
మూఢనమ్మకాలతోనే మృత్యువాత
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిపుత్రులు మూఢ నమ్మకాల వల్లే మృత్యువాతపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఒడిశాలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ తరహాలో రాష్ట్రంలోనూ ఒక సంస్థ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటిని పరీక్షించి, నివేదికలను తయారు చేయాలని, ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి పనిచేయాలని సూచించారు. దోమల ఉత్పత్తి నివారణ చట్టానికి సంబంధించిన వ్యవహారాలపై ముగ్గురు సభ్యులతో అప్పిలేట్ అథారిటీని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంపై విధివిధానాలు నిర్ణయించి, కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి వచ్చే మంత్రివర్గ సమావేశంలో దాని గురించి చర్చించనున్నట్లు తెలిపారు.