అమరావతి
ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వరుని కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని దర్శించేందుకు వచ్చిన ఓ భక్తురాలు పుణ్యలోకాలకేగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం అదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి గ్రామానికి చెందిన అల్లూరి పార్వతీదేవి మరో ఆరుగురు బంధువులతో కలిసి కాకినాడ అర్టీసీ డిపో బస్సులో పంచారామాల యాత్రకు బయలు దేరింది.
సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు అచరించి అమరేశ్వరుని దర్శనం కోసం వచ్చిన ఆమె క్యూలైన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సుమారు ఆరు గంటలకు అలయంలోని ధ్వ జ స్తంభం వరకు రాగానే ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై అపస్మారకస్థితికి చేరటంతో ఆలయ సిబ్బంది, పోలీసుల సహాయంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పార్వతీదేవి మృతదేహాన్ని దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి కొమరవోలు గ్రామానికి పంపించారు.
తొక్కిసలాటవల్లేనా..?: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా తెల్లవారుఝాముకు రాష్ట్రం నలుమూలలనుంచి పంచారామ యాత్ర చేయటానికి సుమారు 400 బస్సుల్లో వచ్చిన 20వేల మంది భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఏడువేల మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వీరి తాకిడికి ఆలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు కూడా విరిగి పోవటంతో భక్తులు ఎటువెళ్లాలో తెలియక చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. పంచారామాల బస్సుల్లో వచ్చిన యాత్రికులంతా మిగిలిన నాలుగు క్షేత్రాల సందర్శనకు త్వరగా వెళ్లాలనే ఆతృతతో క్యూలైన్లలో హడావుడి చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
అమరేశ్వరుని సన్నిధిలో భక్తురాలి మృతి
Published Tue, Nov 11 2014 1:21 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు
T20 World Cup 2024: సేద తీరుతున్న టీమిండియా క్రికెటర్లు
లైఫ్లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
హైదరాబాద్లో భారీ వర్షం
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరక్టర్!
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
తప్పక చదవండి
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
- T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
- ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
Advertisement