తామన్న నమ్మకం ఉండాలి. రక్షించే క్రమంలో మునిగిపోయే వ్యక్తి వెంట్రుకలను పట్టుకుని లాగటం ఉత్తమం. ఒక వేళ అతను దుస్తులు వేసుకుని ఉంటే వాటిని పట్టుకుని లాగి పైకి తీసుకుని రావాలి. అలా బయటకు తీసుకొచ్చిన వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. ఫలితంగా ఊపిరితిత్తుల మధ్య ఉన్న నీరు బయటకు వచ్చి శ్వాస తీసుకునే వీలు కలుగుతుంది. ఆ తర్వాత వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లాలి.– డాక్టర్ సురేష్, ప్రభుత్వ వైద్యుడు -
కొండయ్యపై హత్యాయత్నానికి కారణం అదే..
ఒంగోలు: కందుకూరు పట్టణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన చదలవాడ కొండయ్యపై జరిగిన హత్యాయత్నం కేసుకు కారణం పాత వివాదాలేనని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. కొండయ్య కేసులో పోలీసులకు తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. జేడీబీఎం చర్చి ఎదురుగా ఉన్న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ షాపులో ఉన్న కొండయ్యపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో కొండయ్యకు ఏకంగా 42 కుట్లు పడ్డాయి. లాక్డౌన్ డ్యూటీలో ఉన్నా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐలు రెండు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో లభించిన సీసీ పుటేజీ ఆధారంగా నిందితులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందుకు టెక్నికల్ సపోర్టు తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో చింతం రూప్కుమార్ అలియాస్ రూప్ (కావలి వైకుంఠపురం), నాదెండ్ల భాస్కర్(కావలి మద్దూరుపాడు). వీరు పూర్తి నేరస్వభావం ఉన్న వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తి కొండూరి రామస్వామి అలియాస్ రాము కూడా చిన్న చిన్న వివాదాల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులు ఉపయోగించిన ఇనుప రాడ్డు, హీరో గ్లామర్ మోటారు సైకిల్, 4 సెల్ఫోన్లతో పాటు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి పులుకూరి సుజయ్కు చెందిన ప్యాంటు, బెల్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు కథ వెలుగులోకి.. కందుకూరు పట్టణంలోని జేడీబీఎం టౌన్ చర్చి నిర్వహణ విషయంలో 2015లో ఎన్నికలు జరిగాయి. దీని అనంతరం సభ్యుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పులుకూరి సుజయ్ ఒక గ్రూపుగా, చదలవాడ కొండయ్య మరో గ్రూపుగా విడిపోయారు. 2016లో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కమిటీలు విడివిడిగా ప్రార్థనలు చేసుకునేలా చర్చలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 20న జేడీఎం టౌన్ చర్చి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ వివాదం జరిగింది. ఈ క్రమంలో చర్చి కార్యదర్శి పులుకూరి కొండయ్య.. రెండో వర్గానికి చెందిన సుజయ్ వర్గంలోని మహిళలను చర్చి నుంచి బయటకు పంపాడు. దానిపై కక్ష కట్టిన సుజయ్.. ఎలాగైనా కొండయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కందుకూరుకు చెందిన తాటిపర్తి అశోక్కుమార్, దరిమడుగు శ్రీరాం, చనమల బాలాజీ అలియాస్ బాలు అనే వ్యక్తులతో కలిసి వారి ద్వారా కావలికి చెందిన చింతం రూప్కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్తో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రాథమికంగా సుజయ్ నుంచి అశోక్కుమార్ రూ.50 వేలు తీసుకుని మిగిలిన మొత్తం పని పూర్తి అయిన తర్వాత తీసుకునేందుకు అంగీకరించాడు. తాను తీసుకున్న మొత్తంలో రూ.4 వేలు అశోక్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని చనుమల బాలాజీ, దరిమడుగు శ్రీరాంలకు ఇచ్చాడు. వారు చెరో రూ.3 వేలు తీసుకుని మిగిలిన రూ.40 వేలను కందుకూరులోని మెర్సీ స్కూల్ వద్ద చింతం రూప్కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్లకు అందించారు. అనంతరం ఫిబ్రవరి 29న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉన్న కొండయ్యపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆయన అపస్మార్థక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం రూప్కుమార్ తన వద్ద ఉన్న రూ.40 వేలలో రామస్వామికి రూ.10 వేలు, నాదెండ్ల భాస్కర్కు రూ.6 వేలు ఇచ్చి మిగితాది రూప్కుమార్ ఉంచుకున్నాడని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరించారు. ఒక వైపు కోవిడ్ విధుల్లో పాల్గొంటూనే మరోవైపు హత్యాయత్నం కేసును ఛేదించిన కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ ఎం.విజయ్కుమార్, టౌన్ ఎస్ఐ కేకే తిరుపతిరావు, హెడ్ కానిస్టేబుల్ ఎంఎం బేగ్, కానిస్టేబుళ్లు జి.దయానంద్, హరిబాబు, వీవీ లక్ష్మణస్వామి, ఎస్కే బాషా, ఎస్కే ముక్తార్బాషా, టి.ఆనంద్ను ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు. -
బత్తాయి..చవకోయి..!
ఒంగోలు టూటౌన్: కరోనా నివారణ నేపథ్యంలో లాక్డౌక్లో ఉన్న పొదుపు మహిళలకు మంచి ఆరోగ్యకరమైన ఫలాలను తక్కువ ధరకు అందించే కార్యక్రమం సర్కార్ చేపట్టింది. కోవిడ్–19 ఎదుర్కొనేందుకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు వెలుగు ద్వారా అరటి అమ్మకాలు చేపట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. అన్ని జిల్లాల్లో కంటే ప్రకాశం జిల్లాలో 940 మెట్రిక్ టన్నుల అరటి అమ్మకాలు చేసి డీఆర్డీఏ–వెలుగు అధికారులు ప్రభుత్వ ప్రశంసలు పొందారు. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మళ్లీ ఇప్పటి నుంచి బత్తాయి అమ్మకాలను పొదుపు సంఘాల ద్వారా సర్కార్ చేపట్టింది. అనంతపురం, కడప జిల్లాల్లోని రైతుల వద్ద బత్తాయిలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ప్రతి పొదుపు సభ్యురాలి కుటుంబానికి అతి తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు వేల టన్నుల బత్తాయిలు అమ్మాలని డీఆర్డీఏ–వెలుగు అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే తొలివిడతగా జిల్లాకు 70 టన్నుల బత్తాయిలుదిగుమతి అయ్యాయి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, వెలుగు శాఖల సమన్వయంతో జిల్లాకు చేరిన బత్తాయిలను ఆయా మండలాల్లోని వీవోఏలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తొలివిడతలో వేటపాలెం, పర్చూరు, కారంచేడు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు, కొత్తపట్నం మండలాలకు చెందిన వీవోఏలకు బత్తాయి దిగుమతి చేశారు. ప్రభుత్వం బత్తాయిలను కిలో పది రూపాయలకు కొనుగోలు చేసి సబ్సిడీపై ఇస్తోంది. బయట మార్కెట్లో మూడు కిలోల బత్తాయి రూ.100 అమ్ముతుండగా ప్రభుత్వం మాత్రం రూ.100 లకి పది కిలోల బత్తాయి అందిస్తోంది. అంటే బయట మార్కెట్లో కంటే మూడు రెట్లు తక్కువ ధరకు నాణ్యమైన బత్తాయిని పేదలకు ఇస్తోంది. అయితే బత్తాయి తోటలు ఉన్న పశ్చిమ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో ఆయా మండలాల ఏపీఎంలు వాటి అమ్మకాలకు అనుమతులు తీసుకోలేదు. మిగిలిన మండలాల్లో పొదుపు సంఘాల ద్వారా అమ్ముతున్నారు. బత్తాయి అమ్మకాల్లో కూడా ముందుంటాం ఇప్పటి వరకు అరటి అమ్మకాల్లో అన్ని జిల్లాల కంటే అత్యధికంగా అమ్మి జిల్లాకు ప్రథమ స్థానం తీసుకొచ్చాం. బత్తాయి పండ్లను చాలా తక్కువ ధరకు ప్రభుత్వం పేదలకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అటు రైతులకు ఇటు పేదలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలను సర్కార్ చేపట్టింది. – జె. ఎలీషా, డీర్డీఏ పీడీ -
తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు..
తల్లిన కోల్పోయిన బిడ్డ.. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. స్నేహితులు, బంధువులను కోల్పోయిన సహచరులు.. రక్త సంబంధీకులంతా ఘొల్లుమనడంతో ఆ గ్రామం కన్నీటి సంద్రంగా మారింది. సహచరులు తమ కళ్ల ముందే విగత జీవులు కాగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు ప్రమాదాన్ని తలచుకుని గగుర్పాటుకు గురవుతున్నారు. నాగులుప్పలపాడు మండలం మాచవరం సమీపంలో గురువారం మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. వారందరి మృతదేహాలను శుక్రవారం ఒంగోలు జీజీహెచ్లో పోస్టుమార్టం అనంతరం ఇళ్లకు తరలించారు. దీంతో మాచవరంలో రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే సుధాకర్ బాబు దగ్గరుండి మృతుల బంధువులతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పల్లె కన్నీరు పెట్టింది.... నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా పది మందిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది. గురువారం సాయంత్రం మండలంలోని రాపర్ల పొలాల్లో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. మాచవరానికి చెందిన తొమ్మిది మందితో పాటు చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడుకు చెందిన మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. కాకుమాను భాగ్యవతి అనే మహిళ జీజీహెచ్లో మృత్యువుతో పోరాడుతోంది. ట్రాక్టర్ ట్రక్కు తగిలి విద్యుత్ స్తంభం విరిగి కరెంట్ తీగలు తగిలి మృత్యువాత పడిన పది మంది మృతదేహలకు శుక్రవారం ఉదయం 9 గంటల్లోపే అధికారులు పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహలను ఉదయం 10 గంటల్లోపు మాచవరం తరలించి బంధువుల రోదనలు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల సూచనలు మేరకు పోలీసులు మృతదేహలను నేరుగా శ్మశాన వాటికకే తీసుకెళ్లారు. మృతుల్లో విద్యార్థులు, విద్యార్థినులు కూడా ఉండటంతో ఆయా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తొమ్మిది మృతదేహాలు మాచవరంలో ఖననం తొమ్మిది మంది మృతదేహాలను మాచవరంలో ఖననం చేశారు. ఏడుగురిని ఒకే శ్మశాన వాటికలో ఖననం చేశారు. గ్రామంలోని పెద్ద మాలపల్లెకు చెందిన వారిలో ఏడుగురిని ఒకే శ్మశాన వాటికలో వేర్వేరుగా ఖననం చేశా>రు. ఇక్కడ ఖననం చేసిన మృతదేహాలు పీకా కోటేశ్వరమ్మ, నూకతోటి లక్ష్మమ్మ, కాకుమాను రమాదేవి, ఆమె కొడుకు శివ, కాకుమాను కుమారి, కాకుమాను మౌనిక, కాకుమాను అమూల్యవి. మాచవరం గ్రామ శ్మశాన వాటికలోనే పొక్లెయిన్తో గొయ్యిలు తవ్వించి సమాధి కార్యక్రమాలు పూర్తి చేశారు. మృతుల్లో గోళ్ల రవిశంకర్ మృతదేహం అతడి స్వగ్రామం చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నల్లూరి చెంచయ్య మృతదేహానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో వారి శ్మశాన వాటికలో ఖననం చేశారు. కాకుమాను రవీంద్ర అనే మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారి సొంత పొలంలో సమాధి చేశారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్బాబు ఒంగోలు నుంచి మాచవరానికి మృతదేహాలతో పాటు వచ్చారు. ఆయన దగ్గరుండి జేసీబీ సాయంతో గోతులు తీయించి మృతదేహాలను ఖననం చేయించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేసియా ప్రభుత్వం అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే టీజేఆర్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు వైవీ పరామర్శ విద్యుత్ షాక్తో మృతి చెందిన మాచవరం బాధిత కుటుంబాలను టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. నర్స్ అవుదామని.. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఇరువురు స్నేహితులు మరణంలోనూ ఒక్కటయ్యారు. మాచవరం గ్రామానికి చెందిన కాకుమాను అమూల్య(16), కాకుమాను మౌనిక(18)ఇరువురూ బంధువులు. బంధుత్వంతో పాటు ఇద్దరూ ఒకరిని మరొకరు విడిచిపెట్టి ఉండరు. నర్సింగ్ డిప్లొమో మొదటి సంవత్సరం చదువుతుండగా, మౌనిక ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇద్దరూ ఇంటి వద్దే ఖాళీగా ఉండటమెందుకని ఇద్దరూ కలిసి మిర్చి కోతలకోసం కూలీ పనులకు వెళ్ళారు. చిన్ననాటి నుంచి కలిసి, మెలసి ఎంతో ప్రేమ, ఆప్యాతలతో ఉంటున్న వీరిద్దరి చూసి మృత్యువుకే కన్నుకుట్టినట్లయింది. అంతే ఎంతో స్నేహంగా ఉంటున్న వీరిద్దరినీ కలిసి కభళించుకుపోయింది. వీరి స్నేహం గురించి గ్రామంలో గొప్పగా చెప్పుకుంటున్నారు. – అమూల్య, మౌనిక (ఫైల్) తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు.... ప్రాణాపాయం నుంచి బయటపడిన :పీకా హేమలత... మిర్చి కోతలు ముగించుకొని గ్రామంలోని అందరం ఉత్సాహంగా వస్తున్నాం. మధ్యలో ట్రాక్టర్ ట్రక్కు విద్యుత్ స్థంభానికి ఢీ కొనటంతో తీగపైనపడి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అందరూ అరుపులూ, కేకలు వేసుకుంటూ ట్రాక్టర్ ట్రక్కులో నుంచి ఎటువాళ్ళు అటు దూకే ప్రయత్నంలో ఉన్నారు. తేరుకునే లోపే దాదాపు పక్కన ఉన్న వాళ్ళూ, ముందు ఉన్న వాళ్ళూ ప్రాణాలు విడిచారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబిఏ చదువుతున్నాను. ఈ సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. పనికి వెళితే ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్లయింది.–పీకా హేమలత శివ మృతితో ఆసరా కోల్పోయిన మూడు కుటుంబాలు.. గ్రామం మొత్తం మీద కాకుమాను రమాదేవి, ఆమె కుమారుడు శివ మృతి అందరినీ కలిసి వేసింది. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు ఒకే ఒక్క వారసుడు శివ(17). తండ్రికి తలలో గడ్డ వస్తే ఆపరేషన్ చేసినప్పుడు కంటి చూపు పోయింది. కంటి చూపు కోల్పోయిన డానియేల్ భార్య ర మాదేవి, కుమారుడు శివను తలుచుకుంటూ విలవిల్లాడుతున్నాడు. అతని ఓదార్చటం ఎవరితరం కావటం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో కరోనా మహమ్మారితో ఖాళీగా ఇంటి వద్ద తన కుమారుడు వాళ్ళ అమ్మతో కలిసి మిర్చి కోతలకు వెళ్ళాడంటూ తండ్రి డానియేలు కుమిలి కుమిలి రోదిస్తున్నాడు. తన కుటుంబంతో పాటు తన అన్న, తమ్ముడు కుటుంబానికి కూడా ఒక్కడే మగ సంతానం అని విలవిలలాడుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కందుకూరులోని ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ విభాగంలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడని ఇక తనకు దిక్కెవరు అంటూ కుమిలిపోతున్నాడు. వద్దన్నా పనికి వెళ్లి మృత్యు ఒడికి.. మిర్చి కోతలకు తల్లి కాకుమాను వెంకాయమ్మతో కలిసి కుమార్తె మౌనిక(18)కూడా కూలీ పనికి వెళ్ళింది. అయితే ట్రాక్టర్, విద్యుత్ స్తంభం ప్రమాదంలో తల్లి వెంకాయమ్మ ప్రాణాపాయం నుంచి బయట పడింది. కుమార్తె తన కళ్ల ముందే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ కుటుంబంలో మౌనిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి ఎఫెఫ్రా గ్రామ పంచాయితీ సహాయకుడుగా(వీఆర్ఏ) పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు అబ్బాయి, అమ్మాయి. కుమారుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువులో ఎంతో ఉత్సాహంగా ఉండే మౌనికను చేతులారా పొట్టను పెట్టుకున్నానంటూ తల్లి వెంకాయమ్మ కన్నీరు మున్నీరవుతోంది. తన కళ్ల ముందే బిడ్డను పోగొట్టుకున్నానంటూ విలపిస్తోంది. తన బిడ్డ మౌనిక చదువుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా నా బ్యాంకు అకౌంట్లో రూ.15 వేలు వేశాడంటూ గుర్తు చేసుకొని విలవిల్లాడింది. పనికి తీసుకెళ్లకుండా ఉన్నా ప్రభుత్వ సాయంతో బిడ్డ బాగా చదువుకొని తమ కుటుంబాలకు అండగా ఉండేదని బోరున విలపిస్తోంది. – మౌనిక ఫొటో చూపుతున్న తల్లిదండ్రులు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా నర్సింగ్ చదువు... కాకుమాను అమూల్య తల్లి అన్నమ్మ రోదిస్తూ:నర్సింగ్ డిప్లొమో చదువుతున్న తన కుమార్తె కాకుమాను అమూల్య మృత్యువాత పడటంతో అమూల్య కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి ఏబేలు గ్రామ పంచాయతీకి మంచినీరు వదిలేందుకు కూలీ పనికి వెళుతుంటాడు. ఏబేలు, అన్నమ్మ దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అమూల్య పదో తరగతి పాస్ కాగానే వైద్య వృత్తిలోకి వెళ్ళాలనుకుందని తల్లి అన్నమ్మ విలపించింది. డాక్టర్ చదువులకు ఆర్థిక స్తోమత సరిపోదని, నర్సు చదువు పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తానని, అందుకే నర్సింగ్ కోర్సులో చేరిందని సెల్ఫోన్లో ఉన్న అమూల్య ఫోటో చూసి రోదించింది. నర్సింగ్ కోర్సులో చేరి మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఈ బిడ్డ చదువుకు ప్రోత్సహించిందని, అయినా మా బిడ్డ కష్టాన్ని తినే ప్రాప్తం మాకు లేదని భోరున విలపించింది. – అమూల్య ఫొటో చూపుతూ రోదిస్తున్న తల్లి చదువుల ఒడి నుంచి.. కూలికెళ్లి.. మాచవరం గ్రామస్తులంతా అక్షర పిపాసులే. అందుకే.. ఎప్పుడూ చదువులమ్మ ఒడిలో ఓలలాడుతుంటారు. అక్కడి విద్యార్థులకు సెలవులొస్తే బలాదూర్ తిరగటం ఇష్టముండదు. ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. పదో.. పరకో సంపాదిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంటారు. లాక్డౌన్ వేళ చదువులకు సుదీర్ఘ విరామం రావటంతో.. ఇంటిపట్టున ఉండలేక గ్రామంలోని కూలీలతో కలిసి మిర్చి కోతలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై.. విద్యుదాఘాతంతో వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
విద్యుత్ చార్జీలు పెంచలేదు: బాలినేని
సాక్షి, ప్రకాశం : .ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఖండించారు. శ్లాబుల ధరలు ఎక్కడ పెంచలేదని, గతంలో ఏదైతే విద్యుత్ చార్జీలు ఉన్నాయే వాటినే ప్రస్తుతం అమలు పరుస్తున్నామని మంత్రి స్పస్టం చేశారు. శుక్రవారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు ఎక్కవ రావడంతో ప్రస్తుతం ప్రజల్లో అపోహలు నెలకొన్నాయన్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగడం వల్ల బిల్లులు పెరిగాయని, దీనిపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు (విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం: బుగ్గన) మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ...మాచవరం మృతుల సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పరమార్శించేందుకు మంత్రులను పంపించి 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచారని తెలిపారు. భాదిత కుటుంబాల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాలు కోరాయని, .దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తిమ్మసముద్రంలో చెరువులో పడ్డ బాలున్ని కాపాడబోయి మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలను కూడా ఆదుకుంటాని మంత్రి పేర్కొన్నారు. (‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’) -
బీర్.. రివర్స్ గేర్
ఒంగోలు: వేసవి వచ్చిందంటే చాలు.. బీరు బాటిళ్ల గలగలలు వినిపిస్తుంటాయి. ఒక్కో సందర్భంలో లిక్కర్ కంటే బీర్లే అధికంగా అమ్ముడవుతాయి. ఈ ఏడాది మాత్రం బీరు విక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గత నాలుగేళ్లలో మే నెల 8 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే 2017లో కనిష్టంగా రోజుకు 2,037 కేసులు, గరిష్టంగా 4,625 కేసుల బీర్లు విక్రయించారు. 2018లో కనిష్టంగా 2,073 కేసులు, గరిష్టంగా 6,591 కేసులు, 2019లో కనిష్టంగా 1,553 కేసులు, గరిష్టంగా 5,397 కేసులు అమ్ముడయ్యాయి. ఈ నెల 8న లాక్డౌన్ మినహాయింపులతో మార్కాపురం(ప్రకాశం 2) మద్యం డిపో ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజులపాటు విక్రయాలు జరిగితే అమ్ముడైన బీరు కేసుల సంఖ్య 3,234 మాత్రమే. ఇక ఒంగోలు మద్యం డిపో ఈ నెల 11న ప్రారంభమైంది. అప్పటి నుంచి 13వ తేదీ వరకు కేవలం 695 కేసుల బీరు అమ్ముడైంది. ధరల పెంపు కారణంగా ప్రజలు మద్యానికి దూరం అవుతున్నారని, బీర్ల విక్రయాలపై ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. లిక్కర్ విక్రయాలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయని వారు పేర్కొనడంగమనార్హం. -
కరోనా ఖతం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విజయం సాధించింది. మహమ్మారిని జిల్లా నుంచి పారద్రోలే క్రతువులో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల పాత్ర అభినందనీయం. మొదట్లో కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న ప్రకాశం నేడు ఒకే ఒక్క పాజిటివ్ కేసుతో రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక జిల్లాల్లో ఇప్పటికీ పాజిటివ్ కేసులు అధి సంఖ్యలో నమోదవుతుండగా ఇక్కడ పాజిటివ్గా నమోదైన వారంతా కోలుకోవడంతో పాటు గత వారం రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనించదగ్గ విషయం. జిల్లాలో నమోదైన 60 పాజిటివ్ కేసుల్లో తాజాగా గురువారం డిశ్చార్జి అయిన 8 మందితో కలిపి మొత్తం 59 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా ఒక్కరు మాత్రమే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయడంతో జిల్లా లో వైరస్ను వేగంగా నియంత్రించగలిగారు. కాంటాక్ట్ గుర్తింపులో వేగం.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబితాలో ప్రకాశం జిల్లా ఆరెంజ్ జోన్లో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలానే కొనసాగితే త్వరలో జిల్లా గ్రీన్ జోన్గా మారే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. జిల్లాలో పాజిటివ్ కేసు నమోదైన వెంటనే వారి కాంటాక్ట్స్ను గుర్తించడం, క్వారంటైన్కు వారిని తరలించడంలో అధికార యంత్రాంగం చొరవ ప్రశంసనీయం. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సైతం జిల్లాలో ప్రజలకు చేయూతనిస్తూ నిత్యావసర సరుకులు, మాస్క్లు, శానిటైజర్ల వంటి వాటిని అందించడంలో ముందున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే లాక్డౌన్ సైతం జిల్లాలో పకడ్బందీగా అమలు చేశారు. లాక్డౌన్ విధుల్లో పోలీసు సిబ్బంది కొరతను అధిగమించేలా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆర్టీసీ ఉద్యోగుల, హాస్టల్ వెల్ఫేర్ అధికారుల వంటి అనేక విభాగాల నుంచి వారికి తోడుగా విధులను కేటాయించడంతో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలు కల్పించారు. ప్రజలు నిత్యావసర సరుకులకు, కూరగాయలకు ఇబ్బందులు పడకుండా రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లు చేసి రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా జిల్లాలో 554 గ్రామాల్లో 64,999 కుటుంబాలకు నేరుగా తక్కువ ధరకు కూరగాయలు, పండ్లు అందించడంతో కష్టకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలిగారు. జనతా బజార్ల ద్వారా రైతుల నుంచి కూరగాయలు, పండ్లు నేరుగా కొనుగోలు చేయడంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర సైతం అందినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో సైతం మూడు రోజుల క్రితమే మద్యం షాపులు తెరుచుకున్నప్పటికీ జిల్లాలో ఒక మద్యం దుకాణం కూడా తెరుచుకోకపోవడం మేలు చేసే అంశంగా చెప్పవచ్చు. ఒకే ఒక్క పాజిటివ్ కేసు జిల్లాలో గత 45 రోజుల్లో 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటి వరకు 59 మంది కరోనా మహమ్మారిని జయించి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు చేరారు. ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్లో ఒకే ఒక్క వ్యక్తి కరోనా వైరస్తో చికిత్స పొందుతున్నాడు. దీనికి తోడు వారం రోజులుగా జిల్లాలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం శుభపరిణామం. పాజిటివ్తో ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులను ఒంగోలు జీజీహెచ్తో పాటు కిమ్స్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. దీంతో పాజిటివ్ ఉన్న ఏ ఒక్క వ్యక్తికి ప్రాణాపాయం లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూ వచ్చారు. ఏప్రిల్ 3వ తేదీన లండన్ నుంచి వచ్చిన యువకుడు కరోనాను జయించి మొట్టమొదటిగా డిశ్చార్జి కాగా, అదే నెల 24వ తేదీన 11 మంది, 25వ తేదీన 11 మంది, 28వ తేదీన ఇద్దరు, 29వ తేదీన 18 మంది, మే 2వ తేదీన ఆరుగురు, మే 5వ తేదీన ఒక్కరు డిశ్చార్జి అయ్యారు. తాజాగా గురువారం మరో 8 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు చేరారు. దీంతో ప్రకాశం జిల్లాలో కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఒకే ఒక్కరు మాత్రమే ఉన్నారు. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, వైద్యులు గత 45 రోజులుగా చేస్తున్న నిరంతర కృషిని, వారి పనితీరును వల్లే కరోనాను కట్టడి చేయగలిగారని జిల్లా ప్రజానీకం అభినందిస్తున్నారు. అందరి సహకారం వల్లే సాధ్యమైంది.. జిల్లాలో కరోనా వ్యాప్తి నివారించేందుకు ఇన్సిడెంటల్ కమాండింగ్ సిస్టంను అవలంభించాం. దీని ద్వారా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశాం. వారికి క్షేత్రస్థాయిలో విధులు కేటాయించాం. పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ను గుర్తించగలగటం, వారిని క్వారంటైన్స్కు తరలించి పరీక్షలు నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. లాక్డౌన్ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయడంలో విజయం సాధించగలిగాం. లాక్డౌన్ సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల సరుకులు, కూరగాయలు, పండ్లు వంటివి అందించడంలో ఇబ్బందులు చేయకుండా సరఫరా చేయడంతో జిల్లా ప్రజల నుంచి పూర్తిగా సహకారం అందింది. రైతులకు సైతం ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా కూరగాయలు, పండ్లు సేకరించి నేరుగా వినియోగదారులకు పంపిణీ చేయడం వంటి విషయంలో జిల్లా ముందంజలో ఉంది. ఇలాంటి విపత్తు సమయంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, వైద్యులు సహకారం అందించిన తీరు మరువలేనిది. జిల్లాలోని ఇప్పటికే చీమకుర్తి, కారంచేడు, కందుకూరు కంటైన్మెంట్ జోన్లను 500 మీటర్ల పరిధికి పరిమితం చేశాం. మరికొద్ది రోజులపాటు ఇదేవిధంగా పనిచేసి కరోనా నుంచి జిల్లాను కాపాడుకునేందుకు అందరూ సహకారం అందించాలని కోరుతున్నాం. – పోల భాస్కర్, జిల్లా కలెక్టర్ బాధితుల సహకారం మరువలేనిది... జిల్లాలో ఇప్పటి వరకు 60 మంది కరోనా వైరస్ సోకి ఒంగోలు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స నిమిత్తం వచ్చారు. పాజిటివ్ కేసులు నమోదైన 60 మందిలో 8 మంది మాత్రమే కరోనా అనుమానిత లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందులో ఇద్దరు న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మిగతా 52 మందికి కరోనా వైరస్ ఉన్నప్పటికీ వారిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవు. కరోనా బాధితులంతా వైద్య సిబ్బందితో ఫ్రెండ్లీగా మెలగడంతో పాటు రిపోర్ట్లు ఆలస్యమైనప్పటికీ మాకు పూర్తిగా సహకరించడం వల్లే ఇప్పటికి 59 మంది వైరస్ నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారు. ఇంకా ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో సైతం వైద్య సిబ్బంది చూపిన తెగువ అభినందనీయం. – డాక్టర్ జాన్ రిచర్డ్స్, కోవిడ్–19 జిల్లా నోడల్ అధికారి -
పది పరీక్షలపై సీఎం జగన్ సమీక్షిస్తున్నారు: మంత్రి
సాక్షి, ప్రకాశం: పదవ తరగతి పరీక్షలు నిర్వహించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తరువాతే పదవ తరగతి పరీక్షలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాట్టిస్తూ పరీక్ష కేంద్రాలను కుందించాలా లేక యదావిధిగా సాగించాలా అనే విషయంపై సీఎం జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా పరీక్షలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టెలి కాన్ఫరేన్స్ ద్వారా తరగతుల నిర్వహణ జరుగుతోందని, ఆన్లైన్లో పదవ తరగతి క్లాసులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. ('సిలబస్ను ఆన్లైన్లో పూర్తి చేయండి') కాగా జిల్లాలో 12వేల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను ఓటు బ్యాంకుగా చుశాయని పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ మత్స్యకారులను ఆదుకుంటునన ప్రభుత్వం తమదన్నారు. అంతేగాక కోవిడ్-19 పరీక్షల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కరోనా వంటి విపత్కర కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రతిపక్షం విచక్షణ కోల్పోయి విమర్శలు చేస్తూ అవాకులు చవాకులు పేల్చుతున్నాయని ఆయన మండిపడ్డారు. దయచేసిన ప్రతి పక్షాలు చౌకబారు విమర్శలు ఆపాలని, బెల్లు షాపులకు ఆజ్యం పోసిన చంద్రబాబు మద్యం దుఖనాలను విమర్శం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు. (లాక్డౌన్ తర్వాత పది పరీక్షలు: సురేష్) -
ఆ జిల్లాలో తెరుచుకోని మద్యం దుకాణాలు
ఒంగోలు: జిల్లాలో మద్యానికి బ్రేక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మద్యం షాపులు తెరవలేమని ఏపీ స్టేట్ బేవరేజెస్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా వైన్ షాపులకు స్టాకు తరలించే మద్యం డిపోలు జిల్లాలో ఒంగోలులో ఒకటి, మార్కాపురంలో ఒకటి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా కంటైన్మెంట్ జోన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం డిపోల వద్దకు పెద్ద ఎత్తున సరుకు తరలింపునకు వాహనాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున కలెక్టర్ పోల భాస్కర్ ఈ వ్యవహారంలో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో పలు మార్లు ఇప్పటికే చర్చించారు. ఒంగోలు ఎక్సైజ్ డిపో ఉన్న పేర్నమిట్ట, మార్కాపురం ఎక్సైజ్ డిపో ఉన్న ప్రాంతంలో ఒకటి రెండు రోజులపాటు ఎలాంటి కరోన పాజిటివ్ కేసులు తాజాగా వెలుగు చూడని పక్షంలో వాటిని కంటైన్మెంట్ జోన్ల పరిధి నుంచి తప్పించేందుకు అవకాశం ఉంది. మంగళవారం కూడా దీనిపై ఒక నిర్ణయం వెలువడకపోవడంతో బుధవారం షాపులను తెరవలేమని, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడితే గురువారం నుంచి లేదా ఆ తరువాత రోజు నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 75 శాతం ధరల పెంపు.. లాక్డౌన్ నేపథ్యంలో 40 రోజులపాటు షాపులు మూతపడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మందుబాబులు ఇష్టారీతిన మద్యం తాగకుండా ఉండేందుకు తొలుత 25 శాతం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయినా క్యూ కట్టడంతో ధరలను ఏకంగా 75 శాతానికి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుతోపాటు త్వరలోనే 15 శాతం మద్యం షాపులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో 40 షాపులు తగ్గనున్నాయి. మద్యం ఒకేసారి ఆపకుండా క్రమంగా వాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జన్మంతా గుర్తుంచుకుంటాం..
సాక్షి, పాలకొండ: కష్టకాలంలో అధికారులు చూపిన ఆదరణను వారు మర్చిపోలేకపోతున్నారు.. ఆకలి కాలంలో అన్నం పెట్టి, ఆతిథ్యమిచ్చిన ప్రభుత్వానికి వేనవేల కృతజ్ఞతలు చెబుతున్నారు. పాలకొండ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో 40 రోజుల కిందట ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన 110 మంది చెరుకు కొట్టేవారు ఆశ్రయం పొందారు. నెల రోజులపైబడి వారికి అధికారు లు అన్నపానాదులిచ్చి జాగ్రత్తగా చూసుకున్నా రు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో వా రంతా సోమవారం అర్ధరాత్రి స్వగ్రామాలకు పయనమయ్యారు. వీరిని తరలించేందుకు ఆర్డీ వో టి.వి.ఎస్.జి.కుమార్ నేతత్వంలో ఆర్డీసీ మే నేజర్ వై.ఎస్.ఎన్.మూర్తి ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఊరుకాని ఊరిలో అధికారులు చూపిన ఆదరణకు వారు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపా రు. అధికారులతో విడదీయలేని బంధం ఏ ర్పడిందని తెలిపారు. నిత్యం వారికి యోగా, క్రీడలు నేర్పిచడం సామూహిక భోజనాలు, వలసదారుల పిల్లలకు చదువు చెప్పడం వంటి పనులతో సిబ్బంది బాగా కలిసిపోయారు. దీంతో వీడ్కోలు చెప్పినప్పుడు అందరి కళ్లు చె మర్చాయి. అధికారులతో ఫొటోలు సెల్ఫీలు తీసుకుని బరువెక్కిన హృదయాలతో వారు స్వగ్రామాలకు వెళ్లారు. జీవితంలో మర్చిపోలేం కష్టకాలంలో ప్ర భుత్వం మాపై చూపించిన ఔదార్యం జీవితంలో మర్చిపోలేం. కు టుంబాలతో సహా దా దాపు నలభై రోజులు ఆశ్రయం పొందాం. అధికారులు సొంత కు టుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. మా యోగక్షేమాలను నిత్యం దగ్గరుండి పర్యవేక్షించారు. కొత్త బట్టలిచ్చారు. వైద్యసేవలు అందుబాట్లో ఉంచారు. కోరిన భోజనం అందించారు. ఇక్కడ నుంచి వెళ్లాలంటే బాధగా ఉంది. – ఎం.సువర్ణరాజు, చెరుకు కొట్టే కార్మికుడు, ప్రకాశం జిల్లా. వెలుగులు నింపారు పురిటి నొప్పులతో బాధపడుతున్న నన్ను స్థానిక అధికారులే రక్షించారు. అర్ధరాత్రి వారి కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాకు మగ బిడ్డ పుట్టాడు. మా కుటుంబంలో అధికారులే వెలుగులు నింపారు. అధికారుల రుణం తీర్చలేనిది. కలెక్టర్ నాకు రూ.25వేలు నగదు అందించగా ఆర్డీవో మాకు అవసరమైన మందు లు, బట్టలు అందించారు. ఏపీఓ సాగర్ వారి సొంత బిడ్డలా ఆదరించారు. – ఎం.మరియమ్మ, మిట్టపాలెం, ప్రకాశం జిల్లా. -
చిన్న పరిశ్రమలకు ఊపిరి
ఒంగోలు టూటౌన్: సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఊపిరి పోస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు ఇవ్వకుండా బకాయి పెట్టిన రాయితీలను మనుగడ కష్టమైన ప్రస్తుత తరుణంలో ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంపై అటు పరిశ్రమల యజమానులు, ఇటు పరిశ్రమల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు లబ్ధిచేకూరనుంది. రాయితీలు రాక నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమల యజమానులకు ప్రభుత్వ నిర్ణయంతో ఊపిరి లేచొచ్చింది. రెండు నెలలుగా పరిశ్రమల మనుగడపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. చిన్న, గ్రామీణ పరిశ్రమలకు కేంద్రం కొన్నింటికి ఇటీవల సడలింపునిచ్చినా రీస్టార్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. యజమానులతోపాటు ఉద్యోగులు, కార్మికులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు గడవటం కష్టంగా మారాయి. యజమానులు బ్యాంకుల రుణాలు చెల్లించలేని దుస్థితిలోకి నెట్టబడ్డారు. రోజూ జిల్లాలో రూ.500 కోట్లకుపైగా నష్టం.. లాక్డౌన్ వల్ల రోజుకి జిల్లాలో దాదాపు రూ.500 కోట్లకు పైగా పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో 42 క్వారీలు, 4 వేల వరకు పాలిషింగ్ యూనిట్లలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఇవిగాక ఇంకా 6,470 వరకు చిన్న పరిశ్రమలు, గ్రామీణ ఖాదీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సిమెంట్ బ్రిక్స్ తయారీ యూనిట్లు, వివిధ రకాల విస్తరాకుల తయారీ వంటి యూనిట్లు ఉన్నాయి. చీమకుర్తి, కనిగిరి, మార్కాపురం, మార్టూరు మండలాల చుట్టు పక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇంకొన్ని ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి పైగా కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మరో 16,235 మంది మాత్రమే తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. చిన్న పరిశ్రమలతో పాటు మరో 67 భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కరోనా నివారణ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు, కర్షకులు, కూలీలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. దీని వలన కుటుంబాలు ఆర్ధికంగా కోలుకోలేకుండా పోతుండటంతో ఇటీవల కొన్ని పరిశ్రమలను రీస్టార్ట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. గ్రీన్జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమలకే అనుమతి ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేశారు. చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తెరుచుకునే వెసులుబాటు కలిగించింది. నియోజకవర్గాల వారీగా కమిటీలు: పరిశ్రమ రీస్టార్ట్కు యజమాని దరఖాస్తు చేసుకుంటే దానిపై మూడు కమిటీలు పరిశీలించాల్సి ఉంది. జీవో ఎంఎస్ నంబర్ 88 ప్రకారం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా కమిటీలను కలెక్టర్ ఇటీవల వేశారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్తో పాటు లేబర్ అసిస్టెంట్ కమిషనర్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ పరిశ్రమల రీస్టార్ట్కు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. అనంతరం జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ వెళ్లి పరిశ్రమను పరిశీలన చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సక్రమంగా ఉంటేనే అనుమతి ఇస్తారు. ఒక వేళ పనిలో ఉన్న కార్మికులకు కరోనా సోకితే దానికి పరిశ్రమ యజమాని బాధ్యుడు అవుతాడని ఆంక్షలు ఉండటంతో ఎవరూ పరిశ్రమ రీస్టార్ట్కు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఫలితంగా వేల కోట్లు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మూడు నెలలు మారిటోరియం ఇచ్చినా ఏ మాత్రం ప్రయోజనం లేదని చిన్న పరిశ్రమల యజమానులు పలువురు నిరాశ వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఆసరాగా.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాయితీలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మూతపడి కోలుకోలేని స్థితిలో ఉన్న పరిశ్రమలకు రూ.905 కోట్లు రాయితీలు విడుదల చేయాలని నిర్ణయించడం అటు పరిశ్రమల యజమానుల్లో భరోసా నింపింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా రాయితీల బకాయిలు విడుదల చేసి చిన్న పరిశ్రమల మనుగడను కాపాడాలని నిర్ణయించడంపై ఫాప్సియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సుబ్బారావు, ఫాప్సి కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
సైబర్ ఉచ్చులో పీరాపురం యువకుడు
కొండపి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు ఏకంగా రూ.46 లక్షలకు మోసపోయాడు. ఈ సంఘటన కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం పీరాపురంలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసుస్టేషన్లో సింగరాయకొండ సీఐ శ్రీనివాసరావు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం పీరాపురం గ్రామానికి చెందిన దేపూరి నాగబ్రహ్మయ్యకు ఫిబ్రవరిలో గ్లోబల్ వాట్సప్ అనే నకిలీ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. రూ.3 కోట్ల 60 లక్షలు గెల్చుకున్నావన్నది ఆ మెయిల్ సారాంశం. నాగబ్రహ్మయ్య ఆశపడ్డాడు. ఆ మొత్తం నగదు జమ చేయాలంటే 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. దాన్ని నిజమని నమ్మిన యువకుడు ఆదాయపు పన్ను పేరుతో రూ.46 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో పాటు నాగబ్రహ్మయ్య డిగ్రీ చదివి ఉండటంతో కుటుంబ సభ్యుల ఆర్థిలావాదేవీలన్నీ అతడే చూసుకుంటుంటాడు. కుటుంబ సభ్యులు భూములు కొనేందుకు సిద్ధం చేసిన నగదుతో పాటు బంధువుల వద్ద సైతం కొంత డబ్బు, సోదరి వద్ద మరికొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. ఈ మొత్తం డబ్బును ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వ తేదీ వరకు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకులకు చెందిన 20 ఖాతాలకు 30 సార్లు డబ్బులు విడతల వారీగా మోసగాళ్లు ఇచ్చి ఖాతా నంబర్లకు జమ చేశాడు. బ్యాంకు అధికారులకు అనుమానం నాగబ్రహ్మయ్య ఇన్ని సార్లు ఇతర రాష్ట్రాలకు నగదు జమ చేస్తుండటంపై బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులు భవన నిర్మాణ రంగంలో ముఠాలు కట్టి వివిధ రాష్ట్రాల్లో పనులు చేయిస్తుంటారని, అక్కడికి డబ్బులు పంపుతున్నట్లు నమ్మబలికాడు. అయినా అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు అతడి ఇంటికి వెళ్లి ఆరా తీయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు లబోదిబోమంటూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు బాధితుడు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు కొండపి ఎస్బీఐ మేనేజర్తోనూ మాట్లాడారు. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని, అనుమానం వస్తే సమాచారం దాచకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సీఐ శ్రీనివాసరావు సూచించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సైతం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
ఎదిగి వస్తున్నారనుకున్న పిల్లలు..
ఒంగోలు: ఈత సరదా ఇద్దరు విద్యార్థులను మృత్యుఒడికి చేర్చింది. ఈ సంఘటన ఒంగోలు మండల పరిధిలోని దశరాజుపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే..బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దశరాజుపల్లి దళితవాడకు చెందిన పాలేటి ప్రదీప్కుమార్, బెంగళూరు నవీన్కుమార్, పాలేటి నవీన్ అనే ముగ్గురు దశరాజుపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. వీరిలో ప్రదీప్కుమార్(16), బెంగళూరు నవీన్కుమార్(15)లు ఈతకు చెరువులోకి దిగారో లేదో వెంటనే మునిగిపోయారు. ఇది గమనించి ఒడ్డున ఉన్న యువకుడు చేయి అందించేందుకుయత్నించగా అతని కాలు బురదలో కూరుకుపోయింది. కళ్ల ముందే ఇద్దరు మిత్రులు నీటిలో మునిగిపోవడాన్ని చూసిన నవీన్ పెద్ద పెట్టున కేకలు వేసుకుంటూ బురదలో కూరుకుపోయిన కాలును తీసుకొని గ్రామంలోకి వెళ్లి విషయాన్ని తెలియజేశాడు. గ్రామస్తులు హుటాహుటిన పెద్ద కర్రలతో చెరువులో గాలించగా తొలుత ప్రదీప్కుమార్, అనంతరం కొద్దిసేపటికి నవీన్కుమార్లను గుర్తించి వెలికితీశారు. వెంటనే ఆటోల్లో ఒంగోలు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ప్రదీప్కుమార్ ఆ గ్రామ మాజీసర్పంచ్ శ్రీనివాసరావు కుమారుడు. సంతనూతలపాడు ఎస్సీ హాస్టల్లో ఉంటూ జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాడు. బెంగళూరు నవీన్కుమార్ ఆంజనేయులు, శాంతిల కుమారుడు. వీరికి ముగ్గురు అబ్బాయిలు కాగా నవీన్కుమార్ పెద్ద కుమారుడు. నవీన్కుమార్ దర్శిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేశాడు. ఎదిగి వస్తున్నారనుకున్న ఇద్దరు పిల్లలు దుర్మరణం కావడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఏటా మంచినీటి ఎద్దడి నెలకొంటుండడంతో ఇటీవలే చెరువు లోతు తీయించి చెరువు నిండా నీరును సోమవారం వరకు అధికారులు నింపారు. అయితే చెరువు లోతును అంచనా వేయడంలో విఫలమైన చిన్నారులు చెరువులో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సచివాలయ ఉద్యోగినికి కరోనా లక్షణాలు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే నగరంలో 30 వరకు కరోనా కేసులు నమోదుకాగా, తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని వార్డు సచివాలయాల కార్యదర్శులు, వార్డు వలంటీర్లు, పారిశుధ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఆదివారం సామూహికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ నాలుగు కేటగిరీలకు చెందిన వారిలో తొలిరోజు 744 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడం యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. ఒంగోలులోని బాలాజీనగర్, మంగమూరురోడ్డు, పాపాకాలనీ, వెంకటేశ్వర కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. బాలాజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఒక వార్డు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న ఒక మహిళకు, పాపా కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో మహిళా వార్డు వలంటీర్కు కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. ర్యాపిడ్ కిట్ ద్వారా పరీక్షించగా, ఇద్దరికి పాజిటివ్గా వచ్చింది. అయితే వారికి స్వాబ్ ద్వారా మరోసారి పరీక్షించి కరోనాను నిర్ధారించనున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన మహిళా పోలీసును రిమ్స్లోని ఐసోలేషన్కు తరలించగా, మహిళా వార్డు వలంటీర్ మాత్రం తాను ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టడంతో ఆమెను హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. ఇద్దరు రేషన్ డీలర్లకు.. ఒంగోలు నగరంలోని కమ్మపాలేనికి చెందిన ఇద్దరు రేషన్ డీలర్లకు కరోనా ఉన్నట్లు ర్యాపిడ్ పరీక్షల్లో తేలింది. వారికి కూడా స్వాబ్ ద్వారా మరోసారి పరీక్షించనున్నారు. దాంతో ఆ డీలర్లను ఐసోలేషన్కు, వారి కుటుంబీకులను క్వారంటైన్కు తరలించారు. ఆ ఇద్దరు రేషన్ డీలర్లలో ఒక వ్యక్తి రేషన్ సరుకులు అతి సమీపంగా ఇవ్వడం, శనగలను కూడా అదే మాదిరిగా ఇవ్వడంతో వాటిని తీసుకున్నవారు భయపడిపోతున్నారు. 56కు చేరుకున్న కోవిడ్ కేసులు ఒంగోలు సెంట్రల్: జిల్లాలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు 56కు చేరుకున్నాయి. ఆదివారం జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుడ్లూరులో మూడు, ఒంగోలు ఇస్లాంపేటలో ఒకటి నమోదైంది. దీంతో వీరికి దగ్గరగా ఉన్న వారిని జీజీహెచ్ క్వారంటైన్కు తరలించారు. వీరు ఎవరెవరిని కలిశారు అనే విషయంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 8453 శాంపిల్స్ను కోవిడ్ 19 అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి సేకరించి, పరీక్షలకు పంపించారు. వీటికి సంబంధించిన నివేదికలు ఇప్పటి వరకూ 4641 జిల్లాకు అందాయి. వీటిలో 4585 శాంపిల్స్ను నెగిటివ్గా నిర్ధారించారు. మరో 3813 మంది నివేదికలు జిల్లాకు అందాల్సి ఉంది. జిల్లాకు అదనంగా ఆర్టీ పీసీఆర్ యంత్రాలు జిల్లాలో కోవిడ్ 19 వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో 7 యంత్రాలను జిల్లాకు మంజూరు చేసింది. ప్రస్తుతం 17 ఆర్టీపీసీఆర్ యంత్రాలు పని చేస్తున్నాయి. మూడు షిఫ్టుల్లో శాంపిల్స్ను పరీక్షిస్తున్నారు. -
కరోనా మెడలు వంచుతున్నారు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా చేస్తున్న పోరాటం సత్ఫలితాలనిస్తోంది. మొదట్లో కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా నేడు 7వ స్థానానికి పడిపోయిందంటే జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికుల కష్టం ఎంతో ఉంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు వైరస్ సోకిన వారంతా కోలుకుంటూ ఉండటంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో అధిక శాతం పాజిటివ్ కేసులు నమోదైన ఒంగోలు, చీరాల, కందుకూరు, కారంచేడు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పాజిటివ్ వ్యక్తులు ఒంగోలు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రిల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిలో మొదట్లో చేరిన 41 మంది కరోనా పాజిటివ్ బాధితుల్లో 37 మంది కరోనాను జయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి శాంపిల్స్ను పలుమార్లు పరీక్షల నిమిత్తం పంపగా నెగిటివ్ రిపోర్టులు రావడంతో వీరందరినీ శనివారం డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు సమాయత్తమవుతున్నారు. ఒకేరోజు 37 మందిని డిశ్చార్జ్ చేసిన జిల్లాగా రాష్ట్రంలోనే పేరొందే అవకాశముంది. కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు వారిని కంటికి రెప్పలా జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది కాపాడారని అధికారులు వారిని అభినందిస్తున్నారు. అంతేగాకుండా ఐసోలేషన్ వార్డు, క్వారంటైన్లలో చికిత్స పొందే వారికి మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రతిరోజు మానసిక వైద్య నిపుణులతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. జిల్లాలో 52కు చేరిన పాజిటివ్ కేసులు జిల్లాలో ఇప్పటి వరకూ 3022 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపగా అందులో 1236 రిపోర్ట్లు వచ్చాయి. ఇందులో 1184 మందికి నెగిటివ్ రాగా, 52 మందికి మాత్రం కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మరో 1782 మందికి సంబంధించిన రిపోర్ట్లు రావాల్సి ఉంది. అయితే వీరిలో మొట్టమొదట పాజిటివ్ కేసు అయిన యువకుడు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరో 37 మందిని నేడు డిశ్చార్జి చేసేందుకు వైద్యులు సమాయత్తమవుతున్నారు. పాజిటివ్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారంతా వేగంగా కోలుకుంటున్నట్లు కోవిడ్–19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జాన్ రిచర్డ్స్ తెలిపారు. సోమవారం నుంచి జీజీహెచ్లోనే కరోనా పరీక్షలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇరుగు పొరుగు నివాసముంటున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపడంలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో సేకరించిన శాంపిల్స్ను ఇప్పటి వరకు గుంటూరు, విజయవాడ ల్యాబ్లకు పరీక్షలకు పంపి నివేదికల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయని గుర్తించిన కలెక్టర్ పోల భాస్కర్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒంగోలు జీజీహెచ్లో ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేశారు. శనివారం టెస్ట్ శాంపిల్స్ను తీసి సోమవారం నుంచి ఒంగోలు జీజీహెచ్లోనే కరోనా పరీక్షలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకు విడివిడిగా అయితే 90 మందికి పరీక్షలు నిర్వహించే వీలుండగా, శాంపిల్ పూలింగ్ ద్వారా ఐదు మందివి ఒకేసారి పరీక్షిస్తే 450 మంది శ్యాంపిల్స్ పరీక్షలు జరిపే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. -
వైఎస్సార్ సున్నా వడ్డి పథకం చెక్కుల పంపిణీ
సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజమైన మహిళల పక్షపాతి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో వైఎస్సార్ సున్నా వడ్డి పథకం చెక్కులను డ్వాక్రా మహిళలకు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబులా మాయమాటలు చెప్పకుండా పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నేత సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జేట్ ఉన్నప్పటికీ ప్రజలను ఆదుకోవాలనే మంచి మనసు ఉంది కాబట్టే ఇవ్వాళ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. (కర్నూలులో సున్నా వడ్డి పథకాన్ని ప్రారంభించిన మంత్రి) గుంటూరు: సీఎం జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి అన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా స్వయం సహాయక సంఘాలకు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అనంతపురం: సంక్షోభ కాలంలోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 11 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. కష్టకాలంలో డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. -
డైట్ కాంట్రాక్టర్ కక్కుర్తి..
డైట్ కాంట్రాక్టర్ కక్కుర్తి.. కరోనా పాజిటివ్ బాధితులు, అనుమానితులకు ప్రాణ సంకటంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రోగులకు ఆహారం ఇవ్వకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఆస్పత్రుల్లో సాధారణ రోగి భోజనానికి రూ.40 వెచ్చిస్తున్న ప్రభుత్వం.. కరోనా బాధితులు,అనుమానితులకు మాత్రం ఒక్కొక్కరికి రూ.100 ఖర్చు చేస్తోంది. నిపుణులైనడైటీషియన్లు సూచన మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక మెనూ అమలు చేయాలని ఆదేశించారు. అయితే ఒంగోలు జీజీహెచ్ డైట్ కాంట్రాక్టర్ మాత్రం కరోనాబాధితులు, అనుమానితులకు సరైన పోషకాహారం ఇవ్వకుండా నిధులు మింగేస్తున్నాడు. ఇతని తీరుతో రోగులు, వారి బంధువులు విసిగి వేసారి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు సెంట్రల్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది ఒంగోలు జీజీహెచ్లో పరిస్థితి. కరోనా బాధితులకు మంచి ఆహారం అందించాలంటూ ప్రభుత్వం మామూలుగా ఇచ్చేదానికంటే రెండున్నర రెట్లు అదనంగా నిధులిస్తున్నా ఒంగోలు జీజీహెచ్లో డైట్ కాంట్రాక్టర్ మాత్రం రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. జీజీహెచ్లో శానిటేషన్ కాంట్రాక్ట్ నుంచి డైట్ కాంట్రాక్ట్ వరకు ప్రతిదీ ఇదే కాంట్రాక్టర్ కనుసన్నల్లో నడుస్తున్నాయి. శానిటేషన్ కాంట్రాక్ట్ వేరే వ్యక్తులు పొందినప్పటికీ సబ్ కాంట్రాక్ట్ మాత్రం ఇతనే నిర్వహిస్తున్నాడు. ఏళ్ల తరబడి జీజీహెచ్లో అన్ని కాంట్రాక్ట్లు నిర్వహిస్తున్న ఇతను ఆస్పత్రి అధికారులను నయానో, భయానో లొంగదీసుకుని దందా కొనసాగిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండతో రోగులకు సరైన భోజనం పెట్టకుండా లక్షల రూపాయలు దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒంగోలు జీజీహెచ్లోని సాధారణ రోగులతోపాటు, క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు పౌష్టికాహారం అందించాల్సిన డైట్ కాంట్రాక్టర్.. నాసిరకమైన ఆహారాన్ని పెడుతుండటంతో రోగులు ఇటీవల ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా అతని తీరు మాత్రం మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ తీరుపై రోగుల ఫిర్యాదు క్వారంటైన్లో ఉన్న వారికి పోషకాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచి, ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒంగోలు జీజీహెచ్లో కోవిడ్ 19 రోగులకు కాంట్రాక్టర్ పోషకాహారం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. జీజీహెచ్లోని కోవిడ్ 19 వార్డులో ఉండే రోగులు తమకు అందించే డైట్ నాణ్యంగా లేదని అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. జీజీహెచ్లో సాధారణ రోగులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.40 చెల్లిస్తోంది. అయితే కోవిడ్–19 రోగులకు ప్రత్యేక పోషకాహారం అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో రోజుకు రూ.100 చెల్లిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్ కక్కుర్తితో పోషకాహారం అందించకుండా నిధులు కాజేస్తున్నాడు. జీజీహెచ్లో దాదాపు 120 నుంచి 150 మంది వరకు ఇన్పేషెంట్లు ఉంటారు. వీరిలో కరోనా పాజిటివ్ బాధితులు, క్వారన్టైన్లో ఉన్న వారు కలిపి 70 మంది ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక ఆహారం అందించాల్సిన బాధ్యత డైట్ కాంట్రాక్టర్పై ఉంది.ఈ విషయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కుడా మౌనం దాల్చడంతో రోగులకు పౌష్టికాహారం అందడం లేదు. ఆహారమే కీలకం కరోనా సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి. ఒక వేళ కరోనా సోకితే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ తగిన మందులు తీసుకోవాలి. నిర్ధిష్టమైన మందు లేని కరోనా వైరస్ను జయించాలంటే ఆహారమే కీలకం. అధికంగా పోషకాలుండే ఆహారం తీసుకోకపోతే కరోనా కాటుకు బలి కావాల్సిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్, ఐసోలేషన్లో ఉండే రోగులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ సోకిన వారితోపాటు అనుమానితులను కుడా ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తోంది. అయితే కరోనా వైరస్ను ఎదుర్కొవాలంటే రోగ నిరోధక శక్తి కీలకం కావడంతో వ్యాధిగ్రస్తులు, క్వారంటైన్లో ఉండే వారు త్వరగా కోలుకోవడానికి బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. నిపుణులైన డైటీషియన్ల సూచనల మేరకు రోగుల కోసం ప్రత్యేక మెనూనూ రూపొందించారు. ఈ మెనూ ప్రకారం భోజనంలో నారింజ, అరటి, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూర, లెమన్ వాటర్, ఉడకబెట్టిన గుడ్లు అందించాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోగులు వైరస్తో పోరాడి త్వరగా కోలుకునేందుకు వీలుకలుగుతుంది. అయితే డైట్ కాంట్రాక్టర్ ధనార్జన రోగులపాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డైట్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. డైట్ కాంట్రక్టార్ తీరుపై జాయింట్ కలెక్టర్ షన్మోహన్ను వివరణ కోరగా ‘‘జీజీహెచ్ ఐసోలేషన్ వార్డు, క్వారంటైన్లో ఉన్న వారికి భోజనం సరిగా అందించడం లేదని ఫిర్యాదులొచ్చాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. -
కడచూపూ దక్కలేదు
ప్రకాశం, పొన్నలూరు: గుండెపోటుతో మృతి చెందిన వివాహిత భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకురాలేని విషాద ఘటన ఇది.. మండలంలోని కొత్తశింగరబొట్లపాలేనికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అప్పనబోయిన సుధారాణి (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో ఉంటోంది. ఆమె భర్త గోవిందరావు అక్కడే ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన సుధారాణికి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె భౌతిక కాయాన్ని కొత్తశింగరబొట్లపాలెం తీసుకొచ్చేందుకు అనుమతి లేక తిరుపతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సెల్ఫోన్లో మృతదేహాన్ని, అంత్యక్రియల దృశ్యాన్ని చూపించి దహనం చేశారు. సుధారాణిని చివరిచూపు చూడలేక ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అవన్నీ తప్పుడు వార్తలు : ఎమ్మెల్యే మధుసూదన్
సాక్షి, ప్రకాశం : మదనపల్లి చెక్పోస్ట్ వద్ద తాను బంధువులతో హల్చల్ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. తాను ప్రయాణించిన కారు వెనుక నా అనుచరుల కారు ఒక్కటే ఉందని తెలిపారు. చెక్పోస్ట్ వద్ద పోలీసులు అభ్యంతరం తెలపడంతో తన వెంట వచ్చిన కారును కూడా వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. తాను బంధువులతో కలిసి హల్చల్ చేశానంటూ తనపై దుష్ప్రచారం చేశారన్నారు. చెక్పోస్ట్ వద్ద ఆగి ఉన్న కారులన్ని తనవే అంటూ అసత్య ప్రచారం చేశారని తెలిపారు. పోలీసుల మాటను గౌరవించి నియోజకవర్గంలో తాను ఒక్కడినే వచ్చానని, లాక్డౌన్ నిబంధనలను సంపూర్ణంగా పాటించాలని మధుసూదన్ యాదవ్ వెల్లడించారు. -
కరోనాను జయించిన ప్రకాశం యువకుడు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మొట్టమొదటగా కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు వైద్యులు చెప్పినట్లుగా వారికి సహకరిస్తూ కరోనాను జయించాడు. ఒంగోలు నగరంలోని జెడ్పీ కాలనీకి చెందిన యువకుడు మార్చి 15వ తేదీ ఉదయం లండన్ నుంచి ఒంగోలుకు చేరుకున్నాడు. 17వ తేదీన ఒంగోలు జీజీహెచ్లోని ఐసోలేటెడ్ వార్డులో చేర్చారు. మార్చి 18వ తేదీ రాత్రి అతనికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆ యువకుడు జీజీహెచ్ ఐసోలేటెడ్ వార్డులోనే చికిత్స పొందుతున్నాడు. 14 రోజుల చికిత్స అనంతరం శాంపిల్స్ను రెండుసార్లు ల్యాబ్కు పంపగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు శుక్రవారం సాయంత్రం ఆ యువకుడిని ఒంగోలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. లండన్ నుంచి వచ్చి జీజీహెచ్లో చేరినప్పటి నుంచి ఆ యువకుడు, వారి కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో తమకు సహకరించడం వల్లే వారు వ్యాధి నుంచి బయటపడ్డారని, ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే విధంగా బాధ్యతగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. యువకుడి తల్లిదండ్రులు, సోదరిని సైతం జీజీహెచ్ క్వారంటైన్లో ఉంచి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరిన సంగతి తెలిసిందే. జీజీహెచ్ వైద్యులు గురువారం సాయంత్రం 38 శాంపిల్స్ను ల్యాబ్లకు పంపగా అన్నీ నెగటివ్ వచ్చాయి. పాజిటివ్ కేసులు తగ్గడంతో అధికారులు, వైద్యులతోపాటు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జీజీహెచ్ వైద్యులు శుక్రవారం పంపిన మరికొంత మంది అనుమానితుల్లో ముగ్గురి శాంపిల్స్ రిపోర్టులు నెగటివ్గా వచ్చాయి. జీజీహెచ్ క్వారంటైన్ నుంచి యువకుడు పరారీ ;పట్టుకుని తీసుకువచ్చిన పొలీసులు ఒంగోలు సెంట్రల్: ఒంగోలు జీజీహెచ్ క్వారంటైన్లో ఉన్న ఓ యువకుడు శుక్రవారం ఉదయం పారిపోయాడు. జీజీహెచ్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువకుడి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సొంత ఊరు అమ్మనబ్రోలులో ఉన్నట్లు గుర్తించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఈ యువకుడు హైదరాబాద్ నుంచి ఇటీవలే ఒంగోలు వచ్చాడు. జలుబు, దగ్గుతో బాధపడుతూ గత నెల 27వ తేదీన జీజీహెచ్కు స్వయంగా వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఇతనికి కరోనా లక్షణాలు లేవని ఈ నెల 2వ తేదీన రిపోర్ట్ వచ్చినా ప్రొటోకాల్ ప్రకారం క్వారంటైన్లో ఉంచారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం ఉదయం నుంచి యువకుడు కనిపించకపోవడంతో పోలీసులు వెతికి పట్టుకుని తీసుకువచ్చారు. -
పట్టు రైతు కుదేలు
గిద్దలూరు: పట్టు రైతులకు కరోనా కాటు పడింది. కరోనా వైరస్ దాటికి పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పట్టు పురుగులను పెంచుతున్న రైతులు పురుగులను మేపాలా, వద్దా అనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఎకరం పొలంలో మల్బరీ ఆకు పెంచేందుకు, పట్టు గుడ్లు కొనుగోలు, చాకీ ఖర్చులు, గూళ్ల దిగుబడికి రూ.ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తికాగా, మరి కొందరు రైతులు పట్టు గూళ్లు తీయాల్సి ఉంది. కొందరు రైతులు పురుగులు నాలుగో దశలో ఉన్నాయి. పంట పూర్తయి పట్టుగూళ్లు తీసిన రైతులు వాటిని విక్రయించుకునేందుకు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట చివరి దశలో ఉన్న రైతులు గూళ్లు కట్టించాలా.. ముందే పంటను పడేయాలా అనే సందేహంలో ఉన్నారు. కిలో పట్టుగూళ్లు రూ.700 నుంచి రూ.750 వరకు ధర పలుకుతున్న తరుణంలో మార్కెట్లు మూతవేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు.. జిల్లాలో మల్బరీ సాగు దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం 70 ఎకరాల్లో రైతులు పట్టు పురుగులు పెంచుతున్నారు. వీరికి పట్టుపరిశ్రమ శాఖ ద్వారా నర్సరీలు పెంచి పట్టు పురుగులు రెండు దశలు వచ్చే వరకు 8 రోజుల పాటు పెంచి ఇస్తారు. ఇక రైతులు 19 రోజులు మాత్రమే పురుగులను సంరక్షించి గూళ్లు కట్టించి మార్కెట్లో విక్రయించాల్సి ఉంది. గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట మండలాల్లో పట్టురైతులు 250 మంది వరకు 500 ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. వీరంతా పట్టు పురుగులను పెంచి చంద్రికల్లో వేశారు. గూళ్లు అల్లే దశలో ఉన్నాయి. కొందరు రైతులు గూళ్లు పూర్తయిన రెండు రోజుల్లోనే మార్కెట్కు తరలిస్తారు. లేదంటే పట్టుగూడుకు రంద్రం వేసి పురుగు పక్షిగా మారి బయటకు వెళ్తుంది. ఆ తర్వాత పట్టు గూడు విక్రయానికి పనికిరాదు. దారం తెగిపోవడం వలన విక్రయించడం వీలు పడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు మండలంలోని ఒక్క పొదలకుంటపల్లె గ్రామంలోనే 23 మంది పట్టు రైతులు ఉన్నారు. పట్టు రైతులకు తీరని నష్టం కరోనా వైరస్తో పట్టు గూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో జిల్లాలోని పట్టు రైతులకు తీరని నష్టం వాటిల్లింది. 750 మంది రైతులు దాదాపు లక్షా, 50 వేల పట్టు గుడ్లు కొనుగోలు చేసి పెంచుతున్నారు. తద్వారా ఒక లక్ష కిలోల పట్టు గూళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కిలో రూ.700 చొప్పున రూ.7 కోట్ల వరకు పట్టు రైతులు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమాచారం ఇచ్చేందుకు పటుపరిశ్రమ అధికారులు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పట్టు గూళ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 250 పట్టు గుడ్లు పెంచుతున్నాను తాను ఎకరంలో మల్బరీ సాగుచేస్తున్నాను. 250 పట్టు గుడ్లు తీసుకొచ్చి పెంచుతున్నాను. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తయి పట్టు పురుగులు గూళ్లు అళ్లాక మార్కెట్కు వెళ్తే కొనుగోలు చేసేవారు లేక వెనక్కు వచ్చారు. తాను రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి పురుగులను పెంచుతున్నాను. మార్కెట్ లేకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు.– ఎస్.మోహన్రెడ్డి, పట్టు రైతు, పొదలకుంటపల్లె -
వారి కోసం విస్తృత గాలింపు
చీమకుర్తి: ప్రార్థనల నిమిత్తం ఢిల్లీ వెల్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో చీమకుర్తి వాసుల్లో గుండె ఝల్లుమంది. ఆయనతో సంబంధం ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, ఇతరులతో కలిసి తిరిగాడని పోలీసులు, అధికారులు గుర్తించటంతో స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇప్పటికే బంధువులు, స్నేహితులను 14 మందిని గుర్తించి ఒంగోలు రిమ్స్కు తరలించారు. పాజిటివ్ వ్యక్తికి సమీపంలో నివాసం ఉంటున్న ఐదుగురు, చీమకుర్తి పట్టణంలో మరో ఐదుగురు, పాజిటివ్ వచ్చిన వ్యక్తి అత్తగారి ఊరైన పల్లామల్లిలో మరో నలుగురు మొత్తం 14 మందిని రిమ్స్కు తరలించారు. ఆర్డీఓ ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గం స్పెషలాఫీసర్ కే.అద్దెయ్య, తహసీల్దార్ కె.విజయకుమారి స్థానిక వైద్యసిబ్బందితో కరోనా అనుమానితుల వివరాలను సేకరించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి చీమకుర్తితో పాటు అత్తగారి ఊరైన పల్లామల్లి వెళ్లి వచ్చాడు. తన భార్య గర్భవతి కావడంతో చీమకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఏఏ ప్రాంతాలలో ఎవరెవరుతో కలిసి మాట్లాడాడో ఆయా వివరాలను సేకరించే క్రమంలో పోలీసులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వలంటీర్లు ఊపిరి పీల్చుకునే తీరిక లేకుండా సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. కుంకలమర్రు(కారంచేడు): మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకి ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన గ్రామస్తులు భయంతో గడగడలాడిపోతున్నారు. వైరస్ సొకిన వ్యక్తి ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన రోజు నుంచి గ్రామంలోని అనేక ప్రాంతాల్లో తిరగడం, గ్రామంలో నెట్ సెంటర్ ఉండటం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. అతనితో పాటు కలసిమెలసి ఉన్న 20 మంది బంధువులు, భార్య, కుమారుడు, కుమార్తెలను క్వారంటైన్కు తరలించారు. వీరిలో 20 మందిని చీరాలలోను, ముగ్గురిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. వీరు కాకుండా అప్పటికే అతనికి వైద్య సేవలందించిన వైద్యుడు, ఏఎన్ఎంలు స్వచ్ఛంద నిర్బంధంలోకి వెళ్లారు. ఆశా కార్యకర్తను కూడా క్వారంటైన్కు తరలించారు. గ్రామంలో 12 టీంల ద్వార సుమారు 50 మంది వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టే పనిలో నిమగ్నమయ్యారు. కందుకూరు: కందుకూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారించడంతో పట్టణంంలో అలజడి రేగింది. ఆ ముగ్గురితో ఎంత మందికి సంబంధం ఉంది, ఎవరెవరు కలిశారనే అంశం చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే పాజిటివ్ రిపోర్టు వచ్చిన ముగ్గురి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఇతర వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండగా, మరికొందరని అధికారులు గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు పంపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇంకా మరింత మంది ఉండవచ్చనే కోణంలో అధికారులు గాలింపు చేస్తున్నారు. ప్రస్తుతం ఓగూరు వద్ద ఉన్న హార్టికల్చర్ కాలేజీ, పట్టణంలోని పాలటెక్నిక్ కాలేజీల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు పాజిటివ్ కేసులతో పట్టణం మొత్త హై అలెర్టు జోన్ కింద అధికారులు ప్రకటించారు. ఆంక్షలను కఠిన తరం చేశారు. -
ఆంక్షల్లేకుండా పింఛన్లు
ఒంగోలు టూటౌన్: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో సర్కార్ ఆంక్షలు తొలగించింది. కరోనా నేపథ్యంలో ఈ సారి బయోమెట్రిక్, సంతకం లేకుండానే పింఛన్లు పంపిణీ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. దీంతో పాటు రెండు రోజుల ముందుగానే నిధులు కూడా విడుదల చేసింది. జిల్లాలో 4,11,207 మంది పెన్షన్దారులు ఉండగా వీరికి కేటగిరీ వారీగా ప్రభుత్వం పెన్షన్లను ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.98,27,92,750 నిధులను జిల్లా అధికారులు ముందస్తుగానే డ్రా చేశారు. వీటిని గ్రామ వలంటీర్లకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. పెన్షన్లు పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు, చేనేతలు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. ఈ కేటగిరీ లబ్ధిదారులకు నెలకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నారు. డప్పు కళాకారులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్కు రూ.3000 ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ను మూడింతలు పెంచి అందిస్తోంది. రూ.3,500 నుంచి రూ.10,000 పెంచి కిడ్నీ వ్యాధి గ్రస్తులకు సకాలంలో పెన్షన్లు అందిస్తున్నారు. ఇంకా అభయహస్తం కింద 7,752 మంది పెన్షన్లు పొందుతున్నారు. వీరందరికీ ఏప్రిల్ ఒకటో తేదీనే పెన్షన్ ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే బ్యాంకులకు జమ చేసిన పెన్షన్ నిధులను డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ బ్యాంకర్లను ఆదేశించారు. దీంతో సోమవారమే పెన్షన్ నిధులను డ్రా చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. డ్రా చేసిన నిధులను గ్రామ వలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే పెన్షనర్లకు ఇంటికి వెళ్లి అందజేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పెన్షనర్ల ఫోటో మాత్రమే తీసుకుని పెన్షన్ అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా నివారణ నేపథ్యంలో వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెన్షన్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
వలంటీర్పై టీడీపీ నాయకుల దాడి
చౌటగోగులపల్లి(పీసీపల్లి): ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వలంటీర్పై టీడీపీ నాయకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని చాటగోగులపల్లిలో వైద్య సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళ్లి వచ్చిన టీడీపీ నాయకుల ఇంటికి వలంటీర్ నరసింహులు వెళ్లి పిలవగా సుగమంచి ఓబుల్ నరేంద్ర, వారి అనుచరులు 15 మంది కలిసి అతనిపై దాడి చేశారు. దీంతో వలంటీర్ టీడీపీ నాయకులపై ఆదివారం ఎస్సై మధుసూదనరావుకు ఫిర్యాదు చేశారు. వలంటీర్పై దాడిని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే నజీర్ బాషాను ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. పరిటాలవారిపాలెం(సంతమాగులూరు): వలంటీర్పై దాడి చేసి కులం పేరుతో దూషించిన సంఘటన పరిటాలవారిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సతీష్ రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన యర్రం శెట్టి వీరాంజనేయులు వలంటీర్ని అడ్డుకొని మా అమ్మ పింఛన్ తీసేస్తావా అంటూ.. కులం పేరుతో దూషించి దాడి చేశాడు. దీంతో వలంటీర్ మిగిలిన వలంటీర్లతో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చి వీరాంజనేయులపై ఫిర్యాదు చేశాడు. వలంటీర్ ఫిర్యాదు మేరకు వీరాంజనేయులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీద్ బాషా తెలిపారు. -
నారాయణ ఈ టెక్నో స్కూల్పై కేసు
ఒంగోలు: నగరంలోని నారాయణ ఈ టెక్నో స్కూల్పై జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. డీఈవో కథనం ప్రకారం.. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని యాజమాన్యాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. అంజయ్య రోడ్డులోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న డీఈవో సుబ్బారావు అప్రమత్తమై పోలీసులతో కలిసి గురువారం పాఠశాలకు వెళ్లి తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా పాఠశాలను తెరవడం, ఉపాధ్యాయులను బలవంతంగా పాఠశాలకు పిలిపించి ఆన్లైన్లో పాఠాలు బోధించడంతో పాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు డీఈవో గుర్తించారు. ఇందుకు బాధ్యులుగా నారాయణ ఈ టెక్నో స్కూల్, అంజయ్య రోడ్డు ప్రిన్సిపాల్ అల్లం కిరణ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కంచిబొట్ల బాలాజీ, స్టాఫ్ టీచర్ షేక్ షర్మిల, ఉపాధ్యాయుడు ఎ.ప్రశాంత్కుమార్లను గుర్తించి వారిపై పోలీసులకు డీఈవో ఫిర్యాదు చేశారు. మార్కాపురంలో కూడా.. మార్కాపురం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక నారాయణ స్కూల్ యాజమాన్యం గురువారం పాఠశాలను తెరిచి ఉంచింది. గమనించిన కొందరు జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్థానిక ఎంఈవో రాందాస్ నాయక్ను స్కూల్ వద్దకు పంపారు. స్కూల్ తెరిచి ఉండటాన్ని ఎంఈవో గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్లో ఎంఈవో ఫిర్యాదు చేశారు. ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్లంకొండ కళాశాలపై కేసు
ప్రకాశం, పొదిలి రూరల్: పొదిలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్లంకొండ కళాశాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.సురేష్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మరి కారణంగా ఎక్కడా విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పని చేయకూడదని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే పొదిలి మండలంలోని బెల్లంకొండ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామ మహిళా పోలీసు కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. రెండు రోజుల తర్వాత మంగళవారం మళ్లీ తరగతులు యథావిధిగా నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసు అప్రమత్తమై పొదిలి సీఐ శ్రీరామ్కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కళాశాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం కళాశాలపై కేసు నమోదు చేశారు. -
ప్రాణాలు బలిగొన్న మాంసం వివాదం
ప్రకాశం, పెద్దదోర్నాల: మాంసం వద్ద చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వండిన మాంసాన్ని పంచుకోవటంలో ఇరువురు సోదరుల మధ్య చోటుచేసుకున్న వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొర్రప్రోలు గిరిజన గూడెంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో గూడెంలోని దాసరి అంకన్న (20) తనకు సోదరుడి వరుసైన దాసరి గురవయ్య చేతిలో హతమయ్యాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ, పెద్దదోర్నాల ఎస్సై అబ్దుల్ రహిమాన్లు సంఘటనా స్థిలికి చేరుకుని సంఘటపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అబ్దుల్ రహిమాన్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గూడేనికి చెందిన దాసరి అంకన్న, దాసరి గరవయ్యలు వరుసకు అన్నాదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంటిపేరు కలిగిన కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆదివారం చనిపోయిన మేకను కుటుంబంలో అందరూ కలిసి వండుకున్నారు. మేక మాంసం వండించుకోవటంలో దాసరి అంకన్నకు, గురవయ్య మధ్య విభేదం తలెత్తింది. ఈ క్రమంలో ప్లేటులో అన్నం, మాంసం కూర వేసుకుని బయట తినేందుకు వెళ్తున్న అంకన్నను గురవయ్య దుర్భాషలాడుతూ ఎవరికి పెట్టేందుకు వెళ్తున్నావంటూ నిలదీశాడు. ఇరువురి మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆగ్రహించిన గురవయ్య వెనుకగా వచ్చి అంకన్న మెడపై కత్తితో దాడి చేయటంలో సంఘటనా స్థలిలోనే అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ రహిమాన్ తెలిపారు. నిందితుడు గురవయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
వండర్ వలంటీర్!
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ/వార్డు వలంటీర్లు ఇప్పుడు కరోనా కేసుల గుర్తింపులోనూ కీ రోల్ పోస్తున్నారు. వండర్ వలంటీర్లుగా ప్రశంసలు అందుకుంటున్నారు. 50 నుంచి 60 కుటుంబాలకు ఒకరి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లను నియమించింది. వారి పరిధిలోని కుటుంబాలకు సంబం«ధించిన సంక్షేమ కార్యక్రమాల్లో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు నెలల నుంచి సామాజిక భద్రత పింఛన్ల నగదును లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు స్వయంగా అందజేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని గుర్తించడంలోనూ వీరు ప్రముఖ పాత్ర పోషిస్తూ అటు అధికారులు, ఇటు ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరు ఏదో ఒక కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజారోగ్య విషయంలో కూడా భాగస్వాములు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్ ప్రత్యక్షం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. సచివాలయాలకు సంబంధించి ప్రాధాన్యతా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యదర్శులను నియమించింది. పట్టణ ప్రాంతాల్లో డివిజన్కు ఒకటి చొప్పున సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఆ సచివాలయాలకు వలంటీర్లను అనుసంధానం చేసింది. సచివాలయాలు ఏర్పాటు చేసే ముందు వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ ఇళ్లల్లో ఎంతమంది నివశిస్తున్నారన్న సమగ్ర సమాచారాన్ని ఫోన్ నంబర్లతో సహా వలంటీర్లు సేకరించి తమ వద్ద ఉంచుకున్నారు. ప్రతి వలంటీర్ తన పరిధిలోని ఇళ్లలో నివసించే ప్రతి ఒక్కరి సమగ్ర సమాచారం తన వద్ద భద్రపరచుకున్నారు. ఒక వ్యక్తి పేరు చెబితే వెంటనే ఆ వ్యక్తి, కుటుంబ సభ్యుల వివరాలు టకాటకా చెప్పేయడం వీరి ప్రత్యేకత. కరోనాలో కీలకపాత్ర.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. జిల్లా కేంద్రం ఒంగోలు రాంనగర్లో తొలుత ఒక అనుమానిత కేసు నమోదైంది. అతడికి నెగెటివ్గా నిర్ధారణ కావడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఆ కేసును గుర్తించడంలో వలంటీర్ కీలకపాత్ర పోషించాడు. మూడు రోజుల క్రితం జెడ్పీ కాలనీలో కరోనా కేసు నమోదైంది. ఈ కేసును కూడా అక్కడి వార్డు వలంటీరే ముందుగా సమాచారాన్ని సేకరించి యంత్రాంగానికి అందించారు. దీంతో సకాలంలో ఆ కుటుంబ సభ్యులందరిని రిమ్స్లోని ప్రత్యేక వార్డులో ఉంచే అవకాశం కలిగింది. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చేవారి ద్వారా ఆ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అలాంటి వారిని గుర్తించడంలో వార్డు వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్నవారు, విదేశాల్లో స్థిరపడినవారు, స్వగ్రామాలకు వస్తున్నవారి వివరాలను సకాలంలో గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. -
అందరూ ఉన్నా..అనాథలే!
చీరాల అర్బన్: వారి ఊరు తెలియదు..పేరు తెలియదు..ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రం..బతుకు పోరులో పయనమైన వారు కొందరైతే..చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే వారు మరికొందరు. కిక్కిరిసిన రైళ్లలో వేళాడుతూ ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మరణించిన వారి చిరునామా తెలియదు. కొద్ది రోజుల తర్వాత అందరూ ఉన్నా అనాథ శవంలా కాలిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యం. జీవితాన్ని కొందరు అందంగా తీర్చిదిద్దుకుంటారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి కుటుంబాన్ని ఏర్పరుచుకుంటాం. బంధాలు, అనుబంధాలను పెంచుకుని వాటిని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైలులో ప్రయాణించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం, కిక్కిరిసిన రైళ్లలో వేళాడుతూ ప్రయాణాలు చేసే వారు ఎక్కువ మంది మరణిస్తున్నారు. విజయవాడ–చెన్నై రైలు మార్గంలో నిత్యం ఎన్నో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గం ఉంది. ఈ మార్గంలో సూపర్ఫాస్ట్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జనరల్ బోగీల్లో ఫుట్పాత్పై కూర్చొని ప్రయాణిస్తూంటారు. ఈ నేపథ్యంలో కొందరు అలా ప్రయాణిస్తూ రైలు నుంచి జారి పడి మృత్యువాత పడుతున్నారు. ఇలా మృతి చెందిన వారి వివరాలు లభించవు. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తుతెలియని మృతదేహాలుగా కేసులు నమోదవుతున్నాయి. చీరాల ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్ పరిధి స్టువార్టుపురం నుంచి ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ వరకు ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో రైలు నుంచి జారిపడి మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారు. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు చీరాల జీఆర్పీ పరిధిలో మొత్తం 24 మంది రైలు నుంచి జారిపడి మృతి చెందగా వీరి వివరాలు లభించక పోవడంతో గుర్తుతెలియని మృతదేహాలుగా కేసులు నమోదు చేశారు. ప్రయాణికులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దూర ప్రాంతాలకు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందుతున్నారు. ఇటీవల అస్సోం, జార్ఖండ్, డెహ్రడూన్ వంటి ప్రాంతాలకు చెందిన వారు జారిపడి మృతి చెందారు. ఇలా మరణించిన వారిలో కొందరి వద్ద దొరికిన చిన్న చిన్న ఆధారాలతో మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చేందకు జీఆర్పీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శరీరం బాగానే ఉంటే వారి ఫొటోలను పరిసర ప్రాంతాల పోలీసుస్టేషన్లకు పంపుతుంటారు. కొన్ని మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్ట లేనంతగా మారతాయి. ఆత్మహత్యలు చేసుకొనే వారు, పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందిన వారి మృతదేహాలు కూడా ఒక్కోసారి ఛిద్రమై పోవడంతో వారు స్థానికులైనా గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉంటుంది. దీంతో అనాథ శవాలుగా మిగిలిపోతున్నారు. రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుంటారు. రైలు ప్రమాదాల్లో మరణించిన వారి శరీరం రెండు, మూడు రోజులకే కుళ్లిపోతుంది. పోస్టుమార్టం చేసినా వాటిని భద్రపరిచేందుకు చీరాల ఏరియా వైద్యశాలలో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో వాటిని మార్చురీలోనే ఉంచుతున్నారు. మూడు రోజులు దాటినా వారి తరఫున ఎవరూ రాకపోవడంతో జీఆర్పీ పోలీసులే వాటిని ఖననం చేయిస్తున్నారు. అందరూ ఉన్నా అనాథ శవాలుగా భూమిలో కలిసిపోతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు కష్టాలను అధిగమించలేక, సమస్యలకు పరిష్కార మార్గం దొరకలేదనో ఎక్కువ మంది రైలు కిందపడి మరణిస్తున్నారు. ఈ తరహా ఆత్మహత్యలు అధికంగానే జరిగాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలకు పాల్పడటంతో కన్న వారికి కడుపుకోత మిగులుతోంది. ప్రేమ విఫలమైందనో, ప్రేమ పెళ్లికి కన్న వారు అంగీకరించ లేదనో రైలు కిందపడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. చీరాల రైల్వేస్టేషన్లోని ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్లో 2019లో మొత్తం రైలు ఢీకొని, జారిపడి మృతి చెందిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో ఎక్కవ మందిని గుర్తించగా మరికొందరు వివరాలు ఇప్పటికీ తెలియదు. జేబులో దొరికే ఆధార్ కార్డు సాయంతో కొందరి చిరునామా దొరికింది. మరికొందరు శరీరాలు ఛిద్రమై పోవడంతో వారి ముఖం కూడా కనిపించక అనాథ శవాలుగా మిగిలిపోయారు. -
బలవన్మరణం; తల్లిని కోల్పోయిన చిన్నారులు
ప్రకాశం, వెలిగండ్ల: దంపతుల మధ్య మనస్పర్థల నేపథ్యంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని రామగోపాలపురం పంచాయతీ వెంగళరెడ్డిపల్లిలో బుధవారం జరిగింది. ఎస్ఐ టి.రాజ్కుమార్ కథనం ప్రకారం.. వెంగళరెడ్డిపల్లికి చెందిన కొత్తకోట ఆదిలక్ష్మి(22)కి గన్నవరం గ్రామానికి చెందిన కొత్తకోట వెంకట చెన్నయ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 15 రోజుల క్రితం ఆదిలక్ష్మి వెంగళరెడ్డిపల్లిలోని తన ఇద్దరు బిడ్డలను తీసుకొని పుట్టింటికి వచ్చింది. భర్త వెంకట చెన్నయ్య వెలిగండ్లలోని ఓ వాటర్ప్లాంట్లో పనిచేస్తూ రోజూ భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. భర్త వచ్చి వెళ్లిన తర్వాత ఇంట్లో ఆమె చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీఆర్వో జి.శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని, మృతదేహాన్ని కనిగిరి సీఐ కె.వెంకటేశ్వర్లు పరిశీలించి వివరాలు సేకరించారు. తల్లిని కోల్పోయిన చిన్నారులు దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇద్దరు చిన్నారులకు కన్నతల్లి దూరమైంది. తల్లి చనిపోయిన విషయం కూడా తెలియని వయసులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులను చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఆదిలక్ష్మి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపిస్తున్నారు. మరో వివాహిత కూడా.. కొమరోలు (గిద్దలూరు): ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని రాములవారి వీధిలో బుధవారం జరిగింది. వివరాలు.. రాములవారి వీధిలో నివాసం ఉండే నక్కా శ్రీవాణి (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త నారాయణ ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. శ్రీవాణి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
ఆర్టీసీ ద్వారా హెవీ డ్రైవింగ్పై శిక్షణ
ఒంగోలు: ఆర్టీసీ ద్వారా ఔత్సాహికులైన అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి శిక్షణను ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జి.విజయగీత పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చే సంస్థలు అతి తక్కువుగా ఉన్నాయని, తద్వారా హెవీ డ్రైవింగ్ డ్రైవర్ల కొరత తీర్చేందుకు ఆర్టీసీ సంకల్పించిందన్నారు. అందులో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ను ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలులో డిపోలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి బ్యాచ్ల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్యాచ్లో 16 మంది అభ్యర్థులు ఉంటారని, వారికి 16 రోజుల థియరీ క్లాసులు, మరో 16 రోజుల పాటు బస్సులపై 15 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. మొత్తం ఒక బ్యాచ్ పూర్తికావడానికి 40 రోజుల సమయం పడుతుందన్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం శిక్షణ సిలబస్ ఉంటుందని, ఎంవీ రూల్స్, డ్రైవింగ్ నైపుణ్యత నేర్పిస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత ఫారం–5, ఫారం–14, ఫారం–15 సర్టిపికెట్లు జారీ చేస్తామన్నారు. తద్వారా అభ్యర్థి ఆర్టీఏ నిర్వహించే టెస్టులో పాల్గొని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చన్నారు. ప్రతి అభ్యర్థి శిక్షణకు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూలుకు రూ.24 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఒంగోలు డిపో మేనేజర్ / ఒంగోలు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7382801048, 9959225691 నంబర్లను సంప్రదించాలని కోరారు.